'కేసీఆర్‌ది ఈవెంట్స్‌ ప్రభుత్వం' | bjp leader kishan reddy slams trs government | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ది ఈవెంట్స్‌ ప్రభుత్వం'

Feb 13 2018 2:05 PM | Updated on Feb 13 2018 2:05 PM

bjp leader kishan reddy slams trs government - Sakshi

కిషన్‌ రెడ్డి

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఈవెంట్స్‌ ప్రభుత్వంగా మారిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌ రెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఈవెంట్స్‌ ప్రభుత్వంగా మారిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్‌ను టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చేశారన్నారు.

కేంద్ర నిధులను వాడుకుని బీజేపీని విమర్శించడం సరికాదని తెలిపారు. 2 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే ఇప్పటికి ఎన్ని నిర్మించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర నిధులను దారిమళ్లించి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement