
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుమారు 40మంది టీడీపీ నేతలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిద్దలూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ఆధ్వర్యంలో అర్థవీడు ఎంపీపీ రవికుమార్ యాదవ్, జడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎదురు శ్రీనివాస్రెడ్డి, ఉడముల సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. కాగా దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తమను అధిష్టానం పట్టించుకోలేదని అందుకే తాము వైఎస్సాఆర్ సీపీలో చేరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment