వైఎస్సార్‌ సీపీలో చేరిన భానుచందర్‌ | Actor Bhanu Chandar Joined In YSRCP | Sakshi
Sakshi News home page

ఇలాంటి నాయకుడిని చూడలేదు : భానుచందర్‌

Published Wed, Jan 9 2019 2:38 PM | Last Updated on Wed, Jan 9 2019 2:59 PM

Actor Bhanu Chandar Joined In YSRCP - Sakshi

జనంతో ఇంతగా కలిసిపోయే నాయకుడు వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని..

సాక్షి,  శ్రీకాకుళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సినీ నటుడు భానుచందర్‌ వైఎస్సార్‌ సీపీలో చేరారు. జననేత పార్టీ కండువా కప్పి భానుచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్ర ముగింపు ఘట్టంలో పాల్గొన్న భానుచందర్‌ మాట్లాడుతూ... ప్రజల కోసం తపించే వైఎస్‌ జగన్‌ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. జనంతో ఇంతగా కలిసిపోయే నాయకుడు వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని పేర్కొన్నారు. 2019 నుంచి మరో 20 సంవత్సరాల పాటు వైఎస్‌ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వ్యాఖ్యానించారు.

కాగా కొన్నిరోజుల క్రితమే భానుచందర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గతేడాది డిసెంబర్‌లో వైఎస్‌ జగన్‌ను భానుచందర్ కలిశారు. ఆరోజే తాను పార్టీలో చేరే విషయంపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement