‘కాంగ్రెస్‌ నేతల ఆస్తులపై విచారణకు సిద్ధమేనా’ | Trs leader fired on congress | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ నేతల ఆస్తులపై విచారణకు సిద్ధమేనా’

Published Tue, Jul 17 2018 1:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Trs leader fired on congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమేనా అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎన్‌.భాస్కర్‌రావు సవాల్‌ చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ దశాబ్దాలుగా అధికారంలో ఉంటూ కోట్లాది రూపాయల అక్రమార్జన కు పాల్పడిన కాంగ్రెస్‌ నేతలే అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుం టే కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమ సందర్భం గా ద్రోహులకు సద్ది మోసిన చరిత్ర కాంగ్రెస్‌దని అన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని నవాజ్‌ షరీఫ్‌ కుటుంబంతో పోల్చిన కోమటిరెడ్డికి పిచ్చి ముది రిందని, కాంగ్రెస్‌ నేతలకు 2019 ఎన్నికలే చివరి వని హెచ్చరించారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటివారే కుటుంబపాలన గురించి మాట్లాడటం విడ్డూరమని భాస్కర్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతల దిగజారుడు విమర్శలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని శేఖర్‌రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement