Praja Sankalpa Yatra
-
విప్లవాత్మక మార్పులకు అది రాచబాట
నెహ్రూనగర్/కర్నూలు(టౌన్)/మక్కువ: ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించాయి. అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి, చరిత్ర సృష్టించారని కొనియాడాయి. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు వేడుకలు నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్ర విప్లవాత్మక మార్పులకు రాచబాట అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం లభించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికారత సాధించారని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అన్నారు. ప్రతి ఊళ్లోనూ మార్పు కనిపిస్తోందని చెప్పారు. గుంటూరులో మంత్రి విడదల రజిని పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన నేత జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. ఇప్పటి వరకు 99 శాతానికిపైగా హామీలు అమలు చేసిన నాయకుడు జగనన్న అని తెలిపారు. కర్నూలులో ఘనంగా కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్పర్సన్ విజయమనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, సంజామలలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత కేక్ కట్ చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్సీఎంగా ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కేక్లు కట్ చేసి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, బువ్వనపల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఓ చారిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ.. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్ ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్.. రావాలి జగన్.. అంటూ నినదించారు. -
విజయ సంకల్పానికి ఐదేళ్లు
-
ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు
పసుపు రంగు కంచుకోటను వైఎస్ జగన్ అనే ఒకే ఒక్కడు పునాదులతో సహా పెకలించిన జ్ఞాపకాలకు ఆ స్థూపం సజీవ సాక్ష్యం. రాజకీయ ఉద్ధండుల అంచనాలను పటాపంచలు చేస్తూ వైఎస్సార్ కుమారుడు రాసిన నవ చరితకు ఆ కట్టడమే తొలి అక్షరం. విలువలు వదిలేసిన నాటి పాలకులు కలలో కూడా భయపడేలా ప్రజాక్షేత్రంలో ఆయన చేసిన యుద్ధానికి ఆ నిర్మాణం ఓ నిదర్శనం. తన పద ఘట్టనలతో పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగించిన యాగానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేత్రంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ఆయన జనం మనసులు గెలుచుకున్నారు. ఇచ్ఛాపురం రూరల్: రాజన్న బిడ్డగా, ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు పూర్తయ్యాయి. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర ఆయన సాగించిన పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసింది. 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ, ప్రజలకు భరోసా ఇస్తూ 2017, 2018, 2019 సంవత్సరాల్లో పాదయాత్రను కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ అడుగడుగునా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెరవకుండా ఎత్తుకున్న పనిని సమర్థంగా నిర్వర్తించారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 13 జిల్లాలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా 3,648 కిలో మీటర్ల మేర సాగిన ప్రజా సంకల్పయాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ పాదయాత్ర తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్ సభ స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు సంక్షేమం అనే పదానికి పర్యాయపదంగా మారిపోయారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేశారు. పాదయాత్రకు గుర్తుగా లొద్దపుట్టిలో నిర్మించిన విజయ స్థూపం ఆ నాటి కథలను అందరికీ గుర్తు చేస్తోంది. సమర్థ పాలకుడిగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవస్థల దెబ్బకు దళారీలు మాయమయ్యారు. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూ డం...పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే నేటి ప్రభుత్వం అజెండా. విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి. సాంఘిక భద్రతలో భాగంగా ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్నించే క్రమంలో పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఆర్థిక సాయం, ఆరోగ్య సంరక్షణ ద్వారా పేదలకు సాయం అందిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నేనున్నానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో పేదలకు భరోసా ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్ప ను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థను ప్రకటించి సంచలన సంస్క రణలకు శ్రీకారం చుట్టారు. చరిత్ర నిలిచి పోయేలా ప్రజా రంజక పాలన సాగిస్తున్న జగనన్న మరో 30 ఏళ్లు సీఎంగా ఉండటం గ్యారెంటీ. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్, శ్రీకాకుళం సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సీఎం జగనన్న నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఆయనతో కలసి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికలకు విజయాలు. – పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం సమన్వయకర్త సంక్షేమానికి పెద్దపీట వెనుకబడిన ఉత్తరాంధ్ర తలరాతను మార్చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వలస ప్రాంతంగా పిలిచే నోటితో ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువచ్చారు. కిడ్నీ ఆస్పత్రితో పాటు ఇంటింటికి తాగునీరు, పోర్టులు నిర్మాణాలు చేపట్టి దేవుడయ్యారు. ప్రతి కుటుంబానికి మేలు కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. విజయ స్థూపం సాక్షిగా మళ్లీ ఆంధ్ర ప్రదేశ్కు ముఖ్యమంత్రి జగనన్నే. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ, శ్రీకాకుళం -
ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్లు .. తిరుపతిలోని తుడా సర్కిల్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం (ఫోటోలు)
-
ప్రజా సంకల్ప యాత్రకు నేటితో ఆరు వసంతాలు పూర్తి
►ఏలూరు జిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కైకలూరులో సంబరాలు ►వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి,కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు ►కృష్ణాజిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 6 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పెడన వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ ►పాల్గొన్న పెడన పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ బండారు మల్లి, పార్టీ నాయకులు ►పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకుని నేటితో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ►అనంతరం పేదలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ►తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ►హాజరైన పలు కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ►నెల్లూరు: జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆఫీస్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కాకాని ►అనంతరం నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసిన మంత్రి ►కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి. ►ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ.. ‘ ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం నెరవేర్చాం. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్యాడర్ కష్టపడి పని చెయ్యాలి. ►తిరుపతి: తుడా వైఎస్సార్ సర్కిల్ వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు. ►సీఎం జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేసిన మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి,టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయ చంద్రారెడ్డి, కార్పొరేటర్లు వెంకటేష్, మునిరామిరెడ్డి,పొన్నాల చంద్ర, నరసింహచారి పేదల కష్టాలు తెలుసుకునేందుకు వేసిన తొలి అడుగుకు ఆరేళ్లు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి నేటి (సోమవారం)తో ఆరు వసంతాలయ్యాయి. 2017 నవంబరు 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2017 నవంబరు 14 నుంచి 2018 డిసెంబర్ 3వ తేదీ వరకు 18 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఏడు నియోజకవర్గాలు, 14 మండలాలు, 66 గ్రామాలమీదుగా 263 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది జననేతతో కలసి అడుగులు వేశారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను, అనుభవాలను మేనిఫెస్టోగా రూపొందించి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. రెండేళ్లలో 90శాతం, నాలుగున్నరేళ్లలో 99 శాతం హామీలు అమలు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రకు ఆరు వసంతాలు పూర్తయిన సందర్భంగా సోమవారం కర్నూలులో పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కటింగ్ చేయనున్నట్లు జిల్లా కమిటీ పేర్కొంది. -
Fact Check: షరతులతోనే జగన్ పాదయాత్ర
సాక్షి, అమరావతి: చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నది రాజ్యాంగం స్పష్టం చేస్తున్న అంశం. కానీ చట్టానికి తాము అతీతమన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహరిస్తోంది. అందుకు ‘ఈనాడు’, ఇతర ఎల్లో మీడియా వత్తాసు పలుకుతూ వక్రీకరణలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయి. చంద్రబాబు, ఈనాడు రామోజీరావుకు మధ్య పరస్పర వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉండొచ్చు. అందుకోసం చంద్రబాబును అర్జంటుగా సీఎంను చేసేయాలని రామోజీరావు ఆరాటపడుతూ ఉండొచ్చు. లోకేశ్కు లేని ప్రజాదరణను ఉన్నట్టుగా చూపించేందుకు నానా తంటాలు పడొచ్చు. కానీ చట్టానికి వాటితో ఏం పని? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలా కాకుండా చట్టం తమ చుట్టం అని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు భావిస్తూ రాజకీయ రాద్ధాంతం చేస్తుండటం విస్మయ పరుస్తోంది. అందుకే తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందంటూ కట్టుకథలతో కనికట్టు చేసేందుకు ఈనాడు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయానికి పాల్పడుతోంది. లోకేశ్ పాదయాత్రకు నిబంధనల మేరకు పోలీసు శాఖ అనుమతిచ్చింది. అయినా సరే ‘యువ గళానికి ఆంక్షల సంకెళ్లు’ అంటూ ఈనాడు పత్రిక బుధవారం ఓ కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తాజా నిదర్శనం. పాదయాత్ర సజావుగా సాగేందుకు పోలీసులు చట్టంలో ఉన్న అతి సామాన్యమైన షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ఆ షరతులు ఇప్పటికిప్పుడు కొత్తగా పెట్టినవి కావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్న భారత పోలీసు చట్టంలో పేర్కొన్నవే అవి. 2009లో సుప్రీంకోర్టు తన తీర్పులో కూడా స్పష్టం చేసిన షరతులనే ప్రస్తుతం పోలీసులు తమ అనుమతి పత్రంలో పేర్కొన్నారు. నాడు పోలీసులు నిర్దేశించిన, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షరతులు ఇలా.. ► వైఎస్సార్సీపీ స్థానిక నేతలు పాదయాత్ర రూట్మ్యాప్ను జిల్లా ఎస్పీలు/ నగర పోలీసు కమిషనర్లు, సంబంధిత ప్రాంతంలోని పోలీసు అధికారులకు ముందుగా తెలియజేయాలి. ► పాదయాత్రలోకానీ, పాదయాత్ర సందర్భంగా నిర్వహించే సభల్లో కానీ.. వచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీదే. అంటే పాదయాత్ర నిర్వాహకులదే. వలంటీర్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నియంత్రించే బాధ్యత తీసుకోవాలి. ► పాదయాత్ర శాంతియుతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. ► ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగితే, అల్లర్లు చెలరేగితే ఆ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు ఆ పాదయాత్ర నిర్వాహకులు కూడా బాధ్యత వహించాలి. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే కార్యకర్తలపై కేసులు పెడతారు. కానీ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నిర్వాహకులు తెరవెనుక ఉండిపోతారు. ఆ విధంగా కాకుండా వారిపై కూడా పోలీసులు తగిన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. పాదయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని...అందుకు విరుద్ధంగా ఏదైనా విధ్వంసం జరిగితే తాము బాధ్యత వహిస్తామని నిర్వాహకులు ముందే లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. ► పాదయాత్ర కొనసాగే పరిధిలోని పోలీస్స్టేషన్ హౌస్ అధికారి ప్రత్యేకంగా ప్రైవేట్ వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని మరీ పాదయాత్ర/సభను వీడియో తీయించాలి. ఏదైనా విధ్వంసం జరిగితే సంబంధిత వీడియో క్లిప్పింగులను ఆధారాలుగా పరిగణిస్తూ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డు చేయాలి. ఆ వీడియో సీడీనీ మెజిస్ట్రేట్ ఎదుట సమర్పించాలి. ► పాదయాత్రలో ఏదైనా విధ్వంసం సంభవిస్తే నిర్వాహకులు వెంటనే పోలీసు అధికారులను కలవాలి. పాదయాత్ర శాంతియుతంగా నిర్వహించేందుకు గాను రూట్మ్యాప్లో మార్పులు చేయాలి. ► ఎటువంటి ఆయుధాలను పాదయాత్రలో అనుమతించరు. ► పాదయాత్రలో ఏదైనా విధ్వంసంగానీ, దుస్సంఘటనగానీ జరిగితే పోలీసులు తగిన వీడియో ఆధారాలతో ప్రభుత్వానికి నివేదించాలి. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నివేదికను రూపొందించాలి. అవసరమైతే వాటిని హైకోర్టుకుగానీ సుప్రీంకోర్టుకుగానీ సమర్పించాలి. ఎందుకంటే ఆ విధ్వంసం/ దుర్ఘటనపై సుమోటోగా హైకోర్టుగానీ సుప్రీంకోర్టుగానీ కేసు నమోదు చేయవచ్చు. అప్పుడు విచారణకు ప్రభుత్వం ఆ నివేదికను సమర్పించాలి. ► పాదయాత్రలో ఏదైనా విధ్వంసంగానీ దుర్ఘటనగానీ సంభవిస్తే న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తాయి. బాధితులకు నిర్వాహకులతో నష్టపరిహారాన్ని ఇప్పిస్తాయి. అందుకోసం అవసరమైతే సిట్టింగ్/ రిటైర్డ్ న్యాయమూర్తితో క్లైమ్ కమిషన్ను న్యాయస్థానం ఏర్పాటు చేస్తుంది. ► పాదయాత్ర సందర్భంగా ఏదైనా విధ్వంసంగానీ దుర్ఘటనగానీ సంభవిస్తే మీడియా (ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా) బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛ కల్పించింది. కానీ సంచలనాలకు కాకుండా సంయమనానికి మీడియా అధిక ప్రాధాన్యమివ్వాలి. అందుకోసం మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి. మీడియాను నియంత్రించడం అని కాదు గానీ ప్రెస్ కౌన్సిల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించేలా పర్యవేక్షించాలి. వైఎస్ జగన్ పాదయాత్రకు అనుమతి కోరుతూ ఆయన పీఎస్ పి.కృష్ణమోహన్రెడ్డి 2017లో అప్పటి డీజీపీకి సమర్పించిన దరఖాస్తు ఇప్పుడెందుకీ రాద్ధాంతం? భారత పోలీసు చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అవే షరతులతో ప్రస్తుతం పోలీసు శాఖ నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతిచ్చింది. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రకు విధించిన షరతులనే ప్రస్తుతం పేర్కొంది. కొత్తగా ఎలాంటి షరతూ విధించ లేదు. పోలీసులకు రూట్మ్యాప్ను ముందుగా తెలపాలి.. రూట్మ్యాప్కు కట్టుబడి పాదయాత్ర సాగాలి.. నిర్ణీత ప్రదేశాల్లోనే సభలు నిర్వహించాలి.. ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదు.. ఎవరూ మారణాయుధాలు కలిగి ఉండకూడదు.. ఇలా ఎప్పటి నుంచో దేశంలో అమలులో ఉన్న సాధారణ షరతులనే పోలీసులు విధించారు. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తాము ఆనాడు తలచుకుని ఉంటే వైఎస్ జగన్ పాదయాత్ర చేయగలిగేవారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండటం హాస్యాస్పదం. ఇటీవల చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటలతో 11 మంది దుర్మరణం చెందారు. అందుకే పాదయాత్ర నిర్వాహకులు అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని.. అంబులెన్స్కు దారి ఇవ్వాలని సూచించారు. అందులో తప్పుబట్టడానికి ఏముంది? కేవలం నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన లభించడం లేదన్నదే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు ఆందోళన. అందుకే పోలీసులు సాధారణ షరతులతో ఇచ్చిన అనుమతిని వక్రీకరిస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. తద్వారా లోకేశ్ పాదయాత్ర పట్ల లేని హైప్ను సృష్టించేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోందనిపరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసుల షరతులు, సుప్రీంకోర్టు తీర్పులోని షరతులతో పాదయాత్రకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం షరతులకు కట్టుబడే.. చరిత్రాత్మక పాదయాత్ర పోలీసు శాఖ విధించిన షరతులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తునే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పూర్తి చేశారు. తన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను 2017 నవంబరు 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించి 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించి.. 2019 జనవరి 10న ఇచ్ఛాపురంలో ముగించారు. పాదయాత్ర రూట్మ్యాప్ను నిర్వాహకులు ముందుగానే సంబంధిత పోలీసు అధికారులకు అందజేశారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రూట్మ్యాప్ రూపొందించారు. సభలు నిర్వహించేందుకు తగినంత విశాలమైన ప్రదేశాలను నిర్వాహకులు ముందుగానే ఎంపిక చేసుకుని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆమోదించిన తర్వాతే ఆ ప్రదేశాల్లో సభలు నిర్వహించారు. ఎక్కడ కూడా ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో కాదని మరోచోట సభ నిర్వహించ లేదు. అంత పకడ్బందీగా రూట్మ్యాప్ అనుసరించారు. మైక్లను ఉపయోగించేందుకు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. పాదయాత్రలో, పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలు సక్రమంగా నిర్వహించేందుకు పార్టీ వలంటీర్లను ముందే నియమించారు. అందుకే అంతటి సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడా సాధారణ జనజీవనానికి ఇబ్బందులుగానీ ట్రాఫిక్ సమస్యలుగానీ తలెత్తనే లేదు. ఎక్కడా తోపులాటలుగానీ తొక్కిసలాటలుగానీ సంభవించలేదు. ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం సజావుగా, సక్రమంగా సాగింది. వైఎస్ జగన్ పాదయాత్రకు విశాఖపట్నం పోలీసులు విధించిన షరతులు, మైక్ వినియోగానికి జారీ చేసిన అనుమతి పత్రం వైఎస్ జగన్ పాదయాత్రకు షరతులతోనే అనుమతి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ఉన్న వైఎస్సార్సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017లో ‘ప్రజా సంకల్ప యాత్ర’పేరుతో చేపట్టిన పాదయాత్రకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పోలీసు శాఖ షరతులతోనే అనుమతి మంజూరు చేసింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన పీఎస్ పి.కృష్ణమోహన్రెడ్డి డీజీపీకి దరఖాస్తు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కూడిన బృందం అప్పటి డీజీపీ సాంబశివరావును కలిసి పాదయాత్రకు అనుమతి కోరింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే డీజీపీ షరతులతో కూడిన అనుమతినిచ్చారు. పోలీసులు ఎన్నో షరతులు విధించడంతోపాటు సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన మార్గదర్శకాలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పాదయాత్ర సాగే జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఆ షరతుల అమలును కచ్చితంగా పర్యవేక్షించాలని కూడా ఆయన ఆదేశించారు. -
విజయసంకల్పానికి నాలుగేళ్లు
-
సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం
ఇచ్ఛాపురం రూరల్: సరిగ్గా నాలుగేళ్ల కిందట.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద.. అశేష జన సందోహం ఓ చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలిచింది. 3,648 కిలోమీటర్ల మేర 341 రోజుల పాటు సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ఆఖరి అడుగు లొద్దపుట్టిలో పడింది. ఆ అడుగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పునాదిని పటిష్టం చేసింది. నాలుగేళ్లయినా ఆ జ్ఞాపకాలు సిక్కోలు గుండెల్లో ఇంకా పచ్చగా మెదులుతున్నాయి. ఒక్కడిగా మొదలై.. ఒక్కొక్కరిని కలుపుకుంటూ.. ఉప నదులు తోడైన మహానదిలా రాష్ట్రమంతా సాగిన ఈ పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా సాగిన పాదయాత్ర ఆఖరి ఘట్టంలో వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇంకా చాలా మందికి గుర్తుంది. నేడు అందరితో ప్రశంసలు పొందుతున్న నవరత్నాలను ఆనాడే వైఎస్ జగన్ వివరించారు. పాదయాత్రలో చూసిన కష్టాలతోనే సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారు. ఈ యాత్ర ఇచ్చిన సత్తువతోనే జనం గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. యాత్ర ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురంలో విజయ స్థూపం కూడా ఏర్పాటు చేశారు. ఇదిప్పుడు మంచి పర్యాటక స్థలంగా పేరు పొందింది. కోట్ల హృదయాలను గెలుచుకున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా ఆయన ప్రజల కష్టాలను నేరుగా చూడటంతో అవి తీర్చడానికే హామీలిచ్చి 97 శాతం నెరవేర్చారు. ఆయనతో అడుగులు కలపడం అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం. – పిరియా సాయిరాజు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం ఆ చెమట చుక్కే అభివృద్ధికి చుక్కాని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చిందించిన చెమట చుక్కలన్నీ రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలయ్యాయి. ఓ సమర్థుడైన పాలకుడి పాలన కోసం ఎదురు చూసిన కోట్లాది మంది ప్రజల కలలను నిజం చేస్తూ ఆయన సంక్షేమ పాలన సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇచ్ఛాపురంలో పడిన జగనన్న అడుగుల చప్పుళ్లు, ఇచ్చిన హామీలు, నెరవేర్చిన వైనాలు సిక్కోలు ప్రజలు ఎప్పటికీ తమ గుండెల్లో పదిలంగానే ఉంటాయి. – పిరియా విజయ, జిల్లాపరిషత్ చైర్పర్సన్, శ్రీకాకుళం కలలో కూడా ఊహించని అవకాశం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ము ఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాలు ఇవ్వలేదు. తన క్యాబినెట్లో దళితులకు ఉన్నత పదవులు ఇచ్చిన జగనన్న ఇచ్ఛాపురం శివారు ప్రాంతంలో నన్ను డీసీఎంఎస్ చైర్పర్సన్గా ఎంపిక చేశారు. నాకు ఈ అవకాశం వస్తుందని కలలోనైనా అనుకో లేదు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి, నా లాంటి వంద లాది మందిని అందలమెక్కించారు. – ఎస్.సుగుణ, డీసీఎంఎస్ చైర్పర్సన్ -
జగన్ సంకల్పం... జన సంక్షేమం
సాక్షి, పుట్టపర్తి: ప్రజా సంకల్పయాత్రలో అన్ని వర్గాలను పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ రాష్ట్రంలో సంక్షేమ బాట పరిచారని ఎమ్మెల్యేలు తెలిపారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అన్నదానాలు, పేదలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి నాయకులు సేవాభావం చాటుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే శంకరనారాయణ తెలిపారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచారన్నారు. పెనుకొండలో నాయకులతో కలిసి ఆయన కేట్ చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో తనదైన మార్కు చూపించారని కొనియాడారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ప్రజా సంక్షేమానికి నాంది పలికిన మహా ఘట్టం ‘ప్రజా సంకల్ప యాత్ర’ అని అభివర్ణించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు వర్తింపజేసి.. జనం మెచ్చిన నేతగా జగన్ నిలిచిపోయారన్నారు. సంక్షేమ పాలన ద్వారా జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అమడగూరు మండలం గొల్లపల్లిలో భారీ కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి నాయకులు, పిల్లలకు పంచిపెట్టారు. మడకశిరలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి మడకశిర పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే తిప్పేస్వామి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితోనే సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఐదేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అరి్పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. హిందూపురంలో జయహో జగన్ నినాదం మార్మోగింది. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులరి్పంచిన అనంతరం భారీ కేక్ను ప్రజాప్రతినిధులు, నాయకులు కట్ చేశారు. పేదలకు అన్నదానం చేసి సేవాభావం చాటుకున్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ధర్మవరం పీఆర్టీ సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. (చదవండి: ఫ్యామిలీ డాక్టర్’: వైద్యం మరింత చేరువ) -
Praja Sankalpa Yatra: జనం చెంతకు జగనన్న అడుగులు (ఫోటోలు)
-
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
YSRCP Plenary 2022: తిరుగులేని శక్తి.. అలుపెరుగని పోరు సాగించిన వైఎస్ జగన్
రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీని అణగదొక్కడానికి చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొంది. అయినప్పటికీ వైఎస్ జగన్ ఒకే మాట.. ఒకే బాటగా ముందుకు సాగారు. ఏ దశలోనూ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు. సవాళ్లే సోపానాలుగా మలుచుకుని.. ఇద్దరితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ ప్రస్తానాన్ని మూడో ప్లీనరీ నేపథ్యంలో ఓ సారి తరచి చూద్దాం. సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారన్న విషాద వార్తను తాళలేక వందలాది మంది మరణించడం వైఎస్ జగన్ను, ఆయన కుటుంబీకులను తీవ్రంగా కలచివేసింది. ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ మేరకు 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్ను ఆదేశించింది. రాజకీయాలకు ఈ యాత్రతో ఏమాత్రం సంబంధం లేదని, తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికే యాత్ర చేపట్టామని తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వైఎస్ జగన్ వివరించినా లాభం లేకపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. ప్రజల నుంచి అపూర్వ ఆదరణ రావడంతో ఓర్వలేకపోయిన కాంగ్రెస్లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై కుట్రలకు తెరతీశాయి. వైఎస్ జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలని నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్ అధిష్టానం లేఖ రాయిస్తే.. కాంగ్రెస్ కనుసైగల మేరకు వైఎస్ జగన్ ఆస్తులపై దర్యాప్తు చేయించాలని నాటి ఎంపీ కె.ఎర్రన్నాయుడుతో టీడీపీ లేఖ రాయించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ, స్థానాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఓ వైపు ఓదార్పు యాత్రను కొనసాగిస్తూనే.. మరో వైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టారు. అప్పటి నుంచి అధికారం చేజిక్కించుకునే వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఇలా ఉన్నాయి. చరిత్రాత్మకంగా ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజాసంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో.. మండుటెండలో.. కుంభవృష్టిలో 14 నెలలపాటు 3,648 కి.మీ. దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. అన్నిచోట్లా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాలను కట్టబెట్టారు. అజేయశక్తిగా అవతరణ 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. దీంతో వరుసగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో పూర్తికావస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్లీనరీ ఏర్పాట్లు వైఎస్సార్సీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు ►02.09.2009 : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్ట్టర్ ప్రమాదంలో హఠాన్మరణం ►09.04.2010: ఓదార్పు యాత్ర ప్రారంభం ►27.11.2010 : తమ ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టారనే అక్కసుతో వైఎస్ జగన్ ఆస్తులపై విచారణ జరపాలని లేఖలు రాసిన కాంగ్రెస్, టీడీపీ ►29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ రాజీనామా ►21.12.2010: రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలనే డిమాండ్తో విజయవాడ కృష్ణా నదీ తీరాన వైఎస్ జగన్ ‘లక్ష్య దీక్ష’ ►11.03.2011: వైఎస్సార్సీపీ పేరు ప్రకటించిన వైఎస్ జగన్ ►12.03.2011: ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద వైఎస్సార్సీపీ పతాకం ఆవిష్కరణ, పార్టీ ఏర్పాటుపై ప్రకటన ►13.05.2011: కడప లోక్సభ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్ 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి. ►08.07.2011:ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ తొలి ప్లీనరీ ►10.08.2011: కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు చేసిన ఫిర్యాదులు ఆధారంగా వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు. ►21.08.2011: వైఎస్సార్సీపీలో చేరుతూ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు 19 మంది రాజీనామా. నెల్లూరు లోక్సభ స్థానానికి మేకపాటి రాజమోహన్రెడ్డి రాజీనామా. ►27.05.2012: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ ►14.06.2012: ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ►21.12.2012: అక్రమ కేసులపై ‘జగన్ కోసం జనం’ పేరుతో కోటి సంతకాల సేకరణ ►24.09.2013: అక్రమ కేసుల్లో బెయిల్పై విడుదలైన వైఎస్ జగన్ ►05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్ పాండ్లో వైఎస్ జగన్ ఆమరణ దీక్ష ►18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం ►16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం ►20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్కు గుర్తింపు ►21.02.2015: అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన వైఎస్ జగన్ ►10.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా ►29.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర బంద్ ►26.01.2017: విశాఖ ఆర్కే బీచ్లో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ జగన్ను రన్ వేపైనే అరెస్టు చేసిన పోలీసులు ►01.05.2017: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష ►08.07.2017: నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న మైదానంలో వైఎస్సార్సీపీ రెండో ప్లీనరీ ►26.10.2017: వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయకపోవడాన్ని, శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతుండటాన్ని నిరసిస్తూ శాసనసభ సమావేశాలను బాయ్కాట్ చేసిన వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. ►06.11.2017:ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం ►25.10.2018: విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై హత్యాయత్నం ►09.01.2019: శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం వద్ద ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు ►23.05.2019: ఎన్నికల్లో ఘన విజయం ►30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం -
ఆదర్శ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి 90 శాతం హామీలను నెరవేర్చి దేశంలో ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇది ఏపీకి ఎంతో గర్వకారణమని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలన్నింటినీ కళ్లారా చూసి, వాటిని మేనిఫెస్టోలో హామీల రూపంలో పొందు పరిచి, ఆచరణలో చేసి చూపించిన అరుదైన నేత అని కొనియాడారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ వైఎస్ జగన్ తన 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం జగన్ అందరి ఆదారాభిమానాలు చూరగొంటూ ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి.. దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం, కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ స్పష్టమైన విజన్తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. పాదయాత్రికులకు సత్కారం నాడు వైఎస్ జగన్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న రోశయ్య (అద్దంకి నియోజకవర్గం), డానియేల్, (ప్రత్తిపాడు నియోజకవర్గం), హరికృష్ణ (తిరుపతి నియోజకవర్గం), సురేష్ (నారావారిపల్లె), విక్రమ్ (కైకలూరు), ఇక్బాల్ బాషా (నంద్యాల), గోవిందరాజు (సత్తెనపల్లి), ఆనందరావు (పెదకూరపాడు), శ్రీనివాసరరెడ్డి (పాణ్యం), శ్రీను(అమలాపురం), వెంకటేశ్వరరెడ్డి (నరసరావుపేట), సతీష్ (పార్వతీపురం) తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ నారమల్లి పద్మజ పాల్గొన్నారు. -
మూడేళ్లు పూర్తి చేసుకున్నప్రజాసంకల్ప యాత్ర
-
CM YS Jagan: మరోసారి గొప్పమనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, గుంతకల్లు టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. సంకల్పయాత్రలో తన వెంట నడుస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోగా, ఆదుకుంటానని ఆ కుటుంబానికి ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సాయమందించి భరోసా ఇచ్చారు. వివరాలు.. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రంగారెడ్డి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని. ఇతనికి భార్య రమణమ్మ, కుమార్తెలు భారతి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఇడుపులపాయ నుంచి రంగారెడ్డి ఆయన వెంట నడిచారు. నెల్లూరు జిల్లా కాండ్ర గ్రామంలో అభిమాన నేతతో కరచాలనం చేసి ఫొటో కూడా దిగారు. అదే రోజు మధ్యాహ్నం రంగారెడ్డికి గుండెపోటు రావడంతో గూడూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. చదవండి: (బాబుది కుట్రపూరిత మనస్తత్వం) రూ.10 లక్షల చెక్కును రంగారెడ్డి కుటుంబసభ్యులకు అందజేస్తున్న ఎమ్మెల్యే వైవీఆర్ కుటుంబాన్ని ఆదుకుంటానని జగన్ హామీ రంగారెడ్డి మృతి వార్త తెలుసుకున్న వైఎస్ జగన్ కాండ్ర గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి సీఎం జగన్కు గుర్తు చేయగా, వెంటనే స్పందించిన ఆయన రూ.10 లక్షల చెక్కు పంపారు. ఈ చెక్కును ఎమ్మెల్యే వైవీఆర్ శనివారం పెద్దొడ్డి గ్రామపెద్దల సమక్షంలో రంగారెడ్డి కుటుంబసభ్యులకు అందజేశారు. సీఎం జగన్కు రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. -
చెక్కు చెదరని దృఢ సంకల్పం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు అంటూ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు, పార్టీ జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా.. లేదా.. అని ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్.. అంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు కదంతొక్కాయి. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసిన విషయం తెలిసిందే. పాదయాత్ర స్ఫూర్తితో 29 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే 97%› హామీలు నెరవేర్చారు. ఎన్నో విప్లవాత్మక చట్టాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగింది. తిరుపతిలో ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పండుగలా సాగిన సంబరాలు ► తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు. కుప్పంలో పార్టీ శ్రేణులు జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశాయి. ► అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాదయాత్రలు చేపట్టారు. పెనుకొండలో మంత్రి శంకరనారాయణ కేక్ కట్ చేశారు. అనంతపురంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ పాదయాత్ర నిర్వహించారు. ► వైఎస్సార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజాద్బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు. ► కర్నూలు జిల్లాలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. ఆలూరులో కార్మిక శాఖ మంత్రి జయరాం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ప్రకాశం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ► నెల్లూరులో మంత్రి అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు కేట్ కట్చేసి సంబరాలు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ► గుంటూరు నగరంలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కేక్లు కట్ చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు పాదయాత్రలు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి, కేక్లు కట్ చేశారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు పాదయాత్ర చేశారు. ► తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్కట్ చేశారు. ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో లాలాచెరువు సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు జరిగాయి. నరసన్నపేటలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని కేక్ కట్ చేశారు. ► విజయనగరం జిల్లాలో సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. కురుపాంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పాదయాత్ర సాగింది. ► విశాఖలో వాడవాడలా వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టారు. జగదాంబ సెంటర్లో వైఎస్సార్సీపీ భారీ జెండాతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గుడిలోవలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. కొయ్యూరు మండలంలోని కంఠారంలో ఎంపీ గొడ్డేటి మాధవి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్. చిత్రంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు కోవిడ్ సంక్షోభం నుంచి ప్రగతిపథంలోకి.. కోవిడ్ సంక్షోభంలో దేశం గర్వించేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అవినీతి మయంగా ఉండిందని, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి.. మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. వైఎస్ జగన్ నాడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, మాట్లాడుతూ.. సీఎం జగన్ అభివృద్ధి – సంక్షేమం అనే రెండు చక్రాల మీదుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. అనంతరం పాదయాత్రలో వైఎస్ జగన్తో పాటు అడుగులు వేసిన వారిని సన్మానించారు. -
ఏపీ వ్యాప్తంగా నాలుగేళ్ల సంకల్ప యాత్ర పండుగ
-
ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్ర: సజ్జల
సాక్షి, తూర్పుగోదావరి: ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్రగాప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. ప్రజాసంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ వెనుకాడలేదని గుర్తుచేశారు. చదవండి: సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ ప్రజలు సీఎం వైఎస్ జగన్వైపే నిలిచారని సజ్జల అన్నారు. సంక్షేమాన్ని అడ్డుకోవడమే ప్రతిపక్షానికి తెలిసిన రాజకీయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించి నేటికి నాలుగేళ్లు పూర్తి అయింది. నవంబర్6, 2017న ఇడుపులపాయలో ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యారు సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యారని పేర్కొన్నారు. అధికారం చేపట్టగాలనే సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ నడుంబిగించారని తెలిపారు. రూ.లక్షా 40 వేల కోట్లు పేద ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. సాగునీటి సమస్యల లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. -
జననేత జగనన్నా.. ‘ప్రజా సంకల్పం’ నీదన్నా..
-
సీఎం జగన్ ప్రజాసంకల్పయాత్ర నాలుగేళ్ల పండగ
-
అలా ఆలోచించింది నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్ మాత్రమే'
సాక్షి, విజయవాడ: ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టారని దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ పేదల గురించి ఏనాడూ ఆలోచించలేదు. క్యాపిటల్, పెట్టుబడిదారులు, తమ సామాజికవర్గం వారి గురించి మాత్రమే చంద్రబాబు ఆలోచన చేశాడు. పేదల గురించి ఆలోచించింది ఆనాడు వైఎస్సార్.. నేడు జగన్ మాత్రమే. ఎండ, వాన లెక్క చేయకుండా 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అనేక ఘటనలు వైఎస్ జగన్కు ఎదురయ్యాయి. మ్యానిఫెస్టోని రెండేళ్లలోనే నెరవేర్చారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజల నాడి, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్. ప్రజలకి మంచి చేయాలన్న మనసున్న వ్యక్తి. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది. చదవండి: (నాలుగేళ్ల ‘ప్రజా సంకల్పం’.. సీఎం జగన్ ట్వీట్) పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే జగన్పై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకూ ప్రజలు మాకు అండగా నిలిచారు. రేపు జరగబోయే ఎన్నికల్లోనూ మాదే విజయం. ఏపీలో ప్రతిపక్షపార్టీల అవసరం లేదు. జనసేన, బీజేపీ, టీడీపీలు చూడ్డానికి మాత్రమే విడివిడిగా ఉండే రాజకీయ పార్టీలు. సీఎం జగన్పై దాడి చేయడానికి మాత్రం మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజలు మాతో ఉన్నారు. రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా భారతదేశంలో పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని సగర్వంగా చెబుతున్నాం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ) -
నాలుగేళ్ల ‘ప్రజా సంకల్పం’.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం సృష్టించిన చరిత్రాత్మక ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని’’ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 6, 2021 చదవండి: మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం -
సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యేలు
-
సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ
Updates: వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్దే: ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగిరిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగిరి ఓం శక్తి సర్కిల్ నందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత పడుతున్న కష్టాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించాలని దృఢ సంకల్పంతో సంకల్ప పాదయాత్ర చేపట్టారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సర కాలంలోనే సమస్యలకు పరిష్కారం చూపుతూ తానిచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం నెరవేర్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్సైడ్గా సీఎం జగన్కు విజయాన్ని అందిస్తున్నారు. ఆనాడు సీఎం జగన్ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు జగన్ వైపు నిలబడ్డారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాగ్దానాలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టుబడి తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని ప్రాంతాల వారికి సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానిక వైఎస్సార్ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి పాదయాత్రను ప్రారంభించారు. గుంటూరులో.. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు గుంటూరు నగరపాలెంలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి హిమని సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో.. గూడూరులో జనహృదయనేత సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ వైఎస్సార్ విగ్రహం నుంచి సాదుపేట సెంటర్ వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో.. సీఎం జగన్ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ 10 ఏళ్ల కష్టం ప్రజలందరికీ తెలుసు: భూమన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసికున్న సందర్భంగా వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తుడా సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహం వద్ద సర్వమత ప్రార్ధనలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తుడా వైఎస్సార్ సర్కిల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీషా, కార్పొరేటర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 10 ఏళ్లు పడ్డ కష్టం ప్రజలందరికీ తెలుసు. నాడు వైఎస్ పాదయాత్రతో ఎలా ప్రభంజనం సృష్టించారో, అదే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని, రెండు పేజీలు మ్యానిఫెస్టోలో పెట్టి నవరత్నాలుగా మార్చి ప్రజలకు అందించారు. కోట్లాది మంది ప్రజల కష్టాలు తెలుసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారు. చంద్రబాబు నిరంతరం దూషిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అయ్యింది. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్కే పట్టం కట్టారు. 3,648 కి.మీ ప్రజా సంకల్ప పాదయాత్ర సువర్ణ చరిత్ర అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి: ప్రజాసంకల్ప పాదయాత్ర 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుంది. విపక్ష నేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా.. ప్రజాసంకల్పయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నిడమర్రు మండలం బువ్వనపల్లిలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించాయి. విజయవాడలో.. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు ఈ సంబరాల్లో పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ భాగ్యలక్ష్మి పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. చిత్తూరు జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో వైఎస్ జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు, నేతలు పాలాభిషేకం చేశారు. ప్రజా సంకల్ప యాత్రను గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎండనక వాననక వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచి పోయిందని అంటున్నారు. వైఎస్సార్ జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేంపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుండి రాయచోటి బైపాస్లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్ రెడ్ది, ఎంపీపీ గాయత్రి, కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నవంబర్ 6వ తేదీతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నేడు (శనివారం) పాదయాత్రలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం పాదయాత్రతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాలని, సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని, కేక్ కటింగ్ చేయాలని ఆయన తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకుని అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలోనే 97 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. నాటి పాదయాత్రను గుర్తు చేస్తూ.. ఈనాటి జగనన్న పరిపాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కాగా, నవంబర్ 6, 2017న ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 134 నియోజకవర్గాల్లో 231 మండలాల్లో 2,516 గ్రామాల్లో కొనసాగింది. అడుగడుగున పేదల కష్టాలను తెలుసుకున్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ఆనాడే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అధికారం చేపట్టగానే యాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి నడుంకట్టారు. -
సీఎం వైఎస్ జగన్ పాదయాత్రకు నేటికి సరిగ్గా నాలుగేళ్లు
-
13 జిల్లాల ప్రజా సంకల్పం.. 14 నెలల సుదీర్ఘ ప్రయాణం
4 Years Of Praja Sankalpa Yatra: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో (శనివారం) నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. (చదవండి: మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం) ►134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ►341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. – –124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. ►క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్ పాదయాత్ర చేశారు. ►ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగింది. ►ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగింది. ►జనం మధ్యే అడుగు మొదలుపెట్టి.. జనం మధ్యే జగన్ విడిదిచేశారు. ►పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందకు సాగారు జగన్. ►నేను ఉన్నానంటూ.. వారికి ఎనలేని భరోసా నిచ్చారు. ►చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను తాను చూశానని, కచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ►వివక్షలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. ►ప్రజల ముంగిటకే సేవలను తీసుకొస్తానని చెప్పారు. ►దీంట్లో భాగంగానే మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, అవినీతిలేని, వివక్షలేని రీతిలో ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయి. ►గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజససాధనేలో కొత్త ఒరవడిని సృష్టించాయి. ►గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చాయి. ►సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ►ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ .. సేవలందించడానికి వచ్చారు. ►మళ్లీ పల్లెలకు కొత్త కళ వచ్చింది. ►గ్రామాలకు ఆస్తులు వచ్చాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు.. ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూర్చబడ్డాయి. ►అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఇవన్నీ.. ప్రజా సంకల్ప యాత్రలో మొగ్గ తొడిగినవే. ►ప్రజా సంకల్పయాత్ర ద్వారా ఇచ్చిన హామీలు, వాటిని దాదాపుగా అమలు చేయడంతో... జగన్ అనే పేరు విశ్వసనీయతకు మరో రూపంగా నిలబడింది. ►ప్రజాసంకల్పయాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర చరిత్రలోనే చరిత్రాత్మక విజయాన్ని వైఎస్ జగన్ సాధించారు. ►నాలుగేళ్ల కిత్రం మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ►మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. ►ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్ను రూ.2,250కి పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. ►మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం కలిగించారు. ►తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. ►మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన జగన్ అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్నీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ►మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశా చట్టం తెచ్చారు. చట్టంగా కేంద్రం ఇంకా ఆమోదించకపోయినా.. చట్టం స్ఫూర్తిని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తున్నారు. ►అధికారం చేపట్టిన రెండున్నరేళ్లు అయినా ప్రజల గుండెచప్పుడు నుంచి జగన్ ఎప్పుడూ దూరంకాలేదు. ►ప్రజాసంకల్పయాత్ర స్ఫూర్తి పాలనకలో కొనసాగుతూనే ఉంది. ►అందుకే తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక, కార్పొరేషన్లు, మున్సిపల్ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూనే ఉంది. ►ప్రజలనాడిని, వారి గుండె చప్పుడు ప్రమాణాలుగా తీసుకోవడం వల్లే ఈ విజయాలు సాధ్యం అవుతున్నాయి. ►గత రెండున్నరేళ్లకాలంలోని ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ వచ్చినా.. ప్రజా సంకల్పయాత్రలో జగన్గారు తనదిగా మార్చుకున్న ప్రజల గొంతుక ప్రకారమే.. సంక్షేమ పథకాల అమలు దేశంలోనే అగ్రగాయి రాష్ట్రంగా ఏపీ నిలవగలిగింది. ఇంతటి కోవిడ్ విపత్తు సమయంలోకూడా ఆకలి చావుకు తావులేకుండా పరిపాలన కొనసాగింది. ‘ప్రజా సంకల్ప యాత్ర’ మరిన్ని వివరాలు: ►వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ వేదికగా 2017, నవంబరు 6వ తేదీన ప్రారంభమైన వైఎస్ జగన్ సుదీర్ఘ ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్రమంతటా 13 జిల్లాలలో 341 రోజులు కొనసాగి, బుధవారం (జనవరి 9, 2019) నాడు ఇచ్ఛాపురంలో పూర్తి కానుంది. వైఎస్సార్ జిల్లాలో.... ఇడుపులపాయలో 2017, నవంబరు 6న ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర, వైయస్సార్ జిల్లాలో అదే నెల 13వ తేదీ వరకు కొనసాగింది. జిల్లాలో 5 నియోజకవర్గాలలో 7 రోజుల పాటు 93.8 కి.మీ నడిచారు. 5 చోట్ల బహిరంగ సభలతో పాటు, 3 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. జిల్లాలో యాత్ర చివరి రోజున మైదుకూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో.. అదే ఏడాది నవంబరు 13వ తేదీన (యాత్ర 7వ రోజు) ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రి వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశించిన వైఎస్ జగన్ 18 రోజుల పాటు 263 కి.మీ నడిచారు. మొత్తం 7 నియోజకవర్గాలలో పర్యటించిన జననేత, 8 బహిరంగ సభలతో పాటు, 6 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘అనంతపురం’లో.. ఆ తర్వాత 2017, డిసెంబరు 4వ తేదీన (యాత్ర 26వ రోజు) అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్, 20 రోజులు పర్యటించి 9 నియోజకవర్గాలలో మొత్తం 279.4 కి.మీ నడిచారు. 10 చోట్ల బహిరంగ సభలతో పాటు, 4 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో.. పాదయాత్రలో 46వ రోజున (2017, డిసెంబరు 28) ఎద్దులవారికోట వద్ద చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్, 23 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించి మొత్తం 291.4 కి.మీ నడిచారు. జిల్లాలో 8 బహిరంగ సభలతో పాటు, 9 చోట్ల ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘కోస్తా’ లోకి ప్రవేశం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2018, జనవరి 23వ తేదీన (యాత్ర 69వ రోజున) కోస్తాలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లా పీసీటీ కండ్రిగ వద్ద ఆయన కోస్తాలోకి అడుగు పెట్టారు. నెల్లూరు జిల్లాలో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో యాత్ర చేసిన జననేత 266.5 కి.మీ నడిచారు. 9 బహిరంగ సభలతో పాటు, 6 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో.. 2018, ఫిబ్రవరి 16వ తేదీన (యాత్ర 89వ రోజు) కందుకూరు నియోజకవర్గం, లింగ సముద్రం మండలంలోని కొత్తపేట వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్, 21 రోజులు పర్యటించారు. జిల్లాలో 9 నియోజకవర్గాలలో ఆయన 278.1 కి.మీ నడిచిన ఆయన, 9 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు, 2 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో.. మార్చి 12వ తేదీన (యాత్ర 110వ రోజు) బాపట్ల నియోజకవర్గం, అదే మండలంలోని స్టూవర్టుపురం వద్ద గుంటూరు జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్, 12 నియోజకవర్గాలలో 26 రోజులు పర్యటించారు. జిల్లాలో 281 కి.మీ నడిచిన ఆయన, 11 బహిరంగ సభలతో పాటు, 3 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో.. ఆ తర్వాత ఏప్రిల్ 14వ తేదీన (యాత్ర 136వ రోజు) కనకదుర్గమ్మ వారధి వద్ద ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. వారధి వద్దకు అశేష జనవాహిని తరలి రావడంతో ఒక దశలో ఆ వంతెన కుంగి పోతుందా? అన్నట్లుగా మారింది. దీంతో పోలీసులు వంతుల వారీగా ప్రజలను వంతెనపైకి అనుమతించారు. కృష్ణా జిల్లాలో 24 రోజుల పాటు 239 కి.మీ నడిచిన వైఎస్ జగన్, 12 నియోజకవర్గాలలో పర్యటించారు. 10 బహిరంగ సభలు సమావేశాలు, 5 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘పశ్చిమ గోదావరి’ లో.. మే 13వ తేదీ (యాత్ర 160వ రోజున) దెందులూరు నియోజకవర్గం, కలకర్రు వద్దపశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్, 13 నియోజకవర్గాలలో పర్యటించారు. జిల్లాలో 27 రోజుల పాటు 316.9 కి.మీ నడిచిన జననేత, 11 బహిరంగ సభలతో పాటు, 5 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘తూర్పు గోదావరి’ లో.. జూన్ 12వ తేదీ (యాత్ర 187వ రోజు)న కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి మాతకు హారతి, ప్రత్యేక పూజల అనంతరం గోదావరి రైల్ కమ్ రోడ్ వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్న వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు. జిల్లాలో సరిగ్గా రెండు నెలలు సాగిన వైఎస్ జగన్ పాదయాత్ర ఆగస్టు 13న ముగిసింది. జిల్లాలో 50 రోజులు పాదయాత్ర చేసిన ఆయన 17 నియోజకవర్గాలలో 412 కి.మీ నడిచారు. 15 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు, 2 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘విశాఖ’ జిల్లాలో.. గత ఏడాది ఆగస్టు 14వ తేదీ (యాత్ర 237వ రోజు)న నర్సీపట్నం నియోజకవర్గం, నాతవరం మండలంలోని గన్నవరం మెట్ట వద్ద ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 32 రోజుల పాటు, 12 నియోజకవర్గాలలో పర్యటించిన వైఎస్ జగన్, 277.1 కి.మీ నడిచారు. 9 సభలు, సమావేశాలతో పాటు, 2 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘విజయనగరం’ లో.. సెప్టెంబరు 24వ తేదీ (యాత్ర 269వ రోజు)న ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. హత్యా ప్రయత్నం అక్టోబరు 25వ తేదీన జిల్లాలో 294వ రోజు యాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ జగన్, హైదరాబాద్ వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడి విఐపీ లాంజ్లో ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. దీంతో ప్రజా సంకల్పయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 17 రోజుల విరామం తర్వాత నవంబరు 12వ తేదీన యాత్ర తిరిగి మొదలైంది. విజయనగరం జిల్లాలో మొత్తం 36 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో పర్యటించిన వైఎస్ జగన్ 311.5 కి.మీ నడిచారు. 9 బహిరంగ సభలతో పాటు, 2 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ‘శ్రీకాకుళం’ జిల్లాలో.. 2018 నవంబరు 25వ తేదీ (యాత్ర 305వ రోజు)న పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని కడకెల్ల వద్ద వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించారు. కాగా, ఇదే జిల్లాలో యాత్ర 341వ రోజున, బుధవారం (జనవరి 9, 2019) నాడు ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తోంది. జిల్లాలో మొత్తం 37 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించిన వైఎస్ జగన్ 338.3 కి.మీ నడిచారు. 10 చోట్ల బహిరంగ సభలతో 6 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు – మొత్తం రోజులు 341 – 13 జిల్లాలు – నియోజకవర్గాలు 134 – 231 మండలాలు – 2516 గ్రామాలు – 54 మున్సిపాలిటీలు – 8 కార్పొరేషన్లలో పాదయాత్ర – 124 సభలు, సమావేశాలు – 55 ఆత్మీయ సమ్మేళనాలు – 3648 కి.మీ నడక ప్రారంభం – నవంబరు 6, 2017 – ఇడుపులపాయ. ముగింపు – జనవరి 9, 2019 – ఇచ్ఛాపురం. 14 నెలలు -
విజయసంకల్పానికి రెండేళ్లు
-
ప్రజా సంకల్ప యాత్ర తుది ఘట్టానికి రెండేళ్లు
జనం గుండె చప్పుడు వింటూ.. దగా పడ్డ ప్రజల కన్నీళ్లు తుడుస్తూ.. నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి రెండేళ్లు. తెలుగుదేశం కర్కశ పాలనలో బరువెక్కిన హృదయ ఘోష వింటానంటూ.. పేదల పక్షాన నేనున్నానంటూ వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదీన వరుణ దేవుడు ఆశీర్వదించగా ఇడుపులపాయ నుంచి తొలి అడుగు వేశారు. అవ్వాతాతల ఆశీస్సులు.. అమ్మల దీవెనలు, అన్నార్తుల ఆశీర్వాదాలే కొండంత అండగా ప్రజా క్షేత్రంలోకి పాదయాత్ర ద్వారా దూసుకెళ్లారు. టీడీపీ ప్రజా కంఠక పాలనలో ప్రజల సమస్యలే జగన్కు స్వాగత తోరణాలయ్యాయి. ఊరూరా బతుకు భారమైన పేదల ఆవేదనలు, కంట తడి పెట్టించిన సన్నివేశాలు, ప్రజల దీన పరిస్థితుల మధ్య సరిగ్గా 2019 జనవరి 9న జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించారు. ‘మీ కష్టాలన్నీ విన్నాను.. నేనున్నాను..’ అంటూ జగన్ చెప్పిన ఒక్కమాట చితికిపోయిన రాష్ట్ర ప్రజలకు కొండంత గుండె ధైర్యాన్నిచ్చింది. అడుగడుగున ఆవేదనలే.. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకొచ్చిన టీడీపీ అరాచకాలకు అంతులేకుండా ఉండేది. కటిక పేదవాడైనా పైసలిస్తే తప్ప పనులు జరగని చీకటి పాలన అది. పెన్షన్ల కోసం పడిగాపులు గాసే అవ్వా తాతల గోడు వినే నాధుడే లేడు. బువ్వపెట్టే రైతన్న పురుగుల మందు తాగే దయనీయ స్థితి. పెన్షన్కు లంచం... రేషన్ కార్డుకు లంచం.. ఇంటి స్థలానికి లంచం.. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ చొక్కా రాయుళ్ల అరాచకమే ఆనాటి పాలనగా సాగింది. అసెంబ్లీలో నిలదీసిన విపక్ష నేతపై టీడీపీ ఎమ్మెల్యేల దిగజారుడు మాటల దాడి. విపక్ష నేత గొంతునొక్కి వ్యవస్థలను ఖూనీ చేసిన దారుణమైన స్థితి. సంతలో బజారు సరుకుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనేసిన టీడీపీ అవినీతి పాలనను జనం అసహ్యించుకునే రోజులవి. ఈ తరుణంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత వైఎస్ జగన్ తన భుజస్కంధాలకెత్తుకున్నారు. నేనున్నానంటూ జనం మధ్యకు వెళ్లారు. జనం మధ్యే ఆవాసం.. ఒకటి కాదు.. రెండు కాదు... 3,648 కిలోమీటర్లు సాగింది జగన్ పాదయాత్ర. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆయన ప్రజల్లోనే ఉన్నారు. మండువేసవి.. కుండపోత వర్షాలు.. ఎముకలు కొరికే చలి.. మూడు కాలాల్లో.. ప్రతికూల పరిస్థితుల్లోనూ జనంతోనే ఉండి జననేత అన్పించుకున్నారు. తమ కోసం తరలి వచ్చిన జగన్ను ప్రజలూ ఆ స్థాయిలోనే ఆదరించారు. ఊరూరా ముగ్గులేశారు. ఊరంతా సంబరాలు చేసుకున్నారు. 70 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలు సైతం పొన్నుగర్ర పట్టుకుని తరలివచ్చి జననేతకు తమ దీన గాథలు చెప్పుకున్నారు. కూడులేక, గూడులేక, పిల్లలను చదివించే దిక్కులేక అవస్థలు పడే ప్రతీ అక్క, చెల్లెమ్మ.. పాదయాత్రకు తరలివచ్చారు. బతుకే భారమైన ప్రతి ఒక్కరి హృదయ ఘోషను ఆయన విన్నారు. ‘మన ప్రభుత్వం వస్తుంది.. ఓపిక పట్టండి.. అన్నీ నేను పరిష్కరిస్తాను’ అంటూ ఇచ్చిన భరోసా పేదవాడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. విన్నాడు.. చేస్తున్నాడు.. తుది ఘట్టానికి చేరిన పాదయాత్రలో జననేత ఏం చెబుతాడనే ఉత్కంఠతో రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. ఇచ్ఛాపురం ఆ రోజు జన సంద్రమైంది. అనుకున్నట్టే ఆ రోజు జననేత జగన్ తన ఉద్విగ్న ప్రసంగంలో అంధకారమైన రాష్ట్ర భవితవ్యాన్ని ఆవిష్కరించారు. తానొస్తే పేదవాడి కన్నీళ్లు తుడుస్తానని భరోసా ఇచ్చారు. ఫలితంగా 175 అసెంబ్లీ స్థానాలకు 151... 25 పార్లమెంట్ స్థానాలకు 22 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకొచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ వారసుడిగా, ఇచ్ఛాపురం సాక్షిగా చేసిన ప్రతిజ్ఞను ముఖ్యమంత్రిగా నెరవేర్చారు. మేనిఫెస్టోనే ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ప్రతీ ఒక్కరి సంక్షేమానికి బాటలు వేశారు. మేడిపట్టిన నాడే రైతన్నకు మేలు చేస్తానన్న హామీ నిలబెట్టారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లోకి డబ్బులేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు పేదవాడికి బీమా కల్పించే అస్త్రమైంది. చదువుకునే చెల్లెళ్లు, తమ్ముళ్ల ఫీజు కడుతూ యువత మనసులో ‘జగనన్న’గా చెరగని ముద్ర వేసుకున్నారు. పాదయాత్రలో మైలు రాళ్లు ఎన్నెన్నో.. 13 జిల్లాల మీదుగా, 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2,516 గ్రామాలను తాకుతూ ప్రజా సంకల్పయాత్ర 341 రోజులు కొనసాగింది. వైఎస్ జగన్ 124 బహిరంగ సభల్లో మాట్లాడారు. 55 చోట్ల పలు సంఘాల (కమ్యూనిటీ మీటింగ్స్)తో సమావేశం నిర్వహించారు. లక్షల మంది ప్రజలను కలిశారు. వేలాది ప్రజా వినతులను స్వీకరించారు. 2017 డిసెంబర్ 16: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్టూరు వద్ద 500 కి.మీ. 2018 జనవరి 29: నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో 1,000 కి.మీ. 2018 మార్చి 14: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురులో 1,500 కి.మీ. 2018 మే 14: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం వెంకటాపురంలో 2,000 కి.మీ. 2018 జూలై 8: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పసలపూడిలో 2,500 కి.మీ. 2018 ఆగస్టు 24: విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెం వద్ద 3,000 కి.మీ. 2018 డిసెంబర్ 22: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావి వలసలో 3,500 కి.మీ. 2019 జనవరి 9: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద 3,648 కి.మీ - వనం దుర్గా ప్రసాద్ -
సంఘీభావ ప్రభంజనం
-
సంక్షేమానికి నీరాజనం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రమంతటా ప్రజాచైతన్య ఝరి ఎగసింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు తీరుకు నీరాజనం పలికింది. కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ.. అన్ని వర్గాలనూ ఆదుకుంటూ ముందడుగు వేస్తున్న పాలనకు జేజేలు పలికింది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజున సైతం పాదయాత్రలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు హోరెత్తాయి. విజయనగరం జిల్లా కురుపాంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, నెల్లిమర్లలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అట్టహాసంగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖ జిల్లాలో ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్రామ్ మహా పాదయాత్ర నిర్వహించారు. కుల వృత్తులు, చేతి వృత్తుల శకటాలతో వినూత్న ప్రదర్శన జరిపి బహిరంగ సభ జరిపారు. పార్టీ సిటీ విభాగం ఆధ్వర్యంలో ఆనం కళా కేంద్రంలో గుడి సెట్టింగ్ వేసి సీఎం జగన్మోహన్రెడ్డిని కొలిచారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ హాజరయ్యారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. విజయవాడ పశ్చిమలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రజాచైతన్య పాదయాత్రలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో పలుచోట్ల హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో మహిళలు 25 వేల ప్రమిదలను అమ్మ ఒడి, విద్యాదీవెన తదితర 12 పథకాల పేర్లతో అమర్చి కార్తీక దీపాల్ని వెలిగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జేజేలు పలికారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాదయాత్ర నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురంలో ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలకు విశేష స్పందన లభించింది. ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల సంఘీభావ యాత్రలను అట్టహాసంగా నిర్వహించారు. కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. -
ప్రజాచైతన్య యాత్రలకు బ్రహ్మరథం
సాక్షి, నెట్వర్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ పేరిట చేపట్టిన సంఘీభావ పాదయాత్రలు ఆదివారం కూడా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. విశాఖపట్నం, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో పాదయాత్రలు కొనసాగాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మబగాంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ రంగయ్య పాల్గొన్నారు. రాప్తాడులో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వర్షంలోనూ పాదయాత్ర నిర్వహించారు. గౌతంరెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కరప మండలం యండమూరు, జి.భావారంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత పాదయాత్రలు చేశారు. కర్నూలు జిల్లా పాణ్యంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. -
సంఘీభావ పాదయాత్రలకు నీరాజనం
సాక్షి, నెట్వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న సంఘీభావ పాదయాత్రలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ నేతలు ప్రజాచైతన్య యాత్రల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ‘ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు’ పేరిట సాగిన కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఏలూరు రూరల్ పోణంగిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని.. ఎంపీ కోటగిరి శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు నీరాజనం పలికారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఇంటింటికీ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ రవీంద్ర, మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు పాదయాత్ర చేశారు. కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి చెల్లుబోయిన వేణు, అల్లవరం మండలంలో ఎంపీ అనురాధ, మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. కృష్ణా, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్రలు, ర్యాలీలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర నిర్వహించారు. జి.సిగడాం మండలం చంద్రయ్యపేట, వెలగాడ, దేవరవలసల్లో ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాదయాత్ర చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పందిపర్తిలో మంత్రి శంకర నారాయణ పాదయాత్ర నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతిల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. -
సంఘీభావ యాత్రలకు బ్రహ్మరథం
సాక్షి నెట్వర్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ పేరిట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య సంఘీభావ యాత్రలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు, ర్యాలీలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను వివరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు.. అనంతపురం జిల్లాలోని రొద్దం మండలంలో రోడ్లు, భవనాల శాఖమంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ, వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు పర్యటించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యేలు పాదయాత్రలు కొనసాగించగా.. ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పాదయాత్ర జరిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్ర చేశారు. నెల్లూరులో జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్, మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రలు నిర్వహించారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంభొట్లపాలెం, బలుసుల పాలెంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాదయాత్ర చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది. కర్నూలు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సంఘీభావ యాత్రలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రాపురం తాళ్లపొలం నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కడియం మండలం జేగురుపాడులో ఎంపీ మార్గాని భరత్రామ్ పాదయాత్రలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం నందిగంపాలెంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, నిడదవోలు రావిమెట్ల, శంకరపురంలో ఎంపీ మార్గాని భరత్, లింగపాలెం మండలం భీమోలులో ఎంపీ కోటగిరి శ్రీధర్ పాదయాత్రల్లో పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. -
ఆ సంకల్పానికి చేతులెత్తి..
సాక్షి నెట్వర్క్: జన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతటా పాదయాత్రలు, ర్యాలీల జోరు కొనసాగింది. ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం కూడా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివిధ వర్గాల ప్రజలు, మహిళలు, రైతులు జేజేలు పలికారు. వైఎస్సార్ జిల్లా లింగాలలో ఎంపీ అవినాష్ రెడ్డి 23 కి.మీ మేర పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో జరిగిన పాదయాత్రలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోమంత్రి శంకర్నారాయణ పాదయాత్ర అనంతరం రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా అంతటా వివిధ కార్యక్రమాలు జరిగాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలు జోరుగా సాగాయి. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పుట్టగుంటలో మంత్రి కొడాలి నాని పాదయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు వరకు హోం మంత్రి సుచరిత పాదయాత్ర నిర్వహించారు. తెనాలిలో జరిగిన బీసీ గర్జనలో ఎంపీలు మోపిదేవి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నెల్లూరులో మంత్రి అనిల్కుమార్ పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మంత్రి వనిత, ఆచంటలో మంత్రి శ్రీరంగనాథ«రాజు పాదయాత్ర చేశారు. కర్నూలు జిల్లా అంతటా ప్రజా చైతన్య యాత్రలు కొనసాగాయి. -
ఘనంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’
సాక్షి నెట్వర్క్: ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, వేటపాలెంలో ఆమంచి కృష్ణమోహన్, టంగుటూరులో డాక్టర్ వెంకయ్య, బల్లికురవలో బాచిన కృష్ణచైతన్య, గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్రలు చేశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు రోజా, ద్వారకానాథ్రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, నవాజ్ బాషా ఆధ్వర్యంలో ఈ పాదయాత్రలు జరిగాయి. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని, మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు.. పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినప్పలనాయుడు, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యేలు.. సుదీర్రెడ్డి, రఘరామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లాలో ఆయా కార్యక్రమాల్లో మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ గొడ్డేటి మాధవి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, వీఆర్ ఎలీజా, తలారి వెంకట్రావు, గ్రంథి శ్రీనివాస్ పాదయాత్ర చేశారు. -
‘ప్రజా సంకల్ప యాత్ర’పై దేవిశ్రీ పాట
సీతమ్మధార (విశాఖ ఉత్తర): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా గాయకుడు దేవిశ్రీ రచించి, పాడిన పాటను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. ‘ఆకలన్నోడికి అన్నం పెట్టే వైఎస్ జగనన్నో.. నీకు పేదలు అండగ ఉన్నారన్నో..’ అంటూ సాగిన గీతాన్ని మంత్రి ఆదివారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకవి శ్రీశ్రీ నుంచి వంగపండు వరకు ఎందరో మహానుభావులు ఇక్కడి వారు కావడం మన అదృష్టమన్నారు. ఆ కోవకు చెందిన మరో గొప్ప కవి దేవిశ్రీ అని కొనియాడారు. ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందన్నారు. గుంటూరులో గుర్రం జాషువా స్మారక చిహ్నం నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు దేవుడయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే బాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇళ్లు ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. -
పండుగలా ప్రజాచైతన్య యాత్రలు
సాక్షి నెట్వర్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు మూడో రోజైన ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు పండుగలా నిర్వహించారు. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ పేరిట మంత్రులు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజలకు ఆయా పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలు కొనసాగాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్గిలో, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కనగాల–చెరుకుపల్లి, మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని, జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పర్యటించగా.. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు జరిపారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విఫ్ బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు పాదయాత్రల్లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పార్టీ శ్రేణులు తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తాళ్లపూడి మండలంలో స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లాలో పలుచోట్ల ప్రజాచైతన్య యాత్రలు జరిగాయి. అనంతపురం జిల్లాలో మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా పాదయాత్రలు జరిగాయి. వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాచైతన్య కార్యక్రమాలు కొనసాగాయి. -
సంకల్పం సాక్షిగా మార్పు
సాక్షి నెట్వర్క్ : ‘నిన్నటి కంటే ఈ రోజు బావుండాలి. ఈ రోజు కంటే రేపు ఇంకా బావుండాలి. అందరి జీవితాల్లో ఇలాంటి మార్పే నా లక్ష్యం. మీ అందరి చల్లని దీవెనలతో రేపు ఆ మార్పు సాధిస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో తరచూ చెప్పేవారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆ దిశగా అడుగులు వేశారు. 17 నెలలు తిరక్కుండానే ఆ మార్పును సాకారం చేశారు’ అని ఊరూరా ప్రజలు వైఎస్సార్సీపీ నేతల ఎదుట ప్రస్తావిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు శనివారం ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగించాయి. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ అంటూ భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్ని ఆరా తీశారు. సమస్యలను ఆలకించారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గుంటూరులో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్సీ జంగా, ఎమ్మెల్యే ఎం. గిరిధర్ ► అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్నారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాదవ్, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని ప్రజలు చెప్పారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ మిథున్రెడ్డి, చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లా– లక్ష్మీపురం మధ్య పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ర్యాలీలు చేపట్టారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో వైఎస్ జగన్ ఇన్ని హామీలు నెరవేరుస్తారని అనుకోలేదని పలుచోట్ల ప్రజలు తెలిపారు. కృష్ణా జిల్లా వెణుతురుమిల్లిలో మంత్రి కొడాలి నాని పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామ, గ్రామాన ప్రజలను కలుసుకున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రులు ఆళ్ల నాని, శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాదయాత్రలో పాల్గొన్నారు. ► విజయనగరం జిల్లా మెట్టపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాకలో ఎంపీ సత్యనారాయణ పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాదయాత్ర చేపట్టారు. -
‘ఆ విషయం తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నాం’
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. శ్రీకాకుళంలో శనివారం నాడు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒక ఎకరం భూమి కొని పేదవాడికి ఒక సెంటు భూమిని ఇండ్ల స్థలం కోసం ఇచ్చాడా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 100 కోట్లు వెచ్చించి పేదల ఇండ్ల స్థలాల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అయినప్పటికి చంద్రబాబు తమ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పేదవాడి కన్నీరు తుడిచారు, అది వైఫల్యమా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రెండు లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమా? అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, మహిళలు, రైతులు, యువతకు అనేక పధకాలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని ధర్మాన తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర తరువాత సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఎటువంటి మార్పు జరిగిందో తెలుసుకోవడానికే పాదయాత్రల ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని ఆయన చెప్పారు. చదవండి: రైతులు రోడ్డున పడటానికి బాబే కారణం: సీపీఎం -
పాదయాత్రకి మూడేళ్లు
జగన్ పాదయాత్రకి, మహాజైత్ర యాత్రకి మూడేళ్లు. ఆయన కన్నాడు, ఆయన విన్నాడు, ఆయన సాధించాడు. నాడు బుద్ధుడు బయట సంచారంలో ఏమి చూశాడు? వాటినిబట్టి పూర్తిగా మారిపోయాడు. అప్పటి దాకా రాజ ప్రాసాదంలో పుట్టి పెరిగిన గౌతముడికి జర రుజ మరణాలు గురించిన స్పష్టత లేదు. తన రథం నడిపిన సారథిని అడిగి తెలుసుకున్నాడు. జర రుజ మరణాలు ప్రతి మనిషిని ఆవహి స్తాయ్ అని సారథి తేటతెల్లం చేశాడు. ఒక్కసారిగా రాకుమారుడికి బుద్ధి వికసించింది. జగన్మోహన్రెడ్డి అప్పటిదాకా అంతఃపురంలో పెరి గాడు. ఒక్కసారిగా విశాల ప్రపంచాన్ని చూడాలని, చూసి అర్థం చేసుకోవాలనుకున్నాడు. పాదయాత్రకి బయలు దేరాడు. ఎండనక, వాననక.. చీకటిని, వెన్నెలని సమంగా సమాదరిస్తూ, పేద గుడిసెల్లో రాజ్యమేలే దరిద్య్రాన్నీ, లేమినీ జాగ్రత్తగా ఆకళింపు చేసుకున్నాడు. రాష్ట్రంలో ఇంతటి కరువు రాజ్యమేలుతోందా? అని జగన్ నివ్వెర పోయాడు. వీళ్లకి ఏదైనా చెయ్యాలని ఎంతో కొంత మేలు చెయ్యాలని అడుగడుగునా ప్రతిజ్ఞ చేస్తూ జగన్ నడిచాడు. జనం ఆడామగా, పిల్లాజెల్లా నీరాజనాలు పలికారు. ప్రతి చిన్న అంశం ఆయన గమనించారు. స్కూల్ బ్యాగుల నుంచి యూనిఫారమ్ల నించీ అన్నీ అందరికీ సమకూర్చాలని సంకల్పించారు. గ్రామాల పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. పిల్లలు గర్వంగా ‘ఇది మా బడి’ అనుకునే స్థాయికి తెచ్చారు. గ్రామ సుపరిపాలనకి నాంది పలికారు. చాలా ఉద్యో గావకాశాలు కల్పించారు. ఇది మన రాజ్యం అనే స్పృహ కల్పించారు. గతంలో పాలకులు పల్లెల్ని బాగు చేయడం ఎవరివల్లా కాదన్నారు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదన్నారు. గ్రామాల్లో ఎందరో పెద్దలు అనేకానేక ప్రయోగాలు చేసి చక్కని సిద్ధాంతాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రతి గ్రామంలో కొద్దిమందైనా ఆదర్శరైతులుండేవారు. మావూళ్లో చిదంబరానికి మంచి పేరుండేది. ఆయనని, ఆయన సేద్యాన్ని చూడటానికి అడపాదడపా పొరుగూరి రైతులు వచ్చేవారు. ఆయన పెద్ద భూస్వామి కాదు. కేవలం ఒక ఎకరం భూమి వసతులన్నీ ఉన్నది ఉండేది. పొలంలో రెండు కొబ్బరి చెట్లు, రెండు నిమ్మ మొక్క లుండేవి. బాగా కాసేవి. ఆ నేలలోనే ఐదు సెంట్ల చిన్న చెరువు ఓ మూల ఉండేది. దాంట్లో చేపల పెంపకం నడిచేది. చుట్టూ అరటి మొక్కలు పెంచేవారు. ఏటా మూడు పంటలు పొలంలో పండించేవారు. ఒక ఆవు వారి పోషణలో ఉండేది. పది బాతులు పంటచేలో తిరుగుతూ ఉండేవి. సేంద్రియ వ్యవసాయానికి ఆవు, దూడ విని యోగానికి వచ్చేవి. పొలం పనులన్నీ చిదంబరం కుటుంబ సభ్యులే సకాలంలో బద్ధకించకుండా చేసుకునేవారు. తక్కువ భూమి కావడంవల్ల శ్రద్ధ ఎక్కువ ఉండేది. రాబడి అధికంగా ఉండేది. మంచి దిగుబడికి మూలం మంచి విత్తనం అన్నది చిదంబరం నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెట్టుబడికి సకాలంలో డబ్బు అందిస్తోంది. రైతుకి గిట్టు బాటు ధర కల్పిస్తోంది. ఇవ్వాళ రైతులకు ముఖ్యంగా సన్నకారు రైతుకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జగనన్న పాదయాత్రలో తెలుగునేల ప్రతి అంగుళం నడిచి చూశారు. అందరి గోడు విన్నారు. వాటికి విరు గుడుగా ఏమి చెయ్యాలో కూడా అప్పుడే పథక రచన చేశారు. దాని పర్యవసానమే ఇప్పుడీ ప్రభుత్వం తెచ్చిన పథకాలు.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. ఇంకా చెయ్యాల్సినవి ఎన్నో ఉన్నాయి. సుమారు ఏడాది కాలం కోవిడ్వల్ల నష్టపోయాం. విలువైన పౌష్టికాహారం మనమే యథాశక్తి పండించుకోవచ్చు. పల్లెల్లో పళ్లు, పచ్చికూరలు రసాయనాలు లేకుండా పండించుకోవచ్చు. వ్యవసాయ రంగంలో, విశ్వవిద్యాలయాల్లో వస్తున్న పరిశోధనా ఫలి తాలు ఎప్పటికప్పుడు చిన్న రైతులకు చేరాలి. హైబ్రిడ్ విత్తనాలు, తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులిచ్చే ధాన్యాలు ధారాళంగా అందుబాటులోకి రావాలి. రైతులకు ఎప్పటికప్పుడు వర్క్షాపులు నడపాలి. వారికి ఉండే మూఢ నమ్మకాల్ని వదిలించాలి. చిన్న చిన్న రైతులు వినియోగించుకోగల వ్యవసాయ పనిముట్లు అందు బాటులోకి రావాలి. నాగళ్లు, హార్వెస్టర్లు, డ్రోన్లు తక్కువ ధరలకే అద్దెలకు దొరకాలి. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భాన్ని పేదరైతులకు అంకితం చేసి, ప్రతి ఏటా వారి వికాసానికి ఒక కార్య క్రమం చేపట్టాలి. -శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘మానవత్వమే నా మతం’ పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకున్న పలు మానవీయ ఘటనలు, ఆ సందర్భంగా అప్పుడు వైఎస్ జగన్ చూపిన దృక్పథంతో పాటు, ఆయన చిన్నతనం నుంచి ప్రదర్శించిన మానవీయ కోణాలను ఆవిష్కరింప చేస్తూ గాంధీపథం పక్షపత్రిక ఒక ప్రత్యేక పుస్తకం ప్రచురించింది. ‘మానవత్వమే నా మతం’ అన్న పేరుతో ప్రచురించిన ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా గాంధీపథం పక్షపత్రిక ఆ పుస్తకం ప్రచురించింది. (ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..) చిన్ననాటి నుంచే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, పాదయాత్రలో ఒక వృద్ధురాలి చెప్పు తెగిపోతే సరిచేసి ఇవ్వడం ,ముఖ్యమంత్రిగా ఒక పోలీసు అధికారికి పతకం ప్రదానం చేస్తుండగా, అది జారిపోతే స్వయంగా ఒంగి తీసి ప్రదానం చేయడం, విశాఖ పర్యటనలో కొందరు విద్యార్థులు తమ సహచరుడి అనారోగ్యం గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తే వెంటనే ఆగి, వారి సమస్య తెలుసుకుని ఆ విద్యార్థి వైద్య సహాయం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయడం.. వంటి పలు మానవీయకోణ విశేషాలను ‘మానవత్వమే నా మతం’ పుస్తకంలో పొందుపర్చినట్లు గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ తెలిపారు. (జీవితకాల మధుర‘యాత్ర’) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు)ఆర్ ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ పాల్గొన్నారు. (ఏపీ వ్యాప్తంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’) -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
-
ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..
సాక్షి, తాడేపల్లి: తండ్రి ఆశయాల కోసం.. మహానేత ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తున్న తరుణంలో వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల సమస్యలను విని వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. దేశంలో ఎవ్వరికీ ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు వైఎస్ జగన్కు ఇచ్చారని తెలిపారు. పాదయాత్రలో చూసిన కష్టాలను సీఎం జగన్ పథకాలుగా మలిచారని చెప్పారు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా.. వైఎస్ జగన్ ఉక్కు సంకల్పంతో పాలన ప్రారంభించారని తెలిపారు. ‘‘ఏడాదిన్నరగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు అమలు చేశారు. దేశ చరిత్రలో ఏడాదిలోనే 90 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ ఒక్కరికే దక్కుతుంది. ఆయన అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతిపక్షాల దుష్ట ఆలోచనలను ప్రజలకు వివరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.(చదవండి: జనం మద్దతే జగన్ బలం) ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘‘ జగన్ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది.14 నెలలు ప్రజలతో మమేకం అయ్యారు. అక్రమ కేసులు పెట్టినా బెదరకుండా జనంలోనే ఉన్నారు. ప్రజల్లో ఆదరణ ఓర్వలేక ప్రాణాలు కూడా తీయ్యాలని కూడా ప్రయత్నించారు. జగన్ ఎప్పుడూ జనంలోనే ఉన్నారు. జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేశారు. ప్రజలు ఆశీర్వదించి 51 శాతం ఓట్లతో 151 సీట్లు కట్టబెట్టారు. ప్రజల నుండి తీసుకున్న అజెండానే తన అజెండాగా తీసుకున్నారు. 16 నెలల్లో రాష్ట్ర దిశను మార్చిన నేత సీఎం జగన్. ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ అనే కార్యక్రమనికి శ్రీకారం చుట్టామని’’ ఆయన పేర్కొన్నారు.10 రోజుల పాటు పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలని పిలుపు నిచ్చామని చెప్పారు. ఇది ప్రజల పండగగా జరపాలని పిలుపునిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. (చదవండి:.వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు) ఎన్ని కష్టాలు వచ్చినా సంకల్పం వదల్లేదు.. సీఎం వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. చంద్రబాబు అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించేందుకే పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు.14 నెలలు ఎన్నికష్టాలు వచ్చినా సంకల్పం వదలలేదని, ఏడాదిన్నరలోనే సీఎం జగన్ 90 శాతం హామీలు అమలు చేశారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పాలన ప్రజలకు వివరిస్తామని వేణుగోపాల కృష్ణ తెలిపారు. -
‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’
-
సంక్షేమ సారధిగా.. ప్రజారంజక పాలన
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా బస్ స్టాప్ను ప్రారంభించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ జక్కంపూడి రాజా ,బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు సహా వైఎస్సార్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ..'ఎవరూ చేయలేని సాహసం వైఎస్ జగన్ చేవారని, 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్రతో అన్ని వర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారు. ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసిన వైఎస్ జగన్..ప్రజా మేనిఫోస్టోతో ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు. అధికారం చేపట్టిన పద్నాలుగు నెలల్లోనే హామీలు నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. సంక్షేమ రథసారధిగా ప్రజారంజక పాలన అందిస్తున్నారు' అని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్కు వస్తోన్న ఆధరణను చూసి టీడీపీ తట్టుకోలేకపోతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీలో సాగుతున్న సంక్షేమ పడకలవైపు చూస్తున్నాయని, సంక్షేమ క్యాలెండర్ అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పేదల ఇంటి వద్దకే చేరుస్తూ.. విద్య ,వైద్యం ,వ్యవసాయం ,శాంతిభద్రతల పరిరక్షణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. (ప్రజా సంకల్పమే నిత్య స్ఫూర్తి) -
ఏపీ వ్యాప్తంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరిట శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు.మంత్రులు, నాయకులు కేక్ కట్ చేశారు. వివిధ మతాల పీఠాధిపతులు సర్వమత ప్రార్థనలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురితో కలిసి పాదయాత్ర చేసిన రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను మంత్రులు ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్న బాబు, అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాల కృష్ణ, కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, ధు సూధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు) వైఎస్సార్ జిల్లా: బద్వేలులో వైఎస్సార్సీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గురుమోహన్, రాజగోపాల్రెడ్డి, సుందరరామిరెడ్డి, గోపాలస్వామి యద్ధారెడ్డి శ్రీనివాసులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పోరుమామిళ్లలోని వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎంపీపీ చిత్తా విజయ్ ప్రతాప్రెడ్డి, మండల కన్వీనర్ బాష, వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో 18, 20,21 వార్డులో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన వివరించారు. ప్రజా సమస్యలను వినతిపత్రాల ద్వారా సేకరించి అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటాచలం, చోడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, నంబూరి రవి, పలు శాఖల అధికారులు, వాలంటీర్లు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో.. ప్రజా సంకల్పానికి పునాదిపడి మూడేళ్లయిన సందర్భంగాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ‘వంగవీటి మోహన్రంగా బస్టాఫ్’ను ప్రారంభించారు. అనంతరం దేవీనగర్ నుంచి ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకొంటూ ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నారు. పశ్చిమగోదావరి: జిల్లాలో ‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’ పేరిట ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పెదవెల్లమిల్లి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాదయాత్ర ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వి.ఆర్.ఎలిజా పాదయాత్ర ప్రారంభించారు. పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామంలో ‘ప్రజల్లో నాడు- ప్రజలకోసం నేడు’ పాదయాత్ర ప్రారంభించారు. ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత పీవీఎల్ నరసింహారాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా: ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పురస్కరించుకొని ‘ప్రజల్లో నాడు- ప్రజల్లో నేడు’ పేరిట ప్రజా చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు వైఎస్సార్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ జిల్లా: ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు . ‘జై జగనన్న జై జై జగనన్న మేము ఉన్నామన్న’ అనే నినాదంతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంకు దగ్గర నుంచి కంచరపాలం వరకు ర్యాలీ నిర్వహించారు. చోడవరం పట్టణంలో ఎల్ఐసీ కోలనీ దగ్గర నుండి కొత్తూరు జంక్షన్ వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహనికి పూల మాల వేసి నివాళర్పించారు.మునగపాక మండలం ఉమ్మలాడలో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళర్పించారు. నాతవరం మండలం మాధవనగరంలో ప్రజాచైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ పాదయాత్రలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్, దంతులూరి దిలీప్ కుమార్, మళ్ల బుల్లిబాబు, మందపాటి జానకిరామరాజు, గొర్లి సూరి బాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, పలకా రవి, జాజుల రమేష్ పాల్గొన్నారు. మునగపాకలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కేక్ చేశారు. -
జీవితకాల మధుర‘యాత్ర’
ఈ రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని ఓ మేలి మలుపు తిప్పిన ప్రజా సంకల్పయాత్ర వంటి ఓ చారిత్రక ఘట్టంలో మేమూ భాగస్వాములమైనందుకు గర్వంగా భావి స్తాను. నిరాశ, నిçస్పృహలు అలముకున్న ప్రజలకు ‘నేనున్నాను’ అని ధైర్యం చెబుతూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసిన ఆ అడుగులు ఈ రాష్ట్ర అభివృద్ధికి పడిన గొప్ప ముందడుగు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను చేసిన పాదయాత్ర గురించి చెబుతూ ఆనాడు తన కాళ్లలో దిగిన ముళ్లు ఇప్పటికీ గుర్తుకు వస్తాయన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డికిగానీ ఆయనతో కలసి పాదయాత్రలో పాల్గొన్న మాకుగానీ మేము పడిన కష్టాలు.. కాళ్ల బొబ్బలు.. జలుబులు, జ్వరాలు, వర్షాలు ఏవీ గుర్తుకు రావు. చివరికి అప్పటి టీడీపీ ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం ఎయిర్పోర్టులో తనపై చేయించిన హత్యాయత్నం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డికి గుర్తుకు రాదు. ఆ పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు, వారి సమస్యలు, ఆవేదన గుర్తుకు వస్తాయి. అంతటి బాధల్లోనూ ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టడం... తమ బాధలు తీర్చడానికి రాజన్న కొడుకు వచ్చాడని వాళ్ల మొహాల్లో కనిపించిన నమ్మకం గుర్తుకు వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు విడిచిపెట్టారు. ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆ యాత్ర ఎన్నో గొప్ప అనుభవాలు, జ్ఞాపకాలు మిగిల్చింది. అసలు కష్టం అన్నది ఏమిటో తెలియకుండా పెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తానంటే మేము మొదట్లో కంగారుపడ్డాం. ఆయన పాదయాత్రకు ఏర్పాట్లు ఎలా చేయాలా అని తర్జనభర్జనపడ్డాం. మేము పది మందిమి ఓ జట్టుగా ఉండి పాదయాత్ర ఏర్పాట్లు పర్యవేక్షించాం. పగటి పూట అంతా పాదయాత్ర చేసే నాయకుడు రాత్రి వేళ అయినాసరే కాస్త హాయిగా విశ్రాంతి తీసుకునేలా చూడాలన్నది మా ఉద్దేశం. కానీ పాదయాత్రలో అన్ని చోట్ల విశ్రాంతికి సరైన ప్రదేశాలు దొరికేవి కావు. ఊరి చివర పొలాల్లో, కొన్ని సార్లు అయితే శ్మశానాల సమీపంలో కూడా రాత్రి విడిది ఏర్పాటు చేయాల్సి వచ్చేది. కానీ అవేవీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టించుకునే వారు కాదు. విడిది ఏర్పాట్లు ఎలా ఉన్నా ఆయనకు పట్టేది కాదు. ఆ రోజు ఎంతమంది ప్రజలను కలిశాను.. వారు చెప్పిన సమస్యలు ఏమిటి.. ఇంకా తనను ఎవరైనా కలవలేక పోతున్నారా... ఇంకా మారుమూల పల్లెలకు వెళ్లాలి... ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూడాలి.. అందుకోసం పాదయాత్రలో ఏమైనా మార్పులు చేయాలా అని మాతో చర్చించేవారు. కానీ తన వసతుల గురించి ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు. పగటి పూట మొత్తం ఏమీ తినకుండా... అంటే టిఫిన్, భోజనం లేకుండానే ఆయన పాదయాత్ర చేసేవారు. మధ్యాహ్నం కొన్ని పండ్లు తినేవారు. రాత్రి వేళల్లోనే భోజనం చేసేవారు. అందుకనే ఆయన చిత్తశుద్ధి, దృఢ సంకల్పాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించి అధికారాన్ని అప్పగించారు. ప్రజల విశ్వాసాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 నెలలుగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అంతటి జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి పాదయాత్రలో మొదటి నుంచీ చివరి వరకూ పాల్గొనడం.. ఆ పాదయాత్ర కోఆర్డినేటర్గా వ్యవహరించడం ఓ గొప్ప అనుభూతి. జీవితకాలం పాటు గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. పాదయాత్రకు ముందు జగనన్న సైనికులుగా ఉండేవాళ్లం. ఆయన్ను చూసిన తర్వాత జనం సేవకులుగా మారిపోయాం. తలశిల రఘురాం వ్యాసకర్త ఏపీ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, పాదయాత్రకు కోఆర్డినేటర్గా వ్యవహరించారు -
జనం మద్దతే జగన్ బలం
వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టి నేటికి సరిగ్గా మూడేళ్లయింది. గతంలో రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డి వరకు రాయలసీమ సాగు, తాగు నీటికోసం, హంద్రీనీవా, గాలేరు నగరి వెలిగొండ ప్రాజెక్టుల కోసం పాదయాత్ర,లు తలపెట్టారు. ఆ తరువాత ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ళ నుండి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ చరిత్రనే తిరగరాసింది. తరువాత జగనన్న వదలిన బాణాన్ని నేను అంటూ అన్నకు మద్దతుగా వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు విజయవంతంగా కొనసాగింది. వైఎస్సార్, షర్మిల చేపట్టిన పాదయాత్రలు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు జరిగినవి. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర మాత్రం రాష్ట్ర విభజనానంతరం జరిగింది. ఇది ప్రజలు పడే బాధలను తీర్చడానికి జరిపిన పాదయాత్ర. వారి బాధలు అక్కడికక్కడే తీర్చడానికి ఆయన చెప్పిన అంశాలు తరువాత ఒక ప్రజా మేనిఫెస్టోకు రూపమిచ్చాయి. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలు తీర్చడానికి ఆ మేనిఫెస్టో ఎంతగానో ఉపయోగపడింది. వ్యవసాయరంగం, సంక్షేమరంగం, ఫీజు రీయింబర్స్ మెంట్, పింఛన్, ఆరోగ్యశ్రీ... ఇలా సంక్షేమం, సుపరిపాలన పేరుతో వైఎస్ జగన్ అమలుచేస్తున్న అనేక పథకాలను నేడు జాతీయంగా చర్చిస్తున్నారు. ఏపీలో అవలంబిస్తున్న విధానాలు పరిపాలనా, వికేంద్రీకరణ కోసం గ్రామ స్వరాజ్యం పేరిట జగన్ ఏర్పాటుచేసిన నూతన పాలనా వ్యవస్థ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, వారికి కల్పించిన సంక్షేమ కార్యక్రమాలు, వారి అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు ఏరకంగా చూసినా వినూత్నమైనవి. దేశచరిత్రలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిం చడం, గ్రామీణ పరిపాలనా వికేంద్రీకరణను అట్టడుగు ప్రజలకు పరిపాలనను అందించే విధంగా చేయడం గొప్ప విషయం. ఇవన్నీ జగన్కు పాదయాత్ర కాలంలో స్ఫురించినవి.. పైగా ఆయన అర్థం చేసుకుని తీసుకొచ్చిన పాలనా సంస్కరణలే. ఆరోజు జగన్ వదలిన బాణాన్ని నేను అంటూ వైఎస్సార్ తనయ షర్మిల జరిపిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ నిలదొక్కుకోవడానికి, వైఎస్ కుటుంబం ప్రతిష్ఠ పెంచడానికి, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి ఇతోధికంగా దోహదపడింది. మరోవైపున సోనియాగాంధీ వత్తాసుతో కాంగ్రెస్, టీడీపీలు రెండూ కుమ్మక్కై చేసిన నేరారోపణల ఫలితంగా 16 నెలలు జైలులో గడిపారు వైఎస్ జగన్. కనీవినీ ఎరుగని కష్టాలకు, బాధలకు ఓర్చి తట్టుకున్న జగన్ మనోనిబ్బరం, మనోస్థైర్యం ప్రజల నుండి వచ్చినవే. వైఎస్సార్ తనయుడిని కడగండ్ల పాలు చేసి తండ్రి వారసత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ చేసిన కుట్రపూరిత ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి వైఎస్సార్ తనయుడి వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. 2019లో జరిగిన విభజనానంతర ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. స్వల్పతేడాతో 2014లో అధికారానికి దూరమైన వైఎస్ జగన్కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి 151 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం ఆయన చేసిన పాదయాత్రల ఫలితమే. గ్రామ స్వరాజ్యం పేరుతో పరిపాలన సాగించడం వైఎస్ జగన్ సాధించిన పరిణతికి నిదర్శనం. పాదయాత్ర ద్వారా ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించిన జగన్ వారి నుంచి స్ఫూర్తి పొందిన ఫలితమే నేడు ఏపీలో సంక్షేమ పథకాలు ఆకాశమే హద్దు లాగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు నాయకులు ఒకే కుటుంబం నుంచి వేలాది కిలోమీటర్ల దూరం పాదయాత్ర జరపడం ఒక విశేషం కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పరిణామానికి కారణమైంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సంక్షేమానికి చిరునామాగా జగన్ మారారు. రాయలసీమలో ఈ రోజు ఇన్ని సేద్యపు నీటి పథకాలు రూపుదిద్దుకున్నాయి అంటే ఆనాడు రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డి పాడు వరకు చేపట్టిన పాదయాత్రకు కొనసాగింపు ఫలితమే అని గుర్తించాలి. రాష్ట్రం అభివృద్ధిలో నూతన మలుపు తిరగడానికి ఉపయోగపడిన పాదయాత్ర వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర. ఈ సందర్భంగా జగన్కు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు ‘ మొబైల్: 99899 04389 -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
-
నవంబర్ 6 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు : సజ్జల
-
‘అరుదైన రాజనీతిజ్ఞుడిగా సీఎం జగన్ నిలిచారు’
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 6 నుంచి వైఎస్సార్సీపీ తరపున వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రజలకు ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అనేది వారి నుంచి తెలుకుంటామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. . దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేశారన్నారు. 14 నెలల పాటు ప్రజల్లో ఉంటూ 3,640 కిలో మీటర్ల దూరం నడిచారని గుర్తుచేశారు. తనకు తానే ఒక మార్పుకు నాంది పలుకుతూ.. ఈ రోజు దేశంలోనే అరుదైన రాజనీతిజ్ఞుడిగా సీఎం జగన్ నిలిచారని ప్రశంసించారు. చీకటి తర్వాత తొలిపొద్దు పొడిచినట్లు రాష్ట్రం ముందడుగు వేసిందన్నారు. అందుకే నవంబర్ 6 నుంచి పార్టీ తరపున కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు సజ్జల వివరించారు. ‘సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను 90శాతం అమలు చేశారు. సంక్షోభాలను తట్టుకొని ఒక ధీశాలిగా ప్రభుత్వాని నడిపించారు. పరిపాలనను వికేంద్రీకరించి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి ముందుకు పరిపాలన తెచ్చారు. గతంలో రేషన్ కార్డు నుంచి ఏది కావాలన్నా సమయం దొరికేది కాదు కానీ, ప్రస్తుతం సంతృప్తి స్థాయిలో నిర్ణీత సమయంలో సేవలు అందుతున్నాయి. సంక్షేమ నగదు నేరుగా లబ్దిదారుని ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ సీఎం జగన్ తపన, నిబద్దత వల్లే సాధ్యమవుతున్నాయి. రివర్స్ టెండరింగ్ వల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు రూ.2.60 లక్షల కోట్ల అప్పులు, మరో 60 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింది అనే ప్రశ్న తలెత్తింది. ఇన్ని సమస్యలను ఎదుర్కొని వైఎస్ జగన్ పారదర్శకత, జవాబుదారీ తనం తెచ్చారు. ఇంగ్లీష్ మీడియం చదువు కొనుక్కోడానికి పేదలు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. సీఎం జగన్ మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అని భావించారు. నాడు నేడు కింద స్కూల్ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మీరే చూస్తున్నారు. కానీ టీడీపీ నేతలు అన్నిటికీ కోర్టులకు వెళ్లి స్టే తెస్తున్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి చేద్దాం అనే ధోరణి నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఫలితాలు అందిస్తున్నాం. మహిళలకు మేము పెద్ద పీట వేశాము అని గర్వంగా చెప్పగలం. అన్నింటిలో వారికి 50 శాతం స్థానం కల్పించాం. ఆస్పత్రులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందబోతున్నాయి.16 కొత్త మెడికల్ కాలేజీ లు వస్తున్నాయి. ఏడాదిన్నరలోనే ఇవన్నీ చేసిన సందర్బంగా మా పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అనేది వారి నుంచి తెలుసుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం’ అని సజ్జల పేర్కొన్నారు. -
‘పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా’
-
‘పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా’
సాక్షి, తాడేపల్లి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ప్రజాసంకల్పయాత్ర రాష్ట్ర స్థితిగతిని మార్చివేసిన పాదయాత్ర అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ప్రజల్లో మమేకమై ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారని గుర్తుచేశారు. ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర ముగిసి నేటికి ఏడాది పూరైన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్లు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. దేశ చరిత్రలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర నిలిచిపోతుంది. ప్రజాసంకల్పయాత్ర రాష్ట్ర స్థితిగతిని మార్చివేసింది. చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. వైఎస్ జగన్తో కలిసి పాదయాత్రలో అడుగులో అడుగు వేయడం సంతోషాన్నిచ్చింది. కోట్లాది మంది ప్రజలు వైఎస్ జగన్ మీద నమ్మకం పెట్టుకున్నారు. రికార్డు స్థాయిలో 3648 కి.మీ పాదయాత్ర చేశారు. మే 23న వైఎస్ జగన్పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో బయటపడింది. 151 సీట్లలో వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. గాలికి వదిలేసిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ గాడిలో పెడుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన 80 శాతం హామీలను రెండు మూడు నెలల్లోనే అమలు చేశారు. చెప్పని హామీలను కూడా అమలు చేసి చూపిస్తున్నార’ని తెలిపారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తానని చెబితే అందరు ఆశ్చర్యపోయారని అన్నారు. సుదీర్ఘంగా 3648 కి.మీ సాగిన పాదయాత్రలో ఆయన 2 కోట్ల మందిని కలుసుకున్నారని తెలిపారు. పేదలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారని చెప్పారు. పాదయాత్రలో చూసిన కష్టాలను తీర్చడం కోసం నవరత్నాలను ప్రవేశపెట్టారని.. మొదటి ఆరు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారని వెల్లడించారు. సీఎం జగన్ చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. నందిగం సురేశ్ మాట్లాడుతూ.. పాదయాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి పండగలా ప్రారంభించారని గుర్తుచేశారు. పాదయాత్ర సమయంలో ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. కానీ ప్రజల కోసం వైఎస్ జగన్ 3,648 కి.మీ పాదయాత్ర చేశారని తెలిపారు. దళిత కుటుంబంలో పుట్టిన తనను ఎంపీగా చేశారని.. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారని చెప్పారు. -
విలీనం రైట్ రైట్
ఆయన మాట.. లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు ప్రగతి బాటఆయన లక్ష్యం.. ప్రతి ఉద్యోగీ తన గుండెలపై చేయి వేసుకుని నిర్భయంగా జీవించడమే ధ్యేయంఆయన మార్గం.. సమస్యలను పారదోలుతూ సాగిపోయే సంక్షేమ పయనం.. ఇదిగో శాసన సభ వేదికగా ఆమోదించిన మరో చారిత్రాత్మక బిల్లే దీనికి సాక్ష్యం. ..ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవ్వాలనే కల.. ఏళ్ల తరబడి శిలగా మారిన వేళ.. పాదయాత్రికుడై వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ అభయమిచ్చారు. ఆనాడే కార్మికుల గుండెల్లో ఆవేదన తడిని చూసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే కమిటీ ఏర్పాటు చేసి.. హామీ అమలుకు ముందడుగు వేశారు. ఇప్పుడు శాసన సభలో విలీన బిల్లుకు పచ్చజెండా ఊపి ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. సాక్షి, గుంటూరు: ప్రజా సంకల్పయాత్ర, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రపంచం మొత్తం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును సోమవారం శాసన సభ ఆమోదించింది. ఈ బిల్లుతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కార్మికులు కాదు.. ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ.. పూర్తిగా ప్రభుత్వ సంస్థ మారనుంది. ఆర్టీసీ కార్మికులు సైతం రాబోయే రోజుల్లో ఉద్యోగులుగా మారనున్నారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతారు. జిల్లాలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది కలిపి 4,851 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వీరంతా జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులే. చరిత్రలో నిలిచిపోతారు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఇందు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి కుదరదని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 52 వేల మంది ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన సీఎం జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. – ఎం హనుమంతరావు,స్టేట్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
ప్రజా సంకల్పానికి రెండేళ్లు
-
ఆ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది : టీజేఆర్
సాక్షి, తాడేపల్లి : దేశచరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గుర్తుచేశారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటితో రెండేళ్లు పూర్తైన సందర్భంగా.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఒక చరిత్ర అని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హమీలను సీఎం వైఎస్ జగన్ ఐదు నెల్లలోనే అమలు చేసి చూపించారని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడం కోసమే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టారని.. ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పవన్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంతకు ముందు మీడియాతో మాట్లాడిన సుధాకర్బాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇసుకను విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు. అప్పుడు స్పందించని పవన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజలు తిరస్కరించినా పవన్ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిరంజీవి లేకపోతే పవన్ సినిమాల్లో వచ్చేవారా అని ప్రశ్నించారు. పవన్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. ఇసుక దోపిడీని ఆరికట్టేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన విధానం తీసుకొచ్చారని తెలిపారు. పవన్ వెనుక ఉన్నవారంతా టీడీపీ తొత్తులే అని ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినవారికే పవన్ సీట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్లు దొంగ నాటకాలు ఆపాలని అన్నారు. పవన్ చేష్టలు అపహాస్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పవన్ లాంగ్మార్చ్లో టీడీపీ కార్యకర్తలు తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటకు రావాలని సూచించారు. -
ప్రజా సంకల్ప సంబరాలు..
సాక్షి, తాడేపల్లి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో సరిగ్గా రెండేళ్లు నిండాయి. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్లు కేక్ కట్ చేశారు. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మారథం పట్టిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజ సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 సభల్లో, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. జనం గుండెల్లో దాగి ఉన్న బాధను తెలుసుకున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపారు. వైఎస్సార్సీపీలో చేరిన అద్దేపల్లి.. జనసేన నేత అద్దేపల్లి శ్రీధర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. చరిత్రలో చూడలేదు.. భవిష్యత్తులో కూడా చూడలేం.. సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ నాయకుడు చేయని విధంగా పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. 3,648 కి.మీ సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి హామీలు ఇచ్చారని.. ఇప్పుడు అధికారంలో వచ్చాక వాటిలో 90 శాతం నెరవేర్చారని తెలిపారు. ఇటువంటి పాదయాత్రను చరిత్రలో చూడలేదని.. భవిష్యత్తులో కూడా చూడలేమని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. -
తిత్లీ తుపాను బాధితుల సహాయం రెట్టింపు
-
తిత్లీ తుపాను బాధితులకు ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి : తిత్లీ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 30న పలాసలో ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ పరిహారాన్ని భారీగా పెంచారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నష్టం వాటిల్లిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచింది. నష్టం వాటిల్లిన జీడిమామిడి చెట్లకు హెక్టారుకు ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. తాజాగా పెంచిన పరిహారాన్ని అందించడానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. లక్షలాది కొబ్బరి చెట్లు, వేలాది హెక్టార్లలో జీడిమామిడి తోటలు నేల కూలాయి. ఏళ్లుగా పెంచుకున్న తోటలు నాశనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం తిత్లీ తుపాను సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏ మూలకూ సరిపోని విధంగా నేలకూలిన కొబ్బరి చెట్టుకు రూ.1500, పూర్తిగా నష్టం వాటిల్లిన జీడిమామిడి తోటకు ఒక హెక్టారుకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీపీ నేతల జోక్యం వల్ల లబ్ధిదారుల జాబితాలో తోటలు నష్టపోయిన రైతుల పేర్లు గల్లంతయ్యాయి. లబ్ధిదారుల జాబితాలో సింహభాగం టీడీపీ నేతలు, కార్యకర్తల పేర్లే కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విన్నవించుకున్నారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతామని, అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని అప్పట్లో వైఎస్ జగన్ పలాస సభలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిత్లీ తుపాను బాధిత రైతులకు పరిహారాన్ని పెంచుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మనకే.. మస్కా కొట్టారు!
త్రిమూర్తులు : అరే.. సహదేవుడు.. మూటా ముల్లు సర్దుకుని ఊరి విడిచివెళ్లిపోతున్న.. ఆ కుటుంబం ఎవరిదిరా.. అటు చూడూ.. సహదేవుడు : వాళ్లా.. మామా.. ఇంకెవరూ మన భూషారావు కుటుంబం.. పాపం.. మన కొల్లేరులో పనులు లేక ఒడిషా రాష్ట్రానికి పిల్లలతో సహా వలస పోతున్నాడు.. త్రిమూర్తులు: అరేరే.. ఎంత కష్టం వచ్చిందిరా.. పదా ఆపుదాం.. అంటూ పరుగున వెళ్లారు.. సహదేవుడు : భూషారావు బాబాయ్.. ఎక్కడకు వెళుతున్నారు.. మొత్తం కుటుంబమే తరలిపోతున్నారు... భూషారావు : ఏమని చెప్పను.. సహదేవు.. మన కొల్లేరులో పనులు కరువయ్యాయి.. ఇకప్పుడు బాగా బతికిన కుటుంబం మాది.. నీకు తెలుసుకదా.. ఒడిషాలో నీటి ఏరులు ఉన్నాయి.. అక్కడ చేపల వేటతో జీవనం సాగిద్దామని వెళుతున్నా.. త్రిమూర్తులు: భూషారావు.. నువ్వు పెద్దోడివి. అన్ని తెలిసినోడివి.. నువ్వే ఇలా అంటే ఎలా.. మరో 21 రోజుల్లో ఎన్నికల వస్తున్నాయి... వచ్చే ప్రభుత్వం మన కొల్లేరు కష్టాలు ఆలకిస్తుందనే నమ్మకం నాకు ఉంది.. అప్పటి వరకు ఆగిపోవచ్చుకదా.. భూషారావు : ఆ నమ్మకం నాకు లేదు.. త్రిమూర్తులు.. మొన్న ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమన్నారు... మేము అధికారంలోకి వస్తే∙కొల్లేరు కాంటూరును కుదిస్తామన్నారు.. రెగ్యులేటర్ కడతా మన్నారు. సర్కారు కాల్వపై వంతెన నిర్మిస్తామని చెప్పారు. కుదింపు అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నా, మిగిలిన హామీలైన నెరవేర్చవచ్చుకదా.. నా పుట్టిన రోజుకు వంతెన నిర్మిస్తానని మన ఎమ్మెల్యే కామినేని గత ఏడాది చెప్పారు.. పనులు పూర్తి కాలేదు.. మనకే మస్కా కొట్టారురా... ఇప్పుడు చెప్పు.. మల్లిఖార్జునరావు : (సైకిల్పై వస్తూ ఆగాడు) భూషారావు నువ్వు చెప్పిన మాటలు విన్నా. అది నిజమే.. మొన్న ఎన్నికల్లో మన కొల్లేరు గ్రామాల వ్యక్తికి రావల్సిన సీటు టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు దక్కింది. ఆయనను గెలిపించాం.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో ఉన్న సంబంధాలతో కొల్లేరు కష్టాలు తీరుతాయని భావించా.. చివరకు మనకు కన్నీళ్లే మిగిలాయి. భూషారావు : నిజమే.. మల్లిఖార్జున.. పుష్కరాల స్నానాలకు వచ్చిన కేంద్ర మంత్రులను హెలికాప్టర్పై మన కొల్లేరు పెద్దింట్లమ్మ గుడివద్ద దించి ఏవో.. నాలుగు మాటలు చెప్పించారు.. తర్వాత కమిటీలంటూ కాలయాపన చేశారు. చివరకు కొల్లేరు కాంటూరు కుదింపు కుదరదన్నారు.. పౌల్రాజ్ : భూషారావు బాబాయ్.. మిగిలింది నేను చెప్తా.. వినండి.. కాంటూరు కుదింపు కుదరదని సుప్రీం కోర్టు చెప్పడంతో, కొల్లేరు బౌండరీలు మార్చి చుట్టూ జిరాయితీ భూములు కేటాయిస్తామని, మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే కామినేని చెప్పారు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు అసలు పత్తా లేకుండా పోయారు... అవునా.. కాదా.. త్రిమూర్తులు : పౌల్రాజ్ నువ్వు చెప్పింది నిజమే .. అదట్టా ఉంచూ.. క్రిందటి సంవత్సరం ప్రజా సంకల్పయాత్ర చేయడానికి వచ్చిన జగన్ మన కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నారా... అదిగదిగో.. ఆ వచ్చేది మన నరసింహేకదా.. ఆడికి బాగా తెలుసు అడుగుదాం.. నరసింహ : అందరికి నమస్కారమండీ.. ఏంటీ అందరూ మీటింగు పెట్టారు... త్రిమూర్తులు: ఏం లేదు.. నరసింహా.. మన భూషారావు కొల్లేరులో పనులు లేవని వలసపోతున్నాడు.. అందరం కలసి ఆపుతున్నాం.. నరసింహ : భూషారావు.. ఇన్ని రోజులు కష్టలు పడ్డావు.. ఇంకొక్క నెల ఆగు.. మన బతుకులు మారతాయి. మొన్న ప్రజా సంకల్ప యాత్రగా వచ్చిన వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి ఏమన్నారో.. చెబుతాను వినండి.. ‘ నేను గత నాయకుల మాదిరిగా అమలు కాని వాగ్దానాలు ఇవ్వను.. మీ సామాజికవర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించి, నా పక్కన కూర్చోబెట్టుకుంటా.. మీ సమస్యల పరిష్కారానికి ప్లాన్ ఏ, ప్లాన్ బీ అనే పద్ధతుల ద్వారా పరిష్కారించుకుందాం.. కొల్లేరు ప్రజలకు అవసరమైన రెగ్యులేటర్ నిర్మించుకుందాం.. అని చెప్పారు.. చూద్దాం.. ఆగండి.. పౌల్రాజ్ : భూషారావు.. నాకు జగన్ చెప్పిన హామీలపై నమ్మకం ఉంది.. మన కొల్లేరు ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటున్నా.. ఆయన తండ్రి కొల్లేరు ఆపరేషన్ తర్వాత దాదాపు 3,500 కోట్లు ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అందించారు. సహదేవుడు : ఇదిగో భూషారావు బాబాయ్.. ఇంత మంది చెబుతున్నాం.. ఒక్క నెలరోజులు ఆగు.. పిన్ని బట్టల బుట్ట.. ఇటివ్వండి.. అందరూ రండిరా.. ఈ రోజు మా ఇంటి దగ్గరే మీ భోజనం.. భూషారావు : మీరందరూ చెబుతుంటే.. నాకు నమ్మకం కలుగుతుంది.. రాజన్న పాలన మళ్లీ మనం చూడబోతున్నామన్న నమ్మకంతో తిరిగి వెళుతున్నాం.. అందరూ అనుకుంటూ సహదేవుడు ఇంటికి భోజనాలకు వెళ్లారు.. -
జన ప్రభంజనం
వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేతవైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చినజనంతో పులివెందుల కిక్కిరిసింది. మూడు రోజులుగాప్రతిపక్షనేత స్వస్థలంలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. దారులన్నీ అటువైపే మళ్లాయి.దీంతో స్థానిక కార్యాలయం లోపల, బయట ఎక్కడ చూసినా జనమే జనం.. వైఎస్ జగన్ సీఎం అంటూ చేస్తున్ననినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. సాక్షి కడప/పులివెందుల : పులివెందులలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం జనసంద్రంగా మారింది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపారు. జగన్ను కలిసిన ఆరోగ్య మిత్ర,ఏపీ వీవీపీ సిబ్బంది, జియాలజిస్ట్లుఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు కలిశారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ను మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ నాయుడుతోపాటు ఇతర సిబ్బంది కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. పదేళ్లకుపైగా ఈ పథకం విజయవంతానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు తెలియజేశారు. అనేక రకాల పరీక్షల పేరుతో ఇబ్బందులు సృష్టించినా ఎదుర్కొనిముందుకు వెళుతున్న తమకు ఉద్యోగ భద్రత లేదని వివరించారు. అధికారంలోకి వస్తే అండగా ఉంటామని వారికి జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 11రక్త నిధుల, 51రక్త నిల్వల కేంద్రాల సిబ్బంది వచ్చి ప్రతిపక్షనేతను కలిశారు. వైఎస్సార్ చొరవతో రూరల్, చైల్డ్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు కింద రెడ్క్రాస్ వారి నిర్వహణలో ఉన్న తమకు తక్కువ జీతం వచ్చేదని.. వైఎస్సార్ హయాంలో మరింత పెంచడంతో రూ.5,500ల వరకు వచ్చేదన్నారు. అంతేకాకుండా ఒక్క ఏడాదిలోనే రెగ్యులర్ చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని వివరించారు. అధికారంలోకి రాగానే తమ డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దేవుడి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిస్కరిస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవెలప్మెంట్ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలు చేస్తున్న ఇందిర జలప్రభ కార్యక్రమం, ఎన్టీఆర్ జలసిరి పథకాల కింద 2011 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న జియాలజిస్ట్లు జీతంతోపాటు ఎఫ్టీఈ కోర్సు, ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయాలని జగన్ను కలిశారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని పనిచేస్తున్న ఆశించిన మేర అవకాశాలు కల్పించడంలేదని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడురోజుల పర్యటన విజయవంతంగా ముగి సింది. దీంతో పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు.. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన టీడీపీ టి.రఘునాథరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఆదివారం పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు వైఎస్ జగన్ కండువా కప్పి ఆహ్వానించారు. రఘునాథరెడ్డితోపాటు మరో 20కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని హనుమగుత్తి ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డి, పోట్లదుర్తి వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో.. జమ్మలమడుగు ఇన్చార్జి డాక్టర్ సుధీకర్రెడ్డి ఆధ్వర్యంలో పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకులు టి.వెంకటశివారెడ్డితోపాటు మరో 20కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకటశివారెడ్డి చేరడంతో వైఎస్సార్సీపీ పోట్లదుర్తిలో బలంగా మారింది. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు చొప్పా యల్లారెడ్డి ఆధ్వర్యంలో ఖాజీపేట మున్సిపాలిటీ పరిధిలోని బోయినపల్లెకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పులివెందులలో వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చిన్న పెంచలయ్య, శేఖర్, శివయ్య, రామకృష్ణ, రాజులతోపాటు మరికొన్ని కుటుంబాలు పార్టీలో చేరాయి. మీ నాయకుడు సుధీర్రెడ్డే.. గెలిపించుకోండి.. వైఎస్ జగన్జమ్మలమడుగుతోపాటు ఎర్రగుంట్ల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు వచ్చి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పులివెందులలో కలిశా రు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు కేరింతలు కొడుతుండగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ డాక్టర్ సుధీర్రెడ్డి చేయిని పట్టుకొని పైకి ఎత్తి మీ నాయకుడు సుధీర్రెడ్డే.. గెలిపించుకొని రండి అంటూ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన సూచించారు. సుధీర్రెడ్డే మీ నాయకుడు గెలిపించుకోండని ప్రతిపక్షనేత అనగానే పెద్ద ఎత్తున జనాలు నినాదాలతో హోరెత్తించారు. జగన్ను కలిసిన అల్లె ప్రభావతి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నాయకురాలు అల్లె ప్రభావతి కలిశారు. ప్రత్యేకంగా సుమారు 50వాహనాలలో అనుచరులతో కలిసి వచ్చిన ఆమె పులివెందులలో వైఎస్ జగన్ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎలాంటి చిన్న, చిన్న సంఘటనలు ఉన్నా.. అన్ని మరిచిపోయి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్అవినాష్రెడ్డిలను పలువురు నేతలు కలిశారు. హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్ సుమారు 70వాహనాలలో తరలి వచ్చి వైఎస్ జగన్ను కలిశారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నదీమ్తో మాట్లాడారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, అంజాద్ బాష, రవీంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు, ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్ అభిషేక్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, తదితర నేతలు కలిసి మాట్లాడారు. వైఎస్ భాస్కర్రెడ్డి ఇంట్లో కాసేపు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న పులివెం దుల నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ భాస్కర్రెడ్డి ఇంటికి వెళ్లి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపు గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ భాస్కర్రెడ్డితోపాటు మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముచ్చటించారు. రోజంతా ప్రజలతోనే.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం 9గంటలనుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలతోనే మమేకమయ్యారు. పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాలనుంచి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. యువకులు ఎక్కువగా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఎక్కడ చూసినా సెల్ఫోన్లతోనే యువత ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వచ్చిన ఏ ఒక్కరిని నిరాశపర్చకుండా అందరితో మాట్లాడుతూ వైఎస్ జగన్ సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన విరామం అనంతరం, రాత్రి వరకు అనుక్షణం ప్రజలతోనే వైఎస్ జగన్ బిజీబిజీగా గడిపారు. -
కదిలిన కడప
పల్లె కదిలింది.. జగన్నినాదం మార్మోగింది. ఎక్కడ చూసినా జనమే జనం.పొలం, రోడ్డు, పల్లె తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రతిపక్ష నేత కోసం ఎదురుచూస్తున్న ప్రజలే కనిపించారు. చిన్నపిల్లలను ఎత్తుకున్న తల్లులు.. వయస్సు మీద పడిన పెద్దోళ్లు.. కులం, మతం, వర్గం అన్న తేడా లేకుండా కలిసేందుకు బారులు తీరారు. వారిని చూస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా సందడి కనిపించింది. రోడ్లపై స్వాగత తోరణాలు పక్కన పెడితే.. కడప, రాజంపేట, పులివెందుల మొత్తం జనాలతో కిక్కిరిసి ఇసుకేస్తే రాలనంత జనంతో పట్టణాల్లో కేరింతలు కనిపించాయి. సాక్షి కడప : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని శుక్రవారం జిల్లాకు విచ్చేశారు.అభిమాన నేత వస్తున్నారన్న ఆనందంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎక్కడ చూసినా వైఎస్ జగన్ సీఎం అంటూ చేస్తున్న నినాదాలు మిన్నంటాయి. రోడ్లపై పూలవర్షం.. బాణసంచా మోత.. బైక్ ర్యాలీలు.. హారతులతో జనం నీరాజనాలు పలికారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ...అందరినీ దగ్గరకు తీసుకుని పేరుపేరున పలుకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వేకోడూరు, రాజంపేటలలో పోటెత్తిన జనం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరుజిల్లాలో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని శుక్రవారం ఉదయం జిల్లాకు పయనమయ్యారు. వైఎస్సార్–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని కుక్కలదొడ్డికి ఉదయం 10 గంటల ప్రాంతంలో చేరుకోగానే ఘనస్వాగతం లభించింది. మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డితో కలిసి సరిహద్దు ప్రాంతానికి రాగానే రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కోడూరు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బెలూన్లు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కుక్కలదొడ్డి నుంచి శెట్టిగుంట, ఉప్పరపల్లె, శాంతినగర్, సూరపురాజుపల్లె తదితర గ్రామాల వద్ద మహిళలు రోడ్డుపైకి వచ్చిన కాన్వాయ్ని ఆపి వైఎస్ జగన్తో మమేకమయ్యారు. రైల్వేకోడూరులో కూడా రోడ్డంతా జనాలతో నిండిపోయింది. ప్రతిపక్ష నేతను కలిసేందుకు కాన్వాయ్ వెంట జనాలు పరుగులు తీశారు. కోడూరు నుంచి మంగంపేట, కొర్లకుంట, ఓబులవారిపల్లె, ముక్కవారిపల్లె క్రాస్, కమ్మపల్లెక్రాస్, రెడ్డిపల్లె, అనంతంపల్లె, అప్పరాజుపేట రైల్వేగేటు, పుల్లంపేట, ఉడుగువారిపల్లె, పుత్తనవారిపల్లె, కనకదుర్గమ్మ కాలనీ, అనంతయ్యగారిపల్లె, ఊటుకూరు ఇలా ఎక్కడ చూసినా పల్లెలు సైతం కదిలివచ్చి జననేత జగన్ను పలుకరించారు. రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిపల్లె ఆర్చి వద్ద నుంచి స్వాగతం పలుకుతూ వైఎస్ జగన్ను తీసుకెళ్లారు. కుక్కలదొడ్డి నుంచి రాజంపేటకు చేరుకోవడానికి దాదాపు ఒంటి గంట సమయం పట్టింది. మిట్టమధ్యాహ్నం ఎండవేడికి అధికంగా ఉన్నా ఏమాత్రం లెక్కచేయకుండా జనాలు రాజంపేటలో బ్రహ్మరథం పట్టారు.భువనగిరిపల్లె ఆర్చి నుంచి పాతబస్టాండు, అమ్మవారిశాల, పెద్ద మసీదు, మార్కెట్, ఆర్టీసీ సర్కిల్, ఏఐటీయూసీ సర్కిల్ ఇలా ఎక్కడ చూసినా జనమే కనిపించారు. బయనపల్లె క్రాస్ వద్ద విద్యార్థులు వందల సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎర్రబల్లి మీదుగా నందలూరు, మంటపంపల్లె, చెర్లోపల్లె, ఒంటిమిట్ట, మాధవరం, భాకరాపేట, కనుమలోపల్లె, జేఎంజే కళాశాల వద్దకు రావడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. ఒంటిమిట్టలో జెడ్పీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కడపలో బ్రహ్మరథం కడప నగర శివార్లలోని జేఎంజే కళాశాల వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే అంజద్బాషా, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి వైఎస్ జగన్, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ర్యాలీగా కడపలోకి ప్రవేశించారు. అడుగడుగునా జై జగన్ నినాదం మార్మోగింది. రోడ్డు వెంబడి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకగా, ఎక్కడికక్కడ రోడ్డుపైకి వచ్చి మహిళలు వైఎస్ జగన్ కాన్వాయ్ని ఆపి మాట్లాడుతూ వచ్చారు. కడప జేఎంజే కళాశాల నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైతే కడప సరిహద్దులు దాటడానికి సాయంత్రం 7.30 గంటలు అయిందంటే ఏ మేరకు కిటకిటలాడిందో అర్థమవుతోంది. చిన్నచౌకులోని మేయర్ సురేష్బాబు సోదరుడు సతీష్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కడప బిల్టప్ నుంచి బయలుదేరిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేఎస్ఆర్ఎం, మిట్టమీదపల్లె, యల్లటూరు, పెండ్లిమర్రి, నందిమండలంలలో కాన్వాయ్ ఆపి కరచాలనం చేశారు. వేంపల్లెలో భారీగా తరలివచ్చిన జనం అఖండ స్వాగతం పలికారు. స్వంత నియోజకవర్గంలోకి అడుగు పెట్టగానే అడుగడుగునా హారతులు పట్టారు. పులివెందులకు చేరుకోగానే ఇంటివద్ద నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్కు సతీమణి వైఎస్ భారతిరెడ్డి హారతి పట్టి..దిష్టితీసి గుమ్మడికాయ కొట్టారు. పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు కడపలోని అమీన్పీర్ (పెద్దదర్గా) దర్గాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పూలచాదర్ గురువుల మజార్ వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ఫాతెహా చేశారు. తర్వాత దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ను కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా పెద్దదర్గా ప్రాంతమంతా ఎక్కడ చూసినా వైఎస్ జగన్ను కలిసేందుకు వచ్చిన ముస్లిం సోదరులు, ఇతర కార్యకర్తలతో నిండిపోయింది. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను శుక్రవారం పలువురు నేతలు కలిసి చర్చించారు. దారి మధ్యలో కడప, రాజంపేట మాజీ ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అంజద్బాష, రవీంద్రనాథ్రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్రెడ్డి, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, సురేష్బాబు, నెల్లూరుజిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రహ్మాన్, బద్వేలు సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితోపాటు పలువురు నాయకులు అనేక అంశాలపై చర్చించారు. రాజకీయాలతోపాటు పార్టీకి సంబంధించిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు. జననేతకు ఘన స్వాగతం పులివెందుల : వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్ర ముగించుకుని శుక్రవారం రాత్రి 9గంటలకు కడప నుంచి పులివెందులకు చేరుకున్నారు. కడప నుంచి వస్తున్న ఆయనకు ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం.. సీఎం.. వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ అభిమానులు నినాదాలు చేశారు. వైఎస్ జగన్ 9గంటలకు స్వగృహానికి చేరుకోగానే అక్కడ వేచి ఉన్న ప్రజలు జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ చెరగని తన చిరునవ్వుతో ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పలకరించారు. విజయ హారతి పట్టిన వైఎస్ భారతమ్మ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు తన సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముగించుకుని శుక్రవారం రాత్రి స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి సతీమణి వైఎస్ భారతమ్మ విజయ హారతి ఇచ్చి ఇంటిలోకి స్వాగతం పలికారు. వైఎస్ భారతమ్మతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. శనివారం స్థానిక సీఎస్ఐ చర్చికి చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతిరెడ్డి.ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు. విద్యార్థులకు దీక్షకు సంఘీభావం రైల్వేకోడూరులోని వైఎస్సార్ ఉద్యాన కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసన దీక్షలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంఘీభావం తెలియజేశారు. ఉద్యానశాఖలో ఉన్న అన్ని రకాల ఉద్యోగాలు అర్హులైన హార్టికల్చర్ విద్యార్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ 15 రోజులుగా దీక్షలకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రైల్వేకోడూరు వద్దగల దీక్షా ప్రాంగణం వద్ద వారికి మద్దతు తెలిపి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు గ్రామ సచివాలయం ద్వారా పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. -
ప్రజాసంకల్పయాత్ర ఎఫెక్ట్.. పింఛన్ల రెట్టింపు
-
తిరునగరి.. జనహారతి
చారిత్రాత్మక పాదయాత్రను పూర్తిచేసుకుని అడుగుపెట్టిన జననేతకు గురువారం అపూర్వ స్వాగతం లభించింది. రేణిగుంట మొదలు తిరుమల వరకూ దారిపొడవునా జనజాతర తలపించింది. తిరుపతి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్ నినాదాలతో హోరెత్తిపోయాయి. ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనసందోహం మధ్య ఆయన వాహనం కదలడానికి చాలా సమయం పట్టింది. అలిపిరి నుంచి తిరుమలకు సాగించిన కాలినడకనూ వేలాదిగా అభిమానులు అనుసరించారు. సాధారణ భక్తునిలా జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్తూరు, తిరుపతి తుడా/ తిరుమల : జననేతకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్రెడ్డి స్వాగతం పలికారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలతో రైల్వేస్టేషన్ నిండిపోయింది. జగన్ని నాదాలతో మార్మోగింది. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేసి చంద్రగిరి–రేణిగుంట బైపాస్ రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి బయలుదేరారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట వద్ద నగరంలోకి ప్రవేశించిన జగన్కు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వినూత్నంగా స్వాగతం పలికారు. రోడ్డుకి రువైపులా మామిడి, అరటి తోరణాలు, బెలూన్లు ఏర్పాటు చేశారు. మహిళలు గుమ్మడికాయలు కొట్టి దిష్టితీశారు. పద్మావతి గెస్ట్హౌస్లో కొంతసేపు సేదదీరారు. అనంతరం ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పలకరించారు. జననేత కాన్వాయ్ తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్ పూలే సర్కిల్కు చేరుకోగానే కార్యకర్తలు ప్లకార్డులతో ఘన స్వాగతం పలికారు. దీనికి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యం వహించారు. మార్మోగిన గోవింద నామస్మరణ.. అలిపిరి మెట్ల మార్గంలో గోవింద నామస్మరణ మార్మోగింది. జగన్తో పాటు వేలాది మంది కార్యకర్తలు కాలినడకన నడిచారు. అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మెట్లకు నమస్కరించా రు. సామాన్య భక్తుని వలే కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ శ్రీవారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. మార్గ మధ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టారు. వడివడిగా మెట్లు ఎక్కిన వైఎస్.జగన్ ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపు లేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలకరిస్తూ ఆత్మీయ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మార్గ మధ్యంలో నరసింహస్వామి ఆలయం మీదుగా మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. సామాన్య భక్తునిలా తిరుమలకు కాలినడకన వస్తున్న జననేతను పలకరించడానికి భక్తులు ఆసక్తి కనబరిచా రు. అలిపిరి నుంచి తిరుమల చేరేవరకు జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గోవింద నామస్మరణ చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.35 గంటలకు అలిపిరి వద్ద మొదలైన నడక 4.30గంటలకు తిరుమలకు చేరుకుంది. పద్మావతి గెస్ట్హౌస్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. 6 గంటల సమయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. రైల్వేస్టేషన్లో మాజీ ఎంపీలు మిథున్ రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేగౌడ తదితరులు స్వాగతం పలికారు. టౌన్క్లబ్ వద్ద భారీగా అభిమానులు టౌన్క్లబ్ సర్కిల్కు రాగానే అక్కడ వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, దివ్యాంగులు చేరుకుని అపూర్వ స్వాగతం పలికారు. మహతి ఆడిటోరియం వద్ద వైస్సార్సీపీ మైనారిటీ నాయకులు ఖాద్రీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు ప్లకార్డులతో రోడ్డుకిరువైపులా నిల్చొని జైజగన్ అంటూ అభిమానాన్ని చాటారు. అనంతరం జ్యోతి థియేటర్ సర్కిల్ వద్ద వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఎస్వీ మెడికల్ కళాశాల చేరుకోగానే అక్కడ అభిమానులు రంగురంగుల కాగితాలను వెదజల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
పాదయాత్ర సక్సెస్తో పాలకుల్లో భయం
-
ఈ సంకల్పం.. అందరికోసం
ఎండమావిలో పన్నీటి జల్లులా...కష్టాల కడలిలో చుక్కానిలా ఇపుడుకొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోములో వెలుగునింపుతోంది.జననేత ఇచ్చిన భరోసాతోప్రతిఒక్కరిలో ఆశలు నింపుతోంది.భరోసా కలిగిస్తోంది. విశాఖపట్నం, చోడవరం : ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ఆధునిక వ్యవసాయం మాట దేవుడికెరుకగాని ఉన్న సాధారణ వ్యవసాయమే చేయలేని పరిస్థితిలో వైఎస్సార్సీపీలో ప్రవేశపెట్టిన నవరత్న పథకాల్లో ‘రైతు భరోసా’ పథకం రైతులకు కొండంత అండగా నిలుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రతి రైతుకు రూ.12500 ఇవ్వడంతోపాటు పంటల బీమా ప్రీమియం కూడా తమ ప్రభుత్వమే చెల్లించేలా చూస్తామని జగన్ చెప్పడం రైతుల్లో ఎంతో ఆనందాన్ని నింపింది. ఉచితంగా వ్యవసాయ బోర్లు ఏర్పాటు, పంట దిగుబడి ముందే కొనుగోలు గిట్టుబాటు ధరను ప్రకటిస్తామని, ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటాకాల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.4వేల కోట్లు స్థిరీకరణ నిధిని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని చెప్పడం రైతుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. సుగర్ ఫ్యాక్టరీలను, చెరకు రైతులను ఆదుకోవడంతోపాటు పాడి రైతులకు లీటరుకు రూ.4 బోనస్గా ప్రకటించడం, సహకార పాల డెయిరీలను ప్రతి జిల్లాకు ఏర్పాటు చేస్తామని చెప్పడం పాడి రైతుకు ఊరటనిస్తుంది. ‘అమ్మ ఒడి’..ఆలంబనగా.. పేద కుటుంబాలకు ఉన్నత భవిష్యత్తును ఇచ్చేదిగా ఉంది. టీడీపీ పాలనలో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం, ప్రైవేటు పాఠశాలలకు వేలకు వేలు ఫీజులు కట్టలేక దిగాలు పడుతున్న కుటుంబాలను జగన్ ప్రకటించిన అమ్మ ఒడి పథకం అక్షరాస్యత శాతాన్ని నూరుశాతం పెంచేదిగా ఉంది. బడికి పంపిస్తే చాలు ఒక్కో పిల్లోడికి ఏటా రూ.15వేలు నేరుగా తల్లికే ఇస్తానని, ఎంతమంది పిల్లలు ఉన్నా, ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివినా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం అన్ని వర్గాల కుటుంబాలకు ఓ వరం కానుంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్’ ఉన్నతంగా.. గడిచిన ఐదేళ్లలో ఇంజినీరింగ్, డాక్టర్తోపాటు ఉన్నత చదువులన్నింటి ఫీజులు రూ.లక్షకు పైగానే పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుకయ్యే ఎంత ఖర్చయినా రూ.లక్ష వరకు భరించడంతో పాటు హాస్టల్ ఖర్చు కింద రూ.20వేలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ ‘ఉన్నత’ విద్యార్థి లోకానికి ఓ మంచి అవకాశంగా ఉంది. ‘డ్వాక్రా రుణమాఫీ’ ఒక ఆసరా డ్వాక్రా మహిళలకు వరంగా కానుంది. గత ఎన్నికల్లో మహిళలందరికీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తర్వాత మాఫీ చేయకపోవడంతో మహిళలంతా అప్పుల చేసి మరీ వడ్డీతో సహా అసలు కట్టిన విషయం తెలిసిందే. దీనితో మహిళలంతా ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తరుణంలో జగన్మోహన్రెడ్డి ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీ పథకం మహిళలందరికీ వరంగా మారనుంది. ఇంపుగా ‘పింఛన్ పెంపు’ ఇప్పటి వరకు రూ.వెయ్యి ఇస్తున్న వృద్ధాప్యం పింఛన్ను రూ.2వేలకు, వికలాంగుల పింఛన్ రూ.1500 నుంచి 3వేలకు పెంచుతామని జగన్ చేసిన ప్రకటన వేలాది మంది లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమౌతోంది. గృహ నిర్మాణం పక్కా.. చంద్రబాబు హయాంలో ఊరికి నాలుగైదు కూడా ఇళ్లు మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిలో అర్హులైన వారందరికీ పక్కాగృహాలు మంజూరు చేయడంతోపాటు స్కీం మొత్తాన్ని రూ. లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచి ఇస్తామని చెప్పడం గూడులేని వారికి నమ్మకం ఏర్పడింది. ఆరోగ్య శ్రీ పథకానికి గతంలో కంటే నిధులు పెంచి రూ.వెయ్యికి మించి ఖర్చయ్యే ప్రతి వైద్యానికి ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని జగన్ ప్రకటించడం జనారోగ్యానికి ఢోకాలేదనే భావన ఏర్పడింది. ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు గ్రామ సచివాలయ వ్యవస్థలో స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి వారికి జీతాలు ఇస్తూ వారి ద్వారా రేషన్తోపాటు అన్ని పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపించే కొత్త విధానికి శ్రీకారం చుట్టేందుకు జగన్ సంకల్పించడం మేధావుల మన్ననలు సైతం పొందుతుంది. పంటకు ముందే ధర నిర్ణయం భేష్ అందరూ రైతులకి ఇదిచేస్తాం అది చేస్తాం అని ఓట్లు అడుగుతారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రైతులనే మరిచిపోతారు. రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకున్నారు. అతనిలాగే అతని కుమారుడు చేస్తాడని నమ్మకం ఉంది. ముఖ్యంగా గిట్టుబాటు ధర కల్పించారు. పంట పండించడానికి ముందే పంటకు ధర నిర్ణయించడం అంటే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. అలాగైతే రైతులు పంటలు పండించడానికి ముందుకు వస్తారు.– బూడి వెంకటరమణ, రైతు, గౌరీపట్నం నిరుద్యోగులకు ఉపాధి వస్తుంది రాష్ట వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలతో పాటు, ఉపాధి అవకాశాలు వస్తాయి. జగనన్న పాదయాత్ర వల్ల ఎంతో మంది నిరుద్యోగుల సమస్యలను దగ్గర నుంచి విన్నారు. జగనన్న తప్పకుండా నిరుద్యోగులకు సముచిత స్ధానం కల్పిస్తారు. కొద్ది రోజుల్లోనే మంచిరోజులు వస్తాయన్న నమ్మకం మా యువతకు కలిగింది. – కంటే వెంకట్, మంగళాపురం, బుచ్చెయ్యపేట -
సంకల్ప సంబరం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్ జగన్ పాదయాత్ర ముగియగానే జిల్లాలో సంబరాలుఅంబరాన్నంటాయి. సంఘీభావంగా పాదయాత్రలు, బైక్ర్యాలీలు, ర్యాలీలు చేపట్టారు. పార్టీ కార్యాలయాల్లో కేక్లు కట్ చేసి..ప్రజలకు పంచిపెట్టారు. ఆలయాల్లో వైఎస్ జగన్ పేరిట అర్చనలు చేయించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయంలో ఐదు వేల మందితో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి రాఘవేంద్రస్వామి ప్రధాన ముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్, 167 జాతీయ రహదారి మీదుగా హెచ్ఆర్బీ కల్యాణ మండపం వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరిట అర్చన చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబం విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటపై నిలబడే నాయకుడని కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు చరిత్ర సృష్టించారన్నారు. ♦ కర్నూలు ఎస్బీఐ సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నగర అ«ధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు తెర్నేకల్ సురేందర్రెడ్డి, లక్కీటూ నరసింహులు యాదవ్ తదితరులు భారీ పూలమాల వేసి.. పాలాభిషేకంచేశారు. ఇక్కడే కేక్లు కట్ చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ♦ కర్నూలు వినాయక స్వామి దేవాలయం వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుడు, సాయిబాబాకు వైఎస్ జగన్ పేరిట అర్చన చేయించారు. అనంతరం 516 కొబ్బరికాయలను సమర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పర్ల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ♦ కల్లూరు శరీన్నగర్లోని వైఎస్సార్ విగ్రహానికి కల్లూరు అర్బన్ వార్డుల ఇన్చార్జ్ బెల్లం మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి.. పాలాభిషేకం చేశారు. ♦ నంద్యాలలో మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మాజీ చైర్మన్ కైపరాముడు, శిల్పా మహిళా సహకార్ చైర్మన్ శిల్పా నాగినీరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి ఇంటి నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ♦ ఆదోనిలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు దేవా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు. ♦ పత్తికొండలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, జిల్లా నాయకుడు కారం నాగరాజు, మండల కన్వీనర్ బజారప్ప ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. ప్రజలకు పంచిపెట్టారు. ♦ బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీఆర్ వెంటేశ్వరరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి.. ప్రజలకు పంచిపెట్టారు. ♦ హాలహర్విలో మండల కన్వీనర్ భీమప్ప చౌదరి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి..మిఠాయిలను పంచిపెట్టారు. -
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం!
-
ఉత్సాహం నింపిన సంకల్పం
బిందువు.. బిందువూ కలిసి సింధువైనట్లు.. అడుగు.. అడుగు కలిసి అభిమాన సంద్రమైంది. 14 నెలలు.. 3648 కిలోమీటర్లు.. అలుపెరగని బాటసారి ప్రజా సంకల్ప యాత్ర సాగింది. నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజలే. అధికార మదం అడ్డంకులు సృష్టించినా.. రాజన్న చల్లని దీవెనలు.. ప్రజల ఆప్యాయత.. ఆత్మీయతలే తోడుగా.. ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన వైఎస్సార్ వారసుడు.. సుదీర్ఘ పాదయాత్ర ఘనంగా ముగిసింది. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నామన్నదే ఆయన సిద్ధాంతం. కష్టం చెప్పుకున్న ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తూ.. రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం అందించేందుకు చేసిన జన జాతర ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకూ అదే అభిమానం సాగింది. ముగింపులోనూ జననేత జగనన్నకు ఆశీస్సులు, అభినందనలు అందించేందుకు ప్రతి జిల్లా దారులన్నీ.. ఇచ్ఛాపురం వైపే సాగాయి. చిన్నా పెద్దా.. కార్యకర్త, నాయకుడు అనే తారతమ్యం లేకుండా అద్వితీయ ముగింపు సభలో పాలుపంచుకునేందుకు ఉరకలేసే ఉత్సాహం ప్రదర్శించారు. విశాఖ సిటీ: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర ఘనంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇచ్ఛాపురం చేరుకొని జననేతకు అభినందనలు తెలిపారు. దారులన్నీ.. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ఇచ్ఛాపురం వైపే సాగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు జననేతకు జేజేలు పలికేందుకు ఇచ్ఛాపురం వెళ్లారు. జననాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళ్తున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. తమ చెంతకే వచ్చి సమస్యలు సావధానంగా విని భరోసా ఇచ్చిన నాయకుడు దొరికాడంటూ ప్రజలందరూ ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. నిఖార్సైన నేతగా.. నిలువెత్తు నిబద్ధతతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రజా సంకల్ప ధీరుడు జగనన్నే అనే ఒక అభయం రాష్ట్ర ప్రజలకు దక్కిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందరూ అక్కడికే.. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు పాదయాత్ర ముగింపు సభాస్థలికి చేరుకునేందుకు ఉత్సాహం చూపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తమ వాహనాల్లో ఇచ్ఛాపురం వెళ్లారు. సంకల్ప ధీరుడికి జన నీరాజనం సంకల్ప ధీరుడికి ముగింపు సభలో అశేష ప్రజానీకం విజయోస్తు అంటూ దీవెనలు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమం కోసం చేపట్టే పథకాలను, వాటి అమలుకు తీసుకునే చర్యలను వివరించడాన్ని ప్రజలు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. అవినీతిరహిత పాలనను ప్రజల చెంతకే చేరువచేస్తానని, రేషన్ సరకులు డోరు డెలివరీ ఇప్పిస్తాననే హామీలు ప్రజల్లో ఆసక్తిని, ఆకాంక్షను కలిగించాయి.– మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ముగింపు సభలో నిజాయితీ, నిబద్ధతకే పెద్దపీట వేశారు. పంచాయతీలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమిస్తానన్న హామీ పేదల్లో ఆనందాన్ని నింపుతుంది. పార్టీ విజయానికి బాటలు వేసేలా చేసిన జగన్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే స్ఫూర్తితో పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఆవశ్యకత ఆసస్నమైంది. – వంశీకృష్ణ శ్రీనివాస్యాదవ్,వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త వైఎస్ఆర్ అభిమాన కుటుంబం తరలివచ్చింది.. ఇచ్ఛాపురంలో ముగింపు సభకు యావత్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాన కుటుంబం తరలివచ్చింది. సంక్రాంతి వారం రోజుల ముందే జరిగినట్టు అనిపించింది. 150 రోజులలో మనందరం కలలుకన్న నవరత్నాల వంటి సంక్షేమ పథకాలతో రాజన్న రాజ్యం సాకారం కాబోతోందని అందరూ చర్చించుకున్నారు. మూడు పాదయాత్రలు ఇచ్ఛాపురంలో ముగియడం.. అక్కడే ఈ మూడు పైలాన్లు ఉండటం స్థానిక ప్రజలు చేసుకున్న అదృష్టం. – అక్కరమాని విజయనిర్మల,భీమిలి సమన్వయకర్త, వైఎస్సార్సీపీ ప్రజా సంకల్పయాత్ర అపూర్వ ఘట్టం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ప్రజల కష్టాలను విని, వారికి అండగా నిలబడ్డారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.– తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీగాజువాక సమన్వయకర్త జగన్పై ప్రజల్లో అపార నమ్మకం రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయాల ఏర్పాటు చేస్తాననడంతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో అపార నమ్మకం కలిగింది. జగన్ రైతు పక్షపాతిగా చెప్పడానికి ఆయన ప్రకటించిన వరాలు, స్థిర నిధి ఏర్పాటు హామీలే నిదర్శనం. ప్రస్తుతం వ్యవసాయం దండగా అనే నిస్పృహలో ఉన్న రైతులకు అది జగన్ సీఎం అయితే పండగా కాబోతోంది. – తైనాల విజయకుమార్, పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ప్రజల్లో ఎనలేని ఉత్సాహం ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుం టూ.. ప్రజలందరికీ భరోసా ఇస్తూ సుదీర్ఘంగా జగనన్న పాదయాత్ర చేయడం ఓ రికార్డు. ఆ తుది ఘట్టం చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అభిమానులు ఇచ్ఛాపు రం చేరుకున్నారు. ఆ జనసందోహం చూస్తే ఓ పండగ వాతావరణంలా కనిపించింది. పైలాన్ను ఓ సందర్శన స్థలంలా అద్భుతంగా నిర్మించారు. రాష్ట్ర ప్రజలకు జగనన్న ముందస్తు కానుకలు ఎన్నో అందించారు. – వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ అనకాపల్లిపార్లమెంట్ జిల్లా సమన్వయకర్త ఇచ్ఛాపురంలో ముగింపు అదిరింది.. ఇచ్ఛాపురంలో సంకల్పయాత్ర ముగింపు అదిరింది. సభకు యావత్ రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు మోసపూరిత హామీలపైనే ప్రజలు చర్చించుకున్నారు. ప్రజల్లో, పార్టీ క్యాడర్లో ఉత్సాహం రెట్టింపైంది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆకాంక్ష ప్రజల్లో కనిపించింది.– డాక్టర్ పైడి వెంకట రమణమూర్తి,వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ప్రజలకు నమ్మకం కలిగించారు జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వినడం వల్ల ఆయనపై విపరీతమైన నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రజలు పెంచుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని కళ్లారా చూశారు. ఓ గొప్ప నాయకుడుని కలుసుకుని ప్రతీ కుటుంబం ఎంతో సంతోషపడింది. యువత కష్టాలకు కాలం చెల్లి రేపటి భవిష్యత్ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తోంది. – కె.కె.రాజు,ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ సీపీ -
సిక్కోలులో ‘తూర్పు’ సందడి
కాకినాడ: ప్రజా సంకల్ప పాదయాత్ర తుది అంకంలో ‘మేముసైతం’... అంటూ జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో బుధవారం జరిగిన పైలాన్ ఆవిష్కరణ, చివరి రోజు పాదయాత్ర ... బహిరంగ సభలో పాల్గొనడానికి జిల్లా నలుమూలల నుంచి ఉత్సాహంగా తరలి వెళ్లారు. అభిమాననేతకు బాసటగా ‘మీ వెంటే మేమం’టూ ఆయా ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లి సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్సీపీ అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్చంద్ర బోస్, కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్ల పర్యవేక్షణలో ఆయా నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కారులు, బస్సుల్లో బుధవారం ఉదయానికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పినపే విశ్వరూప్, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగంఅధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితర నేతలు పాదయాత్రకు పార్టీశ్రేణులతో తరలి వెళ్లారు. వివిధ నియోజక వర్గాలకు చెందిన కో–ఆర్డినేటర్లు తమ ప్రాంతాలకు చెందిన పార్టీశ్రేణులతో కలిసి ఇచ్చాపురం చేరుకున్నారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు మార్గాని భరత్, చింతా అనురాధ, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పొన్నాడ వెంకటసతీష్కుమార్, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా యువజన విభా గం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, మాజీ కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాజమహేంద్రవరం, కాకినాడసిటీ పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, ఆర్వీజేఆర్ కుమార్, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్ తదితరులు వేలాదిగా వెళ్లిన పార్టీశ్రేణులు జగన్ వెంట నడిచారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్ను సందర్శించడంతో పాటు చివరి బహిరంగ సభలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో సంబరాలు... జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రం కాకినాడలో పార్టీశ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాకినాడ కొండయ్యపాలెంలో కేక్కట్ చేసి చిన్నారులకు పండ్లు, మిఠాయిలు పంచారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ర్యాలీ నిర్వహించి టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తనయుడు ఆకుల విజయ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక అచ్చమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర లీగల్సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు ఇచ్చాపురంలో పైలాన్వద్ద పాదయాత్ర 341 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 341 బెలూన్లను ఎగురవేశారు. -
విజయోస్తు జగనన్న!
కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని... ప్రతి పేదవాడి గుండెల్లో బాధను నేరుగా తెలుసుకోవాలని... పద్నాలుగు నెలల క్రితం ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. కానీ తాను చేపట్టే ప్రజా సంకల్పయాత్ర 3648 కిలోమీటర్లు సాగుతుందని... తనపై ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమాలను తట్టుకోలేక కుట్రలు పురుడుపోసుకుంటాయని... ఆయనకే తెలియదు. అయితేనేం? ఎన్ని దుర్మార్గపు అవాంతరాలు ఎదురైనా అనిర్వచనీయమైన జనాభిమానం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. మృత్యుంజయుడై వచ్చిన ఆయన అడుగుముందుకే వేశారు. అనితరసాధ్యమైన మహాయజ్ఞాన్ని పూర్తిచేశారు. అ విజయోత్సాహంతోకలియుగవైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని దివ్యదర్శనానికి సంసిద్ధులయ్యారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 3648కిలోమీటర్ల దూరం నడిచి ఇచ్ఛాపురం చేరుకుని ఓ చరిత్రను సృష్టించారు. ఆ చారిత్రక నేపథ్యానికి సాక్ష్యంగా రూపొందించిన విజయస్తూపాన్ని అక్కడ ఆవిష్కరించారు. ఆ అరుదైన ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వెళ్లారు. ప్రతి నియోజకవర్గం నుంచి బస్సులు, కార్లలో వేలాదిగా వెళ్లి చివరి సభకు అఘండ విజయాన్ని చేకూర్చారు. ప్రజా సంకల్పయాత్ర విజయ సంకల్ప స్ధూపాన్ని సందర్శించి తరించారు. జగన్మోహన్రెడ్డి సాధించిన గ్రేట్ విక్టరీకి చిహ్నంగా అద్భుతంగాఅద్భుతంగా మలిచిన స్తూపం వద్ద ఫొటోలు దిగి ఆ జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు. విజయనగరం నుంచి తిరుపతికి... అశేష జనవాహిని నడుమ ప్రజా సంకల్పయాత్ర చివరి బహిరంగ సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించుకుని రోడ్డు మార్గంలో జగన్ బుధవారం రాత్రికి విజయనగరం పట్టణానికి చేరుకున్నారు. దురంతో ఎక్స్ప్రెస్ రైలులో రాత్రి 10.10 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లా రు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పాదయా త్ర చేసిన ఆయన పాదయాత్ర ముగిసిన జిల్లాలో విశాఖపట్నం విమానాశ్రయం మినహా మరెక్కడికీ మరలా వెళ్లలేదు. ఎప్పుడూ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళుతుండేవారు. కానీ విజయనగరం జిల్లాలో 36 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్ పాదయాత్ర చివరిలో కూడా జిల్లాకు వస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా ముగించుకు న్న తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపేం దుకు రైల్వే స్టేషన్ పరిసరాలకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంత మంతా కోలాహలం గా మారిపోయింది. జగన న్న రాగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూ ప్రతిపక్ష నేతకు జయ జయ ధ్వానాలు పలి కారు. క్షేమంగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోమం టూ వీడ్కోలు పలికారు. ప్రతిఒక్కరికీ చిరునవ్వుతో చేతులు జోడించి అభివాదం చేస్తూ జగన్ పయనమయ్యారు. రైల్వే స్టేషన్లో జగన్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జి భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీ వాణి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స అప్పలనరసయ్య, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్ర శేఖర్, శత్రుచర్ల పరిక్షిత్ రాజు, నెల్లిమర్ల నియోజక వర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
జన గర్జన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నేల ఈనిందా అన్నట్లు ఇచ్ఛాపురం కదం తొక్కింది. రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుత చంద్రబాబు పాలనపై ఉన్న నిరసన ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. ప్రజాసంకల్ప తీవ్రతను రాష్ట్రానికి చాటిచెప్పింది. ఇసుకేస్తే రాలనంతగా కిలోమీటర్ల మేర జనం తరలిరావడంతో ఇచ్ఛాపురం జనసంద్రమైంది. రాష్ట్రంలో ‘నారా’సుర పాలనకు అంతమొందించడానికి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో దిగ్విజయంగా ముగిసింది. ఇడుపులపాయలో మొదటి కిలోమీటర్తో ప్రారంభమైన ఈ చరిత్ర బుధవారానికి ఇచ్ఛాపురం చేరుకుని ఏకంగా 3648 కిలోమీటర్ల మేరకు చేరి యాత్రను ఓ చరిత్రలా ముగించింది. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ఈ దృఢ సంకల్ప ముగింపునకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో వ్యతిరేక సర్కా ర్ వెన్నులో వణుకు పుట్టింది. చంద్రబాబు దుష్ట సర్కార్ను తరిమికొట్టేందుకు నవరత్నాలే సమరాస్త్రాలుగా ప్రజా సంక్షేమమే సంకల్పంగా చేపట్టిన సంకల్ప యాత్రికుడికి జనం జయ జయ ధ్వానాలు పలికారు. ఇందులో భాగంగా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ముగింపు సభలో చంద్రబాబు సర్కార్పై ధ్వజమెత్తడంతో పాటు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలపై జగన్ వివరించారు. వేలాది కిలోమీటర్లు మేరకు తానే నడిచినప్పటికీ నడిపించింది మాత్రం ప్రజలే అని చెప్పడం విశేషంగా చెప్పవచ్చు. ఇదిలావుంటే ముగింపు సభ జరుగుతున్న సమయంలో జిల్లాలో పలు చోట్లతో పాటు ప్రధానంగా ఇచ్చాపురం, పలాస, టెక్కలి తదితర నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. జగన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంగా టీవీల్లో చూసే అవకాశాలు లేకుండా సర్కార్ చేసిన ఈ కుటిల చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరైన నేతలు ప్రజాసంకల్పయాత్రకు రాష్ట్ర స్థాయి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంకల్పానికి తుది లక్ష్యానికి చేరుకోనున్న నేపథ్యంలో పలువురు జగన్తో కలిసి అడుగులు వేశారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, గొర్లె కిరణ్కుమార్, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, రాష్ట్ర పార్టీ సిఈసి సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు, ముఖ్యనేతలు దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, ఎన్ని ధనంజయ, మామిడి శ్రీకాంత్, హనుమంతు కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్ను నమ్మం బాబూ..అంటున్నారంతా.. ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర అవస్థలకు గురిచేసిన చంద్రబాబును ఇక నమ్మేది లేదంటూ జనం గట్టిగా చెబుతున్నారని వైఎస్ జగన్ అనడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ప్రజ లను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరాజకీయాలతో పాటు అవినీతి అక్రమాలను జగన్ ఎండగట్టాడు. పాదయాత్రలో ఎన్నో రకాల సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు చేసిన మోసాలను చెప్పారని, అప్పట్లో చంద్రబాబుకు ఓటేసి మోసపోయామన్నారు. రుణమాఫీపై మోసం చేయడంతో రైతులంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అని అంటున్నారని, పొదుపు రుణాలు, బంగారు రుణాల మాఫీపై మోసం చేయడంతో డ్వాక్రా మహిళంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారని జగన్ చెప్పడంతో జనంలో మంచి స్పందన వచ్చింది. అలాగే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయడంతో నిరుద్యోగులు, యవత కూడా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారని, అలాగే యువకులు, గ్రామాల్లో ప్రజలు, ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు చెయ్యకపోవడంతో విద్యార్థులు, వైద్యం సక్రమంగా అందివ్వని కారణంగా రోగులు తదితర వర్గాల ప్రజలంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ అంటున్నారని జగన్ చెప్పడంతో విశేష స్పందన వచ్చింది. ఘనంగా విజయ స్తూపం ఆవిష్కరణ ప్రజాసంకల్పయాత్ర ముగింపునకు గుర్తింపుగా ఇచ్ఛాపురానికి సమీపంలో అద్భుతంగా నిర్మించిన విజయ స్తూపాన్ని (పైలాన్) వైఎస్ జగన్ ఘనంగా ఆవిష్కరించారు. 13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లతో అద్భుత రీతిలో టోంబ్తో పాటు గ్రీనరీ లాన్, దివంగత వైఎస్సార్ ఫొటోలు, అలాగే జగన్ పాదయాత్ర చేసిన రూటు తదితర వివరాలన్నీ ఈ స్తూపంలో ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు యువకులు పెద్ద సంఖ్యలో సీఎం సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఇదే మార్గంలో దివంగత వైఎస్సార్ చేపట్టిన ప్రజాప్రస్థానం పైలాన్, వైఎస్ షర్మిళ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పైలాన్లు కూడా ఉండడంతో యాత్రలో భాగంగా జగన్ వాటిని తిలకించి సభకు హాజరయ్యారు. పాదయాత్రకు జన నీరాజనం ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఉదయం కవిటి మండలం అగ్రహారం నుంచి భారీ జనసందోహం నడుమ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. జాతీయ రహదారి మీదుగా కొజ్జీరియా కూడలి, ఎ.బలరాంపురం, అయ్యవారిపేట, లొద్దపుట్టి వరకు యాత్ర సాగింది. విరామం అనంతరం ముగింపు పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం మళ్లీ పాదయాత్రగా ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకుని బహిరంగ సభను నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఆద్యంతం అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. ముగింపు రోజు కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభం నుం చి వేదమంత్రాలు, శంఖారావం, కోలాటాలు, బిందెల నృత్యాలతో జగన్కు స్వాగతం పలి కారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోకి జగన్ రాగానే మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఘన స్వాగతం పలికారు. రైతుల కళ్లల్లోఆనందం చూడాలని.. పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలని అనడంతో రైతులంతా హర్షం ప్రకటించారు. పంటలకు ఏటా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, అలాగే ముందస్తు పెట్టుబడిగా మే నెలలో ప్రతి రైతుకు రూ.12500 నేరుగా ఇస్తామని ప్రకటించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే రైతులు వినియోగించే ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని, ఉచితంగా బోర్లు వేయిస్తామని, అలాగే రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి, అలాగే పంట భీమాను ఇక రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేసి, రైతన్న ఆదాయం పెంచుతామని జగన్ ప్రకటించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం లక్షలాది మంది రైతులకు ఆసరాగా మారనుంది. మరో మూడు నెలల్లో.. రాష్ట్రంలో మరో మూడు నెలల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నవరత్నాల అమలుతో ప్రజలకు సంక్షేమం చేరవవుతుంది. టీడీపీ చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి.– కంబాల జోగులు,ఎమ్మెల్యే, రాజాం. ఇది చరిత్ర ఇచ్ఛాపురం చరిత్రలో నిలిచి పోతుంది. పాదయాత్ర ముగింపు, పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహణ చిరస్థాయిగా నిలిచి పోతాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై పూర్తి దృష్టి పెడుతుంది. తిత్లీ బాధిత రైతులను ఆదుకుంటుంది. –పిరియా సాయిరాజ్,ఇచ్ఛాపురం వైఎస్ఆర్ సీపీ సమన్వయ కర్త,మాజీ ఎమ్మెల్యే జగన్ పేదల మనిషి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల మనిషి, పేద ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో ఉంది. రాష్ట్రానికి 30 ఏళ్లు సీఎంగా కొనసాగుతారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నిం పారు. విద్య, వైద్యం, సంక్షేమం అన్ని రంగాల్లో ప్రగతికి కృషి చేస్తారు. – తమ్మినేని సీతారాం,పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పాలనలో విఫలం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా పాలనలో విఫలమైంది. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది. టీడీపీ నాయకులు ప్రజాధనం దోచుకుంటున్నారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.– పేరాడ తిలక్, టెక్కలి, సమన్వయకర్త రాక్షస పాలనకు అంతం తప్పదు ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాష్ట్రం రావణ కాష్టంగా ఉండేది. వైఎస్సార్ పాదయాత్రను విజయవంతం చేసి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. మళ్లీ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. మరి కొద్ది రోజుల్లో ధర్మమైన ప్రజా తీర్పుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. – దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త. విజయం అందజేయాలి సుమారు 14 నెలల పాటు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. గ్రామ స్థాయిలో నవరత్నాలు, ఫ్యాన్ గుర్తుపై ప్రచారం చేసి రాబోయే ఎన్నికల్లో జగనన్నకు సీఎం చేయాలి.– విశ్వాసరాయి కళావతి,ఎమ్మెల్యే, పాలకొండ -
నాడు వైఎస్... నేడు జగన్
సాక్షి, తిరుపతి: తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు. నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు. నేడు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకోనున్నారు. అదే రోజు తిరుపతి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.. 2017 నవంబర్ 6న ప్రారంభమైన పాదయాత్ర 341 రోజుల పాటు 3,648 కి.మీ. 2516 గ్రామాల మీదుగా సాగి బుధవారం ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. గత ఏడాది ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర సాగింది. ఈ ఏడాది కూడా జనవరిలోనే జగన్మోహన్రెడ్డి యాత్రను పూర్తి చేసుకుని తిరుపతికి వస్తున్నారు. జననేతకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకనున్నాయి. యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరి వద్ద 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు జగన్కు స్వాగతం పలకడంతో పాటు ఆయన వెంట తిరుమలకు కాలినడకన వెళ్లడానికి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం వైఎస్ జగన్ రైలులో రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన తిరుపతిలోని పద్మావతి అతిథిగృహానికి వెళ్తారు. అనంతరం తిరుపతి నుంచి కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. అదే రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. వైఎస్ జగన్కు భారీ స్వాగత ఏర్పాట్లు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. చంద్రగిరి నియోజక వర్గం మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించనున్న మార్గంలో ఏడాదిపాటు వైఎస్ జగన్ పడిన కష్టాన్ని మరిపించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి 20 అడుగులకు రోడుకిరువైపులా అరటిచెట్టు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దారిపొడవునా మామిడి తోరణాలు, పార్టీ జెండాలతో కూడిన తోరణాలు, 50 వేలకు పైగా పార్టీ జెండా రంగుతో కూడిన బెలూన్స్ను మొత్తం కట్టారు. ఇంకా రోడ్డుకిరువైపులా మహిళలు, యువకులు పార్టీ జెండా రంగులతో కూడిన దుస్తులు ధరించి సుమారు 7 టన్నుల వివిధ రకాల పుష్పాలతో ఘనంగా స్వాగతం పలకనున్నారు. -
341వ రోజు పాదయాత్ర డైరీ
-
కడపలో వైఎస్ఆర్సీపీ నేతల సంబరాలు
-
సీఎంగా చూడాలని ఆకాంక్ష..
శ్రీకాకుళం :పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎనలేని ప్రజాదరణ వచ్చింది. ప్రజల సమస్యలు తెలుసుకునే వారే నిజమైన నాయకులు. అలా.. జనంలో నడిచి వారి కష్ట,సుఖాలు తెలుసుకున్నారు. వారి బాధలు తీర్చడానికి భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వారు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారు.– పి.నాని, వ్యాపారవేత్త, విశాఖపట్నం -
వచ్చేది రైతు రాజ్యమే!
-
గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి...
శ్రీకాకుళం :గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. ప్రజా సంకల్పయాత్ర చేపట్టి ప్రజల బాధలు, కష్టాలు తెలుసుకోవాలన్న సంకల్పం ఎంతో మంచిది. జనం వద్దకే వెళ్లి జనం సమస్యలు తెలుసుకున్న నాయకుడిగా జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు.– పడాల రామారావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, తూముకొండ రామచంద్రాపురం, మెళియాపుట్టి మండలం -
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర
శ్రీకాకుళం :ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన పాదయాత్రలో జన హృదయాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుచుకున్నారు. బడగు, బలహీన వర్గాలు కష్టాలను తెలుసుకున్నారు. వారికి భరోసానిస్తూ ముందుకు సాగిన తీరు రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోతుంది.– డాక్టర్ బి.కాశినాయుడు,రిటైర్డ్ డీఎంహెచ్ఓ, బలిజిపేట, విజయనగరం జిల్లా -
దివ్యాంగులను పట్టించుకోని టీడీపీ
శ్రీకాకుళం :దివ్యాంగులను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. పెన్షన్కు దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలు తొలగించాయి. హిందీ బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ రాశాను. పోస్టులు తక్కువగా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి.– ఏదురు భారతి, కొత్త కొజ్జీరియా, ఇచ్ఛాపురం మండలం