thief
-
అమ్మో పోలీస్.. ఇదేం పని బాస్!
చిత్తూరు అర్బన్: దొంగ నుంచి రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించకుండా వాటాలు వేసేసుకున్నారు. పంచుకున్న వాటాల డబ్బుల్లో ఏకంగా సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేశారా..? స్టేషన్కు రంగులు వేయించారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో ఓ దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.12.50 కొట్టేయడం, ఈ విషయాన్ని రాయచోటి పోలీసులకు పట్టుబడ్డ దొంగ బహిర్గతం చేయడం తెలిసిందే. అక్కడి నుంచి సమాచారం చిత్తూరు పోలీసుశాఖకు చేరడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పోలీసు దొంగలు..?’ శీర్షికన కథనం ప్రచురితం అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ మణికంఠ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి జిల్లా పోలీసుశాఖలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దొంగ నుంచి లంచంగా తీసుకున్న రూ.12.50 లక్షల్లో.. ఓ పోలీసు రూ.3.50 లక్షలు, మరో పోలీసు రూ.9 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే దొంగను పట్టుకోవడంలోని బృందంలో ఉన్న కానిస్టేబుల్ పెద్ద మొత్తంలో నగదును తన సమీప బంధువుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి, ఆపై దీన్ని తన అధికారికి ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో దొంగ సొమ్ముతో స్టేషన్లో పనిచేసే పోలీసులకు ఖాకీ యూనిఫామ్ పంపిణీ చేయడంతో పాటు స్టేషన్కు రంగులు వేయించారనే ఆరోపణ విచారణలో బయటపడినట్లు సమాచారం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, లంచంగా తీసుకున్న డబ్బును వ్యక్తిగత అవసరాలను వాడుకోవడంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలోని సిబ్బందికి యూనిఫామ్ను కొనుగోలు చేసి ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేసు నమోదుపై చర్చ విచారణ అధికారులు పూర్తి చేసిన ప్రాథమిక నివేదికపై ఓ పోలీసు ఉన్నతాధికారి, జిల్లా అధికారితో చర్చించినట్లు తెలుస్తోంది. ‘దొంగ ఇచ్చిన రూ.12.50 లక్షలు ఎన్ని కేసుల్లో చోరీ చేశాడో, అన్ని కేసుల్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను నిందితులుగా ఎందుకు చేర్చకూడదు..? అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నమ్మక ద్రోహం చేసి, పోలీసుశాఖ పరువు తీసిన వీళ్లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 316(5) కింద కేసు నమోదు చేయొచ్చా..?’ అని సుదీర్ఘంగా చర్చించారనే సమాచారం గుప్పుమంటోంది. ఇక రూ.3.50 లక్షలు స్వయంగా తీసుకున్న పోలీసును సస్పెండ్ చేయడంతో పాటు, మరో పోలీసును సస్పెండ్ చేయడం లేదా వీఆర్కు పంపాలని.. ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పనితీరు నచ్చి, తాను కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన.. తప్పు చేసిన వాళ్లను కాపాడే ప్రసక్తేలేదని, ఈ ఘటనపై చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం తప్ప మరో ఆలోచనలేదని పోలీసు ‘బాస్’ సైతం ఒకరిద్దరితో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిస్తే అవార్డులు, రివార్డులు పంపిణీ చేసే అధికారులు.. తప్పు చేసినపుడు చర్యలు తీసుకుంటే తప్ప సామాన్యులకు పోలీసుశాఖపై నమ్మకం ఉండదనేది బహిరంగ వాదన. ఈ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. -
పోలీసులే దొంగను నిద్రలేపారు
కర్ణాటక: అర్థరాత్రి వేళ ఇంటి చోరీకి వచ్చిన దొంగ ఆరవేసిన టవల్, పంచను చోరీ చేసి పక్కింటి మీద నిద్రించగా, మంగళవారం ఉదయం పోలీసులు అతనిని నిద్రలేపి ఠాణాకు తీసుకెళ్లారు. నవ్వు పుట్టించే ఈ తమాషా సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. నగర శివార్లలోని సోమినకొప్ప టీచర్స్ కాలనీలో కుమార్ అనే వ్యక్తి ఇంటి పై అంతస్తులోకి ఓ యువ దొంగ చొరబడ్డాడు. అక్కడ ఉన్న బీరువాను తెరిచి చూడగా అందులో ఏమీ దొరకలేదు. టవల్, పంచ తదితర దుస్తులను తీసుకుని పక్కింటి మిద్దైపెన వాటిని పరచుకుని నిద్రించాడు. తెల్లవారగానే కుమార్ ఇంటి పైభాగంలో ఆరవేసిన దుస్తుల కోసం రాగా, గది తలుపులు, బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించి ఆశ్చర్యపోయాడు. పోలీసులకు సమాచారమిచ్చాడు, వెంటనే పోలీసులు వచ్చి చూడగా పక్కింటిపై నిద్రిస్తున్న దొంగ కనిపించాడు. వినోబానగర ఎస్ఐ సునీల్, సిబ్బంది ఆ దొంగను నిద్ర లేపి పట్టుకుని పోలీసు స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. -
ఎంపీ డీకే అరుణ ఇంట చోరుడు.. మహా ముదురు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిందితుడు ఉత్తరాఖండ్కు చెందిన అక్రమ్ అని, దేశ రాజధానిలో దొంగతనాలకు పాల్పడి అరెస్ట్ అయ్యాడని.. ఇప్పుడు హైదరాబాద్కు మకాం మార్చడాన్ని వెల్లడించారు.వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్రమ్ మీద 2004 నుంచి ఇప్పటిదాకా 17 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పదే పదే పోలీసులకు దొరుకుతుండడంతో హైదరాబాద్కు వచ్చాడు. గుడిమల్కాపూర్ ఏరియాలో రెండు రోజులు రెక్కీ చేశాడు. చివరకు ఎంపీ డీకే అరుణ ఇంటి సమీపంలో చోరీ చేయాలనుకున్నాడు. అయితే.. దొంగతనానికి ఎంపీ ఇంటినే ఎంచుకున్నాడు. ఆ ఇంట్లోకి దూరి ఈజీగా చోరీ చేయొచ్చని భావించాడు. ఒకవేళ తేడాలొచ్చి దొరికినా.. వెనకాల ఉన్న రోడ్డు నుంచి పారిపోవచ్చని ప్లాన్ వేశాడు. ఎంపీ ఇంటి కిచెన్ కిటికీ గుండా లోపలికి ప్రవేశించిన అక్రమ్.. మాస్క్ వేసుకుని లోపలే గంటన్నరపాటు ఉండిపోయాడు. అక్రమ్ ధనవంతుల ఇళ్లు మాత్రమే టార్గెట్ చేస్తాడు. నగదు మాత్రమే దొంగిలిస్తాడు. విలువైన వస్తువులు, నగల జోలికి పోడు. ఎందుకంటే.. అవి అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమని భావిస్తాడు’’ అని డీసీపీ విజయ్ వెల్లడించారు. ఇక.. వీఐపీ నివాస ప్రాంతాలతో పాటు నగరంలో పలు ఏరియాల్లో చోరీలు జరగడంపై ఆందోళన వ్యక్తం కావడం తెలిసిందే. అయితే.. ఇక నుంచి ఎలాంటి నేరాలు జరగకుండా పోలీస్ భద్రతను పెంచుతున్నాం అని పోలీసులు ప్రకటించారు. జరిగింది ఇదే..డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–56లోని డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లౌజ్లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్లో ఉన్న సీసీ కెమెరాల వైర్ను కట్ చేశాడు. అరుణ బెడ్రూమ్ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్ను కట్ చేశాడు. గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్నగర్లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. ఈ ఘటనపై డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారామె. ఈ ఘటనను సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారామె. -
DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం
సాక్షి,హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. ఓ అగంతకుడు అర్థరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం, ఇంట్లో కిచెన్,హాల్సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. గంటన్నరపాటు ఇంట్లో కలయతిరిగాడు. అయితే,దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేకపోవడం ప్రమాదమే తప్పింది. మరోవైపు, డీకే అరుణ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగకపోవడంపై కుట్రకోణం దాగి ఉందని డీకే అరుణ కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డీకే అరుణ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంట్లో పోలీసులు, క్లూస్ టీమ్ విచారణ చేపట్టారు. తనపై ఏదైనా కుట్ర కు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న ఎంపీ డీకే అరుణ.. తన ఇంటికి భద్రత పెంచాలని కోరారు. -
ఈ దొంగకు న్యూ ఇయర్ ఒకరోజు ముందే వచ్చింది.. ఏం చేశాడో తెలుసా?
సాక్షి,మెదక్ : అతడో దొంగ. అసలే కొత్త సంవత్సరం (new year). సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడు. డబ్బులు కావాలి కదా. వైన్ షాపులో డబ్బులు బాగా ఉంటాయ్. దోచేద్దామని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా రెండ్రోజుల పాటు రెక్కీ కాచాడు. మూడో రోజు ప్లాన్ ప్రకారం.. తాను ముందుగా రెక్కి నిర్వహించిన వైన్ షాప్లో దొంగతనం చేశాడు. దొంగతనానికి ముందే తాను ఎవరికి దొరక్కూడదనే ఉద్దేశ్యంతో సీసీ టీవీ కెమెరాల్ని ధ్వంసం చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బుంతా ఊడ్చేశాడు. అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశాడు. కానీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు.మెదక్ జిల్లా నార్సింగ్ ప్రాంతంలో నిర్వాహకులు కనకదుర్గా వైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 10 వైన్ షాపును క్లోజ్ చేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ వైన్ షాప్లో దొంగతనం ప్లాన్ చేసిన దొంగ రూఫ్ను తొలగించి షాప్లో చొరబడ్డాడు. డబ్బుల్ని కాజేశాడు. అనంతరం, దొంగతనానికి వచ్చిన ఆ దొంగకి మందు మీద కుతిపుట్టింది. వెంటనే వైన్ షాపులో ఏ బ్రాండ్ దొరికితే.. ఆ బ్రాండ్ని ఫుల్లుగా సేవించాడు. మత్తులో తాను దొంగతనానికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి ఎంచక్కా పడుకున్నాడు. ఆ మరుసుటి రోజు అంటే నిన్న ఉదయం నిర్వహాకులు వైన్ షాప్ను ఓపెన్ చేశారు. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఆ పక్కనే మత్తులో ఉన్న దొంగను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను పరిశీలించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు. -
బైక్ పార్కింగ్ చేస్తే ఖతం
-
పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు
అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి తుని వెళ్లాల్సిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. కాంప్లెక్స్ ఆవరణలో బస్సు నిలిపి ఉంచిన అనంతరం క్లీనర్ తాళాలు మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. తుని వెళ్లేందుకు డ్యూటీ డ్రైవర్ కాంప్లెక్స్కు వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రదేశంలో బస్సు లేదు. డ్రైవర్ వెంటనే బస్సు యజమాని దాట్ల గీతంరాజుకు విషయం చెప్పాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించి గాలింపు చేపట్టారు. చింతపల్లికి సమీపంలోని చింతలూరు వద్ద పోలీసులు బస్సుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాధిక్ బాషా తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. చింతలూరు వద్ద… pic.twitter.com/E4jhNy1bXl— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024 -
అపార్ట్ మెంట్ లో బరితెగించిన దొంగలు..
-
పాపం పూల కుండీల దొంగ
-
బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా?
దోమలగూడ: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్ కాలనీలో గురువారం జరిగిన బంగారం చోరీ ఘటన ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితులు రంజిత్ గౌరాయ్ సోదరుడు ఇంద్రజిత్ గౌరాయ్ను పోలీసులు విచారించినట్లు సమాచారం. రంజిత్ గౌరాయ్ వద్ద పనిచేసే 40 మంది కారి్మకుల వివరాలతో పాటు కాల్ డేటాను పోలీసులు సేకరించారు. బంగారం దొంగతనం చేసిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ -
Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ
కవాడిగూడ: దొంగలు బరితెగించారు. దోమలగూడ పరిధిలోని అరవింద్నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున నగల వ్యాపారిని మారణాయుధాలతో బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కోల్కతాకు చెందిన రంజిత్ గౌరాయ్ కొన్నేళ్లుగా అరవింద్నగర్ కాలనీలో నివసిస్తున్నారు. నగరంలోని వివిధ జ్యువెలరీ షాపుల నుంచి ఆర్డర్లు తీసుకుని నగలు తయారు చేసి సప్లయ్ చేస్తుంటారు. రంజిత్ వద్ద దాదాపు సుమారు 50 మంది కారి్మకులు పని చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3– 4 గంటల మధ్య దాదాపు ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రంజిత్ ఇంటి తలుపులు కొట్టి కత్తులతో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. రంజిత్ కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు రంజిత్ గౌరాయ్ దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీం, డాగ్స్కా్వడ్లతో తనిఖీలు చేపట్టారు. బంగారం దోపిడీకి పాల్పడింది ఇంట్లో పని చేస్తున్న సిబ్బందికి తెలిసినవారా? గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో దారుణం -
దొంగల పరువుతీసిన చీప్ దొంగ
-
మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగ
-
దొంగల టార్గెట్.. ప్రచార సభలు, పాదయాత్రలు..
-
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అష్టధాతువులతో తయారు చేసిన 100 ఏళ్ల రాధాకృష్ణుల విగ్రహాన్ని చోరీ చేశారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. అయితే ఈ చోరీకి పాల్పడ్డ దొంగ వారం రోజుల తరువాత ఆలయానికి కొద్దిదూరంలో రోడ్డుపై రాధాకృష్ణుల విగ్రహాలను, ఒక లేఖను ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఆ విగ్రహాల గురించి ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడ లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సదరు దొంగ క్షమాపణలు చెబుతూ.. రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించాక తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని, పీడకలలతో బాధపడుతున్నాడని’ రాశాడు. తాను అప్పగించిన విగ్రహాలను ఆలయంలో తిరిగి అదోచోట ఉంచాలని ఆ దొంగ వినయపూర్వకంగా కోరాడు.ఇది కూడా చదవండి: ఆర్జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం -
రాజ రాజ చోర
అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్స్ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్ ఖేడి, హుల్ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.ఇలా బయటపడింది.. ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో ఘనంగా జరిగింది. ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు. పోలీసులు ఏం చేయలేరా? నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. పైగా దొంగల స్కూల్ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
గణేష్ మండపంలో దొంగ
-
బండిని ఇంత సింపుల్ గా ఎత్తుకెళ్లాడు ఏంటి..!
-
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
దండం పెట్టాడు - దొంగతనం చేశాడు
-
Hyderabad: అపార్టుమెంట్లో భారీ చోరీ
బన్సీలాల్పేట్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్లో దొంగలు పడ్డారు. సుమారు 40 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన ఘటన గాందీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ భోలక్పూర్ కృష్ణానగర్ కాలనీలోని భవానీ శ్రీ షీలా ఎవెన్యూ అపార్టుమెంట్ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్లో మాదాపూర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్, ఆయన భార్య సబిత, ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తె అనుష్కతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం ఇంటికి తాళం వేసి సబిత బయటకు వెళ్లారు. కుమార్తె కాలేజీకి, శ్రీనివాస్ బ్యాంక్కు వెళ్లారు. మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని దొంగలు అపార్టుమెంట్ మూడో అంతస్తులోకి ప్రవేశించారు. తాళం వేసిన గడియ కింది భాగాన్ని తొలగించి ఇంట్లోకి వెళ్లారు. అల్మరా, ఇతరత్రా ప్రదేశాల్లో దాచి ఉంచిన 14 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించారు. శ్రీనివాస్ కుమార్తె అనుష్క సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా గాంధీనగర్ డివిజన్ ఏసీపీ మొగులయ్య, ఇన్స్పెక్టర్ డి.రాజు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రూపాయి కూడా ఉంచలే.. మీకో దండం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్ బాటిల్ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.మండల కేంద్రం కావడంతో..మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్ కావడంతో క్యాష్ కౌంటర్లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్ కౌంటర్ వద్ద, ఆ తర్వాత కిచెన్లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.అనంతరం క్యాష్ కౌంటర్ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్లోంచి వాటర్ బాటిల్ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్ పాకెట్ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్ బాటిల్ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు. -
భలే మంచి దొంగ
-
సంగారెడ్డి జిల్లా నందిగామలో దొంగల బీభత్సం
-
యాంటీ డెకాయిట్ ఆపరేషన్.. దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : యాంటీ డెకాయిట్ ఆపరేషన్లో దొంగలకు హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. ధార్ భావరియా గ్యాంగ్లే లక్ష్యంగా నగరంలో పలు పప్రాంతాల్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపై పోలీసులు కన్నేశారు. పలు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ తరుణంలో హైదరాబాద్ అసిఫ్ నగర్, చిలకలగూడా, సికింద్రాబాద్లో చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఈ సమయంలో కళ్లుగప్పి దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసుల ఫైరింగ్ చేశారు. ఇక యాంటీ డెకాయిట్ ఆపరేషన్లో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు చైనా స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మేడ్చల్లో పట్టపగలే ముసుగు దొంగల బీభత్సం.. జ్యువెలరీ షాప్లో చొరబడి..
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
హై క్లాస్ దొంగ
-
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ఒంటెనే చోరీ చేశారు
కురబలకోట : ఇన్నాళ్లు పర్సులు కొట్టేసే దొంగలను చూశాం.. ఇంట్లో చొరబడి బంగారో..నగదో చోరీ చేసిన వాళ్లనూ చూశాం.. కానీ ఏకంగా పెద్ద జంతువులలో ఒకటైన ఒంటెనే ఎత్తుకెళ్లే ఘనులుంటారని ఇప్పుడే చూస్తున్నాం. అవును.. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో ఒంటెను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..త్వరలో జరగబోయే బక్రీద్కు అంగళ్లుకు చెందిన మిత్రులు కొందరు 13 రోజుల క్రితం రూ.1.25 లక్షలతో ఒంటెను కొన్నారు. పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టేసేవారు. ఆదివారం వేకువ జామున లేచి చూస్తే ఒంటె కాస్తా కన్పించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్లిందోమోనని తొలుత భావించారు. స్థానికంగా వెతికినా కన్పించలేదు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్నేహితులు కలసి అంతటా గాలించారు. పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు. సమీపంలోని గుట్టలు, వాగులు, వంకలతో పాటు పరివాహక ప్రాంతాల్లో కూడా వెతికారు. ఎక్కడా ఆచూకీ కన్పించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జాడ మాత్రం కన్పించలేదు. అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె నుంచి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తోలుకెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కన్పించినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి భారీ సైజు వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద ఒంటెనే అంగళ్లులో ఏకంగా చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబరుకు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని బాధితులు తెలిపారు. -
జిమ్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్ట్లు..
ఓ దొంగ జిమ్లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్ యజమాని ఏం చేశాడంటే..ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్ సెంటర్లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్ని ఏదో విధంగా ఓపెన్ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. జిమ్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్కి వెళ్లి ఆ దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు యజమాని. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ యజమాని దొంగని ట్రెడ్మిల్పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్ట్లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!. ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. (చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్! ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత) -
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. -
ఓరి ‘దొంగ’.. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు..
లక్నో: నడుస్తున్న సమయంలో, పక్కన కూర్చున్నప్పుడు జర్నీలో దొంగతనాలు చేయడం సాధారణమే.. అయితే ఇటీవల దొంగలు విచిత్రంగా పడుకొని చోరీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని మథుర రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులకు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా.. ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలో ఓ దొంగ ఒక వ్యక్తి నిద్రపోతున్నట్లు నటిస్తూ పలు చోరీలకు పాల్పడ్డాడు. తొలుత ఒక ప్రయాణికుడి పక్కన అతడు పడుకొన్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని లేచి చూశాడు. తిరిగి పడుకొన్నాడు. మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయాణికుడి పక్కన పడుకున్నాడు. అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ చోరీ చేశాడు. అనంతరం ఆ వెయిటింగ్ రూమ్ నుంచి జారుకున్నాడు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన రైల్వే పోలీసులు చివరకు ఆ దొంగను గుర్తించారు. నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు చేస్తున్న ఎటా జిల్లాకు చెందిన 21 ఏళ్ల అవినీష్ సింగ్ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. అతడి నుంచి ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువుల స్వాధీనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ‘The Sleeping Thief’: A Person has been arrested from UP’s Mathura for stealing from passengers sleeping on railway stations. The CCTV Footage shows the cunning modus operandi of the thief where he pretends to sleep beside a traveller & swiftly pick pockets the mobile phone. pic.twitter.com/6OVSYydwaZ — Tanishq Punjabi (@tanishqq9) April 10, 2024 -
సొత్తుతో పాటు.. కుక్కపిల్లనూ వదలలేదు సార్..!
హైదరాబాద్: పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. సొత్తుతో పాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని సైతం ఎత్తుకెళ్లిన ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఎఫ్సీనగర్ బాలాజీ నగర్కు చెందిన ఐలయ్య గురువారం కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ జిల్లా అంబాల గ్రామంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా అల్మరా తాళం పగులగొట్టి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో దాచిన 7.5 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రూ. 5 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వీటితో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను కూడా అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం (వేలి ముద్రల నిపుణులు)తో కలిసి వివరాలు సేకరించారు. ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్ను ఢీకొట్టడంతో.. -
కేసీఆర్ పర్యటనలో జేబు దొంగల హల్చల్
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో జేబు దొంగలు హల్చల్ చేశారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో ఎండిన పొలాలను కేసీఆర్ పరిశీలిస్తుండగా.. ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ. 10 వేలు కొట్టేశాడు. అయితే దొంగను పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అతడికి దేహశుద్ది చేశారు. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్నారు. సాయంత్రం సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. -
బేగంపేటలో దొంగల బీభత్సం.. ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. బేగంపేటలో ఓ ఇంట్లోకి గురువారం తుపాకీతో అగంతకులు చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఇంట్లో చోరికి యత్నించారు. అయితే దుండగులును ఇంట్లోని తల్లీ కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అగంతకుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఎదురు దాడికి దిగారు. ఊహించని పరిణామంలో దుండగులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. -
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
బిహార్లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్లోని భాగల్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భాగల్పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा। वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe — Priya singh (@priyarajputlive) January 17, 2024 -
హైదరాబాద్: పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ
సాక్షి, హైదరాబాద్: ఓయూ పోలీసులకు ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు శంకర్ నాయక్.. అలాగే డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు. దొంగిలించబడ్డ సొమ్ముతో ముత్తూట్ గోల్డ్ లోన్లో తాకట్టు పెట్టి హోటల్స్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, మిగిలిన ఆ డబ్బుతో మళ్లీ దొంగతనం చేయడానికి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి, ఆ బండ్లపై దొంగతనం చేసే వెరైటీ దొంగ ఈ శంకర్ నాయక్. మహబూబ్నగర్కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు. ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు. అయితే రిమాండ్ చేసిన శంకర్ నాయక్ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులు ఓయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్షతో -
అర్ధరాత్రి హెడ్కానిస్టేబుల్ ఇంట్లో చోరీ!
ఖమ్మం: ఫంక్షన్కు వెళ్లి వచ్చేసరికి బెటాలియన్ హెడ్కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గంగారం 15వ బెటాలియన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కోరం లక్ష్మణ్రావు, నాగకుమారి దంపతులు బేతుపల్లిలోని గౌండ్లబజార్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి సత్తుపల్లిలో ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. కిచెన్ తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని రూ.12 లక్షల విలువ చేసే 18 తులాల బంగారంతో పాటు రూ.25 వేల నగదును అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి ఎస్ఐ కుశకుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఇంట్లో కూడా.. గ్రామంలోని పటంబజార్లో దొడ్డా శ్రీనివాసరావు ఇంట్లోకి ముసుగులు ధరించిన దుండగులు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వచ్చి సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ప్రధాన ద్వారం తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి బెడ్రూంలోని కబోర్డులో దుస్తులు, వస్తువులను కిందపడేసి వెతికినా వారికి ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. ఇంటి యజమాని అమెరికా వెళ్లినట్లు తెలిసింది. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
గుప్త నిధుల కలకలం! ఒక్కసారిగా బయటపడ్డ..
వికారాబాద్: పొలంలో ఉన్న భారీ శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు పెకిలించి, పక్కన పడేశారు. ఈ సంఘటన యాలాల మండల పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. బాధిత రైతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల గ్రామానికి చెందిన గంగుల వెంకట్రెడ్డి తనకున్న 9 ఎకరాల పొలాన్ని విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన నర్సింహ్మరెడ్డికి కౌలుకు ఇచ్చారు. ప్రస్తుతం అందులో కంది, వరిని సాగు చేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం పొలంలో కంది పంట ధ్వంసం అయినట్లు కౌలురైతు గమనించాడు. వెళ్లి పరిశీలించగా.. పొలంలోని శివలింగాన్ని బయటికు తీసిన ఆనవాళ్లను గుర్తించాడు. విషయాన్ని పొలం యజమానికి వివరించాడు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, కళ్లు కవర్లను స్థానికులు గుర్తించారు. సుమారు 5 అడుగులు శివలింగాన్ని వెలుపలకు తీయాలంటే ఐదారుగురి సాయం అవసరమవుతుందని, ఇదంతా గుప్త నిధుల కోసమే జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తంచేశారు. యాలాల చుట్టుపక్కల పెద్ద మొత్తంలో శివలింగాలు ఉండటం, తరుచూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం జరుగుతుంటాయని గ్రామస్తులు పేర్కొన్నారు. రైతు వెంకట్రెడ్డి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటన స్థలంలో వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇవి కూడా చదవండి: మరణంలోనూ వీడని బంధం! తల్లడిల్లిన తల్లి హృదయం.. -
'ఫేక్ వెబ్సైట్స్' క్లిక్ చేశారో ఖతమే! వాటిని ఇలా గుర్తించండి!!
రాజన్న సిరిసిల్ల: సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ వెబ్సైట్స్ పేరుతో నగదు అపహరిస్తున్నారు. ఫర్నీచర్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఇస్తున్నామంటూ ఫేక్ వెబ్సైట్లతో బురిడీ కొట్టిస్తున్నా రు. నమ్మి వాటిపై క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ఇటీవల జిల్లాలో సైబర్మోసాలు వరుసగా జరుగుతున్నాయి. సోషల్మీడియాలో వస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు! సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరికి క్రెడిట్కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి ఓ కాల్ వచ్చింది. బాధితులు అతనితో క్రెడిట్కార్డ్ నంబర్, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.77వేలు నష్టపోయాడు. సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు ఇన్స్ట్రాగామ్లో ఓ యాడ్ చూసి అందులోని లింక్పై క్లిక్ చేయడంతో వాట్సాప్కు కనెక్ట్ అయ్యింది. దీంతో బాధితుడు వారు చెప్పినట్లు కొన్ని టాస్క్లు చేయడంతో రూ.40వేలు నష్టపోయాడు. కోనరావుపేట్ ఠాణా పరిధిలో ఒకరికి తక్కువకే వజ్రాలు ఇస్తామంటూ ఓ కాల్ వచ్చింది. లోన్ ఇస్తామని చెప్పిన వారు ముందుగా చార్జీలు రూ.27వేలు చెల్లించాలనడంతో పంపాడు. తర్వాత తను మోసపోయానని గుర్తించాడు. సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరికి కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది. వారి మాటలు నమ్మి డెబిట్కార్డ్ వివరాలు, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.లక్ష వరకు మోసపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు నర్సరీ వ్యాపారం కోసం ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్ను సంప్రదించాడు. తర్వాత కొత్త నంబర్ నుంచి కాల్ రావడంతోపాటు ఒక పేమెంట్ స్కానర్ను పంపించారు. బాధితుడు దాన్ని స్కాన్ చేయడంతో రూ.లక్ష నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బిజినెస్ ఎమోషనల్ అని చెప్పి టెలిగ్రామ్లో ఒక లింక్ పంపించారు. అందులో భాగంగా కొన్ని టాస్క్ లు చేస్తే డబ్బు వస్తుందని నమ్మబలికారు. వారు చెప్పినట్లుగా కొన్ని టాస్క్లు చేయడంతో కొంత డబ్బు పంపించారు. ఇందులో భాగంగా బాధితుడు రూ.96వేలు నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బాధితుడు పార్ట్ టైం జాబ్ గురించి ఒక యాప్లో నమోదు చేసుకున్నాడు. ఇందులో భాగంగా వారు ఇచ్చిన వర్క్లో డాటా తప్పుగా ఎంటర్ చేశారని బెదిరించి బాధితుడి నుంచి రూ.55వేలు తీసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సోషల్మీడియాలో వచ్చే యాడ్స్ను నమ్మొద్దు. ఎస్బీఐ యోనో బ్లాక్ అయిందని, పాన్కార్డు అప్డేట్ చేయాలని వచ్చే మెస్సేజ్లను నమ్మొద్దు. ఆ మెస్సేజ్లలో వచ్చే లింక్స్పై అస్సలు క్లిక్ చేయొద్దు. సోషల్మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టవద్దు. మీ ప్రమేయం లేకుండా మీ సెల్ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పొద్దు. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా గమనించాలి. అప్రమత్తతే అవసరం.. కొత్త ఫోన్ నంబర్ నుంచి కాల్ వస్తే ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్చేస్తే తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంది. డెబిట్కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. – అఖిల్మహాజన్, రాజన్నసిరిసిల్ల ఎస్పీ ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
చెరువులోకి దూకిన దొంగ..గంటలు గడుస్తున్నా దొరకని దొంగ..
-
మాయలు, మంత్రాలు.. ఆనక హత్యలు!
సాక్షి, మహబూబ్నగర్/నాగర్కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ, బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ, విడిపోయిన భార్యభర్తలను కలుపుతానంటూ.. 11 మంది అమాయకపు ప్రాణాలను తీసిన రాక్షసుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రామాటి సత్యనారాయణ యాదవ్(47) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన తండ్రి, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి నాటువైద్యం ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించాడు. ఆపై మంత్రతంత్రాలతో గుప్త నిధులు వెలికి తీసిస్తానంటూ, బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజల్ని నమ్మబలికాడు. వారి ఆస్తులను, ఇంటి స్థలాలను కాజేశాడు. అదే తన వృత్తిగా కొనసాగిస్తూ.. ప్రజల్ని మభ్యపెడుతూ, చివరికి ప్రశ్నించిన వారి ప్రాణాలను తీస్తూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇద్దరు భార్యాభర్తలు విడిపోయిన వారిని కలుపుతానంటూ, వారి ఇంటి స్థలం తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆపై ఆ మహిళా కనిపించకుండా పోవడంతో.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన వివరాలను సేకరించి, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరికి గత కొన్ని రోజులుగా ఎవరి కంట పడకుండా తప్పించుకుంటున్న నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఓ రియల్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్ (10) ఉన్నారని తెలుస్తోంది. రెండేళ్ల కిందట నాగర్కర్నూల్ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. అయినా ఆ టైంలో పోలీసుల్లో కదలిక లేకపోవడం గమనార్హం. ఇవి కూడా చదవండి: మిస్టరీగా మారిన 'కాంగో జాతీయుడి లాకప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది? -
వీడు మహా కేటుగాడు! డైరెక్ట్గా పోలీస్టేషన్లనే ఏం చేశాడో తెలిస్తే షాక్!
హైదరాబాద్: తాను బ్రెజిల్కు చెందినవాడినని, హైదరాబాద్ పర్యటనకు రాగా తన పర్సుతో పాటు ల్యాప్టాప్ కూడా చోరీ అయిందని ఈ నెల 7వ తేదీన అచ్చు విదేశీ యువకుడిలాగా ఉన్న ఓ వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చాడు. జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు సరైనదేనని నమ్మి పర్సు ఎక్కడ పోగొట్టుకున్నాడో ఆ ప్రాంతానికి వెళ్లి రోజంతా సీసీ ఫుటేజీలు వెతికారు. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. తనకు తినడానికి కూడా డబ్బులు లేవని ఆ యువకుడు చెప్పగా రూ.500 ఇచ్చి పంపించారు. ఆ మరుసటి రోజు భువనగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లిన అదే యువకుడు తన పర్సు పోయిందని, తాను అమెరికా నుంచి వచ్చానని అక్కడ పోలీసులకు చెప్పగా రోజంతా వారు కూడా సీసీ ఫుటేజీలు వడపోశారు. ఖర్చులకు డబ్బులు లేవని చెప్పగా రూ.1500 ఇచ్చి పంపారు. తాజాగా ఈ నెల 9న అదే యువకుడు మధురానగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన పర్సు పోయిందని ఫిర్యాదు చేశాడు. తిండికి డబ్బులు లేవని చెప్పడంతో జాలిపడ్డ అక్కడి పోలీసులు రూ.1000 ఇచ్చి పంపించారు. తీరా ఈ యువకుడి గురించి ఆరా తీస్తే గోవాకు చెందిన సెబీ డిసిల్వాగా గుర్తించారు. సదరు యువకుడు అచ్చం విదేశీ పోలికలతో ఉండటంతో పోలీసులు కూడా విదేశీయుడనే భ్రమపడి ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టేవారు. ఖర్చుల కోసం అడిగితే డబ్బులు కూడా ఇచ్చారు. తీరా సదరు యువకుడి గురించి లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు గోవాకు చెందిన వాడని, ఇలాగే రాజస్థాన్, బీహార్, గోవాలలో మోసాలకు పాల్పడి రిమాండ్ అయినట్లు తేలింది. రోజువారి ఖర్చుల కోసం ఇలాగే పర్సు పోయిందని ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తూ ఎంతో కొంత పోలీసుల నుంచే తీసుకొని రోజులు గడిపేస్తున్నట్లుగా తేలింది. ఈ సరికొత్త వసూళ్ల పథకం గురించి తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెడుతున్నారు. పోలీసులకు టోకరా వేస్తున్న వైనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ముందు ఈ యువకుడు పర్సు పోయిందని, ల్యాప్ట్యాప్ పోయిందని ఫిర్యాదు చేస్తే నమ్మవద్దని చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం! -
సైబర్ వల నుంచి తప్పించుకోవాలంటే ఇలా చెయ్యండి చాలు!
విజయవాడ: విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువకుడు పీజీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతగా వ్యాపారం చేయాలన్నది అతని కల. ‘ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసి నెలనెలా రూ.లక్షల్లో సంపాదించొచ్చు’ అంటూ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అతడిని ఆకట్టుకుంది. మెసేజ్ పంపిన వారితో చాటింగ్లో పరిచయం పెంచుకున్నాడు. ‘కొన్ని వెబ్ లింక్లు ఓపెన్ చేసి టాస్క్లు పూర్తి చేస్తే వెంటనే నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని’ సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. రిజిస్ట్రేషన్కు కొంత నగదు చెల్లించి తొలి రెండు టాస్క్లు పూర్తి చేయగానే నగదు చెల్లించారు. ఆ తరువాత ఆ యువకుడు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్లు కొని పూర్తిచేశాక అతని వ్యాలెట్లో డబ్బు కనిపించినా విత్డ్రా కాకపోవడంతో సదరు వ్యక్తులను వాట్సాప్, టెలిగ్రాం చాటింగ్తో సంప్రదించాడు. ‘ఏదో ఎర్రర్ వస్తుంది.. మీరు టాస్క్లు పూర్తి చేయండి.. నగదు ఎక్కడికీ పోదు’ అని నేరగాళ్లు అతడిని భరోసా ఇచ్చారు. వారిని నమ్మి విడతల వారీగా రూ.80 లక్షలు చెల్లించాక మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు విజయవాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ నేరస్తుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. మోసం చేసేది ఇలా.. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీతో మోసాలకు తోడు టెలిగ్రాం, వాట్సాప్ల సాయంతో ఉద్యోగ, వ్యాపార ప్రకటనతో నిరుద్యోగులు, చిరుద్యోగులు, మధ్యతరహా వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. పలు మార్గాల ద్వారా ప్రజల ఫోన్ నంబర్లను సేకరిస్తున్న నేరగాళ్లు ముందుగా వాట్సాప్/ టెలిగ్రాంలో ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతారు. ఇంట్లో కూర్చుని, ఖాళీ సమయంలో పని చేస్తే కుటుంబ ఖర్చులౖకైనా వస్తాయన్న ఆశతో ఉన్న వారిని సైబర్నేరగాళ్లు చాటింగ్తో ముగ్గులోకి దింపుతారు. చాటింగ్కు నంబర్లు కనిపించని టెలిగ్రాం యాప్నే నేరగాళ్లు ఉపయోగిస్తారు. వర్క్ ఎలా చెయ్యాలి, ఇన్స్టా, ఫేస్బుక్, యూ ట్యూబ్ వీడియోలకు ఎలా లైక్లు కొట్టాలి, ఎలా షేర్ చేయాలి, ఎంత డబ్బు వస్తుంది.. అనే విషయాలను చాటింగ్లోనే వివరిస్తారు. మచ్చుకు కొన్ని వీడియోలను వాళ్లే పంపించి టాస్క్లు ఇస్తారు. నమ్మించేందుకు తొలి రోజే కొంత నగదును వారి బ్యాంక్ ఖాతాలో వేస్తారు. రెండో రోజూ కొన్ని టాస్క్లు ఇచ్చి నగదు చెల్లిస్తారు. ఆ తరువాత నుంచి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే పేరున్న కంపెనీలు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు రేటింగ్ ఇవ్వాలని, ఈ పని రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. వెబ్సైట్ వాలెట్లో డిపాజిట్ సొమ్ము, ప్రాఫిట్, విత్డ్రా వివరాలు నిత్యం స్క్రీన్పై కనపడుతూనే ఉంటాయని నమ్మబలుకుతారు. సొమ్ము డిపాజిట్ చేసి టాస్క్లో దిగిన తరువాత.. చెల్లించిన సొమ్ముకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కలిపి ప్రాఫిట్ బాక్స్లో చూపిస్తారు. అయితే ఆ డబ్బు విత్డ్రా అవ్వదు. ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరి కొంత నగదు చెల్లించి రెండో టాస్క్ పూర్తి చేయాలని నమ్మిస్తారు. ప్రాఫిట్ బాక్స్లో ఉన్న నగదు కంటే డిపాజిట్ చేయాల్సిన నగదును తక్కువగానే చెబుతారు. ప్రాఫిట్ బాక్స్లో ఎక్కువగా ఉన్న నగదును చూసి ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లకు బాధితులు నగదు చెల్లిస్తూనే ఉంటారు. అవతలి వ్యక్తి మాయగాడని తెలుసుకునే లోపు రూ.లక్షల్లో మోసపోతారు. ఆ తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న మోసాలు.. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 కేసులు నమోదు చేస్తున్నాం. ఇటీవల ఓ యువతి రూ.10 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేసింది. సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతోనే ప్రజలు మోస పోతున్నారు. 'ఉద్యోగం ఇచ్చే వ్యక్తి నెలకు జీతం ఇస్తాడే కానీ మన నుంచి ముందుగా డబ్బులు తీసుకోడనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.' ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాలతో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ క్రైం పోలీస్స్టేషన్, విజయవాడ ఇవి చదవండి: కడపలో తల్లీతనయుల అదృశ్యం! -
వచ్చింది పోలీసులేనా? కిడ్నాప్ గ్యాంగ్ సభ్యులా? అసలేం జరిగింది?
సాక్షి, కరీంనగర్: సిద్దిపేట కమిషరేట్ పరిధిలోని దుబ్బాక ఠాణా పోలీసులమని కొందరు వ్యక్తులు సిరిసిల్లకు వచ్చి హల్చల్ చేశారు. అంతేకాదు ఓ దంపతులను బెదిరించారు. ఇదేంటని ప్రశ్నించగా.. వారి బైక్కు కారు అడ్డుపెట్టడంతో మహిళ చేయి విరిగింది. బాధితురాలు చికిత్స నిమిత్తం గురువారం సిరిసిల్ల ఆసుపత్రికొచ్చి తనకు జరిగిన అవమానాన్ని మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన కవిత ఇంటికి కొందరు వచ్చారు. ఇంట్లో చొరబడి వెతుకుతుండగా ఆమె భర్త ఆ ఆగంతకులను నిలదీశారు. తాము పోలీసులమని, కొడుకు దుబ్బాకలో ఓ గొడవలో నిందితుడని చెప్పారు. అతను ఎక్కడ ఉన్నాడో తెలపాలని బెదిరించారు. అదే సమయంలో పోలీసులని చెప్పిన వాళ్లు నానా బూతులు తిడుతూ కవిత భర్త ప్రయాణిస్తున్న బైక్కు కారు అడ్డుగా పెట్టడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ సంఘటనలో కవిత చేయి విరిగింది. వచ్చిన ఆగంతకులు ఆమె భర్తను కారులో తీసుకెళ్లారు. ఆటో నడుపుకునే తన కొడుకు దుబ్బాకలో ఏదో కేసులో ఉన్నాడని బెదిరించారని రోదించింది. ఈ విషయమై సిరిసిల్ల టౌన్ పోలీసులను వివరణ కోరగా కొందరు వచ్చి ఒకరి తీసుకెళ్లినట్లు సమాచారం కోసం పలువురు ఫోన్ చేశారని తెలిపారు. కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఒక జిల్లా పోలీసులు మరో జిల్లా పరిధిలోకి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారని.. అలాంటి సమాచారం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. అసలు వచ్చింది పోలీసులేనా? ఎవరైన కిడ్నాప్ గ్యాంగ్ సభ్యులా? అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇవి చదవండి: క్షణికావేశంలో వివాహిత తీవ్ర నిర్ణయం! -
దొంగ వెనుక దీన గాథ!
అనంతపురం క్రైం: జల్సాలు, వ్యసనాల కోసమో దొంగతనాలు చేయడం చూశాం. అయితే, ఓ యువకుడు తన తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకునేందుకు దొంగగా మారాడు. కిలో బంగారం చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగ వెనక విషాద గాథ ఉన్నట్లు తెలిసింది. ఆ దీనగాథ పోలీసుల మనసులను కూడా కదిలించినట్లు సమాచారం. అతడి కష్టాలను విన్న పోలీసులు పాపం విధి వంచితుడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి చెందిన వినయ్ తల్లిదండ్రుల ఎడబాటును తట్టుకోలేక ఆరేళ్ల వయసులో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చాడు. రైలుగుండా అనంతపురం చేరుకున్నాడు. స్థానిక పోలీసులకు చిక్కాడు. వినయ్ని తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని పోలీసులు సాగించిన అన్వేషణ ఫలించలేదు. దీంతో నగరంలోని విజయనగర కాలనీలో ఉన్న సీడబ్ల్యూసీ గృహంలో చేర్చారు. ఆదరించాల్సిన పాస్టర్ వినయ్ని నిత్యం చితకబాదుతూ హింసించడం ప్రారంభించాడు. దీంతో మళ్లీ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఫ్లాట్ఫాంపై పడ్డాడు. కడుపు నింపుకునే మార్గం కనిపించలేదు. సెల్ఫోన్లు చోరీ చేసి వాటిని అమ్ముకుని పొట్ట పోసుకోవడం ఆరంభించాడు. వేసుకునేందుకు దుస్తులు కూడా లేకపోవడంతో నగరంలో ఆరుబయట ఇళ్ల ముందు ఆరేసిన వస్త్రాలను అపహరించేవాడు. అదే ప్రవృత్తిగా మారిపోయింది. అలా వినయ్కు 18 ఏళ్లు దాటాయి. ఈ క్రమంలోనే తన వాళ్లను కలుసుకునేందుకు సూరత్ చేరుకున్నాడు. తల్లిదండ్రుల జాడ కనిపించలేదు. దీంతో మళ్లీ అనంతపురం చేరుకున్నాడు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్లోని మయూరీ హోటల్లో సప్లయర్గా చేరాడు. దొంగతనాలు చేయడం మాత్రం మానలేదు. అలా కొంత కాలం క్రితం స్థానిక రెండో రోడ్డులోని ఓ ఇంట్లో చొరబడ్డాడు. చాలా డబ్బు, బంగారం గుర్తించినా.. కొన్ని దుస్తులు, కొంత బంగారం, డబ్బు దొంగిలించాడు. మళ్లీ కన్న వారి కోసం సూరత్ పయనమయ్యాడు. మూడో సారికి చిక్కాడు.. అయిన వారిని కలుసుకుందామని వినయ్ చేసిన ప్రయత్నం మళ్లీ ఫలించలేదు. దీంతో తిరిగి నగరానికి చేరుకున్నాడు. రెండో సారి కూడా రెండో రోడ్డులోని అదే ఇంట్లో కొంత నగదు చోరీ చేశాడు. అదే క్రమంలో ఇటీవల మూడో సారిగా మళ్లీ గృహంలో చొరబడ్డాడు. కొంత డబ్బు, బంగారం, పంచలోహ విగ్రహం తీసుకుని మయూరీ హోటల్కు వెళ్లాడు. తనతో పాటు హోటల్లో పని చేసే మహిళకు బంగారు నెక్లెస్, పనివాళ్లలో తెలిసిన మిత్రుడికి బంగారు గొలుసు, హోటల్ యజమానికి పంచలోహ విగ్రహం ఇచ్చాడు. అయితే, మహిళ తనకిచ్చిన నెక్లెస్ గిల్టుదని భావించి అందరి ముందే మురుగు గుంతలో పడేసింది. ఈ క్రమంలోనే తన ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం ఆరా తీస్తుండగా.. బంగారాన్ని కొందరికి ఉచితంగా ఓ యువకుడు ఇస్తున్నాడనే సమాచారం తెలిసి అతన్ని పట్టుకున్నారు. విచారణ చేపట్టగా రెండో రోడ్డులో చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. సొంతూ రులో బంగారం ఎక్కడైనా దాచుంటాడని పోలీసులు గుజరాత్లోని సూరత్కు వెళ్లారు. అయితే, అక్కడ అతనికి తెలిసిన వారు లేరు. ఈ క్రమంలో వినయ్ను ఆరా తీస్తే తన గతాన్నంతా పూసగుచ్చినట్టు వివరించాడు. చలించిన పోలీసులు అతని కుటుంబ సభ్యుల కోసం ఆరా తీస్తే, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని, తండ్రి కొన్ని రోజుల క్రితమే మృతి చెందాడని తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికీ పోలీసులు వినయ్కు చెప్పలేదు. -
పుట్టింటి బంగారం ధరించికుండానే.. పట్టపగలు చోరీ!
రాజన్న సిరిసిల్ల: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రోడ్డును ఆనుకుని ఉన్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. చందుర్తి మండలం మల్యాలకు చెందిన రైతు దేశెట్టి రాజయ్య ఉదయమే పొలానికి వెళ్లగా, భార్య లక్ష్మి, కోడలు రవళితో కలిసి వేములవాడ ఆస్పత్రికి వెళ్లారు. ఇదే సమయంలో ఇంట్లోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలో దాచి ఉంచిన ఏడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. భార్య లక్ష్మి, కోడలు రవళి ఇంటికొచ్చే వరకు ఇంటి తాళం పగులగొట్టి ఉండడం, బీరువాలోని బట్టలు మంచంపై పడేసి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చందుర్తి ఎస్సై అశోక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చందుర్తి సీఐ కిరణ్కుమార్.. డాగ్స్క్వాడ్తోపాటు ఫోరెన్సిక్ నిపుణులు తెప్పించారు. కొన్ని వేలిముద్రలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. తెలిసిన వారే దొంగతనానికి.. దేశెట్టి రాజయ్య–లక్ష్మి దంపతుల కుమారుడు రా జుకు నాలుగేళ్ల క్రితం రవళితో వివాహమైంది. రవళి తల్లిగారు పెళ్లి సమయంలో ఒప్పుకున్న ఏడు తులాల బంగారు నగలను వారం క్రితం తయారు చేయించి అప్పజెప్పారు. పుట్టింటి బంగారు నగలు ధరించకముందే దొంగల పాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల బంధువుల వివరాలతోపాటు సన్నిహితంగా ఉన్న వారి వి వరాలు సేకరించారు. ఇంట్లో బంగారు నగలు ఉన్నాయన్న విషయం తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగంలోకి పోలీసు ప్రత్యేక బృందాలు.. మండలంలో పది రోజుల వ్యవధిలో రెండు దొంగతనాలు జరగడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ కిరణ్కుమార్, చందుర్తి, రుద్రంగి ఎస్సైలు అశోక్, రాజేశ్ పరిశీలించారు. సీఐ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దొంగతనం జరిగిన సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సీసీ కెమెరాల్లో ఏమి రికార్డు కాలేదు. దీంతో పోలీసులు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోటలోని సీసీ పుటేజీలు సేకరిస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజుల్లో దొంగలను పట్టుకుంటామని సీఐ ధీమా వ్యక్తం చేయడంపై.. దొంగతనానికి పాల్పడ్డ వారు చిక్కినట్లేనని తెలుస్తోంది. -
రైలు పక్కనే కాచుకుని ఉంటారు, చటుక్కున మొబైల్ లాగేసుకుంటారు
-
కాంగ్రెస్వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
బస్సు చోరీ చేసి.. ప్రయాణికుల్ని ఎక్కించుకుని..
రాజన్నసిరిసిల్ల జిల్లా: సిద్దిపేటలో చోరీకి గురైన ఆర్టీసీ అద్దె బస్సు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులో ప్రత్యక్షమైంది. పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్దిపేట డిపోకు చెందిన అద్దె బస్సు (టీఎస్ 36 టీఏ 3336)ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా సిద్దిపేట బస్టాండ్కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకొని వేములవాడకు వచ్చాడు. ఇక్కడి నుంచి హైదరాబాద్ బోర్డుతో ప్రయాణికులను ఎక్కించుకుని బయల్దేరాడు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, టికెట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు.. తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోగానే డ్రైవర్ను నిలదీశారు. దీంతో సదరు వ్యక్తి బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. వెంటనే ప్రయాణికులు డయల్ 100కు కాల్చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడి పోలీసులు సిద్దిపేట పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గంభీరావుపేటకు చెందిన రాజుగా గుర్తించారు. అనంతరం రిమాండ్కు తరలించారు. -
మాయమాటలు చెప్పి.. మోసం చేశాడు..!
ఆదిలాబాద్: ఘరానా మోసగాడు దంపతులకు మాయమాటలు చెప్పి బంగారు గొలుసు కాజేసిన సంఘటన మండలంలోని కన్కపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపు నాగన్న అనే రైతు ఇంటికి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైక్పై వచ్చాడు. నాగన్న–లక్ష్మి దంపతులతో నేను బ్యాంకు నుంచి వచ్చాను. మీరు ఇంతకు ముందు బ్యాంకులో గోల్డ్లోన్ తీసుకున్నారుగా, మీకు లోన్ మాఫీ వచ్చిందని, మరింతగా రెట్టింపు లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. నమ్మిన ఆ దంపతులు లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును భర్త నాగన్నకు ఇచ్చింది. నాగన్నను అతడి బైక్పై ఎక్కించుకుని అబ్దుల్లాపూర్ గ్రామ పరిధిలోని సబ్స్టేషన్ వరకు తీసుకెళ్లి అతడి వద్ద నుంచి గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. -
మహిళా దొంగల హల్చల్.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్ల మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు. -
ఎన్నికలొస్తేనే కేసీఆర్కు హామీలు గుర్తొస్తాయి: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/తొర్రూరు: ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్కు హామీలు గుర్తుకొస్తాయని, మోసాలు చేయడంలో ఆయన పీహెచ్డీ పూర్తయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘రైతుగోస– బీజేపీ భరోసా’సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఉద్యమాల గడ్డ మాత్రమే కాక కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ పాస్పోర్టులు చేసిన దుబాయ్ శేఖర్ అని, ఆయన కొడుకు పేరు అజయ్రావు అయితే టికెట్ కోసం ఎన్టీఆర్ మెప్పు పొందడానికి తారక రామారావు అనే పేరు పెట్టాడని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ముందుకొస్తున్నాయన్నారు. అప్పుల రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలన్నా, ప్రజల బాధలు పోవాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు. కాగా ఖమ్మం వెళుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సంజయ్ కొద్దిసేపు ఆగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడు అలిసేరి రవిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ కంటే కేసీఆరే డేంజర్ అని వ్యాఖ్యానించారు. హామీలను విస్మరిస్తూ ప్రజలను నట్టేట ముంచిన బీఆర్ఎస్కు ఓటేయవద్దని, సామాన్యుల కోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం కాదు: ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుంది తప్ప చేతల ప్రభుత్వం కాదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు వస్తుండడంతో రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తరుగు లేకుండా ధాన్యం కొంటామని, రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
''తలుపులు తాళాలు లేని ఇళ్ళు... దొంగతనం కూడా జరగదు''
వారణాసిలో గంగానదీ ఒడ్డున ఒక సత్రం ఉంది. ఆ సత్రానికి ఒకరోజున ముగ్గురు బాటసారులు వచ్చారు. వారు ఉదయం భోజనం ముగించాక సత్రం మధ్యలో ఉన్న చెట్టు కింది రచ్చబండ మీద కూర్చొన్నారు. ఒకరి సమాచారం ఒకరు చెప్పుకున్నారు. వారిలో పొడగరి సుదత్తుడు. అతను అంగరాజ్యం నుండి వచ్చాడు. బట్టతల వాడు సుశీలుడు కోసల రాజ్య వాసి. పొట్టిగా నల్లగా ఉన్నవాడు ధర్మధరుడు. అతను శాక్య రాజ్యం నుంచి వచ్చాడు. ‘‘మిత్రులారా! మన దగ్గర ధనం ఉంది. ఈ ప్రాంతంలో దొంగలు ఎక్కువ. మనం చూస్తూ ఉండగానే మాయం చేయగలరు. కళ్లు గప్పి సొమ్ములు కాజేసుకుపోగల నేర్పరులు.’’ అన్నాడు సుదత్తుడు. ‘‘ఇక్కడ కంటే మగధ రాజ్యం మరీనూ. పట్టపగలే దోపిడీలు చేస్తారు’’ అన్నాడు సుశీలుడు. ‘‘మా రాజ్యంలో ఆ బెడద ఉండదు’ అన్నాడు ధర్మధరుడు.‘‘మా రాజ్యంలో కూడా... మా రాజ్యంలో కూడా’’ అన్నారు మిగిలిన ఇద్దరు! ‘‘నిజమా!’’ అని ప్రశ్నించాడు ధర్మధరుడు.‘‘ఔను మిత్రమా! మా రాజ్యంలో ఇళ్ళన్నీ గట్టి గోడలతో ఉంటాయి. బలమైన తలుపులు ఉంటాయి. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండరు. వస్తువులన్నీ ఎడాపెడా పడవెయ్యరు. పైగా.. రాజభటులు ఎప్పుడూ కావలి కాస్తూనే ఉంటారు. మన అజాగ్రత్తే దొంగలకు అవకాశం అవుతుంది. మనం నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకుని నేరం దొంగల మీద వేస్తాం’’ అన్నాడు అంగ రాజ్యానికి చెందిన సుదత్తుడు. ‘‘అసలు మా రాజ్యంలో అయితే.. దొంగతనం చేయాలి అంటేనే దొంగలకీ భయమేస్తుంది. దొంగల విషయంలో మా మహారాజుగారు మహా క్రూరంగా వ్యవహరిస్తారు. కఠిన శిక్షలు అమలు చేస్తారు’’ అన్నాడు సుశీలుడు. ‘‘దొంగతనం చేయాలంటే.. దొంగలకి వెన్నులో వణుకు వస్తుంది. అందుకే మా రాజ్యంలో ఇళ్ళకు సరైన తాళాలు కూడా వెయ్యరు. దండం దశగుణం భవత్... అంటూ ముగించాడు సుశీలుడు. ధర్మధరుడు వాళ్ళిద్దరి మాటలు విని మౌనంగా ఉన్నాడు. ‘‘మిత్రమా! మరి మీ రాజ్యం’’అని అడిగాడు సుదత్తుడు. ‘‘మిత్రులారా! మా రాజ్యంలో మా ఇళ్ళకు తాళాలు ఉండవు.’’ అన్నాడు. ‘అంటే మా రాజ్యం లాగానే అన్నమాట’’ అన్నాడు ఆతృతగా సుశీలుడు. ‘‘కాదు మిత్రమా! ఈ సుదత్తుని రాజ్యంలో ప్రజలు తమ జాగ్రత్తల్లో ఉంటారు. ఇంటికి బలమైన గోడలూ, వాటి చుట్టూ రక్షక వలయాలూ.. ఇతరులకి దొంగతనం చేసే అవకాశమే ఇవ్వరు. కాబట్టి ఆ రాజ్యంలో దొంగతనాలు లేవు. ఇక మీ రాజ్యంలో కఠోరమైన శిక్షలు. కాబట్టి, శిక్షల భయంతో మీ రాజ్యంలో చోరులు లేరు. కానీ మా రాజ్యంలో వేరు. దొంగతనానికి కఠినమైన శిక్షలు లేవు. మా ఇళ్లకూ గట్టి రక్షణలూ లేవు. అయినా దొంగతనాలు జరగవు. కారణం! దొంగతనం చేయాలనే ఆలోచనే ఎవ్వరిలోనూ ఉండదు. ‘శిక్షించబడతాం’ అనే భయంతో కోరికల్ని వదిలిపెట్టకూడదు. భయంతో వదిలే కోరికలు తాత్కాలికమే. ఇక్కడ శిక్షలు లేవు, ఎవ్వరూ చూడడం లేదు’ అనుకుంటే వెంటనే కోర్కెలు తీర్చుకోవడానికి సిద్ధపడతారు. అవకాశం లేకపోవడం వల్లనో, శిక్షల భయం వల్లనో తప్పులకు దూరంగా ఉండటం కాదు... స్వీయ నిగ్రహం వల్ల ఉండాలి. అలా ఉండాలంటే మనస్సులో కామరాగాలు నశించాలి. వాళ్లే వీతరాగులు. పరుల సొమ్ముని పాములా భావిస్తారు. మనో నిబ్బరంతో ఉంటారు. శీలవంతులుగా జీవిస్తారు. కాబట్టి మా రాజ్యంలో దొంగతనాలు తెలియవు. దొంగలకి శిక్షలు తెలియవు. వారి కోసం చెరసాలలూ లేవు.’’ అన్నాడు. ‘‘ఐతే.. మేము విన్నది నిజమే అన్నమాట’’ మీరందరూ వీతరాగులే’’ అన్నారు మిగిలిన ఇద్దరూ!‘‘అవును.. తథాగత బుద్ధుని బోధనలు పాటిస్తాం. వీతరాగులుగానే జీవిస్తాం’’ అన్నాడు ధర్మధరుడు. అలాంటి మనుషులు, వారి మనస్సులూ దుఃఖాలకి దూరమవుతాయి. అలాంటి మనుషులున్న సమాజం ఆదర్శనీయమవుతుంది. అల్లకల్లోలాలకు దూరమవుతుంది. ఆ సమాజంలో శాంతి తాండవిస్తుంది’’ అంటాడు బుద్ధుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
కోట్లకు పడగలెత్తిన దొంగ.. నేపాల్లో హోటల్, యూపీలో గెస్ట్హౌస్, లక్నోలో ఇల్లు..
దేశరాజధాని ఢిల్లీ పోలీసులు ఇటీవల ఒక దొంగను పట్టుకున్నారు. ఇతను పోలీసుల కన్నుగప్పి చోరీలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఈ దొంగ తన దొంగసొమ్ముతో ఢిల్లీ మొదలుకొని నేపాల్ వరకూ పలు ఆస్తులను కూడబెట్టాడు. ఈ దొంగ.. ఢిల్లీలో ఒంటరిగా 200కు పైగా చోరీలు చేశాడు. ఇతనిని పోలీసులు వివిధ పేర్లతో తొమ్మిదిసార్లు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగ తన భార్య పేరుతో సిద్ధార్థనగర్లో గెస్ట్హౌస్, తన పేరుతో నేపాల్లో ఒక హోటల్ కొనుగోలు చేశాడు. అలాగే లక్నో, ఢిల్లీలలోనూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. 2001 నుంచి 2023 వరకూ ఈ దొంగపై 15కు పైగా నేరపూరిత కేసులు నమోదయ్యాయి. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం మోడల్ టౌన్ పోలీసులు ఒక ఇంటిలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో కోటీశ్వరుడైన ఒక హోటల్ వ్యాపారిని అరెస్టు చేశారు. అతనిని మనోజ్చౌబేగా గుర్తించారు. అతను గడచిన 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జీవిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతనొక్కడే 200కుపైగా చోరీలు చేశాడని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ చౌబే(45) కుటుంబం యూపీలోని సిద్దార్థనగర్లో ఉండేది. తరువాత వారి కుటుంబం నేపాల్కు తరలివెళ్లింది. మనోజ్ 1997లో ఢిల్లీ వచ్చాడు. కీర్తినగర్ పోలీస్స్టేషన్లో క్యాంటీన్ నిర్వహించాడు. క్యాంటీన్లో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు మొదలుపెట్టాడు. భారీ మొత్తంలో సొమ్ము పోగేశాక గ్రామానికి వెళ్లిపోతుండేవాడు. ఈ చోరీ సొమ్ముతో మనోజ్ నేపాల్లో హోటల్ ఏర్పాటు చేశాడు. ఈ సమయంలోనే యూపీలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలో తాను ఢిల్లీలో పార్కింగ్ కంట్రాక్టు పనులు చేస్తుంటానని తెలిపాడు. ఇందుకోసం తాను ఆరు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లవలసి ఉంటుందని నమ్మబలికాడు. మనోజ్ను తాజగా అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా? -
ఈ తల్లి ధైర్యానికి సెల్యూట్.. దొంగను ఉరికించింది
సాక్షి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా వేములవాడలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఆమెపై దొంగ దాడి చేస్తున్నా భయంతో బెదరకుండా అతడితో పోరాడింది. వివరాలు.. భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. భర్త గల్ఫ్లో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కాగా మొదటి అమ్మాయికి వివాహం జరిగింది. రెండో కూతురు అమెరికాలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీలత ఇంట్లోకి ఓ దుండగుడు దొంగతానికి వచ్చాడు. ఇంటి ముందు చప్పుడు కావడంతో శబ్దాలకు ఆమె బయటకు వచ్చి చూసింది. ఇంటి ఆవరణలో చీకట్లో నక్కిన ఆగంతకుడు మహిళను చూసి రాడ్తో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రీలత ఎంతమాత్రం భయపడకుండా దొంగను ధైర్యంగా ప్రతిఘటించింది. చాకచక్యంగా వ్యవహరించి చీకట్లోనే అతనితో పోరాడింది. చివరికి గట్టిగా కేకలు వేయడంతో దొంగ చేతికి చిక్కిన ఏడు గ్రాముల బంగారు గొలుసుతో అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళా ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. తల్లి ధైర్యానికి సెల్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కర్టెన్ ఉపయోగించి, దొంగ దాడి నుంచి తప్పించుకున్న విధానాన్ని ప్రశంసిస్తున్నారు. వేములవాడలో మహిళపై దాడి చేసిన దొంగ .. ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ వేములవాడ - భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు. శ్రీలత… pic.twitter.com/TSl6uZTTkQ — Telugu Scribe (@TeluguScribe) August 14, 2023 -
క్రైమ్ బ్రాంచి పోలీసునని చెప్పి.. బిర్యానీ తెమ్మని.. ఇంతలో..
మెదక్: క్రైమ్ బ్రాంచి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లాలని కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గమధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి డ్రైవర్ను బిర్యానీ తెమ్మని చెప్పాడు. అతడు వచ్చేలోపే కారుతో ఉడాయించాడు. ఈసంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గంగాపూర్కు చెందిన గండ్ల నరేష్గౌడ్ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం జహీరాబాద్లో ఉండగా ఓ అపరిచిత వ్యక్తి క్రైమ్ బ్రాంచి పోలీసునని సంగారెడ్డి వరకు కారు కిరాయికి కావాలని రూ. 2 వేలకు మాట్లాడుకున్నాడు. జహీరాబాద్ నుంచి వస్తుండగా మార్గమధ్యలో బుదేరా వద్ద ఓ దాబాలో లంచ్ చేసి, అక్కడి నుంచి సంగారెడ్డి పోలీస్స్టేషన్ వద్ద ఐదు నిమిషాలు ఆపమన్నాడు. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్ వద్ద ఫోన్లో మాట్లాడాడు. జూబ్లీహిల్స్లో సాయంత్రం మీటింగ్ ఉందని డ్రైవర్కు తెలిపాడు. అదనంగా రూ. 3 వేలు కిరాయి అవుతుందని చెప్పగా సరే అన్నాడు. హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని ఓ హోటల్ వద్దకు రాగానే మూడు బిర్యానీలు తీసుకురమ్మని డ్రైవర్కు చెప్పి రూ.1000 ఇచ్చాడు. దీంతో డ్రైవర్ బిర్యాని ఆర్డర్ చేశాడు. పది నిమిషాలు పడుతుందని హోటల్ నిర్వాహకుడు తెలపగా.. కారులో ఉన్న వ్యక్తికి చెప్పేందుకు వచ్చాడు. అప్పటికే అతడు కారుతో పరారయ్యాడు. ఈ మేరకు డ్రైవర్ నరేష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ చదివి.. యూట్యూబ్ చూసి దొంగతనం.. చివరికి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): బీటెక్ చదివిన యువకులు ఉద్యోగం లభించక బైక్ చోరీలకు అలవాటుపడి చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన హనుమంతనగర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బాలయ్యపల్లి మండలానికి చెందిన హేమాద్రి, పవన్లు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చారు. అయితే వారికి ఉద్యోగం దొరకలేదు. ఊర్లో మాత్రం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకునేవారు. యూట్యూబ్లో చూసి బైక్లు చోరీ చేయడం ఎలాగో తెలుసుకున్న ఇద్దరూ ఖరీదైన బైక్లు, బుల్లెట్ బండ్లను చోరీ చేసి ఊర్లో దర్జా చూపేవారు. మరోవైపు బాధితులు హనుమంతనగర పీఎస్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను వారి సొంతూరికి వెళ్లి అరెస్టుచేసి తీసుకొచ్చారు. చదవండి ఎమ్మెల్యేకు షాక్.. సంచలనం రేపుతున్న మహిళా కానిస్టేబుల్ వాట్సాప్ స్టేటస్ -
దోష నివారణ చేస్తానని.. గుడి వద్ద ఉండమని చెప్పి.. సొమ్ముతో..
సంగారెడ్డి: ఇంటికి దోష నివారణ పూజ చేస్తానని యజమానులకు టోకరా వేసి బంగారంతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన అంబేద్కర్నగర్లో సోమవారం వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిముత్తగల్ల భూమవ్వ పెద్ద కుమారుడు బాబు గడ్ల వ్యాపారస్తుడి వద్ద డ్రైవర్. గతేడాది మొహర్రం పండగ రోజు అతను విజయవాడకు చెందిన షేక్ మస్తాన్ను ఇంటికొచ్చాడు. గృహానికి దోషం ఉందని నివారణకు పూజ చేయాలంటే తిరస్కరించారు. తాజాగా బాధితురాలి చిన్న కుమారుడైన మధుతో మస్తాన్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసి నంబర్ తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి వచ్చి, పూజ చేస్తున్నాడు. మధ్యలో అమ్మవారి అలంకరణకు బంగారు నగలు కోరాడు. 2.5 తులాల పుస్తెల తాడు, పావు తులం కమ్మలు, 5 తులాల వెండి పట్టీలు ఇచ్చారు. ఈ తంతు ముగిసిన అనంతరం సామగ్రిని సిద్దిపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఓ ప్రాంతంలో పడవేయాలని చెప్పగా మధు వెళ్లాడు. పొద్దు పోయే వరకు రాలేదు కాల్ చేయగా తనను గుడి వద్ద ఉండమని చెప్పి మస్తాన్ వెళ్లాడు. తర్వాత కుటుంబీకులు అనుమానం వచ్చి గదిలో వెళ్లి చూస్తే బంగారం నగలు లేవు. తాము మోసపోయామని గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్ వదిలి పరార్..
హైదరాబాద్: దొంగతనం కోసం వచ్చిన దుండగులు ఇంటి యజమాని అప్రమత్తమై కేకలు వేయడంతో తాము వచ్చిన బైక్ను అక్కడే వదిలేసి పరారైన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ...షేక్పేట ఓయూ కాలనీ సమీపంలోని భగత్సింగ్ కమ్యూనిటీ హాల్ వద్ద నివసించే మెకానిక్ ఆంజనేయులు శుక్రవారం తెల్లవారుజామున అలికిడి రావడంతో లేచి చూశాడు. ఏసీ సందులో నుంచి ఓ చెయ్యి లోపలికి రావడం, తన పర్సును తస్కరించేందుకు యత్నించడంతో వెంటనే లేచి అరిచాడు. ఈ అరుపులకు ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారవుతుండగా ఆంజనేయులు బయటికి పరుగులు తీశాడు. దొంగతనానికి వచ్చిన వ్యక్తితో పాటు మరొకరు కూడా ఉన్నట్లుగా గుర్తించాడు. ఇద్దరిని పట్టుకునేందుకు యత్నించగా వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దొంగతనానికి ఈ ఇద్దరూ వచ్చిన యాక్టివా బైక్ను అక్కడే వదిలేసి పోయారు. బాధితులు ఈ బైక్ను పోలీసులకు అప్పగించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైన్స్లో చోరీ..! ఎందుకీ తేడా? పలు అనుమానాలకు దారితీస్తున్న చోరీ..!!
ఆదిలాబాద్: జాతీయ రహదారికి కూతవేటు దూరాన భోరజ్ సమీపంలో ఉన్న వైన్స్ షాపులో శనివారం రాత్రి జరిగిన చోరీలో కొత్త కోణం బయటపడింది. దాదాపు 26 పెట్టెల మద్యం, రూ.70 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆధారాలు సేకరించి ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. అయితే నిర్వాహకులు చెప్పిన సొమ్ముకు, పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సొమ్ముకు పొత్తన లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.3 లక్షల వరకు చోరీకి గురైనట్లు నిర్వాహకులు చెప్పారు. రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైనట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. కాగా, చోరీ సొత్తుపై స్పష్టత కొరవడింది. ఎందుకీ తేడా? వైన్స్షాపులో చోరీని గుర్తించి నిర్వాహకులు పోలీస్స్టేషన్కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రూ.2.30 లక్షల విలువ చేసే మద్యం, రూ.70 వేల నగదును ఇద్దరు దుండగులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. పోలీసులకు అనుమానం వచ్చి వైన్స్ షాపును పరిశీలించారు. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైందని, నిర్వాహకులు అబద్దం చెబుతున్నారని అనధికారికంగా వెల్లడించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చోరీకి గురైన సొమ్మును నిర్వాహకులు ఎక్కువగా చేసి చూపుతున్నారని కేసు నమోదు చేయడానికి వెనక ముందు చేశారు. చోరీ విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి. రూ.62 వేల విలువ చేసే మద్యంతోపాటు మరో రూ.8 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులు మాత్రం రూ.3లక్షల వరకు చోరీ అయిందని చెప్పడం గమనార్హం. ఏదీ నిజం ? వైన్స్ నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నదానికి పొంతన లేకపోవడంతో అసలు ఏది నిజం అన్న ప్రశ్న తలెత్తుతోంది. చోరీ కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చూపించడం అనే పోలీసుల ప్రాథమిక విధిగా ఉంటుంది. రూ.3 లక్షల వరకు సొత్తు చోరీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోద చేస్తే, అంత మొత్తం రికవరీ చూపించడం కష్టం ఉంటుందని పోలీసులే కావాలనే రూ.70 వేలు మాత్రమే అని నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు నిర్వాహకుల నిజాయితీపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఊరికి బయట ఉన్న వైన్స్లో రాత్రి వేళ కౌంటర్లో రూ.70 వేల వరకు నగదు ఉంచాల్సిన అవసరం ఏం వచ్చింది? అంత డబ్బులు, మద్యం సీసాలతో నిండిన షాపులో కాపలాగా ఎవరిని ఎందుకు నియమించలేదు? రూ.3 లక్షలు చోరీకి గురైతే ఎఫ్ఐఆర్లో రూ. 70వేలు అని పోలీసులు రాస్తే, నిర్వాహకులు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నలకు సమాధానాలు లేవు. అసలు సీసీ టీవీలో కనిపిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? చోరీకి గురైన సొత్తు ఎంత? నిర్వాహకులు, పోలీసుల చెబుతున్నది ఎవరిది నిజం? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సీసీ టీవీల్లో రికార్డ్ అయిన దొంగలు దొరకాలి. ఈ విషయమై సీఐ కోల నరేశ్ను వివరణ కోరగా, కేసు నమోదు చేశామని, త్వరలో దర్యాప్తు పూర్తి చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
సింగరేణికి దొంగల బెడద..
కరీంనగర్: సింగరేణి రామగుండం రీజియన్ ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని ఓసీపీల్లో ఉన్న కాపర్ కేబుళ్లే లక్ష్యంగా దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో స్క్రాప్ యార్డులపై కన్నేసిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లి, అక్రమ మార్గాన విక్రయించి, సొమ్ము చేసుకునేవారు. చోరీలను నివారించేందుకు యాజమాన్యం స్క్రాప్ యార్డులు, గనుల వద్ద సెక్క్యూరిటీ పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. స్క్రాప్ నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ చోరీలు తగ్గిపోయాయి. అంతేకాకుండా స్క్రాప్ చోరీలవల్ల ప్రయాస ఎక్కువగా ఉండటం, లాభాలు కూడా తక్కువగా ఉండటంతో దొంగలు తమ రూట్ మార్చారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వచ్చే కాపర్ కేబుళ్లపై కన్నేశారు. భారీ యంత్రాల పవర్ కేబుళ్లు చోరీ వర్షాకాలం కావడంతో ఓసీపీ క్వారీలోని పనిస్థలాల వద్దకు సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి అధికారులు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇదు అదనుగా దొంగలు రెచ్చి పోతున్నారు. విద్యుత్తో నడిచే భారీ యంత్రాలకు ఉన్న పెద్ద కాపర్ కేబుళ్లను కట్ చేసుకొని, ఎత్తుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో హెచ్టీ లైన్ విద్యుత్ సరఫరా ఉండగానే పెద్ద గొడ్డళ్లతో కేబుళ్లను నరికి, క్షణాల్లో వాహనంలో వేసుకొని, పరారవుతున్నారు. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టంతోపాటు యంత్రానికి విద్యుత్ లేక పని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దొరికినా చర్యలు లేవు దొంగతనాలు జరిగిన కొన్ని సందర్భాల్లో దొంగలు రెడ్హ్యాండెడ్గా సెక్యూరిటీ సిబ్బందికి దొరికినా సరైన చర్యలు లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సింగరేణి సంస్థకు, పోలీసు శాఖకు మధ్య సరైన సమన్వయం లేక దొంగలు తిరిగి అదే పనికి అలవాటు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. స్క్రాప్, కాపర్ కేబుళ్ల ముఠాల వివరాలు, విషయాలు తెలిసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంతో సింగరేణిలో చోరీలకు అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంటి దొంగల అండతోనే! ఇంటి దొంగల అండతో కాపర్ కేబుళ్ల చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో కొంత ముట్టజెప్పి, చోరీ సమయంలో సహకరించాలని కోరడంతో కొందరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే స్టోర్స్లోని 600 మీటర్ల కాపర్ కేబుల్ దొంగతనం జరిగిందని పలువురు అంటున్నారు. దీనిపై కొందరికి సస్పెండ్ కమ్ పెండింగ్ ఎంకై ్వరీ పెట్టి, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
శాయం పేట: సెల్ఫోన్ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. -
కూతురు సంసారం చక్కదిద్దాలని.. అందరినీ ఆలయానికి పంపి, తిరిగి వచ్చేసరికి
బనశంకరి: బీరువాలో నిమ్మకాయ పెట్టి నగలు దోచుకెళ్లిన ఉదంతంపై యలహంక పోలీస్స్టేషన్లో జరిగింది. అళ్లాలసంద్రకు చెందిన ఇందిరా అనే మహిళ కుమార్తె సంసారంలో గొడవలు వచ్చాయి. కుమార్తె పుట్టింటికి వచ్చింది. దీంతో తన కుమార్తె జీవితాన్ని చక్కదిద్దాలని హొసపేట సురేశ్ పాటిల్ను ఇందిరా ఆశ్రయించింది. అమావాస్యరోజున అందరినీ ఆలయానికి పంపి బీరువా తెరిచి రూ.5 లక్షల విలువచేసే బంగారు నగలు దోచుకుని బీరువాలో నిమ్మకాయపెట్టి పారిపోయాడు. దీనిపై కేసు నమోదైంది. చదవండి తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి... -
రోడ్డుపై నుంచి ఫాలో.. మహిళ ఇంట్లోకి వెళ్లగానే చొరబడి
మైసూరు(బెంగళూరు): మహిళలు రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో చేసి అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లగానే.. తాను కూడా చొరబడి మహిళ తలపై రాడ్ కొట్టి తాళి చైన్ను లాక్కెళ్లాడో దుండగుడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణం చామలాపుర హుండిలో జరిగింది. వివరాలు.. ప్రైవేటు ఉద్యోగి రవికుమార్ భార్య సవిత (40) సోమవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఇనుప రాడ్తో తలపై గట్టిగా కొట్టి ఆమె మెడలో ఉన్న మాంగళ్యం చైన్ను లాక్కొని పారిపోయాడు. మహిళ అరుపులు విని చుట్టుపక్కలవారు వచ్చేసరికి ఆగంకుతుడు పరారయ్యాడు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. నంజనగూడు పోలీసులు పరిశీలించి దుండగుని కోసం గాలింపు చేపట్టారు. చదవండి Video: లంచం తీసుకుంటూ పట్టుబడి.. కరెన్సీని కసాబిసా నమిలి మింగేశాడు -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్!
మెదక్: మండలంలోని మిర్జాపల్లిలో శనివారం అర్ధరాత్రి తాళం వేసిన ఆరు ఇళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వెండి, బంగారంతోపాటు కోళ్లు ఎత్తుకెళ్తారు. చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం మేరకు... మిర్జాపల్లిలోని శ్రీకాంత్గౌడ్ ఇంట్లో దొంగలు పడ్డారు. అర తులం బంగారపు ఉంగరం, 20 తులాల వెండి పట్టాగొలుసులు, రూ.5 వేల నగదు అపహరించారు. అలాగే సంగని శ్రీనివాస్, తాళ్ల శేఖర్గౌడ్, గడ్డమీది ముత్యాలు, కాయితి చంద్రయ్యకు చెందిన ఇళ్ల తాళలు పగలగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. పారిపోతూ చింతల కిష్టయ్యకు చెందిన మూడు కోళ్లు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో వీరి కుటుంబసభ్యులు నిద్రిస్తున్నారు. మెదక్ క్లూజ్ టీం బాధితుల ఆరు ఇళ్లను పరిశీలించింది. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరి మహిళలే లక్ష్యంగా!
నిజామాబాద్: ఒంటరి మహిళలే లక్ష్యంగా జి ల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ద్విచక్రవాహనాలపై వచ్చి గొలుసులు లాక్కెళ్తున్నారు. అంతేగాకుండా రద్దీ ఎక్కువగా ఉండే అంగడి లాంటి ప్రాంతాల్లో సైతం చైన్స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని గొలుసులను సైతం చోరీ చేస్తున్నారు. అడ్రస్ అడగినట్లు వచ్చి చైన్ లాక్కొని పారిపోతున్నారు. ఇటీవల ఆర్మూర్లో ఓ మహిళ ఇంట్లో టీవీ చూస్తుండగా దొంగ ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. కరువైన నిఘా.. పోలీసులు నిఘా లోపించడంతో చైన్ స్నాచింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. సీసీ పుటేజీలను ఏర్పాటు చేసిన వాటి నిర్వహణ లేకపోవడంతో అవి సక్రమంగా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘా పెంచి చైన్ స్నాచర్లను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ నెల 18న నిజామాబాద్లోని మహాలక్ష్మి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ► పదిహేను రోజుల క్రితం ఆర్మూర్లోని కుమ్మరిగల్లీకి చెందిన మీనాక్షి స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి బైక్పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ► రెండు నెలల క్రితం ఆర్మూర్లోని తిరుమల కాలనీలో స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల చైన్ను లాక్కెళ్లారు. అనుమానం వస్తే స్థానికులకు చెప్పాలి ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్స్నాచింగ్కు పాల్పడుతున్నారు. ఎవరైన బైక్పై మెల్లగా వచ్చి అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానికంగా ఉండే వారికి విషయం చెప్పాలి. అప్రమత్తంగా ఉండటంతోపాటు డయల్ 100కు కాల్ చేయాలి. – కిరణ్కుమార్, ఏసీపీ, నిజామాబాద్ -
పట్టపగలే హుండీ చోరీ!
మహబూబ్నగర్: పట్టపగలే ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగుచూసింది. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. మండలంలోని పాత కిష్టంపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దుండగులు హుండీని పగులగొట్టి రూ.రెండు లక్షలు నగదు, అలాగే వెండి నగలు అపహరించారు. ఆలయంలో పూజలు నిర్వహించడానికి శనివారం ఉదయం ఆలయ పూజారి సోములు వెళ్లాడు. తాళాలు పగులగొట్టి ఉండటంతో హుండీని గమనించాడు. పగిలి ఉండటంతో వెంటనే సర్పంచ్తోపాటు ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని పోలీసులకు తెలిపారు. ఎస్ఐ జగన్మోహన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీని పరిశీలించారు. ఈ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేస్తున్నారు. కారులో వచ్చి... వికారాబాద్కు చెందిన అంబిరియా నానవత్ (టీఎస్ 34 టీఎ 0783) కారులో కిష్టంపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఎవరూ లేకపోవడంతో ఆలయంలోకి చొరబడ్డారు. తాళాలు పగులగొట్టిన అనంతరం కారులో ఉన్న మహిళ ఆలయ గర్భగుడిలోకి వెళ్లి హుండీలోని నగదు తీసుకున్నారు. కారు నంబర్ను పోలీసులు ట్రేస్ చేయగా కారు వికారాబాద్కు చెందిన అంబిరియా నానవత్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఇదే కారుకు జూలై 3న నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్లో ఫైన్ వేసినట్లు గుర్తించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
నమ్మించి.. ఆపై ఉడాయించి..
నెల్లూరు: వ్యాపారినంటూ నమ్మించి స్థానికుల నుంచి రూ.మూడు కోట్లను కాజేసి వ్యక్తి పరారైన ఘటన ఆత్మకూరు పరిధిలోని నెల్లూరుపాళెంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్కు చెందిన ఓ వ్యక్తి తన పేరు భాస్కర్రెడ్డి అంటూ నెల్లూరుపాళెం వద్ద మక్కెన రోశయ్య ఇంట్లో మూడు నెలల క్రితం అద్దెకు చేరారు. ఆత్మకూరు సమీపంలోని నాగులపాడు రోడ్డులో గోడౌన్ లాంటి ఇంటిని అద్దెకు తీసుకొని లారీల్లో చక్కెర బస్తాల ఎగుమతి, దిగుమతి చేస్తూ హడావుడి చేశారు. నెల్లూరుపాళెంలోని పాత ఆర్టీఏ కార్యాలయ సమీపంలో మరో ఇంటిని అద్దెకు తీసుకొని గెస్ట్హౌస్గా వినియోగించసాగారు. తాను చక్కెరతో పాటు వర్జీనియా పొగాకుతో ఐటీసీ తయారు చేసిన సిగరెట్ల హోల్సేల్ వ్యాపారం చేస్తున్నానని చుట్టుపక్కల వారిని నమ్మించారు. తన వ్యాపారానికి కోట్లు అవసరమని.. పెట్టుబడి పెడితే రూ.లక్షకు రోజుకు రూ.1500 వడ్డీని ఏరోజుకా రోజు చెల్లిస్తానని చెప్పారు. దీనికి ఆశపడిన రోశయ్య రూ.కోటిన్నరను ఆయనకు ముట్టజెప్పారు. చెప్పిన విధంగా రూ.2.25 లక్షల చొప్పున అధిక వడ్డీని క్రమం తప్పకుండా అందించసాగారు. విషయం తెలుసుకున్న నెల్లూరుపాళెం సెంటర్లోని వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.30 లక్షలను సమర్పించారు. అనంతరం భాస్కర్రెడ్డి పత్తా లేకపోవడంతో కంగారుపడిన బాధితులు ఆయన గురించి ఆరాతీశారు. ఇదే తరహాలో బుచ్చిరెడ్డిపాళెంలోనూ పలువుర్ని నమ్మించి నగదుతో పరారయ్యాడని తెలుసుకొని లబోదిబోమంటూ ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించారు. అతని ఫోన్ లోకేషన్ను పరిశీలించి బద్వేల్లో ఉన్నారని గుర్తించి పోలీసుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు రూ.మూడు కోట్ల మేర కాజేసి ఉడాయించారని బాధితులు రోశయ్య, చెరుకూరి కామాక్షయ్య సన్నిబోయిన ప్రభాకర్, ఈదల సురేష్, ప్రసాద్, ఖాజారహంతుల్లా, మాదాల విష్ణు, బొబ్బల రాజా, ముక్కాల శ్రీనివాసులు, పుచ్చకట్ల రమణయ్య, మాదాల కృష్ణయ్య, తదితరులు తెలిపారు. ఫిర్యాదు మేరకు డీఎస్పీ కోటిరెడ్డి, ఎస్సైలు ముత్యాలరావు, రాజేష్ దర్యాప్తు చేపట్టారు. -
లిఫ్ట్ అడిగి.. బైక్తో ఉడాయించాడు!
భద్రాద్రి: ఓ యువకుడు లిఫ్ట్ అడిగి బైక్తో ఉడాయించిన ఘటన శనివారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. టీడీపీ మండల అధ్యక్షుడు కొమరం దామోదర్రావు ఉదయం బైక్పై సీతానగరం నుంచి లక్ష్మీనగరం వస్తున్నాడు. ఈ క్రమంలో సీతానగరం గ్రామం దగ్గర ఓ యువకుడు లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కాడు. చిన్ననల్లబల్లి వచ్చాక బైక్లో పెట్రోల్ కొట్టించారు. అనంతరం స్టార్ట్ కాకపోవడంతో దామోదర్రావుతోపాటు సదరు యువకుడు ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ మెకానిక్ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ రిపేర్ చేస్తుండగా అత్యవసర పని ఉండటంతో దామోదర్రావు ఆటోలో లక్ష్మీనగరం బయల్దేరాడు. ఆటో ఎక్కాక అనుమానం వచ్చి.. తాను వచ్చే వరకు బైక్ ఎవరికీ ఇవ్వొద్దని మెకానిక్కు చెప్పాలంటూ ఇద్దరు గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు మెకానిక్ షాపు వద్దకు వచ్చే లోపే లిఫ్ట్ అడిగిన యువకుడు స్టార్ట్ చేసి చూస్తానంటూ బైక్తో ఉడాయించాడు. దీంతో దామోదర్రావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
దొంగలు దొరికారు !
వికారాబాద్: పనిచేసిన యజమాని ఇంటికే కన్నం వేశాడు ఓ వ్యక్తి.. ఇంట్లో భారీగా నగదు ఉందనే పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల తాండూరు పట్టణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.19లక్షలను రికవరీ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. బుధవారం ఎస్పీ కోటిరెడ్డి తాండూరు పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన వ్యాపారి ఎండీ వాజీద్ ఇటీవల ప్లాట్ విక్రయించగా రూ. 20 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇంట్లో పెట్టి ఈ నెల 14న హైదరాబాద్లో బంధువుల వివాహానికి వెళ్లాడు. తరువాతి రోజు ఇంట్లో చోరీ జరిగింది. రూ. 20లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రాజేందర్రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. తెలిసిన వ్యక్తి పనే.. వాజీద్ వద్ద అబూబాకర్ ఖురేషి అనే వ్యక్తి గతంలో పనిచేశాడు. ఇంట్లో డబ్బు ఉందన్న సమాచారంతో దొంగతానికి ప్లాన్ చేశాడు. తన పెద్దమ్మ కొడుకు అబూ సోఫియాన్ ఖురేషికి విషయాన్ని చెప్పాడు. అదే కాలనీలో ఉంటున్న ఖలీల్, తౌసిఫ్, దీపక్ అలియాస్ కిట్టుతో కలసి ప్లాన్ వేశాడు. ఈ నెల 15న రాత్రి అబూబాకర్, ఖలీల్లు రాడ్తో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. మిగిలిన ముగ్గురు బయటనే ఉండి పరిసరాలను గమనిస్తూ ఉన్నారు. బీరువాలో ఉన్న రూ. 20 లక్షలను ఎత్తుకెళ్లారు. అందులో రూ.లక్షను మొదట అందరూ పంచుకున్నారు. మిగిలిన రూ. 19 లక్షలను యాదిరెడ్డి చౌక్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఉన్న చెత్తకుప్పలో దాచి పెట్టారు. తరువాత వచ్చి నగదును తీసుకెళ్లి పంచుకుందామనుకున్నారు. సీసీ కెమెరాలే పట్టించాయి బాధితుడి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను, పలు ముఖ్య కూడళ్లలోని కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే మాణిక్ నగర్ వద్ద ఉన్న కెమెరాలో అబూబాకర్ ఖురేషి అనుమానాస్పద కదలికలను పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అబూ సోఫియాన్ ఖురేషిని అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసు ఛేదనకు సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషించాయన్నారు. 72 గంటల్లోనే నిందితుల అరెస్టులో కీలకపాత్ర వహించిన కానిస్టేబుళ్లు అమ్జద్, శివ, సాయికుమార్, షబీల్అహ్మద్లను ఎస్పీ అభినందించి, రివార్డు అందజేశారు. పట్టుబడిన నిందితులు ఇద్దరినీ బుధవారం రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. నిందితులు ఉపయోగించిన ఆటో, బైక్ను సీజ్ చేశామన్నారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకుంటామన్నారు. -
అర్ధరాత్రి ఆగంతకుడు !
భద్రాద్రి: ఇల్లెందులోని సింగరేణి కార్మికవాడల్లో అర్ధరాత్రి ఓ ఆగంతకుడు సంచరించిన సంఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ మొదటి లైన్లో శనివారం తెల్లారుజామున 3.35 గంటల ప్రాంతంలో 20 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆగంతకుడు ముఖానికి మంకీ క్యాప్, మాస్క్ ధరించి కొన్ని ఇళ్లల్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇల్లెందులోని ఐసీఐసీఐ బ్యాంక్లో పని చేస్తున్న క్రాంతి, సింగరేణి స్కూల్లో పని చేస్తున్న ఆయన సతీమణి కృష్ణవేణి నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. వారి క్వార్టర్ ముందు కిటికీ తీసి ఇంట్లోకి మొబైల్ టార్చ్ వేసి చూశాడు. ఇంట్లోని కుక్క గమనించి అరవడంతో ఇంటి యజమాని కృష్ణవేణి నిద్ర లేచింది. కిటికీ ముందు నిలబడిన ఆగంతకుడు మొబైల్ టార్చ్ వేసుకుని చూస్తుండటంతో భయపడిన కృష్ణవేణి కేకలు వేసింది. ఆ సమయంలో భర్త క్రాంతి ఊరెళ్లాడు. పక్కింటివారికి ఫోన్ చేయగా, వారు నిద్రలేచి వెతికినా అప్పటికే ఆగంతకుడు పారిపోయాడు. అదే లైన్లో మరికొన్ని ఇళ్లల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. గతేడాది వేసవిలో కూడా ఇదే తరహాలో పట్టణంలో దుండుగులు చోరీలకు పాల్పడ్డారు. తాజాగా సింగరేణి కాలనీలో ఆగంతకుడి సంచారంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వీడియో: ఏం తెలివిరా నాయనా.. సినీ ఫక్కీలో 10లక్షలు చోరీ
సాక్షి, గుంటూరు: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దొంగలు ఎప్పటికప్పుడు అప్గేట్ అవుతూ ట్రిక్కులతో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.20 కోసం కక్కుర్తిపడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో పట్టపగలే దొంగలు చేతివాటం చూపించారు. రూ. 20నోటును ఎరగవేసి రూ.10లక్షల నగదును ఎత్తికెళ్లారు. బాలాజీ నగర్కు చెందిన కోసూరి హరిబాబు ఎం.ఎన్ ఎక్స్పోర్టు కంపెనీలో మూడేళ్లుగా గుమస్తాగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన లక్ష్మీపురంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.10 లక్షలు డ్రా చేశారు. కాగా, బ్యాంకు నుంచి బయటకు వచ్చి డబ్బులు ఉన్న బ్యాగును బైక్ హ్యాండిల్కు తగిలించారు. తర్వాత బైక్ స్టార్ట్ చేస్తుండగా.. ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పాడు. దీంతో, ఆ రూ.20లను తీసుకునేందుకు హరిబాబు.. బైకి దిగి కిందకు వంగాడు. ఇంతలో మరో వ్యక్తి బైక్ హ్యాండిల్కు ఉంచిన డబ్బుల సంచిని ఎత్తుకెళ్లాడు. అప్పటికే మరొక వ్యక్తి వాహనం స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో షాకైన హరిబాబు.. తేరుకుని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా.. బ్యాంకులోకి కూడా ఒక దొంగ ముందుగా వచ్చి ఎంత నగదు డ్రా చేసింది రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుని బ్యాంక్ దగ్గర రెక్కీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: శామీర్పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్.. -
షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది!
సాక్షి,ఖలీల్వాడి(హైదరాబాద్): నవీపేట్ శివారులో సాయినగర్ షిర్డీలో రైలులో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ సంఘటనలో నిందితులను రైల్వే పోలీసులు వదిలేసినట్లుగా సమాచారం. నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రైలు నవీపేట వద్ద క్రాసింగ్ ఉందని ఆపగా అక్కడ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు ఎక్కి ప్రయాణికుల బ్యాగులు చోరీ చేసిన విషయం విదితమే.. రైలులో బ్యాగ్లు చోరీ జరిగినట్లు తెలుసుకున్న ప్రయాణికులు బాసర వద్ద రైలును చైన్ లాగి ఆపిన విషయం తెలిసిందే. అయితే రైలు ఆగగానే పారిపోతున్న యువతుల్లో కొందరిని రైలు ప్రయాణికులే పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. బాధితులు సైతం తమ పూర్తి వివరాలతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాగుల్లో ల్యాప్టాప్తో డబ్బులు, ల్యాప్టాప్, ఓ మహిళ మెడలో నుంచి చైన్ ఎత్తుకెళినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు గుంటరు, విజయవాడ, నెల్లరు, వైజాగ్, కడపకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. మర్మమేమిటో..! బాసర రైల్వే పోలీసులు, ఆర్ఫీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తొమ్మిది మంది యువతులను విచారించి వదిలి వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యువతులు మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందినట్లు వారుగా గుర్తించారు. సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్లో చోరీపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదనే విమర్శులున్నాయి. ప్రయాణికులు బాసర వద్ద చైన్ లాగిన తర్వాత అక్కడి సీసీ ఫుటేజీలు, అలాగే యువతులు నవీపేట్ రైల్వేస్టేషన్ వద్ద ఎక్కిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే చోరీ విషయమై స్పష్టత వస్తుందనిప్రయాణికులు పేర్కొంటున్నారు. బాసర వద్ద ఉన్న సీసీపుటేజీల్లో యువతులు బ్యాగులు తీసుకుని స్లీపర్ కోచ్ నుంచి జనరల్ బోగీల్లోకి వెళ్తున్నట్లుగా రికార్డయినట్లు సమాచారం. రైల్వే ట్రాక్ పక్కన పడ్డ బ్యాగులు రైల్వే పోలీసుల వద్ద ఉన్నట్లు తెలిసింది. ఈ బ్యాగులు రైల్వేట్రాక్ పక్కకు ఎలా వచ్చాయనే విషయపై రైల్వేపోలీసులు సరైన విచారణ చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైలులో చోరీపై ఎస్పీ, ఎస్బీ ఆరా..! సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్లో చోరీపై రైల్వే ఎస్పీ, రైల్వే స్పెషల్ బ్రాంచ్ అధికారులు రైల్వే అధికారుల నుంచి వివరాలను సేకరింనట్లు సమాచారం. ఈ చోరీలో ప్రయాణికులు పట్టింన నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చోరీకి పాల్పడ్డ యువతులను ఆర్పీఎఫ్ పోలీసులు రైలు లో నిజామాబాద్ రైల్వేస్టేషన్కు గురువారం ఉద యం తీసుకొచ్చినట్లు తెలిసింది. వారిని రైల్వే పోలీ సులకు అప్పజెప్పినట్లు సమాచారం. చదవండి: Dundigal 83 Police SI's Transfers: ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు -
దారి దోపిడి దొంగకు తగిన శాస్తి
-
టమాటాతో కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు.. అంతలోనే ఊహించని షాక్!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దేశవ్యాప్తంగా టమాటకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కేజీ రూ.200తో విక్రయిస్తున్నారు. దీంతో ఆ పంటపై దొంగల కన్ను పడింది. రాత్రికి రాత్రే పంటను దోచుకెళ్తున్నారు. దొడ్డ తాలూకా లక్ష్మిదేవపురం గ్రామంలో రైతు జగదీష్ తన ఎకరా భూమిలో టమాట సాగు చేశాడు. మంచి దిగుబడితోపాటు ధరలు పెరగడంతో తన కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. ఎందుకంటే మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలోకి చొరబడి టమాట కాయలు తెంపుకొని ఉడాయించారు. బుధవారం ఉదయం తోటకు వెళ్లిన జగదీష్ చెట్లు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యాడు. చోరీకి గురైన టమాట విలువ రూ.1.50లక్షలు చేస్తుందని రైతు తెలిపాడు. చదవండి: Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. నగర చరిత్రలో ఆల్టైమ్ రికార్డు -
సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం.. అసలు విషయం తెలిసి అవాక్కయిన పోలీసులు!
వాషింగ్టన్: సాధారణంగా దొంగతనం చేసేటప్పుడు దొంగలు క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల నుంచి సొమ్ము, బంగారం వంటివి దోచుకోగానే అక్కడి నుంచి జాడలేకుండా పారిపోతారు. ముఖంపై మాస్క్ ధరించి వాళ్లెవరో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంత వరకు మనకు తెలిసిన కథే.. అయితే ఓ దొంగ మాత్రం వీటన్నింటికి భిన్నంగా ప్రవర్తించాడు. సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు. ఈ వింత ఘటన న్యూయార్క్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగరంలోని మాన్హట్టన్లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన దొంగ తుపాకీ గురిపెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు. దాంతో ఆ యువకుడు తన దగ్గర డబ్బులు లేవని, కేవలం సెల్ఫోన్, ఏటీఎం కార్డు మాత్రమే ఉందని చెప్పాడు. అయితే ఏటీఎంకు పదా అంటూ బాధితుడిని దొంగ తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేయించి తీసుకున్నాడు. చోరీ అనంతరం దొంగ ఏం చేయకుండా యువకుడిని సురక్షితంగా ముందు ఉన్న ప్రదేశంలోనే దింపాడు. అంతేకాకుండా ఆ దొంగ కొన్ని విషయాలు బయటపెట్టాడు. యువకుడి వద్ద డబ్బులు దోచుకున్నందుకు ‘సారీ బ్రదర్.. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లే దొంగలిస్తున్నట్లు’ వివరించాడు. మొబైల్ ఫోన్ కూడా త్వరలోనే తిరిగి ఇస్తానని ఆ యువకుడికి చెప్పాడు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను దొంగకు ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ కలుద్దాం అని చెప్పి ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.ఈ విషయం తెలియగానే పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటన అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉండగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చదవండి: Largest Restaurant In World: కొండల మధ్యలో రెస్టారెంట్.. ఒకేసారి 5800మంది భోజనం చేయొచ్చు -
హనుమాన్ టెంపుల్లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి..
ఛండీగఢ్: హనుమాన్ దేవాలయంలో ఓ దొంగ రూ.10 దేవునికి సమర్పించి రూ.5000 దోచేశాడు. ఈ ఘటన హర్యానా రేవారి జిల్లాలోని ధరుహేరా పట్టణంలో జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మొదట గుడిలోకి ఎంట్రీ ఇచ్చిన దొంగ.. హనుమంతుని పాదాల చెంత చేరి ప్రార్థన చేశాడు. పూజారి ముందే 10 నిమిషాల పాటు హనుమాన్ చాలీషా చదువుతూ దేవుని సన్నిధిలో గడిపాడు. ప్రార్థన అనంతరం చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని హుండీ తాళాని పగులగొట్టాడు. రూ.5000 చోరీ చేశాడు. దోపిడీ జరిగిందని గుర్తించని పూజారి గుడి తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా.. అసలు విషయం బోధపడింది. పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: హరిద్వార్లో రాకాసి మేఘం.. చూస్తే..! -
వైరల్ వీడియో.. దొంగోడి తిక్క కుదిరిందిగా!
-
దొంగోడికోసం అవ్వ కాపలా..
-
చీమకుర్తిలో పట్టపగలే దొంగతనం
-
దొంగల ముఠాపై పోలీసుల కాల్పులు
-
బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ!
రాంచీ: జార్ఖండ్లోని రాంచీలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ చైన్ స్నాచర్ బంగారు గొలుసును మింగేశాడు. డోరండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాది వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు స్నాచర్లు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. గొలుసు లాక్కొని ఆ ఇద్దరు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అయితే, నేరం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పోలీసులు ఉండడంతో.. ఇదంతా గమనించిన వారిని వెంబడించడం ప్రారంభించారు. సల్మాన్, జాఫర్లను పోలీసులు ఒక కిలోమీటరు మేర వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు సల్మాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. చివరికి పోలీసుకు దొరికిపోయే పరిస్థితి ఏర్పడడంతో.. తన దొంగతనానికి ఆధారం లేకుండా చేసే క్రమంలో చోరీకి గురైన బంగారు గొలుసును మింగేశాడు. అయితే సల్మాన్ చైన్ మింగుతుండగా పోలీసు అధికారులు చూశారు. చివరికి సల్మాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పొత్తికడుపు, ఛాతీకి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. ఎక్స్-రేలో సల్మాన్ ఛాతీలో బంగారు గొలుసు ఇరుక్కుని ఉన్నట్లు స్పష్టమైంది. దురదృష్టవశాత్తు, గొలుసు మింగిన కారణంగా, సల్మాన్ ఛాతీలో నొప్పిని మొదలై అది కాస్త తీవ్రతరం అయ్యింది. దీంతో తనని కాపాడాలని ఆ దొంగ పోలీసులను వేడుకోవడంతో ప్రస్తుతం అతని చికిత్స నిమిత్తం రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. గ్యాస్ట్రోస్కోపీ, ఎండోస్కోపీ లేదా శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీసేందుకు వైద్యులు చికిత్స చేయనున్నారు. ప్రస్తుతం నిందితుడు రిమ్స్లో పోలీసుల నిఘాలో ఉన్నాడు. చదవండి: నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తా.. -
'దొంగ 'అని పొరబడి అనాలోచితంగా చితకబాదేశారు..పాపం ఆ వ్యక్తి..
మద్యం మత్తులో ఓ వ్యక్తి హౌసింగ్ బోర్డులోకి చొరబడ్డాడు. అంతే అతన్ని దొంగగా భావించి సదరు హౌసింగ్ బోర్డు వాచ్మెన్, కొందరూ వ్యక్తులు అతడిని దొంగ అనుకుని చితకబాదేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి చేర్పించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ప్రవీణ్ అనే వ్యక్తి మద్యం సేవించి సమీపంలో కూల్చి వేసి ఉన్న హౌసింగ్ బోర్డులోకి ప్రవేశించాడు. అది గమనించిన వాచ్మెన్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కంగారుపడ్డ ఆ వ్యక్తి గోడ ఎక్కి పారిపోతున్నాడు. ఆగమని చెప్పిన వినకుండా వెళ్లడంతో ..వాచ్మెన్ తోపాటు సదరు వ్యక్తులు ప్రవీణ్పై గట్టిగా కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని కస్తుర్బా ఆస్పత్రికి తరలించాగా..అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అతను దాడి చేయడం వల్ల మరణించాడా లేక మరేదైనా కారణం వల్ల చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు పోస్ట్మార్టం అనంతరం అతడిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తామని వెల్లడించారు. (చదవండి: డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం: వీడియో వైరల్) -
జగిత్యాల సీఎం కప్ పోటీల్లో దొంగల హల్చల్..
జగిత్యాల: సీఎం కప్ లైటింగ్ నిర్వహణ చూస్తున్న సతీష్ అనే వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కొట్టేసిన దొంగలు.. మంత్రి కొప్పుల, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు హాజరైన కార్యక్రమంలో లక్ష రూపాయలు అపహరణకు గురి కావడంతో కలకలం.. పోలీస్ సెక్యూరిటీ కళ్ళు కప్పి ఉడాయించిన దొంగ.. మైక్ లో అనౌన్స్ మెంట్ చేసిన నిర్వాహకులు. -
ఐఫోన్ కోసం ఎన్ని తిప్పలో.. రెండో అంతస్తు నుంచి దూకేశాడు.. వీడియో వైరల్!
ఐఫోన్ క్రేజ్ మామూలుగా ఉండదు.. యాపిల్ కంపెనీకి చెందిన ఆ ఫోన్ అంటే ప్రతిఒక్కరికీ మోజు. దానిని కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అది చాలా ఖరీదు కావడంతో అందరూ కొనలేరు. ఇదీ చదవండి: iPhone 15 Manufacturing: టాటా ఐఫోన్! ఇక ఐఫోన్ 15 తయారీ ఇక్కడే.. అయితే కష్టపడి కొనడం ఎందుకు? కొట్టేస్తే పోలా అనుకున్నాడో వ్యక్తి. యాపిల్ స్టోర్కి వెళ్లి నచ్చిన మోడల్ ఐఫోన్ తీసుకుని పరుగు లంకించుకున్నాడు. ఈ క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డాడు. క్రేజీ క్లిప్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) Dude jumps off 2nd floor trying to get away after robbing Apple store 😬 pic.twitter.com/pdEjodh1Ka — Crazy Clips (@crazyclipsonly) May 17, 2023 -
దొంగను మార్చేసిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి!
భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడమే కాదు.. తొమ్మిదేళ్ల కిందట ఓ ఆలయంలో చోరీ చేసిన నగలను సైతం తిరిగి ఇచ్చేలా చేసింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన భువనేశ్వర్(ఒడిషా)లో జరిగింది. భువనేశ్వర్లోని గోపీనాథ్పూర్ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీ జరిగింది. కృష్ణ భగవానుడికి చెందిన లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అవి దొరకపోవడంతో కొత్త అభరణాలు చేయించారు ఆలయ నిర్వాహకులు. కట్ చేస్తే.. ఈ మధ్య ఆలయ ద్వారం వద్ద ఓం సంచి ఒకటి దొరికింది. అందులో ఓ లేఖ.. పోయిన నగలు కనిపించాయి. చేసిన చోరీకి క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 కూడా ఉంచాడు ఆ వ్యక్తి. ఈ మధ్యకాలంలో తాను భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని విలువైన ఆ ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమే అంటున్నారు. Video Source: OTV News English -
ఆరు గంటలు.. ఇంట్లోనే మకాం వేసి.. 10 లక్షలు దోచేసి.. క్యాబ్లో చెక్కేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తల్లి, కూతురును కత్తితో బెదిరించి ఓ ఆగంతకుడు రూ.10 లక్షలతో ఉడాయించాడు. నిందితుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు నివాసం ఉంటున్నారు. కుటుంబం అంతా గురువారం రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి వరకు ఇంటి పరిసరాల్లో కాపుకాసిన ముసుగు ధరించిన ఓ యువకుడు.. గోడ మీదుగా నిచ్చెన వేసుకొని ఇంటి ఆవరణలో దిగాడు. రాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే వారి కళ్లుగప్పి లోనికి ప్రవేశించాడు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో రాజు కూతురు నడింపల్లి నవ్య (30) ఉంటున్న గదిలోకి వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఎనిమిదిన్నర నెలల నిండు గర్భిణి అయిన నవ్య.. ఆ ఆగంతకుడిని చూసి వణికిపోయింది. అరిచేందుకు యత్నించగా.. ఆమెను కత్తితో పొడుస్తానని హెచ్చరించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తన ఒంటి మీద, బీరువాలో ఉన్న నగలు ఇస్తానని తన దగ్గర నగదు లేదని ఆమె వేడుకుంది. అయినాసరే ఆ దొంగ వినిపించుకోలేదు. ఈ క్రమంలో నవ్య పెట్టిన కేకలతో అప్రమత్తమైన ఆమె తల్లి లీల(54) ఆ గదిలోకి పరిగెత్తుకురాగా.. ఆ ఆగంతకుడు ఆమెను కూడా కత్తితో బెదిరించి ఓ మూలన కూర్చోబెట్టాడు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించాల్సిందిగా బెదిరించాడు. దీంతో నవ్య డబ్బులు కావాలని తన భర్తకు ఫోన్ చేసింది. ఆయన రూ. 8 లక్షలు ఆమె బావతో పంపించాడు. దీంతో లీల గేటు వద్దకు వచ్చి అతడి నుంచి నగదు తీసుకొని లోనికి వెళ్లింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే కూతురును హత్య చేస్తానని బెదిరించడంతో ఆమె రూ. 8 లక్షలు తీసుకొచ్చిన అల్లుడికి ఈ విషయం చెప్పలేదు. ఈ విషయాలు ఏమీ తెలియని ఎన్.ఎస్.ఎన్.రాజు తన గదిలో నిద్రిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10 గంటల సమయానికి తల్లీ, కూతురు ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు కలిపి మొత్తం రూ.10 లక్షలను నిందితుడి చేతిలో పెట్టారు. అనంతరం నవ్య మొబైల్ ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయగా ఆగంతకుడు అందులో పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న బాధితులు ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓలా క్యాబ్లో నిందితుడు షాద్నగర్ బస్టాప్లో దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆరుగంటల పాటు తల్లీ, కూతురును గదిలో బంధించి రూ. 10 లక్షలతో ఉడాయించిన ఆగంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. క్లూస్టీమ్, డాగ్స్కా్వడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు తెలుగు, ఇంగ్లిష్లో మాట్లాడినట్లు క్యాబ్ డ్రైవర్ వెల్లడించడంతో పోలీసులు పాత నేరస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. -
పోలీసుల చిత్రహింసల వల్లే చిరంజీవి మృతి
సాక్షి, హైదరాబాద్: తుకారాంగేట్ పోలీసులు సెల్ఫోన్ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న ఆమూరి చిరంజీవిని ఈ నెల 25వ తేదీన తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లనే మృతి చెందాడని మానవ హక్కుల వేదిక ఆరోపించింది. ఈ మేరకు తమ నిజనిర్ధారణలో వెల్లడైనట్లు మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం అందజేయాలని, బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్య మంజులకు ఉద్యోగం కల్పించి పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేరి్పంచాలని కోరారు. -
పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ.. ఈ డెలివరి బాయ్ ఏం చేశాడంటే..
-
దొంగను కొట్టి చంపిన గ్రామస్థులు
-
కార్లలో వచ్చి చోరి.. కథ అడ్డం తిరగడంతో యజమానికి ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్: వస్త్ర దుకాణంలోకి కొనుగోలుదారుల్లా వచ్చిన దొంగలు.. దృష్టి మరల్చి ఖరీదైన చీరలను నొక్కేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెక్కేశారు. నానా హంగామా చేసి ఒక్క చీర కూడా కొనకుండా తిరిగి వెళ్లిపోవటంతో అనుమానం వచ్చిన షాపు యజమానురాలు.. సీసీ టీవీ కెమెరాలోని ఫుటేజీని పరిశీలించారు. వచ్చింది కస్టమర్లు కాదు దొంగలు అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కెమెరాలో నమోదైన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్గా మారి దొంగల వరకూ చేరింది. దీంతో ఇంట్లో పిల్లలకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు.. షాపు యజమానురాలికి ఫోన్ చేసి తప్పయిందని ఒప్పుకొన్నారు. తాము దొంగిలించిన చీరలను తిరిగి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొనుగోలుదారుల్లా వచ్చి.. మణికొండలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులో పావులూరి నాగతేజకు తేజ సారీస్ పేరుతో బోటిక్ ఉంది. గత సోమవారం గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు (ఓ పురుషుడు, అయిదుగురు మహిళలు) నంబరు ప్లేట్లేని స్కారి్పయో కారులో వచ్చారు. షాపు ముందు వాహనంలో నుంచి దిగి రెండు బృందాలుగా విడిపోయి కొనుగోలుదారుల్లా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించారు. బోటిక్లోని విక్రయదారులను చీరలు చూపించండి అని వారి దృష్టి మళ్లించారు. రూ.2 లక్షలు విలువైన అయిదు ఖరీదైన చీరలను దొంగిలించారు. ఏమీ కొనకుండానే 15 నిమిషాల్లో అక్కడి నుంచి నిష్క్రమించారు. వీరి కదలికలపై నాగతేజకు అనుమానం వచ్చి వెంటనే స్టాక్ను చెక్ చేసి చీరలు తగ్గినట్లు గుర్తించారు. షాపులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలించారు. కొనుగోలుదారుల్లా వచ్చిన అయిదుగురు సభ్యులు ఒకే ముఠా అని, చీరలు దొంగతనం చేసి స్కారి్పయో కారులో పరారైనట్లు అందులో రికార్డయింది. ఆ వీడియోలను నాగతేజ తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టు చేశారు. ఆ దృశ్యాలను చూసిన కోకాపేటకు చెందిన మరో షాపు యజమాని నాగతేజకు ఫోన్ చేశారు. తన షాపులోనూ ఇదే ముఠా సభ్యులు ఇదే తరహాలో రూ.10 లక్షలు విలువైన చీరలు ఎత్తుకెళ్లారని వివరించారు. ఓ నేత కారి్మకుడు, షాపు యజమానికి ఫోన్ చేసి.. మార్చి 9న తన షాపులోనూ చోరీ జరిగిందని తెలిపారు. ఇదే తరహాలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 షాపుల యజమానులు చోరీ జరిగిందంటూ నాగతేజకు వివరించారు. మొదటిసారి దొంగతనం చేశామని.. వైరల్గా మారిన సదరు వీడియోలు.. సదరు ముఠా సభ్యుల కంట పడటంతో షాక్ తిన్నారు. వెంటనే గ్యాంగ్లోని ఓ మహిళ షాపు యజమానురాలు నాగతేజకు ఫోన్ చేసి.. తొలిసారిగా దొంగతనం చేశామని, తప్పయిందని ప్రాధేయపడింది. దొంగిలించిన చీరలను తిరిగిచ్చేస్తామని చెప్పింది. ఇన్స్ట్రాగామ్ ఖాతాలోని వీడియో, ఫొటోలను తమ పిల్లలు చూస్తే పరువుపోతుందని వాటిని డిలీట్ చేయాలని అభ్యర్థించింది. పోస్టులను తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. వెంటనే దుకాణానికి వచ్చి చీరలు రిటర్న్ చేయాలని నాగతేజ సూచించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరోసారి మహిళ నాగతేజకు ఫోన్ చేసింది. బొటిక్కు కొద్ది దూరంలో ఉన్న మరో షాపు సెక్యూరిటీ గార్డు వద్ద చోరీ చేసిన చీరలు అప్పగించామని వివరించింది. వెంటనే అక్కడికి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకున్న నాగతేజ.. పరిసర ప్రాంతాలలో గాలించగా నిందితులు అప్పటికే అక్కణ్నుంచి పరారయ్యారు. -
ఆస్పత్రి బెడ్పై దిండు, సంచి ఉంచి పరారైన దొంగ
గురజాల: తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి బెడ్పై దిండు, కర్రల సంచి ఉంచి పైన దుప్పటి కప్పి.. పోలీసుల కళ్లుగప్పి సినీపక్కీలో ఓ దొంగ పరారయిన ఘటన గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా చర్లగుడిపాడు గ్రామానికి చెందిన ఉద్దగిరి అలేఖ ఇంట్లో దొంగనోట్లు తయారు చేస్తున్నాడనే సమాచారం రావడంతో నవంబర్ 17వ తేదీ 2022న పోలీసులు సోదా చేస్తుండగా.. అతను గోడ దూకి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో అలేఖ రెండు కాళ్లు దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఈ ఏడాది జనవరి 3న అలేఖతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అలేఖకు రిమాండ్ విధించగా సబ్ జైల్ అధికారులు అలేఖ రెండు కాళ్లకు చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆపరేషన్ చేసిన అనంతరం గురజాల వైద్యశాలకు తరలించారు. అప్పటి నుంచి గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అలేఖకు కాపలాగా ఏఆర్ కానిస్టేబుళ్లు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు ఏఆర్ సిబ్బంది మంచం వద్దకు వెళ్లి చూడగా దిండు, కర్రల సంచి ఉంచి పైన దుప్పటి కప్పి అలేఖ పరారైనట్లు గుర్తించారు. వీల్ చైర్తో సహా పరారీ..? నిందితుడు ఉద్దగిరి అలేఖ వైద్యశాలలో ఉన్న వీల్ చైర్తో సహా పరారైనట్లు పోలీసులు తెలుపుతున్నారు. అలేఖ రెండు కాళ్లు దెబ్బతినడంతో నడవడం కష్టంగా ఉంటుందని వైద్యశాలలో ఒక వీల్ చైర్ కూడా కనిపించడం లేదని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పట్టణంలోని పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. -
చెలరేగిన దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో మంగళవారం రాత్రి ఇద్దరు దొంగలు చెలరేగిపోయారు. రెండు గంటలపాటు స్కూటీపై నగరమంతా తిరుగుతూ కనపడిన వారిపై ఇనుప రాడ్తో దాడి చేశారు. ఇద్దరు వాచ్మెన్లను హత్య చేసి, పలువురిని గాయపరిచారు. సుమారు పది షాపుల షట్టర్లు పగులగొట్టారు. కొన్ని షాపుల షట్టర్లు తెరుచుకోలేదు. హంతకుల్ని పోలీసులు 12 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరూ మైనర్లే. పోలీసులు వారిద్దరినీ జువైనల్ హోమ్కు తరలిస్తున్నారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో గుంటూరు నగరం అమరావతిరోడ్డులోని జ్వరాల ఆసుపత్రి ఎదురుగా మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న యమహా షోరూం వద్దకు స్కూటీపై ఇద్దరు మైనర్లు వచ్చారు. అందులో ఒకడు బండి వద్ద ఉండగా మరొకడు షోరూం వద్ద కుర్చీలో నిద్రపోతున్న కాపలాదారు కృపానిధి (66)పై ఇనుపరాడ్తో దాడి చేసి చంపేశాడు. అనంతరం షోరూం షట్టర్లు పగులగొట్టి లోపలికి వెళ్లారు. క్యాష్ కౌంటర్లో నగదు లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక హెల్మెట్ను తీసుకుని మళ్లీ ద్విచక్ర వాహనంపై నగరంలోకి వచ్చారు. అరండల్పేట 11/1 రోడ్డులోని మీసేవ కేంద్రం షట్టర్ తెరిచే ప్రయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో పదో రోడ్డులోకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ వైన్మార్ట్ వద్ద ఉన్న వాచ్మెన్ బత్తుల సాంబశివరావు (63)పై దాడి చేసి చంపేశారు. అనంతరం వైన్మార్ట్ తలుపు తెరిచే ప్రయత్నం చేయగా అది తెరుచుకోలేదు. దీంతో చుట్టుపక్కల నాలుగు షాపుల్లో చోరీకి ప్రయత్నం చేశారు. ఒక సెల్ఫోన్ షాపులో రెండు ట్యాబ్లు, స్మార్ట్వాచ్లు దొంగతనం చేశారు. అలికిడికి పక్కనే ఉన్న స్వగృహా స్వీట్షాప్ వాచ్మెన్ బయటకు వచ్చి కేకలు పెట్టడంతో అతనిపై దాడి చేశారు. అతను తప్పించుకుని సమీపంలోని అరండల్పేట పోలీసు స్టేషన్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులకు విషయం చెప్పాడు. డ్యూటీలో ఉన్న సెంట్రీ రక్షక్ వాహనంలో వారిని వెంబడించినా తప్పించుకుపోయారు. అనంతరం అరండల్పేట రెండో లైన్లోనే కూర్చుని మద్యం సేవించిన దుండగులు అక్కడి నుంచి పాత గుంటూరు ఆంధ్రా బ్యాంకు వద్ద పేపర్లు కట్టలు కడుతున్న పత్రిక ఏజెంట్పై పేపర్ ధర ఎంత అని అడుగుతూనే రాడ్తో దాడి చేశారు. ఆయన సెల్ఫోన్ లాక్కుని పరారయ్యారు. అనంతరం సుద్దపల్లి డొంక సమీపంలోని పాలబూత్ యజమాని ఎండ్లూరి రవికుమార్ అలియాస్ ఏసుబాబుపై దాడి చేశారు. అతని నడుముకు గాయమైంది. అక్కడి నుంచి యాదవ హైస్కూల్ వద్ద మరో వ్యక్తిపై దాడి చేశారు. అనంతరం నందివెలుగు రోడ్డులోని శ్మశానాల రోడ్డులో రెండు ఆటో ఫైనాన్స్, రెండు స్టిక్కరింగ్, ఒక కూల్డ్రింక్ షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. రెండు గంటల్లోనే నగరమంతా తిరుగుతూ విధ్వంసం సృష్టించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలాల్లో ఆనవాళ్లు సేకరించాయి. ఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, ఇతర అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలను రంగంలోకి దింపారు. సీసీ టీవీ ఫుటేజిల్లో నిందితుల్లో ఒకడు పాత నేరస్తుడేనని గుర్తించారు. వెంటనే అతని కుటుంబ సభ్యుల నుంచి సెల్ఫోన్ నంబర్ తీసుకొని, సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో రెండో నిందితుడిని కూడా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు. గంజాయి మత్తులో వారు ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరినీ జువైనల్ హోంకు పంపుతున్నట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. -
Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుడిలో చోరీకి యత్నించిన దొంగపై వాచ్మెన్ దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు చోరీ కోసం గుడిలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి వచ్చిన దుండగుడు గర్భగుడిలోని హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతను వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునేందుకు వాచ్మెన్ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు మృతుడిని పరిశీలించగా.. అతని ఫోన్ దొరికింది. ఫోన్లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిగా తెలిపారు. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. -
చీకోటి ప్రవీణ్ కారు చోరీ
-
బైక్పై దూసుకెళ్తూ మొబైల్ దొంగ దుర్మరణం!
సాక్షి, శివాజీనగర: ప్రజల నుంచి మొబైల్ఫోన్లు లాక్కెళ్తూ వేగంగా దూసుకెళ్లిన బైకర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోడ్డు డివైడర్కు బైక్ ఢీకొనడంతో ఒకరు అక్కడే మృతి చెందగా అతని వద్ద 8 మొబైల్ఫోన్లు చిక్కడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి సిటీ మార్కెట్ పై వంతెన మీద ఈ ఘటన జరిగింది. మృతుడు కబీర్ పాషా. అతి వేగంగా పై వంతెన మీద వెళుతుండగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పడడంతో తలకు గాయాలై చనిపోయాడు. ద్విచక్ర వాహనంలో ఎనిమిది మొబైల్లు లభించడం పలు అనుమానాలకు కారణమైంది. కేపీసీసీ కార్యాలయం వద్ద ఓ మహిళ మొబైల్ ఫోన్ను లాక్కొని పరారైంది ఇతడేనని అనుమానం ఉంది. సెల్ చోరీలకు పాల్పడి ఉడాయించాలనే తొందరలో ప్రమాదానికి గురైనట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో వ్యక్తి గాయపడగా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: భార్యకు బీమా పత్రాలు, డెత్నోట్ వాట్సాప్ చేసి..) -
దొంగలు బాబోయ్ దొంగలు! ఫీల్డింగ్, ఆడి, స్ట్రైకింగ్, షాను అంటూ కోడ్ భాష!
జేబు దొంగలు (పిక్ పాకెటర్స్) ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఒకప్పుడు పర్సులు కొట్టే పిక్ పాకెటర్లు ఇప్పుడు సెల్ఫోన్లు, ఇతర సొత్తును టార్గెట్గా చేసుకుని పక్కా ప్లానింగ్తో పని కానిచ్చేస్తున్నారు. ఆ..చిల్లర దొంగల్లే అనుకోకండి. అతి చిన్న నేరమైన పిక్ పాకెటింగ్పై ఆధారపడి హైదరాబాద్లో ఇప్పుడు అనేక వ్యవస్థీకృత ముఠాలు పని చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పోలీసు రికార్డుల్లోకి ఎక్కవు. కానీ రాజధానిలో ఏటా జరుగుతున్న సాధారణ చోరీలు, దోపిడీలు, దొంగతనాల్లో చోరుల పాలవుతున్న సొత్తుకు సమానంగా జేబు దొంగలు గుల్ల చేస్తున్న మొత్తం ఉంటోందని అంచనా. అందుకే ఓ పక్క ఒంటరి నేరగాళ్లు పిక్ పాకెటింగ్లు చేస్తుండగా, మరోపక్క వ్యవస్థీకృత ముఠా నేరగాళ్లు ఈ చోరీలు చేయిస్తున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు గతంలో చిక్కిన థండర్ సింగ్ కుష్వా అనే పిక్ పాకెటర్ చందానగర్లో నివసిస్తున్న ఫ్లాట్ అద్దె నెలకు రూ.30 వేలుగా తేలడం..విస్మయం కలిగించే అంశం. కాగా మహా నగరంలో వ్యవస్థీకృతంగా జరుగుతున్న పిక్ పాకెటింగ్స్లో ఏటా బాధితులు నష్టపోతున్నది రూ.30 కోట్లకు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. ఖాళీ పర్సులతో గిట్టుబాటు కాక..! హైదరాబాద్లో పిక్ పాకెటింగ్ గ్యాంగ్లు ఏళ్లుగా పని చేస్తున్నాయి. మధ్య, పశ్చిమ, తూర్పు మండలాల్లోని అనేక ప్రాంతాలు వీరికి అడ్డాలుగా ఉన్నాయి. ఈ ముఠాలు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. ప్రతి నెలా మొదటి, రెండు వారాల్లో జీతం డబ్బుతో ఇళ్లకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకునేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తర్వాత పర్సుల్లో నగదు అంతగా లేకపోతుండటంతో వీరికి ‘గిట్టుబాటు’కావట్లేదు. పర్సుల్లో దొరికిన కార్డుల్ని తీసుకువెళ్లి షాపింగ్ చేయడం, ఏటీఎం సెంటర్లలో నగదు డ్రా చేయడం ఓ పట్టాన కుదిరే పనికాదు. అందుకే ఇటీవల కాలంలో పర్సుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. చోరీ చేసిన ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిషకేషన్ (ఐఎంఈఐ) నంబర్ను క్లోనింగ్ చేసి అమ్మడం ద్వారానో, రాష్ట్ర సరిహద్దుల్ని దాటించి విక్రయిస్తూనో, కొన్నాళ్ల పాటు వినియోగించకుండా ఉంచేసి తర్వాత సొమ్ము చేసుకోవడమో చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం దొంగలకు అనుబంధంగా మరికొన్ని గ్యాంగ్స్ పని చేస్తుంటాయి. ఈ కారణంగానే చోరీకి గురైన ఫోన్లు సాంకేతికంగానూ ట్రాక్ కావట్లేదు. ప్రత్యేక పారిభాషక పదాలు.. పక్కా ప్లానింగ్ పిక్ పాకెటింగ్ ముఠాలకు ప్రత్యేక పారిభాషిక పదాలు కూడా ఉన్నాయి. రద్దీగా ఉండే బస్సులు, ఆటోలు, మార్కెట్లను ఎంచుకునే ఈ గ్యాంగ్ సభ్యులు టార్గెట్ను అనుసరిస్తుంటారు. మొదట గ్యాంగ్లోని కొందరు సభ్యులు ఎంచుకున్న వ్యక్తి చుట్టూ చేరతారు. ఇలా చేరడాన్ని ఫీల్డింగ్ అని, వారిని ‘ఆడి’అని పిలుస్తారు. వీరు సదరు వ్యక్తి చుట్టూ చేరి హడావుడి చేయడంతో పాటు గందరగోళ వాతావరణం, ఒత్తిడి కలిగిస్తారు. అదే అదనుగా మరో ముఠా సభ్యుడు తమ ‘టార్గెట్’నుంచి సెల్ఫోన్, పర్సు లేదా సొత్తును చోరీ చేస్తాడు. ఇలా చేయడాన్ని స్ట్రైకింగ్ అని, అతడిని ‘షాను’అని పిలుస్తుంటారు. కావాల్సింది చేతి కందగానే ‘షాను’అక్కడ నుంచి ఉడాయించడమో, మరో వ్యక్తికి అందించి పంపేయడమో చేస్తాడు. బస్సుల్లో ఈ చోరీలు జరుగుతుంటే దాని వెనుకే వీరి ఆటో ఫాలో అవుతుంది. ఈ ముఠా సభ్యులు ‘శిక్షణ’కూడా పొందుతారు. ‘పని’కి ఉపక్రమించే ముందు అంతా ఓ చోట సమావేశమై చోరీ చేయాల్సిన విధానాన్ని చర్చిస్తారు. ఆ సమయంలో జరిగే పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, రద్దీ ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహ రచన చేస్తుంటారు. అంతా కలిసి ఒకేచోట కాకుండా జట్లుగా విడిపోయి ‘పని’చేస్తుంటారు. ఈ ముఠాలో ఎవరైనా పోలీసులకు చిక్కితే గ్యాంగ్ లీడర్ న్యాయవాదిని ఏర్పాటు చేయడం, బెయిల్కు అవసరమైన ఖర్చులు భరించడం వంటివి చేస్తుంటాడు. ఎక్కడా ఆధారాలు లేకుండా... ఈ నేరంలో ఎంత మొత్తం పోయినా దానికి బాధితుడి వాంగ్మూలం తప్ప ఎలాంటి ఆధారం ఉండదు. పిక్ పాకెటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సీసీ కెమెరాలు వంటివి ఉన్న ప్రాంతాల్లో చేతివాటం చూపరు. షాపింగ్ మాల్స్ సహా మరికొన్ని చోట్లకు వెళ్లరు. చోరీకి పాల్పడిన వెంటనే సొమ్మును క్షణాల్లో జట్టులోని ప్రధాన వ్యక్తికి అందిస్తారు. అతడు వెంటనే అక్కడ నుంచి జారుకుంటాడు. ఒకవేళ బాధితుడు తన జేబును ఖాళీ చేసిన వ్యక్తిని పట్టుకున్నా ఫలితం ఉండదు. ఆధారాలేమీ చిక్కవు. సొమ్ము అందుకునే వ్యక్తి ముఠాకు సూత్రధారిగా వ్యవహరిస్తాడు. ఏదైనా ముఠా చిక్కినప్పుడు వారి వాంగ్మూలం ఆధారంగా కొలిక్కిరావాల్సిందే తప్ప ప్రత్యేక దర్యాప్తు అంటూ ఉండదు. అప్పటివరకు కేసు పెండింగ్ జాబితాలో ఉండిపోవాల్సిందే. అందుకే పోలీసులు సైతం ఈ ఫిర్యాదుల్ని పెద్దగా పట్టించుకోరు. కేసుగా నమోదు చేయడానికి అంగీకరించరు. హద్దు ‘దాటితే’అంతే.. ఒంటరిగా నేరాలు చేసే వారు ఎక్కడ పడితే అక్కడ చేసినా.. వ్యవస్థీకృత గ్యాంగులు నడిపించే వారు మాత్రం కొన్ని ప్రాంతాలు, బస్సులు, రూట్లు ఎంపిక చేసుకుంటారు. నిత్యం ఆయా ప్రాంతాల్లోనే తమ పంజాలు విసురుతుంటారు. గతంలో టాస్్క ఫోర్స్ పోలీసులకు చిక్కిన మన్సూర్, జహీర్, మొయిన్లు కేవలం చాంద్రాయణగుట్ట, సైదాబాద్ మధ్యే బస్సుల్లో చోరీలు చేశారు. ఒక ముఠా నేరాలు చేసే ప్రాంతంలోకి మరో ముఠా వస్తే సహించరు. ఎంతకైనా తెగిస్తారు. మొఘల్నగర్కు చెందిన జహీర్.. అక్రమ్ నేతృత్వంలో నడిచే గ్యాంగ్లో పని చేసి ఆపై సొంత ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. వీరు లక్డీకాపూల్, నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో పంజా విసిరేవారు. అవే ఏరియాల్లో ఖైసర్ గ్యాంగ్ సైతం చోరీలు చేస్తుండటంతో వీరి మధ్య వైరం ఏర్పడింది. దీంతో ఖైసర్ను హత్య చేయడానికి జహీర్ కుట్రపన్ని పోలీసులకు చిక్కాడు. జేబు దొంగల ముఠాల మధ్య తరచు ఇలాంటి గ్యాంగ్ వార్లు, హత్యలు సైతం నగరంలో వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.. పిక్ పాకెటింగ్ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో చాలావరకు మల్లేపల్లి, మాన్గార్బస్తీ, పాతబస్తీలోని వట్టేపల్లి, హసన్నగర్, ఫలక్నుమా, డబీర్పుర, తలాబ్కట్ట, షాహీన్నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. వీరు పంజా విసిరే వాటిల్లో ఐఎస్ సదన్, ఇమ్లిబన్, అఫ్జల్గంజ్, ఉస్మానియా ఆసుపత్రి, అబిడ్స్, కోఠి, సుల్తాన్బజార్, బషీర్బాగ్, నిజాం కాలేజ్, ట్యాంక్బండ్, అమీర్పేట్, ఎస్సార్నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లి, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్రోడ్స్, సికింద్రాబాద్లతో పాటు టూరిస్టుల్ని కొల్లగొట్టేందుకు అనువుగా ఉండే చారి్మనార్, లాడ్బజార్, గుల్జార్హౌస్ తదితర ప్రాంతాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీరితో కొందరు అవినీతి పోలీసులు కుమ్మక్కవుతుండటం గమనార్హం. పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ను నిర్వహిస్తూ కానిస్టేబుల్ ఒకరు నల్లగొండ పోలీసులకు చిక్కడం ఇందుకు నిదర్శనం. మరికొందరు పోలీసుల పైనా ఈ ‘మిలాఖత్’ఆరోపణలు ఉన్నాయి. -
దొంగకు ఖాకీ మద్దతు.. తొమ్మిది నెలలుగా కేసు చేధించకుండా..
సాక్షి, పుట్టపర్తి: ‘నా ఇంట్లో చోరీ జరిగి 9 నెలల వుతోంది. 20 తులాల బంగారాన్ని అపహరించుకెళ్లారు. ఈ సొత్తు రికవరీలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న హోంగార్డు నాగరాజు నాయక్.. పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు స్టేషన్కెళ్లి సీఐను కలిసినా ఫలితం లేకుండా పోతోంది. పైగా నన్నే దుర్భాషలాడుతూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. నాకు న్యాయం చేయాలి’ అంటూ ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఎదుట హోంగార్డు లక్ష్మణ నాయక్ వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఏఎస్పీని కలసి అర్జీ అందజేసి, మాట్లాడారు. పుట్టపర్తిలోని శిల్పారామం సమీపంలో నివాసముంటున్న లక్ష్మణ నాయక్ ఇంట్లో 2022, జూన్ 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ.11 వేలను అపహరించుకెళ్లారు. గోకులం ప్రాంతానికి చెందిన కాటమయ్య, హోంగార్డు నాగరాజు నాయక్ను అనుమానితులగా పేర్కొంటూ అప్పట్లో పుట్టపర్తి అర్బన్ పోలీసులకు లక్ష్మణ నాయక్ ఫిర్యాదు చేశాడు. నాగరాజు నాయక్పై గతంలోనూ చోరీ కేసులున్నాయని అందులో గుర్తు చేశాడు. బైక్ చోరీ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించి వచ్చిన నాగరాజు నాయక్ను పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చేరదీసి డ్రైవర్గా పెట్టుకున్నారని వివరించాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో అంతులేని నిరక్ష్యం కనబరుస్తున్నారని బాధితుడు వాపోయాడు. చోరీ సొత్తు రికవరీ చేసివ్వాలంటూ స్టేషన్కెళ్లి అడిగితే దుర్భాషలాడుతున్నారని వాపోయాడు. పైగా ‘ఎమ్మెల్యేతో ఫోన్చేయిస్తే బంగారాన్ని రికవరీ చేయాలా? నా దగ్గర పనిచేసే డ్రైవర్ దొంగతనం ఎందుకు చేస్తాడు? ఇంకోసారి స్టేషన్కు వస్తే బాగుండదు. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులైనా న్యాయం చేయాలని కోరాడు. 63 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. తొలుత ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ అర్జీలు స్వీకరించి, పరిశీలించారు. అనంతరం ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ చేరుకుని అర్జీదారులతో మాట్లాడి సమస్య తీవ్రతపై ఆరా తీశారు. చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. (చదవండి: కనుమరుగవుతున్న కష్టజీవి..) -
దొంగతనానికి వచ్చి బాత్టబ్లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో..
ఒక దొంగ దొంతనానికని వచ్చి.. హాయిగా బాత్రూంలో స్నానం చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు. ఇంతలో అనుహ్యంగా యజమాని లోపలకి రావడంతో ఊహించని విధంగా కథ మలుపు తిరిగింది. ఈ ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..34 ఏళ్ల మహిళ బయటకు వెళ్లి ఇంటికి తిరిగారాగానే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి వాతావరణం చూస్తే కాస్త అనుమానాస్పదంగా అనిపిపించింది. దీనికి తోడు ఇంటి కిటికి కూడా పగిలి ఉండటం..లోపల ఎవరో ఉన్నట్టు అనుమానం కలిగింది. అనుకున్నదే తడువుగా ఆమె పోలీసుకు కాల్ చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాము ఇంటిని చుట్టుముట్టామని లోపల ఉన్నావాళ్లెవరో బయటకు రావాల్సిందిగా సూచించారు. అయితే ఎంతకీ అటు నుంచి స్పందన రాకపోవడంతో ఇల్లంతా గాలించడం ప్రారంభించారు పోలీసులు. చివరికి ఆ దొంగ బాత్టబ్లో ఉన్నట్లు గుర్తించారు. ఐతే పోలీసులు లోపలకి వెళ్లి చూసేటప్పటికి..అక్కడి సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు పోలీసులు. పాపం ఆ దొంగ బాత్టబ్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పట్టుబడ్డ ఆ 27 ఏళ్ల నిందితుడు తన గురించి వివరణ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. (చదవండి: పాపం..! డ్యాన్స్ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష) -
గర్ల్ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు.. 13 ఖరీదైన బైక్లు చోరీ
ముంబై: గర్ల్ఫ్రెండ్ను ఇంప్రెస్ చేయాలని ఓ యువకుడు దొంగగా మారాడు. ఖరీదైన బైకులు దొంగతనం చేశాడు. మొత్తం 13 ద్విచక్ర వహనాలకు తస్కరించి కటకటాలపాలయ్యాడు. మహారాష్ట్ర థానె జిల్లా కల్యాణ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ యువకుడి పేరు శుభం భాస్కర్ పవార్. ఓ బైక్ను దొంగిలించిన ఇతడ్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే అతడ్ని విచారించగా అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. తాను మొత్తం 13 బైక్లు దొంగిలించినట్లు శుభం విచారణలో ఒప్పుకున్నాడు. కేవలం తన ప్రేయసిని సంతోష పెట్టేందుకే ఈ చోరీలకు పాల్పడినట్లు చెప్పాడు. ఈ బైక్ల విలువ రూ.16లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు చెప్పారు. చదవండి: లఖీంపూర్ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్ -
పట్టుబడ్డ దొంగను స్టేషన్కి తరలిస్తుండగా..హఠాత్తుగా పోలీసుపై కత్తితో..
మొబైల్ ఫోన్ దొంగతనం కేసు విషయమై ఒక దొంగను పట్టుకుని తరలిస్తుండగా అనుహ్యంగా పోలీసుపై దాడి చేశాడు. అదీకూడా అందరూ చూస్తుండగా పట్టపగలే దాడి చేసి పారిపోయేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలో మయపూరీలోని ఒక స్లమ్ ఏరియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ ఢిల్లీలోని మాయపురిలో అనిష్ రాజ్ అనే దొంగ ఒక మహిళ ఫోన్ని దొంగలించాడు. దీంతో ఆ మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏఎస్ఐ శంభు దయాల్ ఈ కేసు విషయమే ఆ మహిళను తీసుకుని సంఘటనా స్థలానికి వచ్చి విచారించగా..సదరు మహిళ అనీష్ను చూపిస్తూ ఇతనే నా భర్త ఫోన్ దొంగలించాడనే చూపించింది. దీంతో వెంటనే దయాల్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కి తరలిస్తుండగా ఒక్కసారిగా జేబులోంచి కత్తిని తీసి పోలీసు ఛాతి, మెడ, వెన్నుపై ఏకంగా 12 సార్లు దాడి చేశాడు. పాపం ఆ పోలీసుల వాటిని లెక్కచేయకుండా అతన్ని ఆపేందుకు యత్నించాడు. ఐతే నిందితుడు సదరు పోలీస్ని తోసేసి పారిపోయాడు. దీంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా స్పందించి..నిందితుడిని వెంబడించారు. సమీపంలో ఉన్న మరో పోలీసు అతడ్ని పట్టుకుని అరెస్టు చేశాడు. ఆ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్లో రికార్డు అయ్యింది కూడా. ఐతే గాయపడిన ఏఎస్ఐని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆయన నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి మృతి చెందారు. రాజస్తాన్లోని సికార్కు చెందిన శంభు దయాల్కి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా సదరు పోలీసు శంభూజీకి నివాళులర్పించారు. అంతేగాదు ట్విట్టర్లో...ప్రజలను రక్షించడం కోసం ప్రాణాలను సైతం పట్టించుకోని మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. మీ ప్రాణానికి విలువ కట్టలేం కానీ మీ గౌరవార్థం కోటి రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నాం అని అన్నారు. जनता की रक्षा करते हुए ASI शंभु जी ने अपनी जान तक की परवाह नहीं की। वे शहीद हो गये। हमें उन पर गर्व है। उनकी जान की कोई क़ीमत नहीं पर उनके सम्मान में हम उनके परिवार को एक करोड़ रुपये की सम्मान राशि देंगे। https://t.co/RA3EW8MKXL — Arvind Kejriwal (@ArvindKejriwal) January 11, 2023 Delhi Police Cop was brutally stabbed to Death in Mayapuri Delhi by a Jihadee. When u vote for Free and ur Leader is an Anarchist ,hell bound to change the demography this is bound to happen. What u need somebody Like Maharaj #Yogi in almost all the state of Bharat. pic.twitter.com/Fzv4a2sY5b — Kavi🇮🇳🇮🇳🇮🇳 (@kavita_tewari) January 9, 2023 (చదవండి: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా! విలపిస్తున్న బాధితురాలి భర్త) -
అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్గా దొంగను బంధించాడు!
దొంగలు కూడా ఇప్పుడూ సాధారణ వ్యక్తుల మాదిరి షాప్లకి వచ్చి తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు. సీసీఫుటేజ్లు ఉన్నా కూడా వారి చేతివాటం మందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. కానీ ఇక్కడొక షాపు ఓనర్ మాత్రం భలే స్మార్ట్గా దొంగను పట్టుకున్నాడు. దొంగ అని అరవకుండా చాలా కూల్గా పట్టించాడు. వివరాల్లోకెళ్తే...యూకేలోని ఫోన్ మార్కెట్కి ఒక దొంగ కస్టమర్లాగా వచ్చాడు. అక్కడ లక్షల ఖరీదు చేసే ఫోన్లను కొనేసేవాడి మాదిరి ఫోన్లను చెక్ చేస్తున్నాడు. ఐతే ఆ షాపు ఓనర్ చాలా తెలివిగా ఫోన్లను చూపిస్తూ..బయట తలుపులను లాక్ చేశాడు. దీన్ని గమనించిన మన దొంగ ఇక ఇదే అవకాశం అనుకుని ఒక రెండు ఫోన్లను పట్టుకుని పరారయ్యేందకు యత్నించాడు. ఐతే డోర్లు ఓపెన్ కాకపోవడంతో చచ్చినట్లు తిరిగొచ్చి షాపు అతనికి ఫోన్లు ఇచ్చి వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించి నవ్వుకోండి. Don’t be an idiot pic.twitter.com/ldoXuFW4QB — UOldGuy🇨🇦 (@UOldguy) December 12, 2022 (చదవండి: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది) -
చోరీ చేసిన సోత్తు ఏం చేశావ్? దొంగ రిప్లై విని ఆశ్చర్యపోయిన పోలీసులు
ఇంత వరకు దొంగలు రకరకాల విచిత్రమైన వాటిని ఎత్తుకుపోవడం గురించి విన్నాం. అందుకు సంబంధించి వీడియోలు కూడా చూశాం. ఐతే పోలీసులు దొంగలను ఇంటరాగేషన్ చేసి.. వారిచేత నిజాలను కక్కిస్తారని అందరికి తెలిసిందే. అచ్చం అలానే ఒక పోలీసు అధికారి అందులో భాగంగా ఒక దొంగను విచారణ చేయగా..పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దొంగ చెబుతున్న జవాబులు విని ఆశ్చర్యపోతూ నవ్వడం పోలీసుల వంతైంది. వివరాల్లోకెళ్తే...ఈ ఘటన చత్తీస్గడ్లోని దుర్గ్ పోలీస్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు సిబ్బంది అంతా ఉండగానే అభిషేక్ పల్లవ్ అనే పోలీస్ సూపరింటెండ్ అధికారి ఒక దొంగను ఇంటరాగేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆ అధికారి దొంగను చోరి చేసిన డబ్బును ఏం చేశావ్ అని ప్రశ్నించారు. దానికి ఆ దొంగ ఆ డబ్బును పశువుల మేత కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశానని, మరికొంత సొమ్మును పేదవాళ్లకు దుప్పట్లు కొన్నానని చెప్పాడు. ఆ దొంగ సమాధానాలకు అధికారుల ఆశ్చర్యపోవడమే గాక వారి ముఖాల్లో నవ్వు తెప్పించాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by SIS / Shit Indians Say (@shitindianssay) (చదవండి: చైనా మంకుపట్టుతో అల్లాడితున్న జనాలు..బలవంతంగా ఈడ్చుకెళ్తూ..) -
దొంగతనానికి వచ్చి..డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు
ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ఏమి దొరక్కా.. ఆ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరువక మునేపే అలాంటి మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చోరీ చేసేందుకు వచ్చి డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన వారణాసిలో సార్నాథ్ ప్రాంతంలోని డానియాల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిని కథనం ప్రకారం....నిజాం అనే వక్తి విద్యుత్ యంత్రాలతో పనిచేసే మగ్గం సెంటర్లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఐతే ఈ దొంగ ఆ సెంటర్లో చోరీ చేసేందుకు వచ్చాడు. ఐతే ఆ సెంటర్ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది. ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృదొ చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మహిళ చేతివాటం.. మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది) -
దొంగిలించిన కారులో వెళ్తుండగా ప్రమాదం.. చికిత్స పొందుతూ మరో బైక్ చోరీ
సాక్షి, ములుగు: కారును దొంగిలించి సొమ్ము చేసుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. తప్పించుకునే తొందరలో వేగంగా వెళ్లిన దొంగలకారు విద్యుత్ స్థంభానికి ఢీ కొట్టడంతో ఆస్పత్రిపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అప్సర్ కారు తన ఇంటి వద్ద నిలిపి ఉండగా ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించి, కారును వేగంగా నడుపుతూ తీసుకెళ్తుండగా మంగపేట మండలం గంపోనిగూడెం వద్ద విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు గాయపడడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు తాడ్వాయి మండలం వీరాపురం గ్రామానికి చెందిన చీరల సందీప్ కాగా.. మరొకరు రాజ్కుమార్గా గు ర్తించారు. మంగపేట పోలీస్స్టేషన్లో రోడ్డు ప్రమా దం కేసు నమోదు కాగా, ఏటూరునాగారంలో కారు అపహరణ కేసు నమోదైంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ ఇద్దరిలో రాజ్కుమార్ ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సామాజిక ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తిస్తున్న గడ్డం దశరథం 108 డ్రైవర్ బైక్ను తీసుకొని ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది, బైక్ యజమాని తలలు పట్టుకుంటున్నారు. ఒక కారుతో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి దొంగతనం బయటపడి పోలీసులకు చిక్కగా చికిత్స పొందుతూ మరో బైక్ను దొంగలించడం హాట్ టాపింగ్ మారింది. అంతేకాకుండా పోలీసులకు చిక్కినట్లే చిక్కి ఒక దొంగ పారిపోవడం గమనార్హం. ఇద్దరు దొంగలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కానీ, సోమవారం రాత్రి వరకు కూడా బైక్పై పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియలేదు. చదవండి: హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి -
కొట్టేశానోచ్! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!
ఒక దొంగ మంచి ఖరీదైన వస్తువు కొట్టేశానన్న ఆనందంలో ముందు వెనుక చూడకుండా పారిపోయేందుకు యత్నించి బొక్క బోర్లాపడి అడ్డంగా దొరికి పోయాడు. ఈ ఘటన యూఎస్లోని వాషింగ్టన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....వాషింగ్టన్లోని బెల్లేవ్లో లూయిస్ విట్టన్ స్టోర్ అనే లగ్జరీ షాపుకి ఒక దొంగ వచ్చాడు. అతను ఆ షాపులో సుమారు రూ. 14 లక్షలు ఖరీదు చేసే వస్తువుని దొంగలించి పారిపోయేందుకు యత్నించాడు. ఐతే ఆ షాపుకి బయటవైపుగా క్లీన్గా ఉన్న అద్దాన్ని గమనించకుండా బయటకు దారి అదే అనుకుని ఆ అద్దం గుండా వెళ్లిపోవాలనుకున్నాడు. అంతే ఆ దొంగ ఆ అద్దానికి గుద్దుకుని ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాడు. అతను 17 ఏళ్ల యువకుడని పోలీసులు చెప్పారు. ఈ బెల్లేవ్ నగరంలో ఇటీవల 50కి పైగా ఇలాంటి రిటైల్ దోపిడి, షాప్ చోరి కేసులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. వారంతా తమను గుర్తుపట్టరన్న ధైర్యంతో చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు పోలీసులు బెల్లేవ్ నగరానికి వచ్చి ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే మరిన్ని కేసులు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
లేత దొంగ! సార్.. ఇదే మొదటి దొంగతనం!
ఖమ్మం అర్బన్: ఓ సినిమాలో ఆలీ లేత దొంగగా కనిపించి నవ్వించాడు. ఎప్పటికప్పుడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం అనుకుని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటాడు. సరిగ్గా ఇదే రీతిన ఖమ్మంలో ఓ యువకుడు చోరీ చేసి పట్టుబడ్డాడు. ఖమ్మం ఖానాపురం సెంటర్లోని తూము మోహన్రావు కిరాణం షాపు షట్టర్లను గతనెల 25న పగులగొట్టి సెల్ఫోన్, వెండిపట్టీలు, రూ.15 వేలు చోరీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణలో భాగంగా ఖమ్మం మంచికంటి నగర్కు చెందిన దేవెళ్ల మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్న అతను చోరీ చేసేందుకు గల కారణాలను వివరించాడు. తల్లిదండ్రులతో ఘర్షణ పడి వేరు కాపురం పెట్టానని, దీంతో అవసరమైన సరుకులు కొనుగోలు చేసేందుకు మొదటిసారి దొంగతనం చేశానని చెప్పాడు. చోరీ చేసిన నగదుతో గ్యాస్ సిలిండర్, వంటపాత్రలు కొనుగోలు చేసి సెల్ఫోన్, పట్టీలు ఇంట్లోనే ఉంచినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఆయా సరుకులను రికవరీ చేసిన ఖమ్మం అర్బన్ పోలీసులు మహేష్ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. (చదవండి: గద్వాలలో ‘డర్టీ పిక్చర్’!) -
దొంగకు చుక్కలు చూపించిన దేవుడు!.. సొత్తు తిరిగిచ్చి క్షమాపణ
భోపాల్: దేవుడి సొత్తును కాజేస్తే రక్తం కక్కుకుని చనిపోవటం, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారని చాలా సినిమాల్లో చూపించారు. కానీ, నిజ జీవితంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆభరణాలను దోచుకుంటున్నారు దొంగలు. అయితే, ఓ దొంగ ఆలయంలో చోరీ చేసిన సొత్తును తిరిగిచ్చేశాడు. దాంతో పాటు తాను తప్పు చేశానని, ఈ దొంగతనం వల్ల తాను చాల ఇబ్బందులు పడ్డానని, తనను క్షమించాలంటూ ఓ లేఖ సైతం రాయటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో జరిగింది. బాలాఘాట్లోని శాంతినాథ్ దిగంబర జైన దేవాలయంలో గుర్తు తెలియని దొంగ అక్టోబర్ 24న చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, దొంగ.. మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద ఉంచాడు. శుక్రవారం నీళ్ల కోసం వెళ్లినవారు సంచిని పరిశీలించగా.. అపహరణకు గురైన వస్తువులు, లేఖ కనిపించాయి. ప్రస్తుతం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘నేను చేసిన పనికి క్షమాపణ కోరుతున్నా. నేను తప్పు చేశా.. క్షమించండి. దొంగతనం చేశాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.’ అని లేఖలో పేర్కొన్నాడు దొంగ. పంచాయతీ వద్ద వదిలివెళ్లిన వస్తువులను స్వాధీనం చేసుకుని దొంగ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఎట్టకేలకు డ్రీమ్ గర్ల్తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం! -
దొంగలను ఎదిరించిన మహిళ.. కత్తులతో పొడిచినా..
సాక్షి, విశాఖపట్నం: చీమలాపల్లిలోని ఓ ఇంట్లో దొంగతనానికి దొంగలు స్కెచ్ వేశారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటి సమయంలో ఆ ఇంటి కిటికీ స్రూ్కలు విప్పి.. మెస్ తొలగించి లోపలికి ప్రవేశించారు. దొంగతనానికి ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకున్న వివాహితను కత్తితో పొడిచారు. ఓ వైపు రక్తం కారుతున్నా.. ఆమె వారిని ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. జీవీఎంసీ 95వ వార్డు పరిధి చీమలాపల్లిలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. చీమలాపల్లిలో ఆళ్ల అప్పారావు, లలితకుమారి దంపతులు పెద్ద కుమారుడు వినయ్కుమార్, చిన్నకుమారుడు అవినాష్ కుమార్, కోడలు లావణ్య(అవినాష్ భార్య)తో కలిసి సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. అవినాష్ నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను నైట్ డ్యూటీకి వెళ్లాడు. ఇంట్లో ఓ గదిలో లావణ్య(25) నిద్రిస్తుండగా.. మరో గదిలో అప్పారావు, లలితకుమారి, వినయ్కుమార్ పడుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఇంటి హాలులోని కిటికీ గ్రిల్ స్రూ్క లు విప్పి, మెస్ కట్ చేసి.. కిటికీ తలుపు గడియ విరగొట్టి.. ఇద్దరు దొంగలు లోపలికి చొరబడ్డారు. అప్పారావు, లలితకుమారి, వినయ్కుమార్ పడుకుని ఉన్న గది తలుపునకు బయట గడియపెట్టారు. లావణ్య పడుకుని ఉన్న గది తలుపును గట్టిగా తన్నడంతో బోల్టు ఊడి.. తలుపు తెరుచుకుంది. దీంతో వారు లోపలకి ప్రవేశించారు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన లావణ్య తేరుకునే లోపే గదిలో ఉన్న బీరువాను తెరిచేందుకు యత్నించారు. ఈ క్రమంలో లావణ్య వారిని గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. ఆమె అరుపులకు ఏం జరిగిందో అని పక్క గదిలో ఉన్న అప్పారావు, లలితకుమారి, వినయ్కుమార్ నిద్రలేచారు. బయటకు వద్దామని ప్రయత్నిస్తే గది బయట గడియవేసి ఉండటంతో వాళ్లు రాలేని పరిస్థితి నెలకుంది. ఆ సమయంలో తన గది నుంచి ఇంటి హాలు వరకు ఇద్దరు దొంగలను లావణ్య ప్రతిఘటిస్తూనే ఉంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా పెద్దగా కేకలు వేయడంతో దొంగలు తప్పించుకునేందుకు లావణ్యను పొట్ట భాగం, కాళ్లపైన కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కారుతున్న రక్తంతోనే లావణ్య.. అత్తమామలు, బావ నిద్రిస్తున్న తలుపు గడియ తీసింది. వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్రైం డీసీపీ నాగన్న, ఏడీసీపీ దుర్గాప్రసాద్, గంగాధర్, ఏసీపీ పెంటారావు, క్రైమ్ సీఐ దుర్గాప్రసాద్, పెందుర్తి లా అండ్ సీఐ నాగేశ్వరరావు తదితరులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఇంటి పరిసర ప్రాంతాలు, సమీపంలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టింది. కాగా.. మొత్తం నలుగురు దుండగులు దొంగతనానికి వచ్చి.. ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంటి ప్రహరీ దూకి వీరంతా వచ్చినట్టు భావిస్తున్నారు. అప్పారావు ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బయట ఆరేసున్న దుస్తులను ముక్కలుగా చేసి ముఖానికి కట్టుకుని లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వాటిని దొంగలు ఇంటి బయట కుర్చీలో వదిలేసి వెళ్లారు. డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలనలో ప్రహరీ బయట ఒక టార్చ్లైట్, డ్రింక్ బాటిల్ను గుర్తించారు. కాగా ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు.. పారిపోయేటప్పుడు ప్రధాన ద్వారం తాళం తీసుకుని వెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. దొంగతనానికి వచ్చిన వారు చెడ్డీగ్యాంగ్గా ప్రచారం జరుగుతోంది. -
432 ఖరీదైన సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగలు
-
విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్! కానీ...
చైన్స్నాచర్లు, పిక్ పాకెటర్స్ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్ పార్కింగ్ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్ డీన్గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు) -
Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్.. సోషల్ పోస్టులొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. ఎందుకంటే మీరు తిరిగొచ్చేసరికి మీ ఇల్లు గుల్లయ్యే ప్రమాదముంది.’ అంటూ పోలీసులు నగర పౌరులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల నేరస్తులు సైతం తెలివిమీరి సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఊరెళ్లిన వారి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. ► మీరు ఊరెళుతున్న విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ► ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని, వాటి డీవీఆర్లు బయటికి కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉంచాలి. ► సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ► బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకులో భద్రపర్చుకోండి. లేదా ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. ► ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలి. ► కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబరులో సమాచారం ఇవ్వాలి. -
షాకింగ్ ఘటన.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ను ఏ మార్చి..
ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): బ్యాంకులో నగదు జమ చేసేందుకు వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేరొకరికి సాయం చేస్తుండగా , ఆమెను ఏ మార్చి ఓ మహిళా దొంగ నగదు, సెల్ఫోన్ను అపహరించింది. అనంతరం మరో వ్యక్తితో కలిసి స్కూటీపై పారిపోయేందుకు యత్నించగా పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన ఆత్మకూరులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలి వివరాల మేరకు.. పంటవీధికి చెందిన అభిజ్ఞ సాఫ్ట్వేర్ ఇంజినీర్. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని ఓ ఏటీఎంలో రూ.28 వేలు నగదు డ్రా చేసుకుంది. అనంతరం ఇండియన్ బ్యాంకుకు జమచేసేందుకు వచ్చింది. చదవండి: అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ బ్యాంకులో ఓ వ్యక్తి నగదు డ్రా చేసుకునేందుకు ఓచర్ రాసి ఇవ్వాలని ఆమెను సాయం కోరగా, చేసేందుకు తన నగదు పర్సు, సెల్ఫోన్ పక్కన పెట్టింది. ఈ క్రమంలో చిన్నపాపను ఎత్తుకుని బ్యాంకులో తచ్చాడుతున్న ఓ మహిళ అదును చూసి పర్సు, సెల్ఫోన్ అపహరించుకుని పరిగెత్తింది. వెంటనే అప్రమత్తమైన అభిజ్ఞ దొంగ వెంట పరిగెత్తగా, అప్పటికే బ్యాంకు ఎదురుగా స్కూటీపై సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తితో కలిసి పరారైంది. కేకలు పెడుతూ వెనుకనే పరిగెత్తిన అభిజ్ఞ కొద్దిదూరంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఎం శివశంకర్రావును కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో బాధితురాలి సెల్ఫోన్ సంకేతాల ఆధారంగా వారు ఏ వైపునకు వెళ్లింది గుర్తించి ఏఎస్పేట మార్గంలో సిబ్బందితో కలిసి వెంబడించారు. ఏఎస్పేట పోలీసులకు సైతం సమాచారం ఇచ్చారు. ఏఎస్పేట శివారులోని వినాయకనగర్ వద్ద వేగంగా స్కూటీ వెళ్తున్న దొంగలు అదుపుతప్పి పడిపోయారు. ఏఎస్పేట పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకునేందుకు యత్నించగా మహిళ, ఆమెతో ఉన్న పాప చిక్కారు. బైక్ తోలుతున్న మరో వ్యక్తి తన చేతిలోని నగదును పర్సుతో సహా విసిరేసి పరారయ్యాడు. ఆత్మకూరు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడిన మహిళను విచారించారు. అక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును సేకరించగా రూ.26 వేలు లభించింది. బిడ్డతో సహా మహిళను ఆత్మకూరు స్టేషన్కు తరలించారు. దొంగలది ప్రాకం పరారైన వ్యక్తి మహిళ భర్తేనని సమాచారం. వారు పరారవుతూ పడిపోవడంతో వదిలి వెళ్లిన స్కూటీని ఆత్మకూరు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఫన్నీ వీడియో: దొంగలుగా పొరబడి.. ఒకరిపై ఒకరుపడి
-
సెల్ఫోన్ వాడడు.. సీసీ కెమెరాకు చిక్కడు.. శ్మశానంలోనే తిండి, నిద్ర..
సాక్షి, మచిలీపట్నం: అతని వయసు వయస్సు 28.. చేసిన దొంగతనాలు 127.. నమోదైన కేసులు 54.. ఎక్కకెళ్లినా ఒక్కడే వెళ్తాడు.. కనీసం సెల్ఫోన్ కూడా వాడడు.. పోలీసులకు ఏ ఒక్క క్లూ వదలడు.. సీసీ కెమెరాకూ దొరకడు.. చదువుకున్న వ్యక్తీ కాదు.. కానీ చాలా స్మార్ట్. శ్మశానాన్నే అడ్డాగా చేసుకుని తన పంథా కొనసాగిస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి.. ఆకతాయిగా కోడిపుంజును దొంగిలిండంతో తొలిసారి జైలు కెళ్లాడు.. ఆపై దొంగతనాన్నే వృత్తిగా మార్చుకుని.. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వరుస చోరీలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు చల్లపల్లి పోలీసులకు పట్టుపడ్డాడు. దీంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి: భార్యకు దూరంగా భర్త.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. లాడ్జిలో షాకింగ్ ఘటన.. ఇదీ నేపథ్యం.. ఈ దొంగ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన వాడు. పేరు తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య. వయస్సు 28. తన పదో ఏటే తండ్రి మరణించాడు. రెండేళ్ల తర్వాత అదే గ్రామంలో పందెం కోళ్లను ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది. తల్లిదండ్రులు లేక అనాథగా మారిన సూర్యని ఎ. కొండూరు మండలం మాధవవరంలో ఉన్న తన అమ్మమ్మ చేరదీసింది. చదువు మీద దృష్టి పెట్టని సూర్య దొంగతనమే మేలని భావించి.. ఆ దిశగానే అడుగులు వేశాడు. చోరీలు ఇలా.. మొదట కోళ్లను దొంగలించి జైలు పాలైన సూర్య.. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషించుకున్నాడు. అందులో భాగంగా చేతికి గ్లౌజ్లు ధరించడం మొదలు పెట్టాడు. ఇక సీసీ కెమెరాలకు దొరక్కుండా దొంగతనం ఎలా చేయాలనే దానిపై కూడా తనకుతానుగానే ఆలోచించుకుని.. ఎవరూ లేని నివాసాలే లక్ష్యంగా చోరీలు చేస్తుండేవాడు. అందుకోసం ముందుగా ఓ బైక్ను తస్కరించడం.. దానిపై వారం పాటు వీధుల్లో తిరిగి.. డబ్బులు, నగలు ఉన్న వారి నివాసాలను గుర్తించడం చేసేవాడు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవా? పరిశీలించేవాడు. ఆ తర్వాత కుటుంబీకులు తాళం వేసి ఎప్పుడు బయటకు వెళ్తారా? అని ఎదురుచూసేవాడు. కుటుంబీకులు బయటకు వెళ్లాక చేతికి గ్లౌజ్లు ధరించి నివాసాల్లోకి చొరబడేవాడు. ఒకవేళ అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ముందే పనిచెయ్యకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. అనంతరం నివాసంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, నగదును దొంగలించి సురక్షితంగా వెలుపలకు వచ్చేసేవాడు. ఇలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ దొంగతనాలపై 47 కేసులు నమోదయ్యాయి. గతనెల 17న ఖమ్మం జైలు నుంచి బయటకు వచ్చిన సూర్య, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజానగరం, కృష్ణా జిల్లా గుడివాడ, చల్లపల్లి దొంగతనాలు చేశాడు. దీంతో ఇతనిపై మొత్తం 54 కేసులు నమోదయ్యాయి. శ్మశానమే నివాసంగా.. దొంగతనం చేసిన ఆభరణాలు, నగదుతో ఎక్కడో ఓ చోట గదిలో ఉంటే పోలీసులకు దొరికిపోతానేమోనని సూర్య శ్మశానాన్ని ఎంచుకున్నాడు. ఎవరికీఅనుమానం రాని శ్మశానంలో వాటిని గొయ్యితీసి దాచిపెడతాడు. చిన్నతనం నుంచే రాటుదేలిన సూర్య ఎటువంటి భయాలు, పట్టింపులు లేకుండా అక్కడే నిద్రిస్తాడు. అంతకు ముందు మద్యం, భోజనం తెచ్చుకుని ఫుల్గా లాగించి పడుకుంటాడు. ఉదయం లేచి యథావిధిగా వీధుల్లో తిరగటం, సినిమాలకు వెళ్లటం చేస్తుంటాడు. బంధువులు ఉన్నా.. సూర్యకు బంధువులు ఉన్నా.. వారితో ఎటువంటి సత్సంబంధాలు నెరిపేవాడు కాడు. ఎప్పుడైనా అమ్మమ్మ వద్దకు వెళ్లి ఆమె ఖర్చులకు డబ్బులు ఇచ్చి వచ్చేసేవాడు. చివరగా కృష్ణా జిల్లా చల్లపల్లి సమీపంలోని చెక్పోస్టు వద్ద పోలీసులు చాకచక్యంగా సూర్యను పట్టుకుని అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 17లక్షలు విలువ చేసే బంగారు, రూ. 2లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు, బైక్ను స్వాధీనం చేసుకుని అతని దొంగతనాలకు చెక్పెట్టారు. -
కదులుతున్న రైలులో మొబైల్ చోరీకి యత్నం.. పాపం వాడి పనైపోయింది!
దొంగతనం.. చట్టరీత్యా నేరం అయినా నిత్యం ఈ పదం వింటూనే ఉన్నాం. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇల్లు గుల్ల అవ్వాల్సిందే. ఒక ఇంట్లోని వస్తువులేనా.. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు, విలువైన వస్తువులు సైతం కొట్టేస్తుంటారు. ఇక రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14న బిహార్లో చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్పూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. అప్పటికే రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’ Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi — Kumar Saurabh Singh Rathore (@JournoKSSR) September 15, 2022 -
తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు.. ఘరానా దొంగ రమేష్ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ, పలుమార్లు జైలుకెళ్లినా బుద్ది మార్చుకోని మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు రమేష్ రాచకొండ పోలీసులకు చిక్కాడు. గతేడాది డిసెంబర్లో ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఓ కారును చోరీ చేసిన ఇతడిపై ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు నిఘా పెట్టారు. శనివారం తెల్లవారు జామున ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రమేష్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ యాదగిరితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. ► సూర్యాపేట జిల్లా, చివేముల మండలం, మూ న్యా నాయక్ తండాకు చెందిన ధారావత్ రమేష్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. జనసంచారం లేని చోట పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రాత్రి వేళల్లో వాటిపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. ► ప్రస్తుతం రమేష్పై రాచకొండ పోలీసు కమిషనరేట్లో 10 కేసులు, సూర్యాపేటలో 5, నల్లగొండలో 3, విశాఖపట్నంలో 2, కొత్తగూడెం, విజయవాడలో ఒక్కో కేసు న్నాయి. సూర్యాపేట టు టౌన్ పోలీసు స్టేషన్లో నమోదైన 15 కేసుల్లో రమేష్ పరారీలో ఉన్నాడు. మోత్కూరు ఠాణాలో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) కూడా జారీ అయింది. 2017లో నాగార్జునసాగర్ పోలీసులు రమేష్ను దోపిడీతో పాటు హత్యాయత్నం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. చివరిసారిగా 2019లో ఖమ్మంలోని రఘునాథపాలెం పోలీసులు ఇతడిని వాహనం చోరీ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2021 సెప్టెంబర్లో కరోనా కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా ప్రవృత్తి మార్చుకోలేదు. ► గతేడాది డిసెంబర్ 22న ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని సూర్యోదయ నగర్ కాలనీలోని శ్రీదుర్గా కార్స్ ఆఫీసులో చొరబడి టేబుల్పైన ఉన్న కారు తాళాలను తీసుకుని స్కోడా కారును దొంగిలించాడు. ఈ కేసులో రమేష్పై ఎల్బీనగర్ సీసీఎస్, ఎల్బీనగర్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో తిరుగుతున్న అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.35.55 లక్షల విలువ చేసే 10 తులాల బంగారం ఆభరణాలు, 2 కార్లు, 2 బైక్లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన పోలీసులు -
పోలీసులకు చిక్కకుండా గర్ల్ఫ్రెండ్ టెడ్డీబేర్లో దాక్కున్న దొంగ.. చివరికి
కొత్తగా ఏదైనా షాప్ ఓపెన్ అయినప్పుడు.. కార్టూన్ క్యారెక్టర్స్ వేషంలో ప్రమోషన్స్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ.. టెడ్డీబేర్ను మరీ కొత్తగా వాడాడు మాంచెస్టర్కు చెందిన ఓ యువకుడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి టెడ్డీబేర్లో దాక్కున్నాడు. అసలేం దొంగతనం చేశాడు? అలా ఎలా దాక్కున్నాడంటే? 18 ఏళ్ల జాషువా డాబ్సన్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల ఓ కారును దొంగిలించాడు. దాంట్లో ఫ్యూయల్ పోసుకుని బంక్లో డబ్బులు కట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో అతనిమీద మరో రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు తనకోసం వెతుకుతుండటంతో భయపడ్డ డాబ్సన్ దాక్కోవడానికి గర్ల్ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదు అడుగుల టెడ్డీబేర్ను కట్చేసి, అందులో కొంత స్టఫ్ తీసేసి, మనోడు అందులో కూర్చున్నాడు. పోలీసులు చివరకు డాబ్సన్ గర్ల్ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెదకడం మొదలుపెట్టారు. టెడ్డీబేర్ శ్వాస తీసుకుంటున్న చప్పుడు రావడంతో అనుమానం వచ్చి దాన్ని కట్ చేసి చూశారు. ఇంకేముంది... అందులోంచి డాబ్సన్ బయటికొచ్చాడు. కార్ల దొంగతనంతోపాటు, అతనిపై రెండుమూడు పెటీ కేసులు కూడా ఉండటంతో డాబ్సన్కు కోర్టు తొమ్మిదినెలల జైలు శిక్ష విధించింది. అలాగే డ్రైవింగ్ చేయకుండా అతనిపై 27 నెలలపాటు నిషేధించింది. మాంచెస్టర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వార్త వైరల్ అవుతూ నెటిజన్స్కు నవ్వులు పంచుతోంది. ‘సూపర్ క్రియేటివిటీ’, ‘పా పెట్రోల్’, ‘‘అన్ ‘బేర’బుల్’’, ‘టెడ్డీబేర్ను ఇలా కూడా వాడుకోవచ్చా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: ఇదేం పెళ్లి.. భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చి -
దొంగను పట్టించిన దోమ!
వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమేనండోయ్! ఇంతకీ విషయం ఏమిటంటే.. తూర్పు చైనాలోని ఫూజియాన్ ప్రావిన్సులో ఉన్న ఫుజోలో ఓ దొంగ ఇటీవల ఓ అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఖాళీగా ఉన్న ఇంటిని ఎంచుకొని బాల్కనీ మీదుగా లోపలికి ప్రవేశించాడు. అప్పటికే బాగా ఆకలితో ఉండటంతో ముందుగా వంటింట్లోకి వెళ్లాడు. కోడిగుడ్లు, న్యూడుల్స్ కనబడటంతో ఎగ్ న్యూడుల్స్ చేసుకొని లాగించేశాడు. ఆ తర్వాత కాసేపు కునుకుతీద్దామని మంచంపై వాలాడు. కానీ ఇల్లంతా దోమలమయం కావడంతో అల్మరాలోంచి ఓ దుప్పటి తీసి కప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న ఓ మస్కిటో కాయిల్ వెలిగించాడు. అయినా కూడా దోమలు కుడుతుండటంతో కొన్నింటిని టపీటపీమంటూ చంపేశాడు. తెల్లవారుజాము దాకా ఇంట్లోనే ఉండి అందినకాడికి దోచుకెళ్లాడు. దొంగతనం ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు ఇంటినంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ దోమ గోడపై రక్తపు మరకలతో అతుక్కుపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. దీని ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో ఆ రక్త నమూనాను ఫోర్సెన్సిక్ ల్యాబ్కు పంపారు. డీఎన్ఏ విశ్లేషణలో దోమలోని ఆ రక్తం చాయ్ అనే పాత నేరస్తుడితో సరిపోలడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో నిజం ఒప్పుకున్న అతను ఆ ప్రాంతంలో మరో మూడు దొంగతనాలు కూడా చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. -
మనోడి రూటే సెపరేటు.. దొంగతనానికి వెళ్లే ముందు అది కంపల్సరీ!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): చోరీ చేస్తూ దొంగ పట్టుబడిన ఘటన నెలమంగల తాలూకా త్యాగదహళ్లిలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ సభ్యుడు రామచంద్ర కుటుంబంతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. గురువారం రాత్రి తిరిగి వచ్చారు. తాళం పగలగొట్టిన దృశ్యం చూసి ఇంట్లో దొంగ ఉన్నాడని పసిగట్టి గొళ్లెం పెట్టేశాడు. స్థానికులను పిలిచి తలుపులు తెరిచి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని శివమొగ్గకు చెందిన సురేశ్గా గుర్తించారు. రామచంద్ర కొత్త ఇల్లు నిర్మిస్తున్నాడని, ఇంట్లో క్యాష్ ఉంటుందని గ్రామానికి చెందిన బాలాపరాధి ఇచ్చిన సమాచారంతో దొంగతనానికి వచ్చినట్లు నిందితుడు సురేష్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. వెనుక ఇంటిలో అరుస్తున్న కుక్కను రాడ్తో చంపేసి చోరీకి ఉపక్రమించినట్లు వెల్లడించాడు. నిందితుడి నుంచి రూ.లక్ష నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. సురేశ్పై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 9కి పైగా చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఎక్కడ చోరీ చేయాలనుకున్నా దగ్గరలో ఉన్న ఆలయంలో దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉందని, ఆ తర్వాతే దొంగతనానికి వెళ్తునాని సురేష్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విషాదం.. మజాక్ల చేసిన పనితో దోస్త్ ప్రాణం పోయింది -
టులెట్ బోర్డు.. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండడంతో..
తుమకూరు(బెంగళూరు): ఇల్లు అద్దెకు ఇస్తామని టులెట్ బోర్డు పెట్టగా దొంగలు వచ్చి ఓ మహిళను బంధించి కాళ్లు, చేతులు కట్టేసి బంగారు గొలుసు దోచుకెళ్లారు. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని రింగ్ రోడ్డు వద్ద దుర్గప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఒక ఫోర్షన్ ఖాళీగా ఉండటంతో టులెట్ బోర్డు పెట్టాడు. వారం రోజుల క్రితం ఓ జంటతో సహా ఐదుగురు వ్యక్తులు వచ్చి ఇల్లు చూసి అడ్వాన్స్ ఇచ్చారు. మరోసారి ఇల్లు చూసే నెపంతో వచ్చి దుర్గప్ప భార్యను కాళ్లు, చేతులు కట్టేసి 70 గ్రాముల బంగారు గొలుసును దోచుకుని పరారీ అయ్యారు. బాధితులు జయనగర పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టి రెండు రోజుల క్రితం ప్రమోద్, అతని భార్య హేమలత, రమేష్, సౌజన్య, తీర్థేశ్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. చదవండి: Hyderabad: భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
రూ.50 నోట్లు కోసం ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకుని లబోదిబోమన్నారు!
మైసూరు(బెంగళూరు): రోడ్డుపై రూ.50 నోట్లను విసిరేసిన దుండగులు ఓ వ్యక్తి దృష్టిని మళ్లించి రూ.1.5 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన మైసూరు జిల్లా టీ నరసీపురలో జరిగింది. మైసూరు నజర్బాద్ నివాసి అబ్దుల్ ఖాదర్ టీ.నరసీపురలోని ఎన్కేఎఫ్ పబ్లిక్ పాఠశాలలో పనులు చేస్తున్నాడు. పనుల నిమిత్తం ఇచ్చిన చెక్ను కెనరా బ్యాంక్లో వేసి డబ్బులు డ్రా చేసుకుని బైక్పై పాఠశాలకు బయల్దేరాడు. ఆ సమయంలో వర్షం రావడంతో బ్రిడ్జి వద్ద బైక్ నిలిపి డిక్కీ తెరిచి అందులోని జర్కీన్ వేసుకుంటున్నాడు. ఈ సమయంలో అతన్ని వెంబడిస్తూ వచ్చిన దుండగులు రోడ్డుపై రూ.50 నోట్లను విసిరేసి ఆ డబ్బు మీదేనేమో చూడండి అంటూ దృష్టి మరల్చారు. ఖాదర్ కిందకి వంగి నోట్లు తీసుకుంటుండగా దుండగులు డిక్కీలోని రూ.1.5 లక్షల నగదు దోచుకెళ్లారు. క్షణాల్లో నగదు మాయం కావడంతో కంగుతున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: Hyderabad: భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
బీకాం చదువు.. యూట్యూబ్ వీడియోలు చూసి.. రోడ్డుపై..
బొమ్మనహళ్లి(బెంగళూరు): బీకాం పట్టభద్రుడు జైల్లో సహచరుడు, యూట్యూబ్ ద్వారా కార్ల దొంగతనాల్లో మెళకువలు తెలుసుకున్నాడు. కారు అలారం మోగకుండా పని ముగించేవాడు. ఖరీదైన కారు కనిపిస్తే మాయం చేసి అమ్ముకుని జల్సాలు చేసేవాడు. ఈ కార్ల దొంగ బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసుకు పట్టుబడ్డాడు. అతని నుంచి సుమారు రూ. 70 లక్షల విలువ చేసే 10 కార్లు, ఒక బైక్ను, చోరీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వరుస ఫిర్యాదులు రావడంతో ఆ దొంగ అరుణ్కుమార్ (32). ఇతడు పుట్టిపెరిగింది చిత్తూరు జిల్లాలోని పలమనేరు. బీకాం వరకు చదువుకుని నేరాల బాట పట్టాడు. ములబాగిలుకు వచ్చి అక్కడ అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఇటీవల పార్కింగ్ చేసి ఉన్న కార్లు చోరీ అవుతున్నట్లు యజమానులు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో పోలీసులు ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున హెచ్ఎస్ఆర్ లేఔట్ 5వ సెక్టర్లో ఉన్న టీచర్స్ కాలనీలో కారు చోరీ చేసి వేసుకెళ్తున్న దొంగ అరుణ్ను పట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ టూల్స్ సాయంతో అతన్ని విచారించగా నేర చరిత్ర బయటపడింది. ఇతనిపైన దోపిడీ, హత్య కేసులు ఉండటంతో కొన్ని రోజులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నాడు. అక్కడ జైల్లో పరిచయమైన కార్ల దొంగ రాకేష్ ద్వారా కార్లను సులభంగా ఎలా ఎత్తుకెళ్లవచ్చో తెలుసుకున్నాడు. అలాగే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు. కొన్ని ఎలక్ట్రానిక్ టూల్స్ సహాయంతో కారు అలారం మోగకుండా లాక్ తీసేవాడు. ఆ కార్లను తమిళనాడులోని తిరుచ్చి, తిరువన్నామలై, వేలూరు, తిరుపత్తూరు తదితర ప్రాంతాల్లో అమ్మేవాడు. ఆగ్నేయ డీసీపీ సి.కే.బాబు, ఏసీపీ సుధీర్, ఎస్ఐ మునిరెడ్డి ఈ కేసును విచారించారు. చదవండి: వాట్సప్లో పరిచయం ఆపై చనువు.. అప్పటి నుంచి అసలు కథ మొదలైంది! -
దారి తప్పడంతో.. దొంగ అనుకుని బ్యాంక్ ఉద్యోగిని కొట్టి చంపాడు
బనశంకరి(బెంగళూరు): ఎక్కడో చత్తీస్ఘడ్ నుంచి వచ్చాడు. ఇక్కడి భాష తెలియదు, ఊరు తెలియదు, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు బ్యాంకు ఉద్యోగిని రాడ్తో కొట్టి చంపాడు. ఈ సంఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మారతహళ్లి వద్ద వంశీ సిటాడెల్ అపార్టుమెంట్ వద్దకు ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెళ్లాడు. సెక్యూరిటీగార్డు శ్యామనాథ్ అతన్ని ఎవరని ఎన్నిసార్లు అడిగినా జవాబివ్వలేదు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో సెక్యూరిటిగార్డు రాడ్తో అతడి తలపై దాడిచేశాడు. తలకు తీవ్రగాయం కావడంతో వ్యక్తి అక్కడే మృతిచెందారు. హతుడు చత్తీస్ఘడ్ చెందిన బ్యాంకు ఉద్యోగి కాగా శిక్షణ తీసుకోవడానికి బెంగళూరుకు వచ్చినట్లు తెలిసింది. స్నేహితులతో విందులో పాల్గొని ఒక్కడే స్నేహితుడి రూమ్ కు నడుచుకుని బయలుదేరాడు. మొబైల్లో అడ్రస్ అడుగుతూ వస్తుండగా అది బ్యాటరీ అయిపోయి స్విచాఫ్ అయ్యింది. దీంతో దారి తప్పి వేరే అపార్టుమెంట్ వద్దకు వెళ్లాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు దాడి చేసినట్లు తెలిసింది. హెచ్ఏఎల్ పోలీసులు పరారీలో ఉన్న శ్యామ్నాథ్ను ను ఆదివారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: 11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్ మిస్టరీ! -
వందేమాతరం అంటూ భవనం పై నుంచి దూకేసిన దొంగ.. షాక్లో పోలీసులు
ఇటీవలకాలంలో దొంగలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన వాటిని దొంగలించి ప్రజలను, పోలీసులను షాక్కి గురి చేస్తున్నారు. సినిమాలోని డాన్లు మాదిరి దొంగతనం చేసి తప్పించుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. ఐతే సమయానికి పోలీసులు వచ్చేయడంతో...ఆ వ్యక్తి అరెస్టు అవుతానన్న భయంతో ఏం చేశాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే....ముంబైలో కొలాబా ప్రాంతంలోని చర్చ్గేట్ సమీపంలోని ఒక భవనంలోకి 25 ఏళ్ల వ్యక్తి ప్రవేశించాడు. ఆ భవనం వాచ్మెన్ ఒక అపరిచిత వ్యక్తి గేటు పై నుంచి దూకి భవనంలోకి ప్రవేశించనట్లు గమనించాడు. దీంతో అతను ఎమర్జెన్సీ అలారం మోగించాడు. ఆ అలారం మోగడంతో భవనంలోని నివాసితులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో పోలీసులు కూడా సంఘటన స్థలానికి సమయానికి చేరుకున్నారు. దీంతో సదరు వ్యక్తి అరెస్టు అవుతానన్న భయంతో ఆ భవనం పైన నాల్గో అంతస్తులోని కిటికి అంచునే నిలబడిపోయాడు. అతన్ని కిందకి వచ్చేయమని పోలీసులు, నివాసితులు చెప్పిన అతను వినలేదు. ఆఖరికి అతన్ని అరెస్టు చేయమని పోలీసులు హామీ ఇచ్చిన అతన కన్విన్స్ అవ్వలేదు. ఇక చేసేదేమీ లేక పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించారు. వారు అతన్ని ప్లాస్టిక్ వలపైకి దూకేయమని కోరారు కూడా. దాదాపు మూడు గంటలపాటు అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంతలో ఒక పోలీసు సేఫ్టి బెల్ట్ సాయంతో దొంగ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతే సదరు దొంగ వందేమాతరం అంటూ అరుస్తూ... నాల్గో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, నివాసితులు షాక్ అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారందర్నీ కలచి వేసింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సదరు వ్యక్తిని రోహిత్గా గుర్తించమని పోలీసులు చెప్పారు. ఐతే అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో అతని గురించి పూర్తి విషయాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. (చదవండి: తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి) -
దొరికిన దొంగ.. పట్టించుకోని పోలీసులు.. చివరికి గ్రామస్తులు ఏం చేసారంటే!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): తామే దొంగను పట్టుకుని అరెస్టు చేసుకోండని సమాచారమిచ్చినా దేవనహళ్లి తాలూకా విశ్వనాథపుర, విజయపుర పోలీసులు స్పందించలేదని ప్రజలు ఆరోపించారు. దేవనహళ్లి తాలూకా ఎంబ్రళ్లి గ్రామంలో అర్ధరాత్రి పొలాల్లో జొరబడ్డ ఒక దొంగ కరెంటు వైర్లను చోరీ చేస్తుండగా రైతులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు ఫోన్ చేసి దొంగను పట్టుకుపోవాలని కోరగా విజయపుర, విశ్వనాథపుర పోలీస్స్టేషన్ల పోలీసులు ఆ గ్రామం తమ పరిధిలోకి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తామే దొంగను బైక్పై తీసికెళ్లి పోలీసులకు అప్పగించామని తెలిపారు. చదవండి: ఎలుక తెచ్చిన తంటా.. ఐదు లక్షల పరిహారం.. -
ఏటీఎం అనుకుని ఎంత పని చేశారు.. చూసుకోవాలి కదా !
మైసూరు: లక్షల్లో డబ్బులు ఉన్న ఏటీఎం యంత్రం అనుకుని దొంగలు పాస్బుక్ను ప్రింట్ చేసే యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఈ తికమక సంఘటన మైసూరు నగరంలోని లష్కర్ మహల్లాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో చోటు చేసుకుంది. దొంగలు చోరీ చేసే హడావుడిలో ఏటీఎం యంత్రం అనుకుని పాస్బుక్ ప్రింటింగ్ యంత్రాన్ని పెకలించుకుని తీసుకెళ్లారు. సిబ్బంది ఏటీఎంను రెండురోజుల పాటు మూసి ఉంచారు. గురువారం ఉదయం తెరిచి చూసిన సెక్యూరిటీ గార్డు ఆ యంత్రం లేకపోవడం చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కాగా, మండ్య, మైసూరు ప్రాంతాల్లో తరచూ ఏటీఎంలను దొంగలు ఎత్తుకెళ్లడం గమనార్హం. చదవండి: Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.! -
రాత్రి నలుగురు యువకులు మాస్కులు ధరించి.. ఇంట్లోకి వెళ్లి..
తిరువొత్తియూరు(చెన్నై): తిరుపూర్లో ఫైనాన్స్ సంస్థ యజమానిని కట్టివేసి రూ.50 లక్షలు నగలు, నగదు చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరుపూర్ పుస్పా రౌండ్ టానా రాయపండ్రా వీధికి చెందిన సంగమేశ్వరన్ (63) ఫైనాన్స్ సంస్థ నడుపుతున్నాడు. అతని భార్య రాజేశ్వరి (57). ఆదివారం రాత్రి 25 ఏళ్ల వయసున్న నలుగురు యువకులు మాస్కులు ధరించి సంగమేశ్వరన్ ఇంటిలోకి చొరబడ్డారు. కత్తులు చూపించి నోటిలో గుడ్డలు కుక్కి వారిని తాడుతో కట్టి వేశారు. తర్వాత ఇంట్లో ఉన్న నగలు నగదును మూటగట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీ చేయగా బీరువాలో ఉన్న 40 సవర్ల నగలు, రూ.30 లక్షల నగదు చోరీ చేసినట్టు తేలింది. వీటి విలువ రూ. 50 లక్షలు చేస్తుందని సంగమేశ్వరన్ తెలిపారు. -
పోలీసులకు చిక్కిన హుండీల దొంగ
అచ్యుతాపురం(అనకాపల్లి): చిన్న చిన్న ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడే ఘరానా దొంగ అచ్యుతాపురం పోలీసులకు గురువారం చిక్కాడు. ఎస్ఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా సంచరిస్తున్న అప్పలరాజును పోలీసులు విచారించి అసలు విషయాన్ని రాబట్టారు. విశాఖ జ్ఞానపురానికి చెందిన అప్పలరాజుపై అనేక కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న అచ్యుతాపురం మండలంలోని ఉప్పవరం ఆంజనేయస్వామి ఆలయంలో రూ.9వేలు, ఫిబ్రవరి 23న మునగపాక మండలం టి.సిరసపల్లి వీరభద్రస్వామి ఆలయంలో రూ.6వేలు, మే 21న పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3వేలు, మే 25న సబ్బవరం మండలం జోడుగుళ్లు ప్రాంతంలో బంగారమ్మతల్లి ఆలయంలో చోరీకి ప్రయత్నించినట్టుగా పోలీసులు విచారణలో రాబట్టారు. అప్పలరాజు రాత్రి వేళల్లో మద్యం సేవించి చిన్న ఆలయాల్లో హుండీలు లక్ష్యంగా చోరీలకు పాల్పడతాడని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇతనిపై విశాఖనగరంలో 20 కేసులు ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. నాపై తప్పుడు కేసు... విచారణ చేయండి’ మాకవరపాలెం : తనపై నమోదైన తప్పుడు కేసుపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కొత్తపాలెం గ్రామానికి చెందిన యాకా లోవరాజు పోలీసులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశాడు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడంటూ లోవరాజుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం లోవరాజు విలేకరులతో మాట్లాడాడు. తహసీల్దార్ సంతకాన్ని తాను ఫోర్జరీ చేయలేదని తెలిపాడు. నిర్వాసిత కాలనీలో పట్టా కోసం అధికారులను కోరగా అప్పట్లో పనిచేసిన వీఆర్వో రూ.80వేలు అవుతుందని చెప్పడంతో మొదట రూ.10 వేలు ఇచ్చానన్నాడు. అనంతరం రూ.70వేలు సిద్ధం చేసుకోవాలని చెప్పగా నగదు పట్టుకుని వెళ్లానన్నాడు. వీఆర్వో తహసీల్దార్ ఇంటికి తీసుకెళ్లి నగదు తీసుకుని పట్టా ఇచ్చినట్టు తెలిపాడు. తీరా ఇప్పుడు ఈ పట్టా నకిలీదని, తానే సృష్టించానని తహసీల్దార్ తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు. ఈ విషయమై తహసీల్దార్ రాణీ అమ్మాజీని వివరణ కోరగా నగదు తీసుకున్నట్టు చెబుతున్న వీఆర్వో కన్నయ్య మరణించాడని, పట్టా తాను ఇవ్వలేదన్నారు. అది నకిలీ పట్టా కావడంతోనే ఫోర్జరీ సంతకంపై కేసు పెట్టినట్టు తెలిపారు. (చదవండి: హుండీలను కొల్లగొట్టే ముఠా అరెస్ట్) -
హుండీలను కొల్లగొట్టే ముఠా అరెస్ట్
కడప అర్బన్: జిల్లాలోని పలు దేవాలయాల్లోకి రాత్రివేళ అక్రమంగా ప్రవేశించి హుండీలను పగులగొట్టి డబ్బులను దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి తెలిపారు. బుధవారం కడప డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగల ముఠా వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఆరుగురు సభ్యులున్న ఈ ముఠాలో ఐదుగురు బాలనేరస్థులు ఉన్నారు. వీరు పలు హుండీలలో దొంగిలించిన రూ. 56 వేలల్లో రూ.14,510 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి డబ్బులను దొంగిలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు స్పెషల్ క్రైమ్టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. కడప నగరం గౌస్నగర్కు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ సలీం(26)తో పాటు ఐదుగురు బాలనేరస్తులు ఉన్నారన్నారు. దొంగతనం చేయాలనుకునే ప్రాంతాలకు బాడుగ ఆటోలలో వెళ్లి దేవాలయాలకు వేసిన తాళాలను ఆయుధాల సహాయంతో పగులగొట్టి అందులో ఉన్న హుండీలను పగులగొట్టి డబ్బులు చోరీ చేసి తమ చెడు అలవాట్లకు ఆ డబ్బును ఉపయోగించుకుంటున్నారన్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కడప, కాశినాయన, సిద్దవటం మండలాల్లోని 10 ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి డబ్బులు దొంగతనం చేశారన్నారు. ఈ దొంగతనాలకు సంబంధించి ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం పోలీసులకు రాబడిన సమాచారం మేరకు రిమ్స్ సీఐ యు. సదాశివయ్య, ఎస్ఐ జె. మోహన్కుమార్ గౌడ్తో పాటు సిబ్బంది నగరంలోని చలమారెడ్డి పల్లె సర్కిల్ దగ్గర వోల్వో కంపెనీ బిల్డింగ్ పక్కన కంపచెట్ల వద్ద ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి వివిధ ఆలయాల్లోని హుండీల్లో దొంగిలించిన నగదు, ఆలయ తాళాలు, హుండీలను పగులగొట్టేందుకు వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అందరూ మద్యం సేవించడం, ఇతర చెడు అలవాట్లు కలిగి, ఎలాంటి పనులు చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటారన్నారు. ఐదుగురు బాలనేరస్థులను ప్రభుత్వ బాలుర గృహానికి తరలిస్తామన్నారు. దొంగలను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్ఐతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఇల్లంతా దోచేసి.. ఇంటి యాజమానికి ప్రేమలేఖ..
Robbery in Goa: ఇటీవల దొంగలు చేస్తున్న పనులు చాలా కామెడీగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఒక దొంగ ఒక కిరాణాషాపుకి వచ్చి దొచుకెళ్దాం అనుకుంటే అక్కడ ఏమిలేక పోయేసరికి ఆవేదనతో ఆ షాపు ఓనర్కి ఒక లెటర్ రాసి వెళ్లిపోయాడు. మరో రాష్ట్రంలో ఏకంగా ఇరిగేషన్ అధికారులమని చెప్పి మరీ ఏకంగా బ్రిడ్జ్నే ఎత్తుకుపోయారు. అలానే ఇక్కడొక దొంగ ఇల్లంతా దోచేసి చివర్లో యజమానికి ప్రేమలేఖ రాశాడు. వివరాల్లోకెళ్తే... గోవాకి చెందిన ఒక కుటుంబం రెండు రోజుల పాటు విహారయాత్రకు వెళ్లి ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చింది. తీరా ఇంటికి వచ్చేటప్పటికీ కాస్త అనుమానస్సదంగా అనిపించింది. అయినా అదేం పట్టించుకోకుండా వాళ్లు ఇంట్లోకి వెళ్లిపోయారు. అంతే ఇంట్లోకి ఎంటరవ్వగానే టీవీ స్క్రీన్పై ఐ లవ్ యూ అనే సందేశం కనిపించింది. దీంతో వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి ఇలా ఉందని వెంటనే అనుమానంతో గదులన్ని తనీఖీ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు గానీ వాళ్లకు అసలు విషయం అవగతమవ్వలేదు. ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులన్నీ ఎత్తుకుపోయారని, ఇందంతా వారి పనేనని గుర్తించారు. దీంతో ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ దొంగలు బాత్రూం కిటికీ గ్రిల్స్ పగలు గొట్టి ఇంట్లోకి చొరబడి సుమారు రూ.21 లక్షల విలువ చేసే నగలు, కొంత నగదు తీసుకుని పారిపోయారని పోలీసులు వెల్లడించారు. -
వరుస చోరీలు.. జనం బెంబేలు
లక్కిరెడ్డిపల్లె : లక్కిరెడ్డిపల్లెలో గత ఆరు నెలల నుంచి వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అర్థరాత్రి 1 గంట సమయంలో రాజ్ మెడికల్ షాపులో రూ.3వేలు, సెల్పాయింట్లో ఫోన్లకు సంబంధించిన సామగ్రి దొంగిలించినట్లు బాధితులు ఫరీద్ బాబా, కరీం ఆదివారం తెలిపారు. రాజ్ మెడికల్ షాప్లో సీసీ కెమెరాలు అమర్చినా దొంగలు తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి తమ వద్ద ఉన్న సెల్ లైటింగ్తో డబ్బులు తీసుకొని బయటికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ మేరకు బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా గత ఏడాది నవంబర్లో దర్బార్బాషా మెడికల్ షాపులో రూ.1.73లక్షలు నగదు దొంగలు అపహరించుకుపోయారు. తరువాత రెండోసారి జనవరిలో రూ.16వేలు అపహరించారని దర్బార్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనల్లో ఇంతవరకు దొంగల ఆచూకీ లేదు. ఇంతలోనే శనివారం అర్థరాత్రి మరో మారు దొంగలు లక్కిరెడ్డిపల్లె–రామాపురం రోడ్డులో ఉన్న మెడికల్ షాపు, సెల్పాయింట్లో చోరీకి పాల్పడటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు దొంగతనం కేసులను ఛేదించాలని ప్రజలు కోరుతున్నారు. మంగంపేట పునరావాసకాలనీలో.. ఓబులవారిపల్లె : మంగంపేట పునరావాస కాలనీలో శనివారం రాత్రి గౌనూతల శ్రీనవాసులు ఇంట్లో చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తన కుమార్తె అనారోగ్యం కారణంగా శనివారం బాధితుడు కడపకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులకొట్టి బంగారు నగలు, వెండి దొంగిలించారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఇంటిలోనే వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. శ్రీనివాసులు, ఆయన భార్య సుబ్బరత్నలు పరిశీలించగా రూ. 45 వేలు నగదు, విలువైన బంగారం చోరి అయినట్లు గుర్తించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. -
‘పెళ్లి కార్డులు ఇవ్వాలి.. తలుపు తీయండి’... అలా తెరిచారో లేదో.. !
రాయగడ(భువనేశ్వర్): ‘పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చాం.. తలుపు తీయండి’ అని పిలవడంతో బయటకు వచ్చిన వారిని దుండగులు బంధించి, దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానిక బుదరావలసలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. బుదరావలసలో నివాసముంటున్న జగన్నాథ మహంతి అనే వ్యక్తి ఇంటికి ఐదుగురు వెళ్లి తలుపులు తట్టారు. మీ దుకాణానికి వెళ్తే.. మూసివేసి ఉందని, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని పిలవడంతో జగన్నాథ భార్య జ్యోతి తలుపులు తెరిచారు. అంతా లోపలికి వచ్చి, ఎండతో వచ్చాం.. తాగేందుకు నీళ్లు ఇవ్వండని అనడంతో ఆమె వంటగది వైపు వెళ్లగా ఆమె వెనకాల వెళ్లిన దుండగులు.. కత్తితో బెదిరించారు. అదే సమయంలో ఆమె కొడుకు ప్రీతమ్(15) తన తల్లిపై దాడి చేయండం గమనించి అవరడంతో అతడిని కొటి,్ట బాత్రూంలో బంధించారు. దీంతో వేరే గదిలో ఉన్న ఆమె కూతురు చాందిని(17) కేకలు వేయగా ఇరుగు–పొరుగు వారు రావడంతో దుండగులు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న 15 వవార్డు కౌన్సిలర్ సంతోష్ కుమార్ దొళాయి పోలీసులకు సమాచారం అందించారు. సైంటిఫిక్ బృందం ఆధారాలు సేకరించిందని ఐఐసీ రస్మీరంజన్ ప్రదాన్ తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే.. -
దొంగతనం కోసం వచ్చి.. వంటింట్లో బాదం పప్పు తినేసి.
సాక్షి,నల్లగొండ క్రైం: నీలగిరిలో దుండగులు తెగబడుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకుని అందినకాడికి దోచుకుపోతున్నారు. అదే తరహాలో సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని నాగార్జున గ్రామీణ బ్యాంక్ కాలనీలో తాళం వేసి ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్రా వెంకట్రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. ఇల్లంతా సోదాలు నిర్వహించినా సొత్తు లభించలేదు. దీంతో వంటింట్లో ఓ డబ్బాలో ఉన్న బాదం పప్పు ఆరగించి వెళ్లిపోయారు. కాగా, హైదరాబాద్లో ఉంటున్న కూతురును చూసేందుకు భార్యతో కలిసి శనివారం వెళ్లిన వెంకట్రెడ్డి ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికులు తెలపడంతో ఆయన తిరిగివచ్చాడు. ఇంట్లో సొత్తు పెట్టలేదని, కానీ దొంగలు బాదం పప్పు తిని వెళ్లారని తెలిపారు. తాళం వేశావా అన్న మాటలు విని.. అదే కాలనీలో టీచర్ వెంకట్రెడ్డి ఇంటి ఎదురుగానే తాళ్లపల్లి చంద్రయ్య, కళమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. కళమ్మ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు. ప్రతి రోజు తెల్లవారుజామున చంద్రయ్య తన భార్యను విధులు నిర్వర్తించే ప్రాంతంలో బైక్పై వదిలి వస్తాడు. ఉద యం 4:30 గంటలకు రోజూమాదిరిగా కళమ్మను కలెక్టరేట్ వద్ద దించేందుకు వెళ్తూ ఇంటికి తాళం వేశావా అంటూ భార్యను ప్రశ్నించాడు. అదే సమయంలో నర్రా వెంకట్రెడ్డి ఇంట్లో ఉన్న దుండగులు ఆ మాటలు విన్నారు. చంద్రయ్య భార్యతో బైక్పై వెళ్లగానే అతడి ఇంటి తాళాన్ని పగులగొట్టి లోనికి చొరబడ్డారు. ఫ్రిడ్జ్పై ఉన్న తాళం చెవులను తీసుకుని బీరువా తెరిచి అందులో ఉన్న పది తులాల బంగారు, 28 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.50వేల నగదును అపహరించుకుపోయారు. చంద్రయ్య 5:30 ఇంటికి తిరిగి రాగా చోరీ విషయం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం -
బిర్యానీతో కలిపి నగలు మింగేశాడు.
పిలిస్తే పార్టీకొచ్చాడు. మంచిగా బిర్యానీ తిన్నాడు. పనిలోపనిగా ఇంట్లోని లక్షన్నర విలువైన నగలను కూడా లాగించేశాడు. కొట్టేద్దామనుకున్నాడో ఏమో గానీ అడ్డంగా దొరికిపోయాడు. తమిళనాడులోని చెన్నైలో ఉన్న సలిగ్రామంలో ఇటీవల ఈ ఆశ్చర్యకర ఘటన జరిగింది. నగల షాపులో పని చేసే ఓ మహిళ తన మేనేజర్, ఆమె పార్ట్నర్ (32)ను ఇటీవల ఈద్ పార్టీకి ఆహ్వానించారు. పార్టీ అయిపోయాక అందరూ వెళ్లిపోయారు. ఆ తర్వాత తన ఇంట్లోని డైమండ్ నెక్లెస్, ఓ పెండెంట్, బంగారు చైన్ పోయిందని ఆమె గుర్తించారు. మేనేజర్, ఆమె పార్ట్నర్కు ఫోన్ చేసి నగల గురించి ఆరా తీయగా తాము చూడలేదని వాళ్లు చెప్పారు. దీంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పార్టీ సమయంలో మేనేజర్ పార్ట్నర్ ఆ నగలున్న గదిలోకి వెళ్లి గడియ వేసుకొని 10 నిమిషాల తర్వాత వచ్చారన్నారు. మేనేజర్ పార్ట్నర్ను పిలిచి పోలీసులు ఆరా తీయగా నగలను మింగేశానని చెప్పాడు. పోలీసు అతన్ని దగ్గర్లోని హాస్పిటల్కు తీసుకెళ్లి స్కాన్ చేయించగా కడుపులో నగలున్నట్టు తెలిసింది. అరటిపండు తినిపించి వాటిని బయటకు తీయించి సదరు మహిళకు అప్పగించారు. తాగిన మైకంలో బిర్యానీతో పాటు నగలను కూడా మింగేశానని అతగాడు చెప్పుకొచ్చాడు. – సాక్షి,సెంట్రల్ డెస్క్ -
భలే దొంగలు...ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే...
Thieves Stolen 60 Feet Steel Bridge: ఇటీవల దొంగతనానికి వచ్చి గోడ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన గురించి విన్నాం. బంగారం, డబ్బులు, ఇంట్లో ఫర్నిచర్ వంటివి ఎత్తుకుపోవడం గురించి విన్నాం. కానీ అసాధ్యమైనవి, అలాంటివి కూడా ఎత్తుకుపోతారా అనిపించే వాటిని ఒక దొంగల ముఠా పక్కా ప్లాన్తో ఎత్తుకుపోయింది. పైగా స్థానికుల సాయంతో దర్జాగా పట్టుకెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే...బిహార్లోని రోహతాస్ జిల్లాలో పట్టపగలు 60 అడుగుల వంతెనను దొంగలించారు. అసలెవరూ ఊహించని విధంగా అసాధారణమైన దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం...అమియావర్ గ్రామం వద్ద 1972లో అర్రా కాలువపై వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడూ చాలా పాతది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అయితే స్థానిక గ్రామస్తులు ప్రస్తుతం ఈ వంతెనను వినియోగించడంలేదు. ఈ మేరకు ఒక దొంగల ముఠా నీటి పారుదల శాఖ అధికారులుగా ఆ గ్రామంలోని స్థానికులకు పరిచయం చేసుకున్నారు. ఆ వంతెనను కూల్చివేస్తున్నామని చెప్పడమే కాకుండా గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నారు. ఆ వంతెన ఉక్కుతో కూడిన నిర్మాణం. ఆ ముఠా గ్యాస్ కట్టర్లు, ఎర్త్మూవర్ యంత్రాలను ఉపయోగించి వంతెనను కూల్చివేసి, మూడు రోజుల్లో మొత్తం మెటల్ని స్వాహా చేశారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారుల అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వంతెన 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. గతంలో ఇలాంటి ఘటనలు చెక్ రిపబ్లిక్, యూఎస్లోని పెన్సిల్వేనియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏదిఏమైన దొంగలకు కూడా రొటిన్గా చేసే దొంగతనాలు పై బోర్ కొట్టిందో ఏమో ఇలా వైరైటీగా దొంగతనం చేయాలనుకున్నారు కాబోలు. Bihar |60-feet long-abandoned steel bridge stolen by thieves in Rohtas district Villagers informed some people pretending as mechanical dept officials uprooted bridge using machines like JCB & gas-cutters. We've filed the FIR:Arshad Kamal Shamshi, Junior Engineer,Irrigation dept pic.twitter.com/o4ZWVDkWie — ANI (@ANI) April 9, 2022 (చదవండి: ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మాజీ సీఎంలకు వార్నింగ్) -
గోడ కన్నంలో ఇరుక్కున్న దొంగ..
-
Viral Video: ఎంతపనైపాయే.. దొంగతనానికి వచ్చి.. గోడ కన్నంలో..
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: దొంగతనానికి వెళ్లిన దొంగ.. గోడలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కంచికి సమీపంలోని జడిపుడి గ్రామంలో పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి.. గాల జమ్మి గుడిలో దొంగతనానికి ప్రయత్నించాడు. తొలిత గోడకు ఓ వైపున చిన్న కన్నం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. చదవండి: యువతిపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో నేలకేసి కొట్టి.. గోడలో నుండి గుడిలోకి బాగానే వెళ్లిపోయిన ఆ దొంగ.. హుండీలో ఉన్న కానుకలు చేత పట్టి ఈజీగా బయటకు రాలేకపోయాడు. చివరికి గోడలో ఇలా ఇరుకున్నాడు. స్థానికులు గమనించి దొంగని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు దీనిని వీడియో చిత్రించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. -
నేనే దొంగ.. నేనే పోలీస్
సాక్షి,కైకలూరు(పశ్చిమ గోదావరి): ప్రజలను రక్షించాల్సిన ఆ కానిస్టేబుల్ చైన్ స్నాచర్ అవతారమెత్తాడు. కైకలూరులో మహిళ మెడలో గొలుసు తెంచి పారిపోతుండగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీసు స్టేషన్లో సింగిడి సత్యనారాయణ 2008 నుంచి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని సొంతూరు గణపవరం సమీపంలోని అప్పనపేట. సత్యనారాయణ ఇటీవల క్రికెట్ బెట్టింగులు, ఆన్లైన్ పేకాటలో అప్పుల పాలయ్యాడు. సత్యనారాయణ వాలీబాల్ ఆడుతుంటాడు. ఈ క్రమంలో ఉండి సమీపంలోని ఉప్పులూరుకు చెందిన బుద్దాల సుభాష్(21)తో పరిచయమైంది. ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి కైకలూరుకు కేటీఎం స్పోర్ట్స్ మోటారు బైక్పై వచ్చారు. సంతమార్కెట్ వద్ద గూడూరి వెంకట వరప్రసాద్ పచారీ దుకాణానికి వెళ్లారు. అతను కౌంటర్లో ఉండగా భార్య లోపల సరుకుల వద్ద ఉంది. సత్యనారాయణ జీడిపప్పు కావాలని ఆమెను అడిగాడు. ఆమె వెనక్కి తిరగగానే మెడలో 4 కాసుల బంగారు గొలుసు తెంచుకుని బయటకు వచ్చాడు. అప్పటికే బైక్పై సిద్ధంగా ఉన్న సుభాష్తో కలిసి ఏలూరురోడ్ వైపు పరారయ్యాడు. ప్రజలు వెంబడించగా సత్యనారాయణ తప్పించుకున్నాడు. సుభాష్ దొరకగా.. కైకలూరు స్టేషన్కు తరలించారు. అతని చెప్పిన సమాచారంతో సత్యనారాయణను ఆటపాకలో బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1,20,000 విలువ చేసే గొలుసు, చాకు, పెప్పర్ స్ప్రే బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మేనేజర్ రోజూ ఏదో ఒక వంకతో మా దగ్గరకు వచ్చి.. -
హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో..
సాక్షి, హైదరాబాద్: ‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటైనా చేస్తాడు లేదా క్లూ అయినా వదులుతాడని’ పోలీసులు చెబుతుంటారు. ఆఖరికి ఇదే నిజమైంది. ఏడేళ్లుగా మూడు కమిషనరేట్ల పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న పొరపాటుతో పోలీసులకు దొరికిపోయాడు. జిల్లెల్లగూడలోని ఓ ఇంట్లో బంగారం, ల్యాప్టాప్, సెల్ఫోన్ను చోరీ చేసిన గజదొంగ సయ్యద్ సాహిల్... ఆ ఫోన్ను తన బావమరిదికి బహుమతిగా ఇచ్చాడు. అది చోరీ ఫోన్ అని తెలియక అతను దాన్ని వినియోగించడం మొదలు పెట్టాడు. అప్పటికే ఫోన్ చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. దాని ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ను పోలీసులు ట్రాకింగ్లో పెట్టారు. సాంకేతిక సాక్ష్యాలను సేకరించిన మీర్పేట పోలీసులు.. శనివారం బాలాపూర్ క్రాస్ రోడ్డులో రెక్కీ చేస్తున్న సాహిల్ను మాటువేసి పట్టుకున్నారు. వనస్థలిపురం మీర్పేట ఇన్స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డిలతో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఆరేళ్లుగా అన్నదమ్ముల ఆటలు.. చాంద్రాయణగుట్ట షాహీన్నగర్కు చెందిన సయ్యద్ మొహమ్మద్, సయ్యద్ సాహిల్లు అన్నదమ్ములు. ఆరేళ్లుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. 2015లో గోల్కొండ పీఎస్ పరిధిలో వీరిపై తొలి కేసు నమోదయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 33, సైబరాబాద్లో 8, రాచకొండ కమిషనరేట్లో 9 వీరిపై మొత్తం 50 కేసులున్నాయి. గతంలో వీరిని మీర్పేట, గోల్కొండ, లంగర్హౌస్, బంజారాహిల్స్, ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, నార్సింగి, రాయదుర్గం, రాజేంద్రనగర్, కొత్తూరు పీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గతేడాది డిసెంబర్లో జైలు నుంచి విడుదలైన సయ్యద్ సాహిల్.. మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. గడిచిన మూడు నెలల్లో సాహిల్ బంజారాహిల్స్లోని ఓ ఇంట్లో, మీర్పేటలో ఏడు చోరీలకు పాల్పడ్డాడు. చదవండి: జ్వరం గోలీకి ధరల సెగ! రాత్రి 7 నుంచి 11 గంటల మధ్యే చోరీలు.. చోరీ చేయడంలో సాహిల్ స్టైలే వేరు. ఉదయం పూట బైక్ మీద రెక్కీ నిర్వహించి, రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య మాత్రమే దొంగతనాలు చేస్తుంటాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకొని, రాత్రి వేళలో వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్తో ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరుస్తాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎలక్ట్రానిక్ వస్తువులతో పరారవుతాడు. చోరీ చేసిన సొత్తులో కొంత భాగం ఇంట్లో దాచిపెట్టుకోగా.. మిగిలిన దాన్ని బంగారం దుకాణాలు, పాన్ బ్రోకర్లు, మణప్పురం ఫైనాన్స్ వంటి వాటిల్లో తాకట్టు పెడతాడు. ఇలా చిక్కిపోయాడు.. బాలాపూర్ క్రాస్రోడ్స్లో శనివారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న మీర్పేట సీఐ మహేందర్ రెడ్డి, డీఐ శేఖర్ రంగంలోకి దిగారు. సాహిల్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. మొహమ్మద్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 81.2 తులాల బంగారం, 2.45 తులాల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్టాప్, బైక్, స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఈ ఖైదీ మామూలోడు కాదండోయ్.. వయసు 26.. వందకు పైగా కేసులు
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్..పోలీసులకు ముచ్చెమటలు పట్టించే గజ దొంగ..వయసు కేవలం 26..వందకు పైగా కేసులు...రెండు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎట్టకేలకు 2020లో విశాఖ పోలీసులకు చిక్కాడు. కోర్టు శిక్ష విధించింది. 2022 జూన్ 8 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కట్ చేస్తే మళ్లీ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాడు. అనకాపల్లి కోర్టుకు వాయిదా కోసం వెళ్లి తిరిగి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు కన్ను కప్పి పరారయ్యాడు. ఇది చిత్తూరు ఖైదీ కథ.. చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ రెండు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడు. చిత్తూరు జిల్లాతో పాటు విశాఖ, పశ్చమ గోదావరి జిల్లాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడం ప్రభాకర్కు వెన్నతోపెట్టిన విద్య. అందుకే ఇళ్లల్లోకి వెళ్లి బంగారం, నగదు, విలువైన వస్తువులు పట్టుకుపోయినా ఎవ్వరి కంటా పడేవాడుకాదు. ఇలా కొన్నేళ్లపాటు తనకు ఎదురులేకుండా పోయింది. రెండు రాష్ట్రాల పోలీసులకు కొరకురాని కొయ్యగా తయారయ్యాడు. 2020 నుంచి శిక్ష అనుభవిస్తూ... ప్రభాకర్ 2020లో విశాఖ పోలీసులు ఎట్టకేలకు ప్రభాకర్ను అరెస్టు చేశారు. 2020 సెప్టెంబరు 8 నుంచి విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవిస్తూనే రిమాండ్ ముద్దాయిగా కోర్టు వాయిదాలకు ఎస్కార్ట్ పోలీసులు హాజరుపరుస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 23న ప్రభాకర్ను అనకాపల్లి కోర్టుకు తీసుకువెళ్లి తిరిగి రాత్రి 8 గంటలకు విశాఖ సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఎస్కార్ట్ వాహనం దిగి పరారయ్యాడు. చీకటి కావడంతో పోలీసులు ఆయన వెంట పరిగెత్తినా దొరకలేదు. దీంతో మరో కేసు ప్రభాకర్పై నమోదైంది. చదవండి: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఎఫెక్ట్..పెరిగిన టిఫిన్ ధరలు -
జైలులో స్నేహం.. కథ మొదలైంది అక్కడినుంచే!
సాక్షి,మల్యాల(చొప్పదండి): జైలులో ఇద్దరు నిందితుల మధ్య స్నేహం చోరీలకు బీజం వేసింది. జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరూ.. మరో ముగ్గురితో కలిసి అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడ్డారు. వాట్సప్ కాల్ మాట్లాడుతూ చోరీలకు స్కెచ్ వేసేవారు.. ఉత్తర తెలంగాణలోని పలు బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించారు. ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు బ్యాంకుల్లో చోరీకి పాల్పడ్డారు. 6న పూడురు బ్యాంకులో.. కర్ణాటకలోని సూళ్లపేట బ్యాంకులో 2017లో జరిగిన దోపిడీ కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన ఫహీంఖాన్, 2019లో గుల్బర్గాకు చెందిన జాలేంద్రనాథ్ ఒక హత్య కేసులో సెంట్రల్ జైలుకు వెళ్లారు. వారి మధ్య స్నేహం కుదిరింది. జైలు నుంచి విడుదలయ్యాక ముఠాగా ఏర్పడి కొత్తగూడెం, ములుగు, పూడూరు, జహీరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాలలోని బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 6న జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులోని ప్యాక్స్ బ్యాంకులో, 10న ఉట్నూరు దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ చేసి మహారాష్ట్రలోని లాథూర్కు పారిపోయారు. ఒకరు అరెస్ట్.. పరారీలో నలుగురు.. పూడూరు ప్యాక్స్ బ్యాంకు దోపిడీ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, నలుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు. మల్యాల సీఐ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన కాలేవ జాలేంద్రనాథ్ను శనివారం అరెస్టు చేశామని, ఫహీంఖాన్, ఘోరాఖాన్, వహీద్ఖాన్, రాజరాము పరారీలో ఉన్నారని తెలిపారు. చోరీలు చేసేందుకు గుల్బార్గా నుంచి జాలేంద్రనాథ్, ఉత్తరప్రదేశ్ నుంచి మిగిలిన నలుగురు బయలుదేరి కరీంనగర్లో కలుసుకున్నారని వివరించారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తుండగా పూడూరు ప్యాక్స్ బ్యాంకు వెనకకు వెళ్లి, తాళాలు పగులగొట్టారని, వెంట తెచ్చుకున్న ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ కట్టర్తో లాకర్ను తెరిచి రూ.2,20,800 నగదుతో పారిపోయారని వెల్లడించారు. మరోసారి చోరీకి వెళ్తున్నామని ఏ–5(జాలేంద్రనాథ్)ను మిగిలిన నలుగురు అడుగగా, జాలేంద్రనాథ్ ఈనెల 19న జేఎన్టీయూ చెక్పోస్టు వద్దకు వచ్చి, మిగిలిన వారికోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రూపేశ్, డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి, కొడిమ్యాల ఎస్సై కె.వెంకట్రావు, కానిస్టేబుళ్లు బృందాలుగా ఏర్పడి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. -
దొంగల కోసం ఓ కంపెనీ.. నెల జీతం, బోనస్లు! ఎక్కడో తెలుసా?
జైపూర్: దొంగతనాలు కూడా ఓ ఉద్యోగంలో చేస్తోంది ఓ ముఠా. ఆ ముఠా గ్యాంగ్ లీడర్ రోజూ దొంగతనానికి టార్గెట్ ఇస్తాడు. అవి చేరుకున్న వాళ్లకు బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇలా ఎన్నో ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నాడు. అసలు ఇంతకీ వాళ్లు చేయాల్సిన పని ఏంటంటే.. వాహనాలను దొంగిలించడం, వాటిని విడదీయడం, ఆ విడిభాగాలను బయట విక్రయించడం, మిగిలిపోయిన వస్తువులను డంపింగ్ చేయడం. వీటికి కోసం అతను ప్రత్యేక నెలవారీ ప్యాకేజీను ఉద్యోగులకు ఇస్తున్నాడు ఓ ఘనుడు. చివరికి జైపూర్ పోలీస్ స్టేషన్ 10 మంది దుండగులను పట్టుకోవడంతో ఆ ముఠా అసలు బండారం బయటపడింది. దీంతో పాటు పట్టుబడిన వారి నుంచి స్కూటీలు, బ్యాటరీలు, ఈ-రిక్షాలు సహా డజన్ల కొద్దీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన రాజస్తాన్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చాలా మంది నిరుద్యోగులకు డబ్బు ఎర చూపి వారి ఆర్థిక పరిస్థితులను అవకాశంగా చేసుకుని దొంగతనాలకు ప్రేరేపించి వాళ్లను దొంగలుగా మారుస్తున్నాడు. ఈ ముఠా.. అదును చూసి ఈ-రిక్షాలు, బైక్లు మాయం చేస్తారు. ఆ తర్వాత వాటి ఇంజిన్లను తీసి టైర్లు, బ్యాటరీలు వీడిగా చేయడంతో ఆ వాహనాన్ని తక్కుకింద మారుస్తారు. కాగా దొంగలు ఎవరు ఏం పని చేయాలనే ముందుగానే ఆ గ్యాంగ్ లీడర్ నిర్ణయిస్తాడు. ఇలా ప్రతీది ఓ ప్లాన్ ప్రకారం చేసి వందలాది బైకులను అమ్మి సొమ్ము చేసుకుంటోంది ఆ ముఠా. కాగా ఇలాంటి ఓ దొంగల కంపనీని 2018లో సైతం ఓ క్రిమినల్ నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే తాజాగా బయటపడ్డ దొంగలకు మాత్రం నెలకు 30 వేల రూపాయలు ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
బయట పోలీస్.. లోపల దొంగ.. అమెరికాలోని ఇంటి యాజమాని గుర్తించి
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: అతనో కరుడుగట్టిన దొంగ.. దాదాపు 30 కేసుల్లో నిందితుడు.. అలవాటు ప్రకారం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చోరీకి వెళ్లాడు..అక్కడ సీసీ కెమెరాలున్నాయన్న విషయం అతనికి తెలియదు..అయితే అమెరికాలో ఉన్న ఓనర్.. తన ఇంట్లో దొంగ ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు..స్పందించిన పోలీసులు వచ్చి ఇంటి బయట గడియపెట్టి.. ఆ తరువాత అరెస్టుచేశారు. అచ్చం సినీఫక్కీలా ఉన్న ఈ సంఘటన దొంగను అరెస్టు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే...కేపీహెచ్బీకాలనీ రోడ్ నెంబర్ రెండులోని ఎల్ఐజి 237లో బి. వెంకటరత్నం నివాసముంటున్నాడు. అతని ఇద్దరు కూతుళ్లు అమెరికాలో ఉంటున్నారు. మొదటి ఫ్లోర్ మినహా మిగతా ఇంటిని అద్దెకు ఇచ్చి ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు మూడు గంటల సమయంలో తయ్యపరాజు రామక్రిష్ణ అనే కరుడుగట్టిన దొంగ వెంకటరత్నం ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. గ్రౌండ్ ప్లోర్లో నివాసమున్న రాజశేఖర్రెడ్డి దొంగతనం జరుగుతోందని అనుమానం వచ్చి అమెరికాలోని ఇంటి యజమానికి సమాచారం అందించాడు. సీసీ కెమెరాల్లో ఇంట్లోకి దొంగ వచ్చిన విషయాన్ని గుర్తించిన వెంకటరత్నం కేపీహెచ్బీ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. చదవండి: చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు.. కోడి గుడ్డు కూర వండలేదని.. విధుల్లో ఉన్న డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు వచ్చి ఇంటి బయటి నుంచి గడియ పెట్టారు. ఆ తరువాత పోలీసులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి కూడా గడియ పెట్టి ఉంది. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లిన పోలీసులు దొంగ రామక్రిష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతను దొంగిలించిన వెండి వస్తువులు, నగదును ఇంటి యజమాని సూచన మేరకు అక్కడ ఉన్నవారికి అప్పగించి దొంగను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. -
కటకటాల్లో గజదొంగ నాయక్
హిమాయత్నగర్: భారీ చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగ సంతోష్నాయక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 22.409 తులాల బంగారు ఆభరణాలు, 23.7 తులాల వెండి ఆభరణాలు, 11 విదేశీ కరెన్సీలు, 251 విదేశీ కరెన్సీ కాయిన్స్ను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో సెంట్రల్ జోన్ డీసీపీ రమణరెడ్డి, అబిడ్స్ ఏసీపీ వెంకట్రెడ్డి, ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.జానయ్య, నారాయణగూడ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, డీఐ రవికుమార్లతో కలసి వివరాలను వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా దొంగలింగాల గ్రామానికి చెందిన జతావత్ సంతోష్నాయక్ 15 ఏళ్ల ప్రాయంలోనే చోరీల బాట పట్టాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు ఇతడిపై 29 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదన్నారు. జువైనల్ హోం నుంచి వచ్చాక కూడా చోరీలు చేశాడని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్లో నారాయణగూడ పీఎస్ పరిధిలోని ఆయిల్సీడ్ కాలనీలో వైద్యుని ఇంట్లో ఇతని స్నేహితుడు విక్రమ్తో కలసి భారీ చోరీ చేశాడు. ఈ చోరీలో 50 తులాల బంగారు ఆభరణాలు, 3 వేల విదేశీ కరెన్సీ, కెమెరా, విలువైన వస్త్రాలు దొంగలించాడు. చోరీ అనంతరం నగరంలో రెండు రోజులున్న నాయక్ తిరుపతికి చేరాడు. విషయం పోలీసులకు తెలిసిందని గమనించిన నాయక్ వైజాగ్కు మకాం మార్చాడు. ఎట్టకేలకు ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నాయక్ను అరెస్టు చేశారు. -
ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేస్తున్న మఠా
మౌలాలి: రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన షేక్ యామిన్ అలియాస్ సలీం (39), మహరాష్ట్రకు చెందిన ఉస్మాన్, నిజామాబాద్కు చెందిన లక్ష్మణ్, మరో వ్యక్తి మొత్తం నలుగురు కలిసి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 16, సైబరాబాద్ పరిధిలో 01, జోగుళాంబ గద్వాల్లో 09, మహబూబ్నగర్లో 01, కామారెడ్డి, 01, మెదక్లో 04, నల్గొండలో 03, నిజామాబాద్లో 05 చొప్పున మొత్తం 41 చోట్ల రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. ఇటీవల ప్రధాన నిందితుడు షేక్ యామిని అలియాస్ సలీంను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అదుపులోని తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 18 లక్షల 20 వేల విలువ గల 350 గ్రాముల బంగారు అభరణాలు, లక్షా రూపాయల విలువగల కిలోన్నర వెండి, లక్షా 50 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్టాప్తోపాటు మొత్తం రూ. 23 లక్షల 80 వేల విలుగల నగదు, నగలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడు షేక్ యామిన్ అలియాస్ సలీంను రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. -
పోస్టాఫీస్లో భారీ చోరీ.. నిందితుడు స్వీపర్
గచ్చిబౌలి: పన్పెండేళ్లుగా స్వీపర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. రాత్రి ఆఫీస్లోకి ప్రవేశించి రూ.33.29 లక్షలు చోరీ చేశాడు. ఆదివారం గచ్చిబౌలిలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న అర్ధరాత్రి బీహెచ్ఈఎల్లోని సబ్ పోస్టాఫీస్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన అనంతరం గ్రిల్స్ తొలగించి ఉండటం గమనించారు. దీంతో అక్కడ చోరీ జరిగినట్లు గుర్తించారు. పోస్టుమాస్టర్ చౌహన్ శంకర్ ఆర్సీపురం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా చోరీ జరిగిన రోజు నుంచి 12 ఏళ్లుగా స్వీపర్గా పని చేస్తున్న జహీర్(25) విధులకు రాలేదు. దీంతో అతనిపై నిఘా ఉంచారు. అతను గోవాకు వెళ్లి మూడు రోజులు ఉన్నట్లుగా కనుగొన్నారు. నగరానికి తిరిగి రాగానే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి రూ.28,52,170 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న జహీర్ చోరీ చేయడాన్ని ట్యూబ్లో చూసి దొంగతనం చేశాడు. నగదు ఎక్కువ డిపాజిట్ అయిన రోజు రాత్రి వాచ్మెన్ లేడనుకొని నిర్ధారించుకొని ఈ చోరీ చేశాడు. మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. -
వెరైటీ దొంగలు.. డబ్బు, బంగారం వద్దు.. అవే కావాలి..పట్టుకుంటే 10 వేల డాలర్లు!
సాధారణంగా దొంగలంటే డబ్బో లేక బంగారమో దోచుకుంటుంటారు. దాదాపుగా ఎక్కడైనా జేబులు కొట్టే వాళ్లు మొదలు.. ఇళ్లను కొల్లగొట్టే వాళ్ల వరకు రకరకాల చోరశిఖామణులు ఉంటారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మాత్రం వెరైటీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రికిరాత్రే ‘సొత్తు’ను కొల్లగొడుతూ స్థానికులకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు చేసే ‘కటింగ్’ ఏమిటో తెలుసా? తేనెటీగల చోరీ..!! వెంటాడి మరీ కుట్టికుట్టి పెట్టే తేనెటీగలను దొంగలు అమాంతం ఎత్తుకుపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..! అందుకే మరి దీన్ని వెరైటీ చోరీ అంటున్నది. ఇంతకీ విషయం ఏమిటంటే.. కాలిఫోర్నియా రకం బాదంపప్పు గురించి మీకు తెలుసుగా.. వాణిజ్య స్థాయిలో యావత్ అమెరికాకు అవసరమయ్యే 100 శాతం బాదంపప్పును ఈ రాష్ట్రమే సరఫరా చేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే బాదంలో 80 శాతం కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇంత భారీ స్థాయిలో బాదం సాగు జరగాలంటే అందుకు పరపరాగ సంపర్కం అవసరం. ఈ విషయంలో తేనెటీగలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఎందుకంటే బాదం తోటల్లో తేనెటీగలు వేర్వేరు చెట్లపై వాలుతూ పుప్పొడిని తరలించే వాహకాలుగా మారి వాటి ఫలదీకరణకు దోహదపడుతుంటాయి. ఇందుకోసం ఏటా కాలిఫోర్నియాలోని బాదం రైతులు తేనెటీగల పెంపకందారుల నుంచి వాటిని అద్దెకు తెచ్చుకుంటుంటారు. తేనెటీగలతో కూడిన ఒక్కో కృత్రిమ తేనెతుట్టె అద్దె 210 డాలర్లు (సుమారు రూ. 15,800)గా ఉంటుంది. దీన్ని పసిగట్టిన చోరులు... ఈ సీజన్లో పెంపకందారులు కృత్రిమ తేనెతుట్టెల్లో సిద్ధంగా ఉంచే వేలాది డాలర్ల విలువైన తేనెటీగలను ఎత్తుకుపోతున్నారట! వాటిని అధిక ధరలకు బాదం రైతులకు అమ్ముకుంటూ లక్షాధికారులైపోతున్నారట!! పట్టుకుంటే 10 వేల డాలర్లు.. గత నెలలో ఇలాగే కొందరు దొంగలు ఓ ఫారంలోని లక్షలాది తేనెటీగలను రాత్రికిరాత్రే మాయం చేయడంతో అప్రమత్తమైన కాలిఫోర్నియా రాష్ట్ర తేనెటీగల పెంపకందారుల సంఘం దొంగలను పట్టిచ్చే వారికి ఏకంగా 10 వేల డాలర్ల (సుమారు రూ. 7,50,000) నజరానా ప్రకటించింది!! అయినా వాటిలో కొన్ని తుట్టెలే చివరకు దొరికాయట. కొందరు పెంపకందారులైతే ఒక అడుగు ముందుకేసి తమ కృత్రిమ తేనెతుట్టెలు చోరీకి గురైతే సులువుగా గుర్తించేందుకు వాటికి ముందుగానే జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను అమరుస్తున్నారట! కారణం ఏమిటి? అమెరికన్లు తినే మూడో వంతు ‘ఆహారం’తయారీ తేనెటీగలు, సీతాకోకచిలుకలు, గబ్బిలాల వంటి వాటిపైనే ఆధారపడి ఉందని అమెరికా వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే గత 50 ఏళ్లుగా అమెరికాలో తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతోందని పేర్కొంటోంది. ఒక్క 2006లోనే దేశంలోని ఏకంగా 30 శాతం తేనెటీగలు నశించాయని తెలిపింది. పంట రసాయనాల వాడకం అధికం కావడం, వ్యాధులు, పౌష్టికాహారలేమి ఇందుకు ప్రధాన కారణమని వివరిస్తోంది. మరోవైపు తేనెటీగల పెంపకం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేపట్టాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకసారి చోరీకి తేనెటీగలు చోరీకి గురైతే మళ్లీ నాణ్యమైన, కొత్త వాటిని పెంచేందుకు ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. అందుకే చోరుల కన్ను వీటిపై పడిందని అంటున్నారు. –సాక్షి, సెంట్రల్డెస్క్ -
స్కెచ్ వేసి.. కొల్లగొట్టారు..
విజయనగరం క్రైమ్: జిల్లాలో ప్రతి మంగళవారం వాణిజ్య కార్యకలాపాలకు సెలవు. దుకాణాలు తెరచుకోవు. అదే రోజును దుండగలు చోరీకి ఎంచుకున్నారు. పక్కాగా స్కెచ్ వేశారు. కట్టర్లతో గ్రిల్స్, తాళాలు కోసి జ్యూయలరీ షాప్లో ఉన్న రూ.4 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని కొల్లగొట్టారు. జిల్లా కేంద్రంలోని గంటస్తంభం వద్ద ఉన్న రవి జ్యూయలరీ షాప్లో జరిగిన చోరీకి సంబంధించి వన్టౌన్ సీఐ జి.మురళి తెలిపిన వివరాలిలా.. గంటస్తంభం వద్ద ఉన్న పాండు జ్యూయలర్స్లోకి మంగళవారం అర్ధరాత్రి దుండగలు ప్రవేశించారు. అక్కడ సీసీపుటేజ్లు, లాకర్లు ఉండడంతో చోరీయత్నం విరమించుకున్నారు. అదే వరుసలో ఉన్న రవి జ్యూయలర్స్ను ఎంచుకుని మేడపైనుంచి లోపలికి ప్రవేశించారు. మేడపై ఉన్న గ్రిల్స్ తలుపును కట్టర్తో చాకచక్యంగా కోశారు. మెట్లమార్గంలో కిందకు దిగారు. ఎటువంటి లాకర్లు లేకుండా, ప్రదర్శనకు ఉంచిన బంగారు ఆభరణాలన్నింటినీ మూటగట్టుకుపోయారు. వెండి వస్తువులను ముట్టుకోలేదు. ఆభరణాల విలువ రూ.4కోట్లకు పైనే... షాప్ యజమాని యథావిధిగా బుధవారం ఉదయం 9.30 గంటలకు దుకాణం తెరిచేసరికి లోపల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కలవరపడ్డాడు. దొంగతనం జరిగినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలాన్ని సీసీఎస్ పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి కీలకమైన ఆధారాలను సేకరించింది. ఎస్పీ దీపికా ఎం.పాటిల్ స్వయంగా షాప్ను పరిశీలించారు. యజమానితో మాట్లాడి వివరాలు రాబట్టారు. అనంతరం దొంగతనం జరిగిన తీరును నిశితంగా పరిశీలించారు. చోరీ శోధనపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. దొంగలు అపహరించిన 8 కిలోల బంగారు ఆభరణాల ఖరీదు సుమారు రూ.4 కోట్లకు పైబడి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. వారం తిరగకముందే... వారం రోజుల కిందట రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఇదే తరహాలో దొంగలోపలికి ప్రవేశించాడు. లిఫ్ట్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఆభరణాలు కనపడకపోయే సరికి అందుబాటులో ఉన్న నగదును పట్టుకుపోయాడు. తాజాగా రవి జ్యూయలర్స్లో వెండి వస్తువులను పక్కన పెట్టి కేవలం బంగారు నగలనే టార్గెట్ చేశాడు. చోరీ ఘటనతో వ్యాపారులందరూ భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక దొంగలా? అంతరరాష్ట్ర ముఠాల పనా? ఒక్కడే చేస్తున్నాడా? ముఠా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం షాపులో లాకర్ సదుపాయం లేదు. వస్తువులన్నీ చక్కగా పేర్చి ఉన్నాయి. గ్రిల్స్ కట్ చేసి లోపలికి ప్రవేశించి వస్తువులను పట్టుకువెళ్లారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సీసీఎస్ ఇప్పటికే రంగంలోకి దిగాయి. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని ఎస్పీ దీపికా ఎం.పాటిల్ తెలిపారు.