thief
-
ఈ దొంగకు న్యూ ఇయర్ ఒకరోజు ముందే వచ్చింది.. ఏం చేశాడో తెలుసా?
సాక్షి,మెదక్ : అతడో దొంగ. అసలే కొత్త సంవత్సరం (new year). సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడు. డబ్బులు కావాలి కదా. వైన్ షాపులో డబ్బులు బాగా ఉంటాయ్. దోచేద్దామని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా రెండ్రోజుల పాటు రెక్కీ కాచాడు. మూడో రోజు ప్లాన్ ప్రకారం.. తాను ముందుగా రెక్కి నిర్వహించిన వైన్ షాప్లో దొంగతనం చేశాడు. దొంగతనానికి ముందే తాను ఎవరికి దొరక్కూడదనే ఉద్దేశ్యంతో సీసీ టీవీ కెమెరాల్ని ధ్వంసం చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బుంతా ఊడ్చేశాడు. అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశాడు. కానీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు.మెదక్ జిల్లా నార్సింగ్ ప్రాంతంలో నిర్వాహకులు కనకదుర్గా వైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 10 వైన్ షాపును క్లోజ్ చేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ వైన్ షాప్లో దొంగతనం ప్లాన్ చేసిన దొంగ రూఫ్ను తొలగించి షాప్లో చొరబడ్డాడు. డబ్బుల్ని కాజేశాడు. అనంతరం, దొంగతనానికి వచ్చిన ఆ దొంగకి మందు మీద కుతిపుట్టింది. వెంటనే వైన్ షాపులో ఏ బ్రాండ్ దొరికితే.. ఆ బ్రాండ్ని ఫుల్లుగా సేవించాడు. మత్తులో తాను దొంగతనానికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి ఎంచక్కా పడుకున్నాడు. ఆ మరుసుటి రోజు అంటే నిన్న ఉదయం నిర్వహాకులు వైన్ షాప్ను ఓపెన్ చేశారు. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఆ పక్కనే మత్తులో ఉన్న దొంగను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను పరిశీలించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు. -
బైక్ పార్కింగ్ చేస్తే ఖతం
-
పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు
అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి తుని వెళ్లాల్సిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. కాంప్లెక్స్ ఆవరణలో బస్సు నిలిపి ఉంచిన అనంతరం క్లీనర్ తాళాలు మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. తుని వెళ్లేందుకు డ్యూటీ డ్రైవర్ కాంప్లెక్స్కు వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రదేశంలో బస్సు లేదు. డ్రైవర్ వెంటనే బస్సు యజమాని దాట్ల గీతంరాజుకు విషయం చెప్పాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించి గాలింపు చేపట్టారు. చింతపల్లికి సమీపంలోని చింతలూరు వద్ద పోలీసులు బస్సుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాధిక్ బాషా తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. చింతలూరు వద్ద… pic.twitter.com/E4jhNy1bXl— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024 -
అపార్ట్ మెంట్ లో బరితెగించిన దొంగలు..
-
పాపం పూల కుండీల దొంగ
-
బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా?
దోమలగూడ: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్ కాలనీలో గురువారం జరిగిన బంగారం చోరీ ఘటన ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితులు రంజిత్ గౌరాయ్ సోదరుడు ఇంద్రజిత్ గౌరాయ్ను పోలీసులు విచారించినట్లు సమాచారం. రంజిత్ గౌరాయ్ వద్ద పనిచేసే 40 మంది కారి్మకుల వివరాలతో పాటు కాల్ డేటాను పోలీసులు సేకరించారు. బంగారం దొంగతనం చేసిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ -
Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ
కవాడిగూడ: దొంగలు బరితెగించారు. దోమలగూడ పరిధిలోని అరవింద్నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున నగల వ్యాపారిని మారణాయుధాలతో బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కోల్కతాకు చెందిన రంజిత్ గౌరాయ్ కొన్నేళ్లుగా అరవింద్నగర్ కాలనీలో నివసిస్తున్నారు. నగరంలోని వివిధ జ్యువెలరీ షాపుల నుంచి ఆర్డర్లు తీసుకుని నగలు తయారు చేసి సప్లయ్ చేస్తుంటారు. రంజిత్ వద్ద దాదాపు సుమారు 50 మంది కారి్మకులు పని చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3– 4 గంటల మధ్య దాదాపు ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రంజిత్ ఇంటి తలుపులు కొట్టి కత్తులతో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. రంజిత్ కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు రంజిత్ గౌరాయ్ దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీం, డాగ్స్కా్వడ్లతో తనిఖీలు చేపట్టారు. బంగారం దోపిడీకి పాల్పడింది ఇంట్లో పని చేస్తున్న సిబ్బందికి తెలిసినవారా? గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో దారుణం -
దొంగల పరువుతీసిన చీప్ దొంగ
-
మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగ
-
దొంగల టార్గెట్.. ప్రచార సభలు, పాదయాత్రలు..
-
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అష్టధాతువులతో తయారు చేసిన 100 ఏళ్ల రాధాకృష్ణుల విగ్రహాన్ని చోరీ చేశారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. అయితే ఈ చోరీకి పాల్పడ్డ దొంగ వారం రోజుల తరువాత ఆలయానికి కొద్దిదూరంలో రోడ్డుపై రాధాకృష్ణుల విగ్రహాలను, ఒక లేఖను ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఆ విగ్రహాల గురించి ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడ లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సదరు దొంగ క్షమాపణలు చెబుతూ.. రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించాక తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని, పీడకలలతో బాధపడుతున్నాడని’ రాశాడు. తాను అప్పగించిన విగ్రహాలను ఆలయంలో తిరిగి అదోచోట ఉంచాలని ఆ దొంగ వినయపూర్వకంగా కోరాడు.ఇది కూడా చదవండి: ఆర్జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం -
రాజ రాజ చోర
అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్స్ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్ ఖేడి, హుల్ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.ఇలా బయటపడింది.. ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో ఘనంగా జరిగింది. ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు. పోలీసులు ఏం చేయలేరా? నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. పైగా దొంగల స్కూల్ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
గణేష్ మండపంలో దొంగ
-
బండిని ఇంత సింపుల్ గా ఎత్తుకెళ్లాడు ఏంటి..!
-
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
దండం పెట్టాడు - దొంగతనం చేశాడు
-
Hyderabad: అపార్టుమెంట్లో భారీ చోరీ
బన్సీలాల్పేట్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్లో దొంగలు పడ్డారు. సుమారు 40 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన ఘటన గాందీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ భోలక్పూర్ కృష్ణానగర్ కాలనీలోని భవానీ శ్రీ షీలా ఎవెన్యూ అపార్టుమెంట్ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్లో మాదాపూర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్, ఆయన భార్య సబిత, ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తె అనుష్కతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం ఇంటికి తాళం వేసి సబిత బయటకు వెళ్లారు. కుమార్తె కాలేజీకి, శ్రీనివాస్ బ్యాంక్కు వెళ్లారు. మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని దొంగలు అపార్టుమెంట్ మూడో అంతస్తులోకి ప్రవేశించారు. తాళం వేసిన గడియ కింది భాగాన్ని తొలగించి ఇంట్లోకి వెళ్లారు. అల్మరా, ఇతరత్రా ప్రదేశాల్లో దాచి ఉంచిన 14 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించారు. శ్రీనివాస్ కుమార్తె అనుష్క సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా గాంధీనగర్ డివిజన్ ఏసీపీ మొగులయ్య, ఇన్స్పెక్టర్ డి.రాజు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రూపాయి కూడా ఉంచలే.. మీకో దండం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్ బాటిల్ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.మండల కేంద్రం కావడంతో..మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్ కావడంతో క్యాష్ కౌంటర్లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్ కౌంటర్ వద్ద, ఆ తర్వాత కిచెన్లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.అనంతరం క్యాష్ కౌంటర్ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్లోంచి వాటర్ బాటిల్ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్ పాకెట్ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్ బాటిల్ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు. -
భలే మంచి దొంగ
-
సంగారెడ్డి జిల్లా నందిగామలో దొంగల బీభత్సం
-
యాంటీ డెకాయిట్ ఆపరేషన్.. దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : యాంటీ డెకాయిట్ ఆపరేషన్లో దొంగలకు హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. ధార్ భావరియా గ్యాంగ్లే లక్ష్యంగా నగరంలో పలు పప్రాంతాల్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపై పోలీసులు కన్నేశారు. పలు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ తరుణంలో హైదరాబాద్ అసిఫ్ నగర్, చిలకలగూడా, సికింద్రాబాద్లో చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఈ సమయంలో కళ్లుగప్పి దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసుల ఫైరింగ్ చేశారు. ఇక యాంటీ డెకాయిట్ ఆపరేషన్లో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు చైనా స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మేడ్చల్లో పట్టపగలే ముసుగు దొంగల బీభత్సం.. జ్యువెలరీ షాప్లో చొరబడి..
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
హై క్లాస్ దొంగ
-
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ఒంటెనే చోరీ చేశారు
కురబలకోట : ఇన్నాళ్లు పర్సులు కొట్టేసే దొంగలను చూశాం.. ఇంట్లో చొరబడి బంగారో..నగదో చోరీ చేసిన వాళ్లనూ చూశాం.. కానీ ఏకంగా పెద్ద జంతువులలో ఒకటైన ఒంటెనే ఎత్తుకెళ్లే ఘనులుంటారని ఇప్పుడే చూస్తున్నాం. అవును.. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో ఒంటెను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..త్వరలో జరగబోయే బక్రీద్కు అంగళ్లుకు చెందిన మిత్రులు కొందరు 13 రోజుల క్రితం రూ.1.25 లక్షలతో ఒంటెను కొన్నారు. పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టేసేవారు. ఆదివారం వేకువ జామున లేచి చూస్తే ఒంటె కాస్తా కన్పించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్లిందోమోనని తొలుత భావించారు. స్థానికంగా వెతికినా కన్పించలేదు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్నేహితులు కలసి అంతటా గాలించారు. పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు. సమీపంలోని గుట్టలు, వాగులు, వంకలతో పాటు పరివాహక ప్రాంతాల్లో కూడా వెతికారు. ఎక్కడా ఆచూకీ కన్పించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జాడ మాత్రం కన్పించలేదు. అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె నుంచి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తోలుకెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కన్పించినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి భారీ సైజు వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద ఒంటెనే అంగళ్లులో ఏకంగా చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబరుకు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని బాధితులు తెలిపారు. -
జిమ్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్ట్లు..
ఓ దొంగ జిమ్లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్ యజమాని ఏం చేశాడంటే..ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్ సెంటర్లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్ని ఏదో విధంగా ఓపెన్ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. జిమ్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్కి వెళ్లి ఆ దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు యజమాని. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ యజమాని దొంగని ట్రెడ్మిల్పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్ట్లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!. ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. (చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్! ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత) -
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. -
ఓరి ‘దొంగ’.. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు..
లక్నో: నడుస్తున్న సమయంలో, పక్కన కూర్చున్నప్పుడు జర్నీలో దొంగతనాలు చేయడం సాధారణమే.. అయితే ఇటీవల దొంగలు విచిత్రంగా పడుకొని చోరీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని మథుర రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులకు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా.. ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలో ఓ దొంగ ఒక వ్యక్తి నిద్రపోతున్నట్లు నటిస్తూ పలు చోరీలకు పాల్పడ్డాడు. తొలుత ఒక ప్రయాణికుడి పక్కన అతడు పడుకొన్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని లేచి చూశాడు. తిరిగి పడుకొన్నాడు. మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయాణికుడి పక్కన పడుకున్నాడు. అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ చోరీ చేశాడు. అనంతరం ఆ వెయిటింగ్ రూమ్ నుంచి జారుకున్నాడు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన రైల్వే పోలీసులు చివరకు ఆ దొంగను గుర్తించారు. నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు చేస్తున్న ఎటా జిల్లాకు చెందిన 21 ఏళ్ల అవినీష్ సింగ్ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. అతడి నుంచి ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువుల స్వాధీనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ‘The Sleeping Thief’: A Person has been arrested from UP’s Mathura for stealing from passengers sleeping on railway stations. The CCTV Footage shows the cunning modus operandi of the thief where he pretends to sleep beside a traveller & swiftly pick pockets the mobile phone. pic.twitter.com/6OVSYydwaZ — Tanishq Punjabi (@tanishqq9) April 10, 2024 -
సొత్తుతో పాటు.. కుక్కపిల్లనూ వదలలేదు సార్..!
హైదరాబాద్: పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. సొత్తుతో పాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని సైతం ఎత్తుకెళ్లిన ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఎఫ్సీనగర్ బాలాజీ నగర్కు చెందిన ఐలయ్య గురువారం కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ జిల్లా అంబాల గ్రామంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా అల్మరా తాళం పగులగొట్టి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో దాచిన 7.5 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రూ. 5 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వీటితో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను కూడా అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం (వేలి ముద్రల నిపుణులు)తో కలిసి వివరాలు సేకరించారు. ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్ను ఢీకొట్టడంతో.. -
కేసీఆర్ పర్యటనలో జేబు దొంగల హల్చల్
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో జేబు దొంగలు హల్చల్ చేశారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో ఎండిన పొలాలను కేసీఆర్ పరిశీలిస్తుండగా.. ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ. 10 వేలు కొట్టేశాడు. అయితే దొంగను పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అతడికి దేహశుద్ది చేశారు. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్నారు. సాయంత్రం సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. -
బేగంపేటలో దొంగల బీభత్సం.. ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. బేగంపేటలో ఓ ఇంట్లోకి గురువారం తుపాకీతో అగంతకులు చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఇంట్లో చోరికి యత్నించారు. అయితే దుండగులును ఇంట్లోని తల్లీ కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అగంతకుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఎదురు దాడికి దిగారు. ఊహించని పరిణామంలో దుండగులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. -
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
బిహార్లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్లోని భాగల్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భాగల్పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा। वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe — Priya singh (@priyarajputlive) January 17, 2024 -
హైదరాబాద్: పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ
సాక్షి, హైదరాబాద్: ఓయూ పోలీసులకు ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు శంకర్ నాయక్.. అలాగే డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు. దొంగిలించబడ్డ సొమ్ముతో ముత్తూట్ గోల్డ్ లోన్లో తాకట్టు పెట్టి హోటల్స్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, మిగిలిన ఆ డబ్బుతో మళ్లీ దొంగతనం చేయడానికి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి, ఆ బండ్లపై దొంగతనం చేసే వెరైటీ దొంగ ఈ శంకర్ నాయక్. మహబూబ్నగర్కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు. ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు. అయితే రిమాండ్ చేసిన శంకర్ నాయక్ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులు ఓయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్షతో -
అర్ధరాత్రి హెడ్కానిస్టేబుల్ ఇంట్లో చోరీ!
ఖమ్మం: ఫంక్షన్కు వెళ్లి వచ్చేసరికి బెటాలియన్ హెడ్కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గంగారం 15వ బెటాలియన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కోరం లక్ష్మణ్రావు, నాగకుమారి దంపతులు బేతుపల్లిలోని గౌండ్లబజార్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి సత్తుపల్లిలో ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. కిచెన్ తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని రూ.12 లక్షల విలువ చేసే 18 తులాల బంగారంతో పాటు రూ.25 వేల నగదును అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి ఎస్ఐ కుశకుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఇంట్లో కూడా.. గ్రామంలోని పటంబజార్లో దొడ్డా శ్రీనివాసరావు ఇంట్లోకి ముసుగులు ధరించిన దుండగులు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వచ్చి సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ప్రధాన ద్వారం తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి బెడ్రూంలోని కబోర్డులో దుస్తులు, వస్తువులను కిందపడేసి వెతికినా వారికి ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. ఇంటి యజమాని అమెరికా వెళ్లినట్లు తెలిసింది. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
గుప్త నిధుల కలకలం! ఒక్కసారిగా బయటపడ్డ..
వికారాబాద్: పొలంలో ఉన్న భారీ శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు పెకిలించి, పక్కన పడేశారు. ఈ సంఘటన యాలాల మండల పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. బాధిత రైతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల గ్రామానికి చెందిన గంగుల వెంకట్రెడ్డి తనకున్న 9 ఎకరాల పొలాన్ని విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన నర్సింహ్మరెడ్డికి కౌలుకు ఇచ్చారు. ప్రస్తుతం అందులో కంది, వరిని సాగు చేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం పొలంలో కంది పంట ధ్వంసం అయినట్లు కౌలురైతు గమనించాడు. వెళ్లి పరిశీలించగా.. పొలంలోని శివలింగాన్ని బయటికు తీసిన ఆనవాళ్లను గుర్తించాడు. విషయాన్ని పొలం యజమానికి వివరించాడు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, కళ్లు కవర్లను స్థానికులు గుర్తించారు. సుమారు 5 అడుగులు శివలింగాన్ని వెలుపలకు తీయాలంటే ఐదారుగురి సాయం అవసరమవుతుందని, ఇదంతా గుప్త నిధుల కోసమే జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తంచేశారు. యాలాల చుట్టుపక్కల పెద్ద మొత్తంలో శివలింగాలు ఉండటం, తరుచూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం జరుగుతుంటాయని గ్రామస్తులు పేర్కొన్నారు. రైతు వెంకట్రెడ్డి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటన స్థలంలో వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇవి కూడా చదవండి: మరణంలోనూ వీడని బంధం! తల్లడిల్లిన తల్లి హృదయం.. -
'ఫేక్ వెబ్సైట్స్' క్లిక్ చేశారో ఖతమే! వాటిని ఇలా గుర్తించండి!!
రాజన్న సిరిసిల్ల: సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ వెబ్సైట్స్ పేరుతో నగదు అపహరిస్తున్నారు. ఫర్నీచర్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఇస్తున్నామంటూ ఫేక్ వెబ్సైట్లతో బురిడీ కొట్టిస్తున్నా రు. నమ్మి వాటిపై క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ఇటీవల జిల్లాలో సైబర్మోసాలు వరుసగా జరుగుతున్నాయి. సోషల్మీడియాలో వస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు! సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరికి క్రెడిట్కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి ఓ కాల్ వచ్చింది. బాధితులు అతనితో క్రెడిట్కార్డ్ నంబర్, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.77వేలు నష్టపోయాడు. సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు ఇన్స్ట్రాగామ్లో ఓ యాడ్ చూసి అందులోని లింక్పై క్లిక్ చేయడంతో వాట్సాప్కు కనెక్ట్ అయ్యింది. దీంతో బాధితుడు వారు చెప్పినట్లు కొన్ని టాస్క్లు చేయడంతో రూ.40వేలు నష్టపోయాడు. కోనరావుపేట్ ఠాణా పరిధిలో ఒకరికి తక్కువకే వజ్రాలు ఇస్తామంటూ ఓ కాల్ వచ్చింది. లోన్ ఇస్తామని చెప్పిన వారు ముందుగా చార్జీలు రూ.27వేలు చెల్లించాలనడంతో పంపాడు. తర్వాత తను మోసపోయానని గుర్తించాడు. సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరికి కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది. వారి మాటలు నమ్మి డెబిట్కార్డ్ వివరాలు, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.లక్ష వరకు మోసపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు నర్సరీ వ్యాపారం కోసం ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్ను సంప్రదించాడు. తర్వాత కొత్త నంబర్ నుంచి కాల్ రావడంతోపాటు ఒక పేమెంట్ స్కానర్ను పంపించారు. బాధితుడు దాన్ని స్కాన్ చేయడంతో రూ.లక్ష నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బిజినెస్ ఎమోషనల్ అని చెప్పి టెలిగ్రామ్లో ఒక లింక్ పంపించారు. అందులో భాగంగా కొన్ని టాస్క్ లు చేస్తే డబ్బు వస్తుందని నమ్మబలికారు. వారు చెప్పినట్లుగా కొన్ని టాస్క్లు చేయడంతో కొంత డబ్బు పంపించారు. ఇందులో భాగంగా బాధితుడు రూ.96వేలు నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బాధితుడు పార్ట్ టైం జాబ్ గురించి ఒక యాప్లో నమోదు చేసుకున్నాడు. ఇందులో భాగంగా వారు ఇచ్చిన వర్క్లో డాటా తప్పుగా ఎంటర్ చేశారని బెదిరించి బాధితుడి నుంచి రూ.55వేలు తీసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సోషల్మీడియాలో వచ్చే యాడ్స్ను నమ్మొద్దు. ఎస్బీఐ యోనో బ్లాక్ అయిందని, పాన్కార్డు అప్డేట్ చేయాలని వచ్చే మెస్సేజ్లను నమ్మొద్దు. ఆ మెస్సేజ్లలో వచ్చే లింక్స్పై అస్సలు క్లిక్ చేయొద్దు. సోషల్మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టవద్దు. మీ ప్రమేయం లేకుండా మీ సెల్ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పొద్దు. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా గమనించాలి. అప్రమత్తతే అవసరం.. కొత్త ఫోన్ నంబర్ నుంచి కాల్ వస్తే ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్చేస్తే తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంది. డెబిట్కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. – అఖిల్మహాజన్, రాజన్నసిరిసిల్ల ఎస్పీ ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
చెరువులోకి దూకిన దొంగ..గంటలు గడుస్తున్నా దొరకని దొంగ..
-
మాయలు, మంత్రాలు.. ఆనక హత్యలు!
సాక్షి, మహబూబ్నగర్/నాగర్కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ, బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ, విడిపోయిన భార్యభర్తలను కలుపుతానంటూ.. 11 మంది అమాయకపు ప్రాణాలను తీసిన రాక్షసుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రామాటి సత్యనారాయణ యాదవ్(47) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన తండ్రి, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి నాటువైద్యం ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించాడు. ఆపై మంత్రతంత్రాలతో గుప్త నిధులు వెలికి తీసిస్తానంటూ, బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజల్ని నమ్మబలికాడు. వారి ఆస్తులను, ఇంటి స్థలాలను కాజేశాడు. అదే తన వృత్తిగా కొనసాగిస్తూ.. ప్రజల్ని మభ్యపెడుతూ, చివరికి ప్రశ్నించిన వారి ప్రాణాలను తీస్తూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇద్దరు భార్యాభర్తలు విడిపోయిన వారిని కలుపుతానంటూ, వారి ఇంటి స్థలం తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆపై ఆ మహిళా కనిపించకుండా పోవడంతో.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన వివరాలను సేకరించి, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరికి గత కొన్ని రోజులుగా ఎవరి కంట పడకుండా తప్పించుకుంటున్న నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఓ రియల్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్ (10) ఉన్నారని తెలుస్తోంది. రెండేళ్ల కిందట నాగర్కర్నూల్ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. అయినా ఆ టైంలో పోలీసుల్లో కదలిక లేకపోవడం గమనార్హం. ఇవి కూడా చదవండి: మిస్టరీగా మారిన 'కాంగో జాతీయుడి లాకప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది? -
వీడు మహా కేటుగాడు! డైరెక్ట్గా పోలీస్టేషన్లనే ఏం చేశాడో తెలిస్తే షాక్!
హైదరాబాద్: తాను బ్రెజిల్కు చెందినవాడినని, హైదరాబాద్ పర్యటనకు రాగా తన పర్సుతో పాటు ల్యాప్టాప్ కూడా చోరీ అయిందని ఈ నెల 7వ తేదీన అచ్చు విదేశీ యువకుడిలాగా ఉన్న ఓ వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చాడు. జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు సరైనదేనని నమ్మి పర్సు ఎక్కడ పోగొట్టుకున్నాడో ఆ ప్రాంతానికి వెళ్లి రోజంతా సీసీ ఫుటేజీలు వెతికారు. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. తనకు తినడానికి కూడా డబ్బులు లేవని ఆ యువకుడు చెప్పగా రూ.500 ఇచ్చి పంపించారు. ఆ మరుసటి రోజు భువనగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లిన అదే యువకుడు తన పర్సు పోయిందని, తాను అమెరికా నుంచి వచ్చానని అక్కడ పోలీసులకు చెప్పగా రోజంతా వారు కూడా సీసీ ఫుటేజీలు వడపోశారు. ఖర్చులకు డబ్బులు లేవని చెప్పగా రూ.1500 ఇచ్చి పంపారు. తాజాగా ఈ నెల 9న అదే యువకుడు మధురానగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన పర్సు పోయిందని ఫిర్యాదు చేశాడు. తిండికి డబ్బులు లేవని చెప్పడంతో జాలిపడ్డ అక్కడి పోలీసులు రూ.1000 ఇచ్చి పంపించారు. తీరా ఈ యువకుడి గురించి ఆరా తీస్తే గోవాకు చెందిన సెబీ డిసిల్వాగా గుర్తించారు. సదరు యువకుడు అచ్చం విదేశీ పోలికలతో ఉండటంతో పోలీసులు కూడా విదేశీయుడనే భ్రమపడి ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టేవారు. ఖర్చుల కోసం అడిగితే డబ్బులు కూడా ఇచ్చారు. తీరా సదరు యువకుడి గురించి లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు గోవాకు చెందిన వాడని, ఇలాగే రాజస్థాన్, బీహార్, గోవాలలో మోసాలకు పాల్పడి రిమాండ్ అయినట్లు తేలింది. రోజువారి ఖర్చుల కోసం ఇలాగే పర్సు పోయిందని ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తూ ఎంతో కొంత పోలీసుల నుంచే తీసుకొని రోజులు గడిపేస్తున్నట్లుగా తేలింది. ఈ సరికొత్త వసూళ్ల పథకం గురించి తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెడుతున్నారు. పోలీసులకు టోకరా వేస్తున్న వైనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ముందు ఈ యువకుడు పర్సు పోయిందని, ల్యాప్ట్యాప్ పోయిందని ఫిర్యాదు చేస్తే నమ్మవద్దని చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం! -
సైబర్ వల నుంచి తప్పించుకోవాలంటే ఇలా చెయ్యండి చాలు!
విజయవాడ: విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువకుడు పీజీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతగా వ్యాపారం చేయాలన్నది అతని కల. ‘ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసి నెలనెలా రూ.లక్షల్లో సంపాదించొచ్చు’ అంటూ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అతడిని ఆకట్టుకుంది. మెసేజ్ పంపిన వారితో చాటింగ్లో పరిచయం పెంచుకున్నాడు. ‘కొన్ని వెబ్ లింక్లు ఓపెన్ చేసి టాస్క్లు పూర్తి చేస్తే వెంటనే నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని’ సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. రిజిస్ట్రేషన్కు కొంత నగదు చెల్లించి తొలి రెండు టాస్క్లు పూర్తి చేయగానే నగదు చెల్లించారు. ఆ తరువాత ఆ యువకుడు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్లు కొని పూర్తిచేశాక అతని వ్యాలెట్లో డబ్బు కనిపించినా విత్డ్రా కాకపోవడంతో సదరు వ్యక్తులను వాట్సాప్, టెలిగ్రాం చాటింగ్తో సంప్రదించాడు. ‘ఏదో ఎర్రర్ వస్తుంది.. మీరు టాస్క్లు పూర్తి చేయండి.. నగదు ఎక్కడికీ పోదు’ అని నేరగాళ్లు అతడిని భరోసా ఇచ్చారు. వారిని నమ్మి విడతల వారీగా రూ.80 లక్షలు చెల్లించాక మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు విజయవాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ నేరస్తుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. మోసం చేసేది ఇలా.. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీతో మోసాలకు తోడు టెలిగ్రాం, వాట్సాప్ల సాయంతో ఉద్యోగ, వ్యాపార ప్రకటనతో నిరుద్యోగులు, చిరుద్యోగులు, మధ్యతరహా వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. పలు మార్గాల ద్వారా ప్రజల ఫోన్ నంబర్లను సేకరిస్తున్న నేరగాళ్లు ముందుగా వాట్సాప్/ టెలిగ్రాంలో ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతారు. ఇంట్లో కూర్చుని, ఖాళీ సమయంలో పని చేస్తే కుటుంబ ఖర్చులౖకైనా వస్తాయన్న ఆశతో ఉన్న వారిని సైబర్నేరగాళ్లు చాటింగ్తో ముగ్గులోకి దింపుతారు. చాటింగ్కు నంబర్లు కనిపించని టెలిగ్రాం యాప్నే నేరగాళ్లు ఉపయోగిస్తారు. వర్క్ ఎలా చెయ్యాలి, ఇన్స్టా, ఫేస్బుక్, యూ ట్యూబ్ వీడియోలకు ఎలా లైక్లు కొట్టాలి, ఎలా షేర్ చేయాలి, ఎంత డబ్బు వస్తుంది.. అనే విషయాలను చాటింగ్లోనే వివరిస్తారు. మచ్చుకు కొన్ని వీడియోలను వాళ్లే పంపించి టాస్క్లు ఇస్తారు. నమ్మించేందుకు తొలి రోజే కొంత నగదును వారి బ్యాంక్ ఖాతాలో వేస్తారు. రెండో రోజూ కొన్ని టాస్క్లు ఇచ్చి నగదు చెల్లిస్తారు. ఆ తరువాత నుంచి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే పేరున్న కంపెనీలు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు రేటింగ్ ఇవ్వాలని, ఈ పని రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. వెబ్సైట్ వాలెట్లో డిపాజిట్ సొమ్ము, ప్రాఫిట్, విత్డ్రా వివరాలు నిత్యం స్క్రీన్పై కనపడుతూనే ఉంటాయని నమ్మబలుకుతారు. సొమ్ము డిపాజిట్ చేసి టాస్క్లో దిగిన తరువాత.. చెల్లించిన సొమ్ముకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కలిపి ప్రాఫిట్ బాక్స్లో చూపిస్తారు. అయితే ఆ డబ్బు విత్డ్రా అవ్వదు. ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరి కొంత నగదు చెల్లించి రెండో టాస్క్ పూర్తి చేయాలని నమ్మిస్తారు. ప్రాఫిట్ బాక్స్లో ఉన్న నగదు కంటే డిపాజిట్ చేయాల్సిన నగదును తక్కువగానే చెబుతారు. ప్రాఫిట్ బాక్స్లో ఎక్కువగా ఉన్న నగదును చూసి ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లకు బాధితులు నగదు చెల్లిస్తూనే ఉంటారు. అవతలి వ్యక్తి మాయగాడని తెలుసుకునే లోపు రూ.లక్షల్లో మోసపోతారు. ఆ తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న మోసాలు.. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 కేసులు నమోదు చేస్తున్నాం. ఇటీవల ఓ యువతి రూ.10 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేసింది. సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతోనే ప్రజలు మోస పోతున్నారు. 'ఉద్యోగం ఇచ్చే వ్యక్తి నెలకు జీతం ఇస్తాడే కానీ మన నుంచి ముందుగా డబ్బులు తీసుకోడనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.' ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాలతో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ క్రైం పోలీస్స్టేషన్, విజయవాడ ఇవి చదవండి: కడపలో తల్లీతనయుల అదృశ్యం! -
వచ్చింది పోలీసులేనా? కిడ్నాప్ గ్యాంగ్ సభ్యులా? అసలేం జరిగింది?
సాక్షి, కరీంనగర్: సిద్దిపేట కమిషరేట్ పరిధిలోని దుబ్బాక ఠాణా పోలీసులమని కొందరు వ్యక్తులు సిరిసిల్లకు వచ్చి హల్చల్ చేశారు. అంతేకాదు ఓ దంపతులను బెదిరించారు. ఇదేంటని ప్రశ్నించగా.. వారి బైక్కు కారు అడ్డుపెట్టడంతో మహిళ చేయి విరిగింది. బాధితురాలు చికిత్స నిమిత్తం గురువారం సిరిసిల్ల ఆసుపత్రికొచ్చి తనకు జరిగిన అవమానాన్ని మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన కవిత ఇంటికి కొందరు వచ్చారు. ఇంట్లో చొరబడి వెతుకుతుండగా ఆమె భర్త ఆ ఆగంతకులను నిలదీశారు. తాము పోలీసులమని, కొడుకు దుబ్బాకలో ఓ గొడవలో నిందితుడని చెప్పారు. అతను ఎక్కడ ఉన్నాడో తెలపాలని బెదిరించారు. అదే సమయంలో పోలీసులని చెప్పిన వాళ్లు నానా బూతులు తిడుతూ కవిత భర్త ప్రయాణిస్తున్న బైక్కు కారు అడ్డుగా పెట్టడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ సంఘటనలో కవిత చేయి విరిగింది. వచ్చిన ఆగంతకులు ఆమె భర్తను కారులో తీసుకెళ్లారు. ఆటో నడుపుకునే తన కొడుకు దుబ్బాకలో ఏదో కేసులో ఉన్నాడని బెదిరించారని రోదించింది. ఈ విషయమై సిరిసిల్ల టౌన్ పోలీసులను వివరణ కోరగా కొందరు వచ్చి ఒకరి తీసుకెళ్లినట్లు సమాచారం కోసం పలువురు ఫోన్ చేశారని తెలిపారు. కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఒక జిల్లా పోలీసులు మరో జిల్లా పరిధిలోకి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారని.. అలాంటి సమాచారం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. అసలు వచ్చింది పోలీసులేనా? ఎవరైన కిడ్నాప్ గ్యాంగ్ సభ్యులా? అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇవి చదవండి: క్షణికావేశంలో వివాహిత తీవ్ర నిర్ణయం! -
దొంగ వెనుక దీన గాథ!
అనంతపురం క్రైం: జల్సాలు, వ్యసనాల కోసమో దొంగతనాలు చేయడం చూశాం. అయితే, ఓ యువకుడు తన తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకునేందుకు దొంగగా మారాడు. కిలో బంగారం చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగ వెనక విషాద గాథ ఉన్నట్లు తెలిసింది. ఆ దీనగాథ పోలీసుల మనసులను కూడా కదిలించినట్లు సమాచారం. అతడి కష్టాలను విన్న పోలీసులు పాపం విధి వంచితుడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి చెందిన వినయ్ తల్లిదండ్రుల ఎడబాటును తట్టుకోలేక ఆరేళ్ల వయసులో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చాడు. రైలుగుండా అనంతపురం చేరుకున్నాడు. స్థానిక పోలీసులకు చిక్కాడు. వినయ్ని తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని పోలీసులు సాగించిన అన్వేషణ ఫలించలేదు. దీంతో నగరంలోని విజయనగర కాలనీలో ఉన్న సీడబ్ల్యూసీ గృహంలో చేర్చారు. ఆదరించాల్సిన పాస్టర్ వినయ్ని నిత్యం చితకబాదుతూ హింసించడం ప్రారంభించాడు. దీంతో మళ్లీ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఫ్లాట్ఫాంపై పడ్డాడు. కడుపు నింపుకునే మార్గం కనిపించలేదు. సెల్ఫోన్లు చోరీ చేసి వాటిని అమ్ముకుని పొట్ట పోసుకోవడం ఆరంభించాడు. వేసుకునేందుకు దుస్తులు కూడా లేకపోవడంతో నగరంలో ఆరుబయట ఇళ్ల ముందు ఆరేసిన వస్త్రాలను అపహరించేవాడు. అదే ప్రవృత్తిగా మారిపోయింది. అలా వినయ్కు 18 ఏళ్లు దాటాయి. ఈ క్రమంలోనే తన వాళ్లను కలుసుకునేందుకు సూరత్ చేరుకున్నాడు. తల్లిదండ్రుల జాడ కనిపించలేదు. దీంతో మళ్లీ అనంతపురం చేరుకున్నాడు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్లోని మయూరీ హోటల్లో సప్లయర్గా చేరాడు. దొంగతనాలు చేయడం మాత్రం మానలేదు. అలా కొంత కాలం క్రితం స్థానిక రెండో రోడ్డులోని ఓ ఇంట్లో చొరబడ్డాడు. చాలా డబ్బు, బంగారం గుర్తించినా.. కొన్ని దుస్తులు, కొంత బంగారం, డబ్బు దొంగిలించాడు. మళ్లీ కన్న వారి కోసం సూరత్ పయనమయ్యాడు. మూడో సారికి చిక్కాడు.. అయిన వారిని కలుసుకుందామని వినయ్ చేసిన ప్రయత్నం మళ్లీ ఫలించలేదు. దీంతో తిరిగి నగరానికి చేరుకున్నాడు. రెండో సారి కూడా రెండో రోడ్డులోని అదే ఇంట్లో కొంత నగదు చోరీ చేశాడు. అదే క్రమంలో ఇటీవల మూడో సారిగా మళ్లీ గృహంలో చొరబడ్డాడు. కొంత డబ్బు, బంగారం, పంచలోహ విగ్రహం తీసుకుని మయూరీ హోటల్కు వెళ్లాడు. తనతో పాటు హోటల్లో పని చేసే మహిళకు బంగారు నెక్లెస్, పనివాళ్లలో తెలిసిన మిత్రుడికి బంగారు గొలుసు, హోటల్ యజమానికి పంచలోహ విగ్రహం ఇచ్చాడు. అయితే, మహిళ తనకిచ్చిన నెక్లెస్ గిల్టుదని భావించి అందరి ముందే మురుగు గుంతలో పడేసింది. ఈ క్రమంలోనే తన ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం ఆరా తీస్తుండగా.. బంగారాన్ని కొందరికి ఉచితంగా ఓ యువకుడు ఇస్తున్నాడనే సమాచారం తెలిసి అతన్ని పట్టుకున్నారు. విచారణ చేపట్టగా రెండో రోడ్డులో చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. సొంతూ రులో బంగారం ఎక్కడైనా దాచుంటాడని పోలీసులు గుజరాత్లోని సూరత్కు వెళ్లారు. అయితే, అక్కడ అతనికి తెలిసిన వారు లేరు. ఈ క్రమంలో వినయ్ను ఆరా తీస్తే తన గతాన్నంతా పూసగుచ్చినట్టు వివరించాడు. చలించిన పోలీసులు అతని కుటుంబ సభ్యుల కోసం ఆరా తీస్తే, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని, తండ్రి కొన్ని రోజుల క్రితమే మృతి చెందాడని తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికీ పోలీసులు వినయ్కు చెప్పలేదు. -
పుట్టింటి బంగారం ధరించికుండానే.. పట్టపగలు చోరీ!
రాజన్న సిరిసిల్ల: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రోడ్డును ఆనుకుని ఉన్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. చందుర్తి మండలం మల్యాలకు చెందిన రైతు దేశెట్టి రాజయ్య ఉదయమే పొలానికి వెళ్లగా, భార్య లక్ష్మి, కోడలు రవళితో కలిసి వేములవాడ ఆస్పత్రికి వెళ్లారు. ఇదే సమయంలో ఇంట్లోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలో దాచి ఉంచిన ఏడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. భార్య లక్ష్మి, కోడలు రవళి ఇంటికొచ్చే వరకు ఇంటి తాళం పగులగొట్టి ఉండడం, బీరువాలోని బట్టలు మంచంపై పడేసి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చందుర్తి ఎస్సై అశోక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చందుర్తి సీఐ కిరణ్కుమార్.. డాగ్స్క్వాడ్తోపాటు ఫోరెన్సిక్ నిపుణులు తెప్పించారు. కొన్ని వేలిముద్రలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. తెలిసిన వారే దొంగతనానికి.. దేశెట్టి రాజయ్య–లక్ష్మి దంపతుల కుమారుడు రా జుకు నాలుగేళ్ల క్రితం రవళితో వివాహమైంది. రవళి తల్లిగారు పెళ్లి సమయంలో ఒప్పుకున్న ఏడు తులాల బంగారు నగలను వారం క్రితం తయారు చేయించి అప్పజెప్పారు. పుట్టింటి బంగారు నగలు ధరించకముందే దొంగల పాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల బంధువుల వివరాలతోపాటు సన్నిహితంగా ఉన్న వారి వి వరాలు సేకరించారు. ఇంట్లో బంగారు నగలు ఉన్నాయన్న విషయం తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగంలోకి పోలీసు ప్రత్యేక బృందాలు.. మండలంలో పది రోజుల వ్యవధిలో రెండు దొంగతనాలు జరగడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ కిరణ్కుమార్, చందుర్తి, రుద్రంగి ఎస్సైలు అశోక్, రాజేశ్ పరిశీలించారు. సీఐ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దొంగతనం జరిగిన సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సీసీ కెమెరాల్లో ఏమి రికార్డు కాలేదు. దీంతో పోలీసులు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోటలోని సీసీ పుటేజీలు సేకరిస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజుల్లో దొంగలను పట్టుకుంటామని సీఐ ధీమా వ్యక్తం చేయడంపై.. దొంగతనానికి పాల్పడ్డ వారు చిక్కినట్లేనని తెలుస్తోంది. -
రైలు పక్కనే కాచుకుని ఉంటారు, చటుక్కున మొబైల్ లాగేసుకుంటారు
-
కాంగ్రెస్వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
బస్సు చోరీ చేసి.. ప్రయాణికుల్ని ఎక్కించుకుని..
రాజన్నసిరిసిల్ల జిల్లా: సిద్దిపేటలో చోరీకి గురైన ఆర్టీసీ అద్దె బస్సు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులో ప్రత్యక్షమైంది. పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్దిపేట డిపోకు చెందిన అద్దె బస్సు (టీఎస్ 36 టీఏ 3336)ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా సిద్దిపేట బస్టాండ్కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకొని వేములవాడకు వచ్చాడు. ఇక్కడి నుంచి హైదరాబాద్ బోర్డుతో ప్రయాణికులను ఎక్కించుకుని బయల్దేరాడు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, టికెట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు.. తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోగానే డ్రైవర్ను నిలదీశారు. దీంతో సదరు వ్యక్తి బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. వెంటనే ప్రయాణికులు డయల్ 100కు కాల్చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడి పోలీసులు సిద్దిపేట పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గంభీరావుపేటకు చెందిన రాజుగా గుర్తించారు. అనంతరం రిమాండ్కు తరలించారు. -
మాయమాటలు చెప్పి.. మోసం చేశాడు..!
ఆదిలాబాద్: ఘరానా మోసగాడు దంపతులకు మాయమాటలు చెప్పి బంగారు గొలుసు కాజేసిన సంఘటన మండలంలోని కన్కపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపు నాగన్న అనే రైతు ఇంటికి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైక్పై వచ్చాడు. నాగన్న–లక్ష్మి దంపతులతో నేను బ్యాంకు నుంచి వచ్చాను. మీరు ఇంతకు ముందు బ్యాంకులో గోల్డ్లోన్ తీసుకున్నారుగా, మీకు లోన్ మాఫీ వచ్చిందని, మరింతగా రెట్టింపు లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. నమ్మిన ఆ దంపతులు లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును భర్త నాగన్నకు ఇచ్చింది. నాగన్నను అతడి బైక్పై ఎక్కించుకుని అబ్దుల్లాపూర్ గ్రామ పరిధిలోని సబ్స్టేషన్ వరకు తీసుకెళ్లి అతడి వద్ద నుంచి గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. -
మహిళా దొంగల హల్చల్.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్ల మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు. -
ఎన్నికలొస్తేనే కేసీఆర్కు హామీలు గుర్తొస్తాయి: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/తొర్రూరు: ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్కు హామీలు గుర్తుకొస్తాయని, మోసాలు చేయడంలో ఆయన పీహెచ్డీ పూర్తయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘రైతుగోస– బీజేపీ భరోసా’సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఉద్యమాల గడ్డ మాత్రమే కాక కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ పాస్పోర్టులు చేసిన దుబాయ్ శేఖర్ అని, ఆయన కొడుకు పేరు అజయ్రావు అయితే టికెట్ కోసం ఎన్టీఆర్ మెప్పు పొందడానికి తారక రామారావు అనే పేరు పెట్టాడని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ముందుకొస్తున్నాయన్నారు. అప్పుల రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలన్నా, ప్రజల బాధలు పోవాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు. కాగా ఖమ్మం వెళుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సంజయ్ కొద్దిసేపు ఆగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడు అలిసేరి రవిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ కంటే కేసీఆరే డేంజర్ అని వ్యాఖ్యానించారు. హామీలను విస్మరిస్తూ ప్రజలను నట్టేట ముంచిన బీఆర్ఎస్కు ఓటేయవద్దని, సామాన్యుల కోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం కాదు: ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుంది తప్ప చేతల ప్రభుత్వం కాదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు వస్తుండడంతో రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తరుగు లేకుండా ధాన్యం కొంటామని, రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
''తలుపులు తాళాలు లేని ఇళ్ళు... దొంగతనం కూడా జరగదు''
వారణాసిలో గంగానదీ ఒడ్డున ఒక సత్రం ఉంది. ఆ సత్రానికి ఒకరోజున ముగ్గురు బాటసారులు వచ్చారు. వారు ఉదయం భోజనం ముగించాక సత్రం మధ్యలో ఉన్న చెట్టు కింది రచ్చబండ మీద కూర్చొన్నారు. ఒకరి సమాచారం ఒకరు చెప్పుకున్నారు. వారిలో పొడగరి సుదత్తుడు. అతను అంగరాజ్యం నుండి వచ్చాడు. బట్టతల వాడు సుశీలుడు కోసల రాజ్య వాసి. పొట్టిగా నల్లగా ఉన్నవాడు ధర్మధరుడు. అతను శాక్య రాజ్యం నుంచి వచ్చాడు. ‘‘మిత్రులారా! మన దగ్గర ధనం ఉంది. ఈ ప్రాంతంలో దొంగలు ఎక్కువ. మనం చూస్తూ ఉండగానే మాయం చేయగలరు. కళ్లు గప్పి సొమ్ములు కాజేసుకుపోగల నేర్పరులు.’’ అన్నాడు సుదత్తుడు. ‘‘ఇక్కడ కంటే మగధ రాజ్యం మరీనూ. పట్టపగలే దోపిడీలు చేస్తారు’’ అన్నాడు సుశీలుడు. ‘‘మా రాజ్యంలో ఆ బెడద ఉండదు’ అన్నాడు ధర్మధరుడు.‘‘మా రాజ్యంలో కూడా... మా రాజ్యంలో కూడా’’ అన్నారు మిగిలిన ఇద్దరు! ‘‘నిజమా!’’ అని ప్రశ్నించాడు ధర్మధరుడు.‘‘ఔను మిత్రమా! మా రాజ్యంలో ఇళ్ళన్నీ గట్టి గోడలతో ఉంటాయి. బలమైన తలుపులు ఉంటాయి. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండరు. వస్తువులన్నీ ఎడాపెడా పడవెయ్యరు. పైగా.. రాజభటులు ఎప్పుడూ కావలి కాస్తూనే ఉంటారు. మన అజాగ్రత్తే దొంగలకు అవకాశం అవుతుంది. మనం నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకుని నేరం దొంగల మీద వేస్తాం’’ అన్నాడు అంగ రాజ్యానికి చెందిన సుదత్తుడు. ‘‘అసలు మా రాజ్యంలో అయితే.. దొంగతనం చేయాలి అంటేనే దొంగలకీ భయమేస్తుంది. దొంగల విషయంలో మా మహారాజుగారు మహా క్రూరంగా వ్యవహరిస్తారు. కఠిన శిక్షలు అమలు చేస్తారు’’ అన్నాడు సుశీలుడు. ‘‘దొంగతనం చేయాలంటే.. దొంగలకి వెన్నులో వణుకు వస్తుంది. అందుకే మా రాజ్యంలో ఇళ్ళకు సరైన తాళాలు కూడా వెయ్యరు. దండం దశగుణం భవత్... అంటూ ముగించాడు సుశీలుడు. ధర్మధరుడు వాళ్ళిద్దరి మాటలు విని మౌనంగా ఉన్నాడు. ‘‘మిత్రమా! మరి మీ రాజ్యం’’అని అడిగాడు సుదత్తుడు. ‘‘మిత్రులారా! మా రాజ్యంలో మా ఇళ్ళకు తాళాలు ఉండవు.’’ అన్నాడు. ‘అంటే మా రాజ్యం లాగానే అన్నమాట’’ అన్నాడు ఆతృతగా సుశీలుడు. ‘‘కాదు మిత్రమా! ఈ సుదత్తుని రాజ్యంలో ప్రజలు తమ జాగ్రత్తల్లో ఉంటారు. ఇంటికి బలమైన గోడలూ, వాటి చుట్టూ రక్షక వలయాలూ.. ఇతరులకి దొంగతనం చేసే అవకాశమే ఇవ్వరు. కాబట్టి ఆ రాజ్యంలో దొంగతనాలు లేవు. ఇక మీ రాజ్యంలో కఠోరమైన శిక్షలు. కాబట్టి, శిక్షల భయంతో మీ రాజ్యంలో చోరులు లేరు. కానీ మా రాజ్యంలో వేరు. దొంగతనానికి కఠినమైన శిక్షలు లేవు. మా ఇళ్లకూ గట్టి రక్షణలూ లేవు. అయినా దొంగతనాలు జరగవు. కారణం! దొంగతనం చేయాలనే ఆలోచనే ఎవ్వరిలోనూ ఉండదు. ‘శిక్షించబడతాం’ అనే భయంతో కోరికల్ని వదిలిపెట్టకూడదు. భయంతో వదిలే కోరికలు తాత్కాలికమే. ఇక్కడ శిక్షలు లేవు, ఎవ్వరూ చూడడం లేదు’ అనుకుంటే వెంటనే కోర్కెలు తీర్చుకోవడానికి సిద్ధపడతారు. అవకాశం లేకపోవడం వల్లనో, శిక్షల భయం వల్లనో తప్పులకు దూరంగా ఉండటం కాదు... స్వీయ నిగ్రహం వల్ల ఉండాలి. అలా ఉండాలంటే మనస్సులో కామరాగాలు నశించాలి. వాళ్లే వీతరాగులు. పరుల సొమ్ముని పాములా భావిస్తారు. మనో నిబ్బరంతో ఉంటారు. శీలవంతులుగా జీవిస్తారు. కాబట్టి మా రాజ్యంలో దొంగతనాలు తెలియవు. దొంగలకి శిక్షలు తెలియవు. వారి కోసం చెరసాలలూ లేవు.’’ అన్నాడు. ‘‘ఐతే.. మేము విన్నది నిజమే అన్నమాట’’ మీరందరూ వీతరాగులే’’ అన్నారు మిగిలిన ఇద్దరూ!‘‘అవును.. తథాగత బుద్ధుని బోధనలు పాటిస్తాం. వీతరాగులుగానే జీవిస్తాం’’ అన్నాడు ధర్మధరుడు. అలాంటి మనుషులు, వారి మనస్సులూ దుఃఖాలకి దూరమవుతాయి. అలాంటి మనుషులున్న సమాజం ఆదర్శనీయమవుతుంది. అల్లకల్లోలాలకు దూరమవుతుంది. ఆ సమాజంలో శాంతి తాండవిస్తుంది’’ అంటాడు బుద్ధుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
కోట్లకు పడగలెత్తిన దొంగ.. నేపాల్లో హోటల్, యూపీలో గెస్ట్హౌస్, లక్నోలో ఇల్లు..
దేశరాజధాని ఢిల్లీ పోలీసులు ఇటీవల ఒక దొంగను పట్టుకున్నారు. ఇతను పోలీసుల కన్నుగప్పి చోరీలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఈ దొంగ తన దొంగసొమ్ముతో ఢిల్లీ మొదలుకొని నేపాల్ వరకూ పలు ఆస్తులను కూడబెట్టాడు. ఈ దొంగ.. ఢిల్లీలో ఒంటరిగా 200కు పైగా చోరీలు చేశాడు. ఇతనిని పోలీసులు వివిధ పేర్లతో తొమ్మిదిసార్లు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగ తన భార్య పేరుతో సిద్ధార్థనగర్లో గెస్ట్హౌస్, తన పేరుతో నేపాల్లో ఒక హోటల్ కొనుగోలు చేశాడు. అలాగే లక్నో, ఢిల్లీలలోనూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. 2001 నుంచి 2023 వరకూ ఈ దొంగపై 15కు పైగా నేరపూరిత కేసులు నమోదయ్యాయి. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం మోడల్ టౌన్ పోలీసులు ఒక ఇంటిలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో కోటీశ్వరుడైన ఒక హోటల్ వ్యాపారిని అరెస్టు చేశారు. అతనిని మనోజ్చౌబేగా గుర్తించారు. అతను గడచిన 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జీవిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతనొక్కడే 200కుపైగా చోరీలు చేశాడని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ చౌబే(45) కుటుంబం యూపీలోని సిద్దార్థనగర్లో ఉండేది. తరువాత వారి కుటుంబం నేపాల్కు తరలివెళ్లింది. మనోజ్ 1997లో ఢిల్లీ వచ్చాడు. కీర్తినగర్ పోలీస్స్టేషన్లో క్యాంటీన్ నిర్వహించాడు. క్యాంటీన్లో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు మొదలుపెట్టాడు. భారీ మొత్తంలో సొమ్ము పోగేశాక గ్రామానికి వెళ్లిపోతుండేవాడు. ఈ చోరీ సొమ్ముతో మనోజ్ నేపాల్లో హోటల్ ఏర్పాటు చేశాడు. ఈ సమయంలోనే యూపీలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలో తాను ఢిల్లీలో పార్కింగ్ కంట్రాక్టు పనులు చేస్తుంటానని తెలిపాడు. ఇందుకోసం తాను ఆరు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లవలసి ఉంటుందని నమ్మబలికాడు. మనోజ్ను తాజగా అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా? -
ఈ తల్లి ధైర్యానికి సెల్యూట్.. దొంగను ఉరికించింది
సాక్షి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా వేములవాడలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఆమెపై దొంగ దాడి చేస్తున్నా భయంతో బెదరకుండా అతడితో పోరాడింది. వివరాలు.. భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. భర్త గల్ఫ్లో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కాగా మొదటి అమ్మాయికి వివాహం జరిగింది. రెండో కూతురు అమెరికాలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీలత ఇంట్లోకి ఓ దుండగుడు దొంగతానికి వచ్చాడు. ఇంటి ముందు చప్పుడు కావడంతో శబ్దాలకు ఆమె బయటకు వచ్చి చూసింది. ఇంటి ఆవరణలో చీకట్లో నక్కిన ఆగంతకుడు మహిళను చూసి రాడ్తో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రీలత ఎంతమాత్రం భయపడకుండా దొంగను ధైర్యంగా ప్రతిఘటించింది. చాకచక్యంగా వ్యవహరించి చీకట్లోనే అతనితో పోరాడింది. చివరికి గట్టిగా కేకలు వేయడంతో దొంగ చేతికి చిక్కిన ఏడు గ్రాముల బంగారు గొలుసుతో అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళా ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. తల్లి ధైర్యానికి సెల్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కర్టెన్ ఉపయోగించి, దొంగ దాడి నుంచి తప్పించుకున్న విధానాన్ని ప్రశంసిస్తున్నారు. వేములవాడలో మహిళపై దాడి చేసిన దొంగ .. ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ వేములవాడ - భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు. శ్రీలత… pic.twitter.com/TSl6uZTTkQ — Telugu Scribe (@TeluguScribe) August 14, 2023 -
క్రైమ్ బ్రాంచి పోలీసునని చెప్పి.. బిర్యానీ తెమ్మని.. ఇంతలో..
మెదక్: క్రైమ్ బ్రాంచి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లాలని కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గమధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి డ్రైవర్ను బిర్యానీ తెమ్మని చెప్పాడు. అతడు వచ్చేలోపే కారుతో ఉడాయించాడు. ఈసంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గంగాపూర్కు చెందిన గండ్ల నరేష్గౌడ్ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం జహీరాబాద్లో ఉండగా ఓ అపరిచిత వ్యక్తి క్రైమ్ బ్రాంచి పోలీసునని సంగారెడ్డి వరకు కారు కిరాయికి కావాలని రూ. 2 వేలకు మాట్లాడుకున్నాడు. జహీరాబాద్ నుంచి వస్తుండగా మార్గమధ్యలో బుదేరా వద్ద ఓ దాబాలో లంచ్ చేసి, అక్కడి నుంచి సంగారెడ్డి పోలీస్స్టేషన్ వద్ద ఐదు నిమిషాలు ఆపమన్నాడు. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్ వద్ద ఫోన్లో మాట్లాడాడు. జూబ్లీహిల్స్లో సాయంత్రం మీటింగ్ ఉందని డ్రైవర్కు తెలిపాడు. అదనంగా రూ. 3 వేలు కిరాయి అవుతుందని చెప్పగా సరే అన్నాడు. హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని ఓ హోటల్ వద్దకు రాగానే మూడు బిర్యానీలు తీసుకురమ్మని డ్రైవర్కు చెప్పి రూ.1000 ఇచ్చాడు. దీంతో డ్రైవర్ బిర్యాని ఆర్డర్ చేశాడు. పది నిమిషాలు పడుతుందని హోటల్ నిర్వాహకుడు తెలపగా.. కారులో ఉన్న వ్యక్తికి చెప్పేందుకు వచ్చాడు. అప్పటికే అతడు కారుతో పరారయ్యాడు. ఈ మేరకు డ్రైవర్ నరేష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ చదివి.. యూట్యూబ్ చూసి దొంగతనం.. చివరికి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): బీటెక్ చదివిన యువకులు ఉద్యోగం లభించక బైక్ చోరీలకు అలవాటుపడి చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన హనుమంతనగర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బాలయ్యపల్లి మండలానికి చెందిన హేమాద్రి, పవన్లు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చారు. అయితే వారికి ఉద్యోగం దొరకలేదు. ఊర్లో మాత్రం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకునేవారు. యూట్యూబ్లో చూసి బైక్లు చోరీ చేయడం ఎలాగో తెలుసుకున్న ఇద్దరూ ఖరీదైన బైక్లు, బుల్లెట్ బండ్లను చోరీ చేసి ఊర్లో దర్జా చూపేవారు. మరోవైపు బాధితులు హనుమంతనగర పీఎస్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను వారి సొంతూరికి వెళ్లి అరెస్టుచేసి తీసుకొచ్చారు. చదవండి ఎమ్మెల్యేకు షాక్.. సంచలనం రేపుతున్న మహిళా కానిస్టేబుల్ వాట్సాప్ స్టేటస్ -
దోష నివారణ చేస్తానని.. గుడి వద్ద ఉండమని చెప్పి.. సొమ్ముతో..
సంగారెడ్డి: ఇంటికి దోష నివారణ పూజ చేస్తానని యజమానులకు టోకరా వేసి బంగారంతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన అంబేద్కర్నగర్లో సోమవారం వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిముత్తగల్ల భూమవ్వ పెద్ద కుమారుడు బాబు గడ్ల వ్యాపారస్తుడి వద్ద డ్రైవర్. గతేడాది మొహర్రం పండగ రోజు అతను విజయవాడకు చెందిన షేక్ మస్తాన్ను ఇంటికొచ్చాడు. గృహానికి దోషం ఉందని నివారణకు పూజ చేయాలంటే తిరస్కరించారు. తాజాగా బాధితురాలి చిన్న కుమారుడైన మధుతో మస్తాన్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసి నంబర్ తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి వచ్చి, పూజ చేస్తున్నాడు. మధ్యలో అమ్మవారి అలంకరణకు బంగారు నగలు కోరాడు. 2.5 తులాల పుస్తెల తాడు, పావు తులం కమ్మలు, 5 తులాల వెండి పట్టీలు ఇచ్చారు. ఈ తంతు ముగిసిన అనంతరం సామగ్రిని సిద్దిపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఓ ప్రాంతంలో పడవేయాలని చెప్పగా మధు వెళ్లాడు. పొద్దు పోయే వరకు రాలేదు కాల్ చేయగా తనను గుడి వద్ద ఉండమని చెప్పి మస్తాన్ వెళ్లాడు. తర్వాత కుటుంబీకులు అనుమానం వచ్చి గదిలో వెళ్లి చూస్తే బంగారం నగలు లేవు. తాము మోసపోయామని గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్ వదిలి పరార్..
హైదరాబాద్: దొంగతనం కోసం వచ్చిన దుండగులు ఇంటి యజమాని అప్రమత్తమై కేకలు వేయడంతో తాము వచ్చిన బైక్ను అక్కడే వదిలేసి పరారైన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ...షేక్పేట ఓయూ కాలనీ సమీపంలోని భగత్సింగ్ కమ్యూనిటీ హాల్ వద్ద నివసించే మెకానిక్ ఆంజనేయులు శుక్రవారం తెల్లవారుజామున అలికిడి రావడంతో లేచి చూశాడు. ఏసీ సందులో నుంచి ఓ చెయ్యి లోపలికి రావడం, తన పర్సును తస్కరించేందుకు యత్నించడంతో వెంటనే లేచి అరిచాడు. ఈ అరుపులకు ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారవుతుండగా ఆంజనేయులు బయటికి పరుగులు తీశాడు. దొంగతనానికి వచ్చిన వ్యక్తితో పాటు మరొకరు కూడా ఉన్నట్లుగా గుర్తించాడు. ఇద్దరిని పట్టుకునేందుకు యత్నించగా వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దొంగతనానికి ఈ ఇద్దరూ వచ్చిన యాక్టివా బైక్ను అక్కడే వదిలేసి పోయారు. బాధితులు ఈ బైక్ను పోలీసులకు అప్పగించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైన్స్లో చోరీ..! ఎందుకీ తేడా? పలు అనుమానాలకు దారితీస్తున్న చోరీ..!!
ఆదిలాబాద్: జాతీయ రహదారికి కూతవేటు దూరాన భోరజ్ సమీపంలో ఉన్న వైన్స్ షాపులో శనివారం రాత్రి జరిగిన చోరీలో కొత్త కోణం బయటపడింది. దాదాపు 26 పెట్టెల మద్యం, రూ.70 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆధారాలు సేకరించి ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. అయితే నిర్వాహకులు చెప్పిన సొమ్ముకు, పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సొమ్ముకు పొత్తన లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.3 లక్షల వరకు చోరీకి గురైనట్లు నిర్వాహకులు చెప్పారు. రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైనట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. కాగా, చోరీ సొత్తుపై స్పష్టత కొరవడింది. ఎందుకీ తేడా? వైన్స్షాపులో చోరీని గుర్తించి నిర్వాహకులు పోలీస్స్టేషన్కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రూ.2.30 లక్షల విలువ చేసే మద్యం, రూ.70 వేల నగదును ఇద్దరు దుండగులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. పోలీసులకు అనుమానం వచ్చి వైన్స్ షాపును పరిశీలించారు. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైందని, నిర్వాహకులు అబద్దం చెబుతున్నారని అనధికారికంగా వెల్లడించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చోరీకి గురైన సొమ్మును నిర్వాహకులు ఎక్కువగా చేసి చూపుతున్నారని కేసు నమోదు చేయడానికి వెనక ముందు చేశారు. చోరీ విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి. రూ.62 వేల విలువ చేసే మద్యంతోపాటు మరో రూ.8 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులు మాత్రం రూ.3లక్షల వరకు చోరీ అయిందని చెప్పడం గమనార్హం. ఏదీ నిజం ? వైన్స్ నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నదానికి పొంతన లేకపోవడంతో అసలు ఏది నిజం అన్న ప్రశ్న తలెత్తుతోంది. చోరీ కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చూపించడం అనే పోలీసుల ప్రాథమిక విధిగా ఉంటుంది. రూ.3 లక్షల వరకు సొత్తు చోరీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోద చేస్తే, అంత మొత్తం రికవరీ చూపించడం కష్టం ఉంటుందని పోలీసులే కావాలనే రూ.70 వేలు మాత్రమే అని నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు నిర్వాహకుల నిజాయితీపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఊరికి బయట ఉన్న వైన్స్లో రాత్రి వేళ కౌంటర్లో రూ.70 వేల వరకు నగదు ఉంచాల్సిన అవసరం ఏం వచ్చింది? అంత డబ్బులు, మద్యం సీసాలతో నిండిన షాపులో కాపలాగా ఎవరిని ఎందుకు నియమించలేదు? రూ.3 లక్షలు చోరీకి గురైతే ఎఫ్ఐఆర్లో రూ. 70వేలు అని పోలీసులు రాస్తే, నిర్వాహకులు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నలకు సమాధానాలు లేవు. అసలు సీసీ టీవీలో కనిపిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? చోరీకి గురైన సొత్తు ఎంత? నిర్వాహకులు, పోలీసుల చెబుతున్నది ఎవరిది నిజం? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సీసీ టీవీల్లో రికార్డ్ అయిన దొంగలు దొరకాలి. ఈ విషయమై సీఐ కోల నరేశ్ను వివరణ కోరగా, కేసు నమోదు చేశామని, త్వరలో దర్యాప్తు పూర్తి చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
సింగరేణికి దొంగల బెడద..
కరీంనగర్: సింగరేణి రామగుండం రీజియన్ ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని ఓసీపీల్లో ఉన్న కాపర్ కేబుళ్లే లక్ష్యంగా దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో స్క్రాప్ యార్డులపై కన్నేసిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లి, అక్రమ మార్గాన విక్రయించి, సొమ్ము చేసుకునేవారు. చోరీలను నివారించేందుకు యాజమాన్యం స్క్రాప్ యార్డులు, గనుల వద్ద సెక్క్యూరిటీ పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. స్క్రాప్ నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ చోరీలు తగ్గిపోయాయి. అంతేకాకుండా స్క్రాప్ చోరీలవల్ల ప్రయాస ఎక్కువగా ఉండటం, లాభాలు కూడా తక్కువగా ఉండటంతో దొంగలు తమ రూట్ మార్చారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వచ్చే కాపర్ కేబుళ్లపై కన్నేశారు. భారీ యంత్రాల పవర్ కేబుళ్లు చోరీ వర్షాకాలం కావడంతో ఓసీపీ క్వారీలోని పనిస్థలాల వద్దకు సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి అధికారులు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇదు అదనుగా దొంగలు రెచ్చి పోతున్నారు. విద్యుత్తో నడిచే భారీ యంత్రాలకు ఉన్న పెద్ద కాపర్ కేబుళ్లను కట్ చేసుకొని, ఎత్తుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో హెచ్టీ లైన్ విద్యుత్ సరఫరా ఉండగానే పెద్ద గొడ్డళ్లతో కేబుళ్లను నరికి, క్షణాల్లో వాహనంలో వేసుకొని, పరారవుతున్నారు. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టంతోపాటు యంత్రానికి విద్యుత్ లేక పని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దొరికినా చర్యలు లేవు దొంగతనాలు జరిగిన కొన్ని సందర్భాల్లో దొంగలు రెడ్హ్యాండెడ్గా సెక్యూరిటీ సిబ్బందికి దొరికినా సరైన చర్యలు లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సింగరేణి సంస్థకు, పోలీసు శాఖకు మధ్య సరైన సమన్వయం లేక దొంగలు తిరిగి అదే పనికి అలవాటు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. స్క్రాప్, కాపర్ కేబుళ్ల ముఠాల వివరాలు, విషయాలు తెలిసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంతో సింగరేణిలో చోరీలకు అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంటి దొంగల అండతోనే! ఇంటి దొంగల అండతో కాపర్ కేబుళ్ల చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో కొంత ముట్టజెప్పి, చోరీ సమయంలో సహకరించాలని కోరడంతో కొందరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే స్టోర్స్లోని 600 మీటర్ల కాపర్ కేబుల్ దొంగతనం జరిగిందని పలువురు అంటున్నారు. దీనిపై కొందరికి సస్పెండ్ కమ్ పెండింగ్ ఎంకై ్వరీ పెట్టి, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
శాయం పేట: సెల్ఫోన్ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. -
కూతురు సంసారం చక్కదిద్దాలని.. అందరినీ ఆలయానికి పంపి, తిరిగి వచ్చేసరికి
బనశంకరి: బీరువాలో నిమ్మకాయ పెట్టి నగలు దోచుకెళ్లిన ఉదంతంపై యలహంక పోలీస్స్టేషన్లో జరిగింది. అళ్లాలసంద్రకు చెందిన ఇందిరా అనే మహిళ కుమార్తె సంసారంలో గొడవలు వచ్చాయి. కుమార్తె పుట్టింటికి వచ్చింది. దీంతో తన కుమార్తె జీవితాన్ని చక్కదిద్దాలని హొసపేట సురేశ్ పాటిల్ను ఇందిరా ఆశ్రయించింది. అమావాస్యరోజున అందరినీ ఆలయానికి పంపి బీరువా తెరిచి రూ.5 లక్షల విలువచేసే బంగారు నగలు దోచుకుని బీరువాలో నిమ్మకాయపెట్టి పారిపోయాడు. దీనిపై కేసు నమోదైంది. చదవండి తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి... -
రోడ్డుపై నుంచి ఫాలో.. మహిళ ఇంట్లోకి వెళ్లగానే చొరబడి
మైసూరు(బెంగళూరు): మహిళలు రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో చేసి అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లగానే.. తాను కూడా చొరబడి మహిళ తలపై రాడ్ కొట్టి తాళి చైన్ను లాక్కెళ్లాడో దుండగుడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణం చామలాపుర హుండిలో జరిగింది. వివరాలు.. ప్రైవేటు ఉద్యోగి రవికుమార్ భార్య సవిత (40) సోమవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఇనుప రాడ్తో తలపై గట్టిగా కొట్టి ఆమె మెడలో ఉన్న మాంగళ్యం చైన్ను లాక్కొని పారిపోయాడు. మహిళ అరుపులు విని చుట్టుపక్కలవారు వచ్చేసరికి ఆగంకుతుడు పరారయ్యాడు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. నంజనగూడు పోలీసులు పరిశీలించి దుండగుని కోసం గాలింపు చేపట్టారు. చదవండి Video: లంచం తీసుకుంటూ పట్టుబడి.. కరెన్సీని కసాబిసా నమిలి మింగేశాడు -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్!
మెదక్: మండలంలోని మిర్జాపల్లిలో శనివారం అర్ధరాత్రి తాళం వేసిన ఆరు ఇళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వెండి, బంగారంతోపాటు కోళ్లు ఎత్తుకెళ్తారు. చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం మేరకు... మిర్జాపల్లిలోని శ్రీకాంత్గౌడ్ ఇంట్లో దొంగలు పడ్డారు. అర తులం బంగారపు ఉంగరం, 20 తులాల వెండి పట్టాగొలుసులు, రూ.5 వేల నగదు అపహరించారు. అలాగే సంగని శ్రీనివాస్, తాళ్ల శేఖర్గౌడ్, గడ్డమీది ముత్యాలు, కాయితి చంద్రయ్యకు చెందిన ఇళ్ల తాళలు పగలగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. పారిపోతూ చింతల కిష్టయ్యకు చెందిన మూడు కోళ్లు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో వీరి కుటుంబసభ్యులు నిద్రిస్తున్నారు. మెదక్ క్లూజ్ టీం బాధితుల ఆరు ఇళ్లను పరిశీలించింది. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరి మహిళలే లక్ష్యంగా!
నిజామాబాద్: ఒంటరి మహిళలే లక్ష్యంగా జి ల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ద్విచక్రవాహనాలపై వచ్చి గొలుసులు లాక్కెళ్తున్నారు. అంతేగాకుండా రద్దీ ఎక్కువగా ఉండే అంగడి లాంటి ప్రాంతాల్లో సైతం చైన్స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని గొలుసులను సైతం చోరీ చేస్తున్నారు. అడ్రస్ అడగినట్లు వచ్చి చైన్ లాక్కొని పారిపోతున్నారు. ఇటీవల ఆర్మూర్లో ఓ మహిళ ఇంట్లో టీవీ చూస్తుండగా దొంగ ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. కరువైన నిఘా.. పోలీసులు నిఘా లోపించడంతో చైన్ స్నాచింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. సీసీ పుటేజీలను ఏర్పాటు చేసిన వాటి నిర్వహణ లేకపోవడంతో అవి సక్రమంగా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘా పెంచి చైన్ స్నాచర్లను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ నెల 18న నిజామాబాద్లోని మహాలక్ష్మి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ► పదిహేను రోజుల క్రితం ఆర్మూర్లోని కుమ్మరిగల్లీకి చెందిన మీనాక్షి స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి బైక్పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ► రెండు నెలల క్రితం ఆర్మూర్లోని తిరుమల కాలనీలో స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల చైన్ను లాక్కెళ్లారు. అనుమానం వస్తే స్థానికులకు చెప్పాలి ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్స్నాచింగ్కు పాల్పడుతున్నారు. ఎవరైన బైక్పై మెల్లగా వచ్చి అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానికంగా ఉండే వారికి విషయం చెప్పాలి. అప్రమత్తంగా ఉండటంతోపాటు డయల్ 100కు కాల్ చేయాలి. – కిరణ్కుమార్, ఏసీపీ, నిజామాబాద్ -
పట్టపగలే హుండీ చోరీ!
మహబూబ్నగర్: పట్టపగలే ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగుచూసింది. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. మండలంలోని పాత కిష్టంపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దుండగులు హుండీని పగులగొట్టి రూ.రెండు లక్షలు నగదు, అలాగే వెండి నగలు అపహరించారు. ఆలయంలో పూజలు నిర్వహించడానికి శనివారం ఉదయం ఆలయ పూజారి సోములు వెళ్లాడు. తాళాలు పగులగొట్టి ఉండటంతో హుండీని గమనించాడు. పగిలి ఉండటంతో వెంటనే సర్పంచ్తోపాటు ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని పోలీసులకు తెలిపారు. ఎస్ఐ జగన్మోహన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీని పరిశీలించారు. ఈ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేస్తున్నారు. కారులో వచ్చి... వికారాబాద్కు చెందిన అంబిరియా నానవత్ (టీఎస్ 34 టీఎ 0783) కారులో కిష్టంపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఎవరూ లేకపోవడంతో ఆలయంలోకి చొరబడ్డారు. తాళాలు పగులగొట్టిన అనంతరం కారులో ఉన్న మహిళ ఆలయ గర్భగుడిలోకి వెళ్లి హుండీలోని నగదు తీసుకున్నారు. కారు నంబర్ను పోలీసులు ట్రేస్ చేయగా కారు వికారాబాద్కు చెందిన అంబిరియా నానవత్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఇదే కారుకు జూలై 3న నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్లో ఫైన్ వేసినట్లు గుర్తించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
నమ్మించి.. ఆపై ఉడాయించి..
నెల్లూరు: వ్యాపారినంటూ నమ్మించి స్థానికుల నుంచి రూ.మూడు కోట్లను కాజేసి వ్యక్తి పరారైన ఘటన ఆత్మకూరు పరిధిలోని నెల్లూరుపాళెంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్కు చెందిన ఓ వ్యక్తి తన పేరు భాస్కర్రెడ్డి అంటూ నెల్లూరుపాళెం వద్ద మక్కెన రోశయ్య ఇంట్లో మూడు నెలల క్రితం అద్దెకు చేరారు. ఆత్మకూరు సమీపంలోని నాగులపాడు రోడ్డులో గోడౌన్ లాంటి ఇంటిని అద్దెకు తీసుకొని లారీల్లో చక్కెర బస్తాల ఎగుమతి, దిగుమతి చేస్తూ హడావుడి చేశారు. నెల్లూరుపాళెంలోని పాత ఆర్టీఏ కార్యాలయ సమీపంలో మరో ఇంటిని అద్దెకు తీసుకొని గెస్ట్హౌస్గా వినియోగించసాగారు. తాను చక్కెరతో పాటు వర్జీనియా పొగాకుతో ఐటీసీ తయారు చేసిన సిగరెట్ల హోల్సేల్ వ్యాపారం చేస్తున్నానని చుట్టుపక్కల వారిని నమ్మించారు. తన వ్యాపారానికి కోట్లు అవసరమని.. పెట్టుబడి పెడితే రూ.లక్షకు రోజుకు రూ.1500 వడ్డీని ఏరోజుకా రోజు చెల్లిస్తానని చెప్పారు. దీనికి ఆశపడిన రోశయ్య రూ.కోటిన్నరను ఆయనకు ముట్టజెప్పారు. చెప్పిన విధంగా రూ.2.25 లక్షల చొప్పున అధిక వడ్డీని క్రమం తప్పకుండా అందించసాగారు. విషయం తెలుసుకున్న నెల్లూరుపాళెం సెంటర్లోని వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.30 లక్షలను సమర్పించారు. అనంతరం భాస్కర్రెడ్డి పత్తా లేకపోవడంతో కంగారుపడిన బాధితులు ఆయన గురించి ఆరాతీశారు. ఇదే తరహాలో బుచ్చిరెడ్డిపాళెంలోనూ పలువుర్ని నమ్మించి నగదుతో పరారయ్యాడని తెలుసుకొని లబోదిబోమంటూ ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించారు. అతని ఫోన్ లోకేషన్ను పరిశీలించి బద్వేల్లో ఉన్నారని గుర్తించి పోలీసుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు రూ.మూడు కోట్ల మేర కాజేసి ఉడాయించారని బాధితులు రోశయ్య, చెరుకూరి కామాక్షయ్య సన్నిబోయిన ప్రభాకర్, ఈదల సురేష్, ప్రసాద్, ఖాజారహంతుల్లా, మాదాల విష్ణు, బొబ్బల రాజా, ముక్కాల శ్రీనివాసులు, పుచ్చకట్ల రమణయ్య, మాదాల కృష్ణయ్య, తదితరులు తెలిపారు. ఫిర్యాదు మేరకు డీఎస్పీ కోటిరెడ్డి, ఎస్సైలు ముత్యాలరావు, రాజేష్ దర్యాప్తు చేపట్టారు. -
లిఫ్ట్ అడిగి.. బైక్తో ఉడాయించాడు!
భద్రాద్రి: ఓ యువకుడు లిఫ్ట్ అడిగి బైక్తో ఉడాయించిన ఘటన శనివారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. టీడీపీ మండల అధ్యక్షుడు కొమరం దామోదర్రావు ఉదయం బైక్పై సీతానగరం నుంచి లక్ష్మీనగరం వస్తున్నాడు. ఈ క్రమంలో సీతానగరం గ్రామం దగ్గర ఓ యువకుడు లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కాడు. చిన్ననల్లబల్లి వచ్చాక బైక్లో పెట్రోల్ కొట్టించారు. అనంతరం స్టార్ట్ కాకపోవడంతో దామోదర్రావుతోపాటు సదరు యువకుడు ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ మెకానిక్ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ రిపేర్ చేస్తుండగా అత్యవసర పని ఉండటంతో దామోదర్రావు ఆటోలో లక్ష్మీనగరం బయల్దేరాడు. ఆటో ఎక్కాక అనుమానం వచ్చి.. తాను వచ్చే వరకు బైక్ ఎవరికీ ఇవ్వొద్దని మెకానిక్కు చెప్పాలంటూ ఇద్దరు గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు మెకానిక్ షాపు వద్దకు వచ్చే లోపే లిఫ్ట్ అడిగిన యువకుడు స్టార్ట్ చేసి చూస్తానంటూ బైక్తో ఉడాయించాడు. దీంతో దామోదర్రావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
దొంగలు దొరికారు !
వికారాబాద్: పనిచేసిన యజమాని ఇంటికే కన్నం వేశాడు ఓ వ్యక్తి.. ఇంట్లో భారీగా నగదు ఉందనే పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల తాండూరు పట్టణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.19లక్షలను రికవరీ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. బుధవారం ఎస్పీ కోటిరెడ్డి తాండూరు పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన వ్యాపారి ఎండీ వాజీద్ ఇటీవల ప్లాట్ విక్రయించగా రూ. 20 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇంట్లో పెట్టి ఈ నెల 14న హైదరాబాద్లో బంధువుల వివాహానికి వెళ్లాడు. తరువాతి రోజు ఇంట్లో చోరీ జరిగింది. రూ. 20లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రాజేందర్రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. తెలిసిన వ్యక్తి పనే.. వాజీద్ వద్ద అబూబాకర్ ఖురేషి అనే వ్యక్తి గతంలో పనిచేశాడు. ఇంట్లో డబ్బు ఉందన్న సమాచారంతో దొంగతానికి ప్లాన్ చేశాడు. తన పెద్దమ్మ కొడుకు అబూ సోఫియాన్ ఖురేషికి విషయాన్ని చెప్పాడు. అదే కాలనీలో ఉంటున్న ఖలీల్, తౌసిఫ్, దీపక్ అలియాస్ కిట్టుతో కలసి ప్లాన్ వేశాడు. ఈ నెల 15న రాత్రి అబూబాకర్, ఖలీల్లు రాడ్తో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. మిగిలిన ముగ్గురు బయటనే ఉండి పరిసరాలను గమనిస్తూ ఉన్నారు. బీరువాలో ఉన్న రూ. 20 లక్షలను ఎత్తుకెళ్లారు. అందులో రూ.లక్షను మొదట అందరూ పంచుకున్నారు. మిగిలిన రూ. 19 లక్షలను యాదిరెడ్డి చౌక్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఉన్న చెత్తకుప్పలో దాచి పెట్టారు. తరువాత వచ్చి నగదును తీసుకెళ్లి పంచుకుందామనుకున్నారు. సీసీ కెమెరాలే పట్టించాయి బాధితుడి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను, పలు ముఖ్య కూడళ్లలోని కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే మాణిక్ నగర్ వద్ద ఉన్న కెమెరాలో అబూబాకర్ ఖురేషి అనుమానాస్పద కదలికలను పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అబూ సోఫియాన్ ఖురేషిని అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసు ఛేదనకు సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషించాయన్నారు. 72 గంటల్లోనే నిందితుల అరెస్టులో కీలకపాత్ర వహించిన కానిస్టేబుళ్లు అమ్జద్, శివ, సాయికుమార్, షబీల్అహ్మద్లను ఎస్పీ అభినందించి, రివార్డు అందజేశారు. పట్టుబడిన నిందితులు ఇద్దరినీ బుధవారం రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. నిందితులు ఉపయోగించిన ఆటో, బైక్ను సీజ్ చేశామన్నారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకుంటామన్నారు. -
అర్ధరాత్రి ఆగంతకుడు !
భద్రాద్రి: ఇల్లెందులోని సింగరేణి కార్మికవాడల్లో అర్ధరాత్రి ఓ ఆగంతకుడు సంచరించిన సంఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ మొదటి లైన్లో శనివారం తెల్లారుజామున 3.35 గంటల ప్రాంతంలో 20 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆగంతకుడు ముఖానికి మంకీ క్యాప్, మాస్క్ ధరించి కొన్ని ఇళ్లల్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇల్లెందులోని ఐసీఐసీఐ బ్యాంక్లో పని చేస్తున్న క్రాంతి, సింగరేణి స్కూల్లో పని చేస్తున్న ఆయన సతీమణి కృష్ణవేణి నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. వారి క్వార్టర్ ముందు కిటికీ తీసి ఇంట్లోకి మొబైల్ టార్చ్ వేసి చూశాడు. ఇంట్లోని కుక్క గమనించి అరవడంతో ఇంటి యజమాని కృష్ణవేణి నిద్ర లేచింది. కిటికీ ముందు నిలబడిన ఆగంతకుడు మొబైల్ టార్చ్ వేసుకుని చూస్తుండటంతో భయపడిన కృష్ణవేణి కేకలు వేసింది. ఆ సమయంలో భర్త క్రాంతి ఊరెళ్లాడు. పక్కింటివారికి ఫోన్ చేయగా, వారు నిద్రలేచి వెతికినా అప్పటికే ఆగంతకుడు పారిపోయాడు. అదే లైన్లో మరికొన్ని ఇళ్లల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. గతేడాది వేసవిలో కూడా ఇదే తరహాలో పట్టణంలో దుండుగులు చోరీలకు పాల్పడ్డారు. తాజాగా సింగరేణి కాలనీలో ఆగంతకుడి సంచారంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వీడియో: ఏం తెలివిరా నాయనా.. సినీ ఫక్కీలో 10లక్షలు చోరీ
సాక్షి, గుంటూరు: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దొంగలు ఎప్పటికప్పుడు అప్గేట్ అవుతూ ట్రిక్కులతో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.20 కోసం కక్కుర్తిపడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో పట్టపగలే దొంగలు చేతివాటం చూపించారు. రూ. 20నోటును ఎరగవేసి రూ.10లక్షల నగదును ఎత్తికెళ్లారు. బాలాజీ నగర్కు చెందిన కోసూరి హరిబాబు ఎం.ఎన్ ఎక్స్పోర్టు కంపెనీలో మూడేళ్లుగా గుమస్తాగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన లక్ష్మీపురంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.10 లక్షలు డ్రా చేశారు. కాగా, బ్యాంకు నుంచి బయటకు వచ్చి డబ్బులు ఉన్న బ్యాగును బైక్ హ్యాండిల్కు తగిలించారు. తర్వాత బైక్ స్టార్ట్ చేస్తుండగా.. ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పాడు. దీంతో, ఆ రూ.20లను తీసుకునేందుకు హరిబాబు.. బైకి దిగి కిందకు వంగాడు. ఇంతలో మరో వ్యక్తి బైక్ హ్యాండిల్కు ఉంచిన డబ్బుల సంచిని ఎత్తుకెళ్లాడు. అప్పటికే మరొక వ్యక్తి వాహనం స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో షాకైన హరిబాబు.. తేరుకుని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా.. బ్యాంకులోకి కూడా ఒక దొంగ ముందుగా వచ్చి ఎంత నగదు డ్రా చేసింది రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుని బ్యాంక్ దగ్గర రెక్కీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: శామీర్పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్.. -
షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది!
సాక్షి,ఖలీల్వాడి(హైదరాబాద్): నవీపేట్ శివారులో సాయినగర్ షిర్డీలో రైలులో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ సంఘటనలో నిందితులను రైల్వే పోలీసులు వదిలేసినట్లుగా సమాచారం. నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రైలు నవీపేట వద్ద క్రాసింగ్ ఉందని ఆపగా అక్కడ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు ఎక్కి ప్రయాణికుల బ్యాగులు చోరీ చేసిన విషయం విదితమే.. రైలులో బ్యాగ్లు చోరీ జరిగినట్లు తెలుసుకున్న ప్రయాణికులు బాసర వద్ద రైలును చైన్ లాగి ఆపిన విషయం తెలిసిందే. అయితే రైలు ఆగగానే పారిపోతున్న యువతుల్లో కొందరిని రైలు ప్రయాణికులే పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. బాధితులు సైతం తమ పూర్తి వివరాలతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాగుల్లో ల్యాప్టాప్తో డబ్బులు, ల్యాప్టాప్, ఓ మహిళ మెడలో నుంచి చైన్ ఎత్తుకెళినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు గుంటరు, విజయవాడ, నెల్లరు, వైజాగ్, కడపకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. మర్మమేమిటో..! బాసర రైల్వే పోలీసులు, ఆర్ఫీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తొమ్మిది మంది యువతులను విచారించి వదిలి వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యువతులు మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందినట్లు వారుగా గుర్తించారు. సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్లో చోరీపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదనే విమర్శులున్నాయి. ప్రయాణికులు బాసర వద్ద చైన్ లాగిన తర్వాత అక్కడి సీసీ ఫుటేజీలు, అలాగే యువతులు నవీపేట్ రైల్వేస్టేషన్ వద్ద ఎక్కిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే చోరీ విషయమై స్పష్టత వస్తుందనిప్రయాణికులు పేర్కొంటున్నారు. బాసర వద్ద ఉన్న సీసీపుటేజీల్లో యువతులు బ్యాగులు తీసుకుని స్లీపర్ కోచ్ నుంచి జనరల్ బోగీల్లోకి వెళ్తున్నట్లుగా రికార్డయినట్లు సమాచారం. రైల్వే ట్రాక్ పక్కన పడ్డ బ్యాగులు రైల్వే పోలీసుల వద్ద ఉన్నట్లు తెలిసింది. ఈ బ్యాగులు రైల్వేట్రాక్ పక్కకు ఎలా వచ్చాయనే విషయపై రైల్వేపోలీసులు సరైన విచారణ చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైలులో చోరీపై ఎస్పీ, ఎస్బీ ఆరా..! సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్లో చోరీపై రైల్వే ఎస్పీ, రైల్వే స్పెషల్ బ్రాంచ్ అధికారులు రైల్వే అధికారుల నుంచి వివరాలను సేకరింనట్లు సమాచారం. ఈ చోరీలో ప్రయాణికులు పట్టింన నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చోరీకి పాల్పడ్డ యువతులను ఆర్పీఎఫ్ పోలీసులు రైలు లో నిజామాబాద్ రైల్వేస్టేషన్కు గురువారం ఉద యం తీసుకొచ్చినట్లు తెలిసింది. వారిని రైల్వే పోలీ సులకు అప్పజెప్పినట్లు సమాచారం. చదవండి: Dundigal 83 Police SI's Transfers: ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు -
దారి దోపిడి దొంగకు తగిన శాస్తి
-
టమాటాతో కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు.. అంతలోనే ఊహించని షాక్!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దేశవ్యాప్తంగా టమాటకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కేజీ రూ.200తో విక్రయిస్తున్నారు. దీంతో ఆ పంటపై దొంగల కన్ను పడింది. రాత్రికి రాత్రే పంటను దోచుకెళ్తున్నారు. దొడ్డ తాలూకా లక్ష్మిదేవపురం గ్రామంలో రైతు జగదీష్ తన ఎకరా భూమిలో టమాట సాగు చేశాడు. మంచి దిగుబడితోపాటు ధరలు పెరగడంతో తన కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. ఎందుకంటే మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలోకి చొరబడి టమాట కాయలు తెంపుకొని ఉడాయించారు. బుధవారం ఉదయం తోటకు వెళ్లిన జగదీష్ చెట్లు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యాడు. చోరీకి గురైన టమాట విలువ రూ.1.50లక్షలు చేస్తుందని రైతు తెలిపాడు. చదవండి: Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. నగర చరిత్రలో ఆల్టైమ్ రికార్డు -
సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం.. అసలు విషయం తెలిసి అవాక్కయిన పోలీసులు!
వాషింగ్టన్: సాధారణంగా దొంగతనం చేసేటప్పుడు దొంగలు క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల నుంచి సొమ్ము, బంగారం వంటివి దోచుకోగానే అక్కడి నుంచి జాడలేకుండా పారిపోతారు. ముఖంపై మాస్క్ ధరించి వాళ్లెవరో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంత వరకు మనకు తెలిసిన కథే.. అయితే ఓ దొంగ మాత్రం వీటన్నింటికి భిన్నంగా ప్రవర్తించాడు. సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు. ఈ వింత ఘటన న్యూయార్క్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగరంలోని మాన్హట్టన్లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన దొంగ తుపాకీ గురిపెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు. దాంతో ఆ యువకుడు తన దగ్గర డబ్బులు లేవని, కేవలం సెల్ఫోన్, ఏటీఎం కార్డు మాత్రమే ఉందని చెప్పాడు. అయితే ఏటీఎంకు పదా అంటూ బాధితుడిని దొంగ తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేయించి తీసుకున్నాడు. చోరీ అనంతరం దొంగ ఏం చేయకుండా యువకుడిని సురక్షితంగా ముందు ఉన్న ప్రదేశంలోనే దింపాడు. అంతేకాకుండా ఆ దొంగ కొన్ని విషయాలు బయటపెట్టాడు. యువకుడి వద్ద డబ్బులు దోచుకున్నందుకు ‘సారీ బ్రదర్.. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లే దొంగలిస్తున్నట్లు’ వివరించాడు. మొబైల్ ఫోన్ కూడా త్వరలోనే తిరిగి ఇస్తానని ఆ యువకుడికి చెప్పాడు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను దొంగకు ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ కలుద్దాం అని చెప్పి ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.ఈ విషయం తెలియగానే పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటన అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉండగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చదవండి: Largest Restaurant In World: కొండల మధ్యలో రెస్టారెంట్.. ఒకేసారి 5800మంది భోజనం చేయొచ్చు -
హనుమాన్ టెంపుల్లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి..
ఛండీగఢ్: హనుమాన్ దేవాలయంలో ఓ దొంగ రూ.10 దేవునికి సమర్పించి రూ.5000 దోచేశాడు. ఈ ఘటన హర్యానా రేవారి జిల్లాలోని ధరుహేరా పట్టణంలో జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మొదట గుడిలోకి ఎంట్రీ ఇచ్చిన దొంగ.. హనుమంతుని పాదాల చెంత చేరి ప్రార్థన చేశాడు. పూజారి ముందే 10 నిమిషాల పాటు హనుమాన్ చాలీషా చదువుతూ దేవుని సన్నిధిలో గడిపాడు. ప్రార్థన అనంతరం చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని హుండీ తాళాని పగులగొట్టాడు. రూ.5000 చోరీ చేశాడు. దోపిడీ జరిగిందని గుర్తించని పూజారి గుడి తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా.. అసలు విషయం బోధపడింది. పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: హరిద్వార్లో రాకాసి మేఘం.. చూస్తే..! -
వైరల్ వీడియో.. దొంగోడి తిక్క కుదిరిందిగా!
-
దొంగోడికోసం అవ్వ కాపలా..
-
చీమకుర్తిలో పట్టపగలే దొంగతనం
-
దొంగల ముఠాపై పోలీసుల కాల్పులు
-
బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ!
రాంచీ: జార్ఖండ్లోని రాంచీలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ చైన్ స్నాచర్ బంగారు గొలుసును మింగేశాడు. డోరండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాది వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు స్నాచర్లు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. గొలుసు లాక్కొని ఆ ఇద్దరు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అయితే, నేరం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పోలీసులు ఉండడంతో.. ఇదంతా గమనించిన వారిని వెంబడించడం ప్రారంభించారు. సల్మాన్, జాఫర్లను పోలీసులు ఒక కిలోమీటరు మేర వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు సల్మాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. చివరికి పోలీసుకు దొరికిపోయే పరిస్థితి ఏర్పడడంతో.. తన దొంగతనానికి ఆధారం లేకుండా చేసే క్రమంలో చోరీకి గురైన బంగారు గొలుసును మింగేశాడు. అయితే సల్మాన్ చైన్ మింగుతుండగా పోలీసు అధికారులు చూశారు. చివరికి సల్మాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పొత్తికడుపు, ఛాతీకి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. ఎక్స్-రేలో సల్మాన్ ఛాతీలో బంగారు గొలుసు ఇరుక్కుని ఉన్నట్లు స్పష్టమైంది. దురదృష్టవశాత్తు, గొలుసు మింగిన కారణంగా, సల్మాన్ ఛాతీలో నొప్పిని మొదలై అది కాస్త తీవ్రతరం అయ్యింది. దీంతో తనని కాపాడాలని ఆ దొంగ పోలీసులను వేడుకోవడంతో ప్రస్తుతం అతని చికిత్స నిమిత్తం రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. గ్యాస్ట్రోస్కోపీ, ఎండోస్కోపీ లేదా శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీసేందుకు వైద్యులు చికిత్స చేయనున్నారు. ప్రస్తుతం నిందితుడు రిమ్స్లో పోలీసుల నిఘాలో ఉన్నాడు. చదవండి: నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తా.. -
'దొంగ 'అని పొరబడి అనాలోచితంగా చితకబాదేశారు..పాపం ఆ వ్యక్తి..
మద్యం మత్తులో ఓ వ్యక్తి హౌసింగ్ బోర్డులోకి చొరబడ్డాడు. అంతే అతన్ని దొంగగా భావించి సదరు హౌసింగ్ బోర్డు వాచ్మెన్, కొందరూ వ్యక్తులు అతడిని దొంగ అనుకుని చితకబాదేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి చేర్పించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ప్రవీణ్ అనే వ్యక్తి మద్యం సేవించి సమీపంలో కూల్చి వేసి ఉన్న హౌసింగ్ బోర్డులోకి ప్రవేశించాడు. అది గమనించిన వాచ్మెన్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కంగారుపడ్డ ఆ వ్యక్తి గోడ ఎక్కి పారిపోతున్నాడు. ఆగమని చెప్పిన వినకుండా వెళ్లడంతో ..వాచ్మెన్ తోపాటు సదరు వ్యక్తులు ప్రవీణ్పై గట్టిగా కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని కస్తుర్బా ఆస్పత్రికి తరలించాగా..అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అతను దాడి చేయడం వల్ల మరణించాడా లేక మరేదైనా కారణం వల్ల చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు పోస్ట్మార్టం అనంతరం అతడిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తామని వెల్లడించారు. (చదవండి: డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం: వీడియో వైరల్)