ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం | Rajya Sabha Possess Ten Percent Quota For EBC | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 9 2019 10:25 PM | Last Updated on Wed, Jan 9 2019 10:30 PM

Rajya Sabha Possess Ten Percent Quota For EBC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా  149 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా  7 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 156 మంది సభ్యులున్నారు. బిల్లుకు దాదాపు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. నేడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకం తర్వాత బిల్లు అమల్లోకి వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement