76వ రోజు పాదయాత్ర ప్రారంభం | YS Jagan begins 76th day padayatra from talupuru | Sakshi
Sakshi News home page

76వ రోజు పాదయాత్ర ప్రారంభం

Published Wed, Jan 31 2018 9:37 AM | Last Updated on Wed, Jul 25 2018 5:17 PM

YS Jagan begins 76th day padayatra from talupuru - Sakshi

పాదయాత్రలో మహిళలతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సైదాపురం మండలం తలుపూరు నుంచి బుధవారం ఉదయం 76వ రోజు పాదయాత్రను జగన్‌ మొదలుపెట్టారు. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరితో కలిసి జననేత ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నారు.

సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని మలిచేడు క్రాస్‌, డేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ఈ రోజు పాదయాత్ర కొనసాగిస్తారు. పొదలకూరు సెంటర్‌లో బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement