
కిషన్ రెడ్డి
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈవెంట్స్ ప్రభుత్వంగా మారిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈవెంట్స్ ప్రభుత్వంగా మారిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్ను టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేశారన్నారు.
కేంద్ర నిధులను వాడుకుని బీజేపీని విమర్శించడం సరికాదని తెలిపారు. 2 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే ఇప్పటికి ఎన్ని నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులను దారిమళ్లించి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు.