తిరుపతిలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు
తిరుపతి: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా భూపాల్కాలనీలో పట్టుకున్నారు. మంగళవారం ఫోర్డు ఎన్డెవర్ వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో భూపాల్ కాలనీ దగ్గర టాస్క్ఫోర్సు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు