Ichapuram
-
విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..
-
ఇచ్చాపురం జనసంద్రం..
-
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
-
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
-
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
-
పిరియా విజయ పల్లె నిద్ర
-
సీఎం జగన్ ను కాపీ కొట్టిన చంద్రబాబు.. కానీ గెలుపు మాదే
-
మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..
-
సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ బ్రిడ్జిని నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సెల్ఫీ తీసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్లు తోక ముడిచారు. వీరి సెల్ఫీకి బొడ్డబడ గ్రామస్తులంతా ప్రతిస్పందించారు. ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైందంటూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ప్రజల్లో అభాసుపాలయ్యామంట గురువారం ‘సెల్ఫీ’ పోస్టులు తొలగించారు. చదవండి: టీడీపీ నేతల ‘సెల్ఫీ’గోల్ -
Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూకంపం
ఇచ్ఛాపురం రూరల్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో కొన్ని క్షణాలపాటు భూమి కంపించింది. రెండురోజుల కిందట కూడా నియోజకవర్గంలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. చదవండి: శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్ -
గంజాయి గుట్టురట్టు
ఇచ్ఛాపురం(శ్రీకాకుళం): ఇచ్ఛాపురం పోలీసు లు మరోసారి శభాష్ అనిపించుకున్నారు. కోటి విలువైన గంజాయి రవాణాను అడ్డుకుని ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. బొగ్గు మాటున గంజాయిని ఉంచి తీసుకెళ్లిపోదామనుకున్న వారి ప్రయత్నాలకు గండి కొట్టారు. ఇచ్ఛాపురం పాత జాతీయ రహదారిలో సోమవారం 1050 కేజీల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్పీ అమిత్ బర్దార్ సోమవా రం తెలిపిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా పెందుర్తి–ఆనందపురం మధ్య బొగ్గును జార్ఖండ్లోని రాంఛీకి తీసుకెళ్లే హెచ్ఆర్ 63సి 9751 నంబర్ గల లారీ సో మవారం జాతీయ రహదారి గుండా బయల్దేరింది. బొగ్గుతో పాటు 210 ప్యాకెట్ల గంజాయిని ఈ లారీలోనే ఉంచి రవాణా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. అందుకు పాత జాతీయ రహదారిని మార్గంగా ఎంచుకున్నారు. అయితే దీనిపై ఇచ్ఛాపురం పోలీసులకు లీ లగా సమాచారం అందడంతో వా రు బెల్లుపడ పాత టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అదే దారిలో బొగ్గు లారీ కూడా రావడంతో ఆపి బండిని నిశితంగా పరిశీ లించారు. దీంతో లారీలోని 210 ప్యాకెట్లలో గల 1050 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి అక్రమ రవాణాలో ఏడుగురు ఉ న్నట్లు పోలీసులు గుర్తించారు. వీ రిలో స్థానికుల పాత్ర కూడా ఉంద ని సమాచారం. లారీని పట్టుకున్న సమయంలో లారీ డ్రైవర్తో పాటు క్లీనర్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇంకొకరు పరారైపోయారు. మిగిలిన ముగ్గురిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. గంజాయి విలువ కోటి ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. గంజాయిని పట్టుకున్న పట్టణ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇందులో కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరా మిరెడ్డి, సీఐ ఎం.వినోద్బాబు, పట్టణ, రూరల్ ఎస్ఐలు వి.సత్యనారాయణ, బి.హైమావతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రియురాలి కోసం మాస్టర్ ప్లాన్.. ఆన్లైన్లో బొమ్మ తుపాకీ కొని
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం పట్టణంలో బొమ్మ తుపాకీ చూపించి నగలు ఎత్తుకుపోయిన కేసును పోలీసులు ఛేదించారు. కేసు దర్యాప్తులో ఈ చోరీ వెనుక ఉన్న ‘లవ్ స్టోరీ’ బయటపడింది. ప్రియురాలికి బహుమ తి ఇవ్వడానికే యువకుడు దొంగతనానికి పాల్పడినట్లు తెలిసి ఖాకీలు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అమిత్ బర్దార్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాయగడ జిల్లా చలకంబ గ్రామానికి చెందిన సూరజ్ కుమార్ కద్రక ఒడిశాలోనే పదో తరగతి వరకు చదివాడు. అనంతరం భీమవరంలోని రొయ్యల ట్యాంకుల వద్ద, విశాఖపట్నంలోని ఒక హోటల్లో వెయిటర్గా పనిచేశాడు. 2020 డిసెంబర్ నెలలో తన చిన్నాన్నకు చికిత్స జరుగుతున్న సమ యంలో ఒడిశాలోని భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కోవిడ్ కాలంలో ఉపాధి కోల్పోయి ఇంటిలోనే ఉండిపోయాడు. అయితే ప్రియురాలి మెప్పు పొందడం కోసం బంగారు గొలుసు ఇద్దామనుకున్నాడు. చేయడానికి పనులు లేకపోవడంతో చోరీ చేసి బహుమతి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో చూపించినట్టు బొమ్మ తుపాకీ చూపించి వ్యాపారిని బెదిరించి నగలు ఎత్తుకెళ్లాడు కూడా. కానీ పోలీసుల ముందు అతడి ఎత్తులు చెల్లలేదు. ఇలా దొరికిపోయాడు.. దొంగతనం చేద్దామని ప్లాన్ వేసిన సూరజ్కుమార్ రూ. 2వేలతో బొమ్మ పిస్టల్ను ఫ్లిప్కార్ట్లో కొన్నా డు. 9వ తేదీన ఇచ్ఛాపురంలో జీకే జుయలరీ షాపు ను ఎంచుకుని తన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాపు ఓనర్ ఒంటరిగా ఉండడంతో కస్టమర్ లాగా లోపల కు వెళ్లాడు. వివిధ డిజైన్లతో మూడు బంగారు గొలుసుల ను ఓనర్ చూపించగా.. వాటిని ఫొటో తీసి తన లవర్కు పంపించాడు. ఆ సమ యంలో దుకాణానికి ఎవరూ రా కపోవడం గమనించి పిస్టల్ తీసి ఓనర్ ను బెదిరించి దాదాపు రెండు తులాల బరు వు గల మూడు గొలుసులు తీసుకుని పారిపోయా డు. దీనిపై ఆ షాపు ఓనర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ కానిస్టేబుల్, మరికొందరు నిందితుడిని వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బొమ్మ పిస్టల్ కిందపడిపోయింది. తర్వాత నిందితుడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర గొలుసులతో సహా పోలీసులకు దొరికిపోయాడు. అతడిని ఇచ్ఛాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని ఎస్పీ సూచించారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరచిన సీఐ వినోద్బాబు, ఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ బషీర్లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఎం.వీరకుమార్, సీఐ వినోద్బాబు, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఒక ఊరు.. మూడు పంచాయతీలు!
ఇచ్ఛాపురం రూరల్: ‘ఒక గ్రామం.. ఒక పంచాయతీ..’ అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం.. రెండు మండలాల్లో, మూడు పంచాయతీల్లో విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలంలోని తిప్పనపుట్టుగ గ్రామంలో సుమారు 700కు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలంలోనే ఉన్న ఈదుపురం పంచాయతీలో తిప్పనపుట్టుగ గ్రామ పరిధి కొంత విస్తరించి ఉంది. అక్కడ 718 మంది ఓటర్లున్నారు. కవిటి మండలం డి.గొనపపుట్టుగ పంచాయతీ పరిధిలో.. తిప్పనపుట్టుగకు చెందిన కొన్ని వీధులుండగా, అక్కడ 134 మంది ఓటర్లున్నారు. అలాగే ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీ పరిధిలో కూడా తిప్పనపుట్టుగకు చెందిన 25 మంది ఓటర్లున్నారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారైనప్పటికీ.. వేరు వేరు పంచాయతీల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సన్యాసిపుట్టుగది అదే తీరు.. ఇచ్ఛాపురం, కవిటి మండలాల పరిధిలో ఉన్న సన్యాసిపుట్టుగ గ్రామానిదీ కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ గ్రామంలో సుమారు 1,600 మంది వరకు ఓటర్లున్నారు. ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ పరిధిలో కూడా సన్యాసిపుట్టుగకు చెందిన కొంత భాగముంది. అందులో 740 మంది ఓటర్లున్నారు. కవిటి మండలం నెలవంక పంచాయతీ పరిధిలో సన్యాసిపుట్టుగకు చెందిన మరికొంత భాగముంది. అందులో 850 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఊళ్లో రెండు మండలాలు! గుర్ల(చీపురుపల్లి): చూడ్డానికి ఒకే ఊరులా ఉన్నా రెండు వేర్వేరు పంచాయతీలున్నాయి. అంతేకాదు వేర్వేరు మండలాలు కూడా. విజయనగరం జిల్లాలోని లవిడాం, వెంకటపాత్రునిరేగ గ్రామాలు చూడ్డానికి ఒకే గ్రామంలా ఉంటాయి. అసలవి రెండు గ్రామాలంటే కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చినవారు అస్సలు నమ్మలేరు. గుర్ల మండలం, గరివిడి మండలాల పరిధిలో ఆ రెండు గ్రామాలున్నాయి. వీటి మధ్య ఓ రహదారి ఉంది. పంచాయతీలు వేరైనా ప్రజలంతా కలిసి మెలసి ఉంటారు. అయితే చాన్నాళ్ల కిందట ఒకే ఊరిగా ఉండగా, చిన్న గొడవ కారణంగా రెండుగా విడిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. లవిడాంలో 280 ఇళ్లు.. 734 మంది ఓటర్లు, వెంకటపాత్రునిరేగలో 320 ఇళ్లు.. 930 మంది ఓటర్లున్నారు. -
నిజమేన్రా.. ఆడి మత్తులో పడిపోనాను
అలో... ఒరే బీమా.. యినిపిత్తందా.. నేన్రా ఎంకటేశులు మామను. మీయమ్మ దెగ్గిర నంబరు తీసుకుని కొట్టాన్రా.. మీ అయ్య అంజిగాడు ఎలచ్చన్లలో పోటీ సేత్తాడట.. ఓరయ్యా నువ్వే వచ్చి సెప్పాల్రా ఆడికి.. అంటూ ఎంకటేశు నోకియా ఫోన్ పగిలిపోయేలా చెప్పిన మాటలకు మరునాడే భీముడు ఊళ్లో దిగిపోయాడు.. ఆ ఊళ్లో ఎప్పుడూ ఏకగ్రీవమే.. ఇప్పుడు సర్పంచ్ పదవికి ఒకరు పోటీ చేస్తున్నారని తెలియడం.. అది కూడా తన తండ్రేనని అర్థం కావడం భీముడి రాకకు కారణం. భీముడు ఇంటికి వచ్చేటప్పటికి ఆంజనేయులుగా మారిపోయిన అంజి తరమాను చారు, కర్రపెండలం కూరేసుకుని కుమ్ముతున్నాడు.. ఒంటిపై ఖద్దరు చొక్కా జిగేల్మంటోంది.. సంతకం రాదు గానీ జేబులో ఖరీదైన పెన్నొకటి కనిపిస్తోంది.. అది చూడగానే అర్థమైపోయింది భీముడికి ఈ అగాయిత్యపు ఆలోచన తన తండ్రిది కాదని.. కొడుకు, బామ్మర్ది కలిసి అంజిగాడి ఎదురుగా బాసింపట్టేసుక్కూర్చున్నారు.. భార్య పాపమ్మ మాత్రం పెద్ద హీరోల సినిమాల్లో పని మనిషిలా వంట గది దాటి బయటకు రాలేదు.. మాటలు మొదలయ్యాయి.. మామా అల్లుళ్లను చూడగానే అంజి చాలాసేపటికి మైకు దొరికిన యాంకర్లా మొదలెట్టేశాడు.. అంజి : ఒరే.. మీరొందుకొచ్చారో నాకు తెలుసున్రా. మామా అల్లుల్లు కలిపి ఉరెట్టుకున్నా.. నేను దిగుతానంటే... దిగుతానంతే.. భీముడు: అదికాదయ్యా.. ఊరంతా ఎప్పుడూ ఒకే మాట కదా.. నువ్వే ఇలాగ సేత్తే ఎలాగ.. ఎంక: బావా.. మొన్నటి వరకు బాగున్నావు కదా.. యిప్పుడెందుకీ ఉతపాతం ఆలోసనొచ్చింది నీకు. అంజి : మీకు సమాదానం సెప్పడమేట్రా.. నేను దిగి తీరుతానంతే.. భీముడు: మాసం కిందట నాతో ఫోన్తో మాట్లాడినప్పుడు.. నువ్వీ ఊసే ఎత్తనేదు.. యిప్పుడేటైంది.. ఎంక: మాసం కిందటంతావేట్రా.. పది రోజులు ముందు బావా నేను గొప్పులు తవ్వడానికెల్లినప్పుడు.. ఎలచ్చన్లొత్తన్నాయి బావా.. అంటే యిప్పుడెందుకొత్తన్నాయి.. అన్నాడు. ఇంతలోపే ఏటైపోనాదో.. అంజి : అన్నాన్రా.. ఇంకో వంద అంటాన్రా.. నా ఇట్టంరా. ఏమిరా నేను సర్పంచ్ కాకూడదా.. అంజి గాడిగానే ఉండిపోవాలా.. ఆంజనేయులు గారూ అనిపించుకోకూడదా.. ఎంక : అబ్బా.. సర్పంచ్ అవుతావా.. ఏది ఈ కాగితం మీద సర్పంచ్ అని రాసి సూపించు. తర్వాత పెసిడెంటు అవుదువు గానీ.. అంజి : నా రాతే మారిపోతుంతే.. ఇంకా రాయడమెందుకు రా.. భీముడు: రాత మారిపోవడమేటి.. ఏటి మాటాడతన్నావు.. అసలు ఈ మాటలు నీవి కావే.. అంజి : కన్న తండ్రి బాగుపడుతుంతే సూడలేని కొడుకుని నిన్నే సూత్తన్నాన్రా దొంగ నా ... భీముడు: నీ బాగు తర్వాత.. ఊరి బాగు మాటేటి.. వాసన్న మంచోడు.. సదువుకున్నోడు.. అందరికీ దగ్గరైనోడు.. ఆ మనిషికి యతిరేకంగా నీవు పోటీకి దిగడమేటి.. అంజి : వాసుగాడితోటి నాకేం తగువు నేదు.. పెజాసామ్యంలో ఎవుడైనా పోటీకి దిగొచ్చు.. నేను దిగుతున్నాను.. అంతే.. ఎంక: అబ్బనాయినా పెజాసామ్యమా.. బావా పెద్ద పెద్ద మాటలొత్తన్నాయి.. ఎక్కడ నేర్సావు.. అంజి : ఒకే నీకు లాగ నాకేటీ రాదనుకున్నావేట్రా.. నీకు మీయప్పకు ఉప్పెంతయ్యాల..కారమెంతయ్యాల తప్ప ఇంకేం తెలుసున్రా.. ఎంక: ఓసోస్.. మూడురోజుల కిందట మెరకీదోడితో రాత్రి నీ నేస్తరికం సూసాను బావా..ఒరే అల్లుడు ఆ మెరకీదోడి మాటలే మీ అయ్య నోటి నుంచొత్తన్నాయిరా.. యిప్పుడు గుర్తొచ్చింది నాకు.. భీముడు: అదా కదా.. అయ్యా.. మెరకీదోడి మాయలో పడ్డావా.. సెప్తానిను.. ఏకగీవమైతే ఊరికి డబ్బులొత్తాయి.. నాలుగు మంచి పనులు సేసుకోవచ్చు.. ఆ పనులు జరిగితే వాసన్నకు పేరొత్తాది కదా.. దాన్ని సెడగొట్టడానికి నిన్ను వాడుకుంతన్నారు.. అంజి : నాకన్నీ యెరుకేరా.. నేను దిగుతానంతే.. భీముడు: అయ్యా.. ఐదు సంవచ్చరాల కిందట రాజి మామ గుర్తున్నాడా నీకు.. మెరకీదోడి తోనే తిరిగేవోడు.. డబ్బాశ సూపించి, మందు పోసి ఎలచ్చన్లలో దిగాలని రెచ్చగొట్టాడు.. తర్వాత ఏమైందో తెలుసును కద నీకు.. ఊరోల మాట యినలేదని రాజి మామను అందరూ స్సీ.. అన్నారు. ఆ తర్వాత మెరకీదోడు రాజిమామను పట్టించుకున్నాడా.. లేదే.. అయ్యా.. ఇది ఆల్ల రాజకీయం. తుపాకీ మన బుజం మీద పెడతారు. తూటా ఆలు పేలుత్తారు.. పాపం ఆల్లది.. సిచ్చ మనకి.. అంజి : (అంతా అర్థమైనట్టుంది) నిజమేన్రా.. నాకూ డబ్బులిచ్చాడు.. ఎంక: బుడ్డీల సంగతి సెప్పు.. అంజి : యిచ్చాడ్లేరా.. నాలుగిత్తే మూడైపోనాయి.. ఒక్కటే ఉంది.. భీముడు: సరే అయిందేదో అయిపోనాది.. నామినేసన్ ఏత్తే ఎనక్కు తీస్కో.. ఊరు బాగుంతే మనమూ బాగుంతాం కదరయ్యా.. అంజి : ఖద్దరు చొక్కా తీసేస్తూ.. నిజమేన్రా.. ఆడి మత్తులో పడిపోనాను.. మీరిద్దరూ మత్తు దింపేనారు కదా.. నేనూ దిగిపోతాన్లే.. అంటూ ఒప్పుకునే సరికి.. తలుపు వెనకే ఉండి అంతా వింటున్న మెరకీదోడు.. మరో బకరా గాడి కోసం ఊరి మీద పడ్డాడు. – ఇచ్ఛాపురం రూరల్ సెల్ఫీ దిగితే ఓటు రద్దు సీతంపేట: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ దిగడం ఫ్యాషనైపోయింది. ఇదే అలవాటుతో పొరపాటుగా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగితే వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49(ఎం) మేరకు ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయరాదు. దీన్ని అతిక్రమించి ఓటు వేస్తూ సెల్ఫీ దిగి ఇతరులకు షేర్ చేస్తే ఎన్నికల సంఘం ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17(ఎ) మేరకు ఆ ఓటును రద్దు చేస్తారు. నోటా ఉందండోయ్.. ఎల్.ఎన్.పేట: ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో పోటీలో నిలిచిన వ్యక్తులు ఓటర్లకు నచ్చకపోయినా, వా రిపై ఓటర్లకు పూర్తి విశ్వాసం లేకపోయినా వారికి వ్యతి రేకంగా ఓట్లు వేసేందుకు నోటా గుర్తును అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు సార్వత్రిక (సాధారణ) ఎన్నికల్లో మాత్రమే అమలవుతున్న నోటా గుర్తు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ(స్థానిక) ఎన్నికల్లోనూ అమలు చేసేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు చే స్తున్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన తర్వాత వచ్చే బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తుకు చోటు లభిస్తుంది. నోటా గుర్తు బ్యాలెట్ పేపర్లలో కిందన ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థుల మెజార్టీ చాలా తక్కువగా ఉంటుంది. వార్డుల్లోను పోటీ పడుతున్న వ్యక్తులకు కొన్ని చోట్ల 200 కంటే తక్కువ ఓట్లే ఉంటాయి. ఈ క్రమంలో నోటాకు పడే ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలపై అధిక ప్రభావం చూపిస్తుంది. -
వి'హంగామా'.. ఎక్కడమ్మా!
పర్యాటకులను అమితంగా ఆకర్షించే విదేశీ విహంగాలు నెలరోజుల ముందే సొంతగూటికి పయనమయ్యాయి. పిల్లలతో కలిసి వేలాది కిలోమీటర్లు పయనమై వెళ్లిపోతున్నాయి. ఈ హఠాత్పరిణామం తేలుకుంచి వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. తమకు తెలిసినంత వరకు ఇలా ఏ ఏడాదీ జరగలేదని, నెల రోజుల ముందుగానే సైబీరియా పక్షులు ఎందుకు వెళ్లిపోతున్నాయో అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. సాక్షి, ఇచ్ఛాపురం రూరల్: ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత స్వదేశాలకు వెళ్లే సైబీరియా పక్షులు ఈ ఏడాది నెల రోజుల ముందే పుట్టింటికి పయనమైపోయాయి. జిల్లాలో తేలినీలాపురం తర్వాత సైబీరియన్ పక్షులు విడిది చేసేది ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలోనే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇక్కడికి వచ్చిన విదేశీ విహంగాలు సంక్రాంతి రాకముందే ఒక్కసారిగా వెళ్లిపోయాయి. కార్తీకమాసం తర్వాత సంతానోత్పత్తితో రెట్టింపు సంఖ్యలో స్వస్థలాలకు వెళ్లే ఈ పక్షులకు ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఈ విధంగా పక్షులు దూరం కావడంతో గ్రామస్తులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. విభిన్న పక్షులు.. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్లో సైబీరియా నుంచి వచ్చిన ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు). శాస్తీయ నామం ‘అనస్థోమస్’. ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దవడల మధ్య (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్ బిల్ స్టార్క్స్ అని పిలుస్తుంటారు. వందల కొద్దీ ఇక్కడికి వచ్చిన పక్షులు గ్రామంలోనే ఊర చెరువు, గ్రామదేవత ఆలయం వద్ద ఉన్న కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పొదుగుతాయి. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. ఆరు నెలలు పాటు పిల్లలతో గడిపి అవి ఎగిరేంత బలం రాగానే జనవరి నెల మధ్య నుంచి తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. ఈసారి ఏమైందో.. ఈ ఏడాది ఒక్కసారిగా పక్షులు మాయమైపోయాయి. తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉండగానే ఒక్కసారిగా గ్రామాన్ని వదిలిపోవడం స్థానికులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభించడం ఈ ప్రాంత రైతులకు అలవాటు. అలాంటిది పక్షులు హఠాత్తుగా మాయం కావడం శుభకరం కాదంటున్నారు. ఈ పక్షులు పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా ఈ గ్రామస్తులు భావిస్తుంటారు. నివాసానికి అనువుగా లేనందునే.. పక్షులు వెళ్లిపోవడానికి ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే, పక్షులు గుడ్లు పెట్టేందుకు సరైన చెట్లు లేకపోవడం మరోకారణమని స్థానికులు భావిస్తున్నారు. గతంలో వరుసగా వచ్చిన తుఫాన్ల ధాటికి చెట్లు నేలకొరగడంతో కొత్త మొక్కలు నాటేందుకు స్థలం లేకపోవడంతో అటవీశాఖాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. వర్షాలు పుష్కలంగా కురిస్తే వాగులు, వంకలు నిండి పక్షులకు ఆహారంగా వరిచేలల్లో నత్తలు, పురుగులు, చేపలు, కప్పలు తింటూ జీవిస్తుంటాయి. అయితే ఈ ఏడాది అవి ఉండేందుకు అనువైన వాతావరణం లేని కారణంగా వేగంగా స్వదేశాలకు పయనమైపోయాయని స్థానికులు చెబుతున్నారు. అపురూపంగా చూసుకున్నాం ఈ పక్షుల్ని మా ఊర్లో ఎవరినీ కొట్టనివ్వరు. అపురూపంగా చూసుకుంటాం. ఈ ఏడాది పక్షులకు వాతావరణం అంతగా అనుకూలంగా లేకుండాపోయింది. మోస్తరు వర్షాలు కురవకపోవడంతో అంతంత మాత్రంగా పంటలు పండటం, పక్షులకు ఆహారమైన పురుగులు, కీటకాలు లేకపోవడంతోనే పక్షులు నెల రోజులు ముందుగా వెళ్లిపోయాయి. – దక్కత నూకయ్యరెడ్డి, గ్రామపెద్ద, తేలుకుంచి మొక్కలు నాటించలేదు.. అటవీశాఖ అధికారులు ఏడాదికోమారు గ్రామంలో సమావేశం పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్పా పక్షులను పర్యవేక్షించే చర్యలు చేపట్టడం లేదు. స్థానిక ఎమ్మేల్యే బెందాళం అశోక్ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నా పక్షులు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొక్కలు నాటించలేకపోయారు. – పాల ధర్మరాజురెడ్డి, యువజన సభ్యుడు, తేలుకుంచి -
గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి
సాక్షి,ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లా– స్వర్ణాపురం తీరంలో ఏనుగుదాడిలో ఒడిశాకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడురోజులుగా ఉన్న ఏనుగుల గుంపు మంగళవారం ఒడిశా రాష్ట్రానికి చేరుకుంది. సుర్లా–స్వర్ణాపురం తీరంలో స్థానిక బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి సెల్ఫీలు దిగారు. అయితే తల్లి ఏనుగు మాత్రం కోపంగా వెనక్కి తిరిగి వచ్చింది. దీంతో ఆ యువకులు పరుగులు తీశారు. అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న ఒడిశా యువకుడు ఏనుగు రాకను గమనించకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. దీంతో ఏనుగు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..) -
ఒక్క ‘టీ’ పడితే అంతా సెట్ అయిపోతుంది!
పుస్తకం తీస్తే కళ్లు మూసుకుపోతున్నాయి.. ఓ టీ పడితే అంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే బద్దకం వీడడం లేదు. కడుపు టీ కోరుతోంది మరి. శీతాకాలపు వేకువలకు టీ జత కలిస్తే ఆ మ్యాజిక్కే వేరు. చలిగాలులు వీస్తున్న సాయంత్రం పూట టీ కప్పు చేసే మాయాజాలం ఆస్వాదిస్తే గానీ అర్థం కాదు. అందుకే టీ తిరుగులేనిది. శ్రీమంతుడి ఇంటిలో వెండి కప్పులో తాగినా, పేదవాడు గ్లాసులో పోసి ఇచ్చినా రుచి మాత్రం అమోఘమే. ఫైవ్ స్టార్ హొటల్ అయినా, రోడ్డు పక్క బడ్డీ కొట్టు అయినా దాని ‘టీ’వే వేరు. అందుకే టీ అందరికీ ఇష్టమైనది. చక్కెర ఒంటికి పడదు, అల్లం వేసుకో.. పాలు అంతగా నచ్చవు.. లెమన్ టీ మీ కోసమే. గొంతు బాగోలేదా.. పెప్పర్ టీ రెడీ.. ఒకటి నచ్చకపోతే పది వెరై‘టీ’లు ఉన్నాయి. అందుకే టీ ఎదురులేనిది. – శ్రీకాకుళం రూరల్, ఇచ్ఛాపురం రూరల్, రాజాం ఎందరికో ఉపాధి.. జిల్లాలో టీ షాపుల సంఖ్య ఎంతో తెలుసా..? దాదాపు 3600. అంటే ఇన్ని వేల కుటుంబాలకు టీ ఆధారంగా నిలుస్తోంది. వెనుకబడిన జిల్లాగా ముద్ర పడిన సిక్కోలులో చాలా గ్రామాల్లో కుటుంబాలు ఈ టీ షాపులపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పుడంటే ఇంట్లో టీ చేసుకోవడం అలవాటైంది గానీ.. ఒకప్పుడు ఊళ్లలో టీ షాపుల ముందు పొద్దున్నే గ్లాసులు పట్టుకుని పార్సిల్ కోసం గంటల తరబడి వేచి ఉండేవారు. రానురాను షాపుల నుంచి టీ ఇంటికి తీసుకెళ్లే అలవాటు మారిపోయినా.. ఆఫీసులు, దుకాణాలకు పట్టుకువెళ్లే కొత్త పద్ధతి మొదలైంది. ముఖ్యంగా వస్త్ర దుకాణాలు, పరిశ్రమలు, షాపింగ్ మాళ్లు కొత్తగా ఏర్పాటు కావడంతో అక్కడకే టీ తీసుకువెళ్లి విక్రయించే పద్ధతులు చాలా మందికి లాభిస్తున్నాయి. ఆహా ఏమి రుచి.. మారుతున్న కాలంతో పాటు టీ రుచుల్లో కూ డా తేడాలు వస్తున్నాయి. ఒకప్పుడు చాలా కొద్ది రకాల టీలు మాత్రమే లభించేవి. కానీ యువత కూడా ఈ టీ బిజినెస్లోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా దీని రూపురేఖలు మారిపోయాయి. అల్లం టీ, లెమన్ టీ, పెప్పర్ టీ, బాదం టీ అంటూ ఊరూరా కొత్త కొత్త షాపులు పుట్టుకువచ్చాయి. సంప్రదాయ టీ దుకాణాల్లో మాత్రం అలవాటైన టీ ఘుమఘుమలు అలాగే ఉన్నాయి. వయసులో పెద్ద వారు తమకు అలవాటైన దుకాణాల్లో టీలను ఆస్వాదిస్తుంటే.. యువత మాత్రం కొత్తగా ఏర్పాటైన షాపుల్లో విభిన్న రుచులను టేస్ట్ చేయడానికి ఇష్ట పడుతున్నారు. ఆరోగ్య ప్రదాయిని.. ఓ పద్ధతి ప్రకారం తాగితే టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాయ్ తాగడం ద్వారా మానసిక ఉత్తేజం కలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు చాలా బాగా పనిచేస్తాయి. గ్రీన్, లెమన్, హీనీ, బ్లాక్, అల్లం, బెల్లం, మసాలా, బాదం టీలు ఈ ఆరోగ్య ప్రదా యిని జాబితాలో అగ్రశ్రేణిలో ఉంటాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనల ద్వారా తెలిసింది. టీకీ ఓ టైముంది.. రోజూ ఉదయాన్నే పరగడుపున కొందరు టీ తాగుతుంటారు. కానీ అది మంచిది కాదని వైద్యుల సూచన. టీలో ఎన్నో ఆల్కలాయిడ్స్ ఉంటా యి. వాటిలో చాలా వరకు ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే పరగడుపున టీ తాగడం అసిడిటీని పెంచుతుంది. భోజనానికి ముందుగా టీ తాగడం కూడా సరైన పద్ధతి కాదు. టీ ఆకలిని చంపేస్తుంది. భోజనం తర్వాత కూడా కనీసం 45 నిమిషాలు మొదలుకొని గంట వరకు టీ తాగడం సరికాదు. వెంటనే తాగితే జీర్ణమైన భోజనంలోని శక్తి ఒంటికి పట్టదు. టీతో ట్యాబ్లెట్ కూడా వేసుకోవడం శ్రేయస్కరం కాదంటున్నారు వైద్యులు. అందుకే టీ తాగే వేళలను నిర్దిష్టంగా చూసుకుంటే రుచిని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు. పెరిగిన ధరలు.. ‘టీ’ ధర చాలా ఏళ్లుగా పేద ప్రజలకు అందుబాటులోనే ఉంది. ఇప్పుడిప్పుడు మాత్రం ధరలు పెరుగుతున్నాయి. తేయాకు, పాలు, చక్కెర, గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు. ప్రస్తుతం చాయ్ రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముతున్నారు. టీ ధరలు పెరిగినా ఆదరణ మాత్రం తగ్గలేదు. కూలీనాలీ చేసే సామాన్యులు సైతం దినచర్యను చాయ్తోనే మొదలుపెడతారు. చాయ్ తయారు చేయడానికి అవసరమయ్యే అన్ని రకాల వస్తు వుల ధరలు పెరగడం వల్ల ఇప్పుడు చాయ్ ధరలను పెంచాల్సి వస్తుందని టీ æకొట్టు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అర్ధ రూపాయి నుంచి అమ్ముతున్నా.. నేను ఐదేళ్ల ప్రాయం నుంచి టీ చేయ డం నేర్చుకున్నాను. 30 ఏళ్ల నుంచి టీ కొట్టును పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ప్రస్తుతం ఇదే వృత్తి మాకు జీవనోపాధి. అర్ధ రూపాయి నుంచి టీ నేటికి ఐదు రూపాయల వరకు పెరిగింది. – తెలుకల బొనమాళి, టీ కొట్టు యజమాని, ఈదుపురం ఒత్తిడి నుంచి ఉపశమనం పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే చాయ్ తాగడం తప్పనిసరి. స్నేహితులు కలిసినా, సహోద్యోగులు కలసినా తప్పని సరిగా చాయ్ ఆఫర్ చేస్తా. ముఖ్యంగా ఇచ్ఛాపురంలో దొరి కే చాయ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. – వి.శ్రీనివాసరావు, ఉద్యోగి, గృహనిర్మాణశాఖ టీ మంచిదే.. టీ చాలా మంచిదే. ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే పరిమితంగా తాగడం అల వాటు చేసుకోవాలి. షుగర్ పేషెంట్లు షుగర్ లెస్ టీ తాగాలి. – డాక్టర్ మహంతి చంద్రశేఖర్నాయుడు, సీహెచ్సీ సూపరింటెండెంట్, రాజాం ఒక్క టీ కొడితే.. నేను ఇప్పటివరకూ వెయ్యికి పైగా కవితలు, రచనలు చేశాను. నా రచనలు, కవితల సమయాల్లో చిన్న టీ తాగితే చాలు అదో తృప్తి. ఒక్కో దఫా టీ తాగి కూర్చుని తెల్లపేపరు తీశానంటే ఎన్నో కొత్త అక్షరాలు, కొత్త పదాలు వచ్చి చేరుతాయి. దటీజ్ టీ మహత్యం. – కుదమ తిరుమలరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రాజాం. అతిగా వద్దు.. రిలాక్స్ కోసమంటూ టీని అతిగా తాగినా అనర్థాలు వస్తాయి. చాయ్కి బానిస కావద్దు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగ డం ద్వారా బీపీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. గ్రీన్ టీ తాగడం మంచిదే కాని, ఏదైనా ఎక్కువగా తీసుకోకుండా మోతాదులో తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఉలాల శేషు యాదవ్, ఎండీ, మహాలక్ష్మి నర్సింగ్ హోమ్, ఇచ్ఛాపురం -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
సాక్షి, అమరావతి: దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా, చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్ 6వ తేదీన జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను జగన్ ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా కొనసాగించారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన ఈ యాత్రలో తొలి నుంచీ జనంతో మమేకం అవుతూ.. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానాన్ని చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అద్వితీయమైన రీతిలో 151 శాసనసభ, 22 లోక్సభా స్థానాల్లో విజయం సాధించి మే 30వ తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. పాదయాత్ర స్ఫూర్తితో 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే నా కసి.. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. ► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. ► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. -
షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం
సాక్షి, ఇచ్ఛాపురం: కుటిల రాజకీయాలు జఠిల సమస్యలు సృష్టిస్తున్నప్పుడు, ఒక నాయకుడిని ఒంటరిని చేసి వేధిస్తున్నప్పుడు, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నప్పుడు ఆ అన్న కు అండగా, కుటుంబానికి తోడుగా, పార్టీకి ఓ ధైర్యంగా ఓ అతివ అడుగులు వేశారు. తండ్రి చూపిన బాటలో రాష్ట్రమంతా కలియదిరిగారు. అన్న పెట్టిన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి తన నడకతోనే ఇంధనం నింపారు. ఆమే వైఎస్ షర్మిల. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె సాగించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. చెల్లెమ్మలకు అండగా ఉండే అన్నల కథలు అందరికీ తెలిసినవే. కానీ అన్నకు బలంగా నిలిచిన చెల్లెలి కథ ఆమెది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అందరూ బాగానే ఉండేవారు. కానీ ఆయన హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అది మొదలు ఆయనపై కుట్రలు మొదలైపోయాయి. ఒక్కడినే చేసి అన్ని రాజకీయ పక్షాలు తమకు తోచిన విధాన దాడు లు చేయడం మొదలుపెట్టాయి. అలాంటి దుర్మార్గ, దుశ్చర్యలకు నిరసనగా అన్నకు తోడుగా నిలిచి జగనన్న విడిచిన బాణంగా ప్రజల మధ్య నడిచి నాయకులకు భరోసా కలిగించింది వైఎస్ షర్మిల. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అన్న వదిలిన బాణంలా అన్ని గ్రామాలు కలియదిరిగారు. 2012 అక్టోబర్ 18న ఇడుపుల పాయ నుంచి మరోప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. షర్మిలమ్మతో కలసి పాదయాత్ర చేస్తున్న ధర్మాన కృష్ణదాస్(ఫైల్) నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర కొనసాగించారు. అప్పటి రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించి 2013 ఆగస్టు 4 వ తేదీన ఇచ్ఛాపురంలో ముగించారు. అన్నకిచ్చిన మాటకోసం ప్రజల శ్రేయస్సును కోరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు. నేటి వైఎస్సార్సీపీ అఖండ విజయానికి అప్పుడే బలమైన పునాదులు వేశారు. ఆ పాదయాత్రను ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి ఆనుకొని మరోప్రజాప్రస్థానం పేరిట విజయ స్థూపం ఏర్పాటు చేశారు. ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిలమ్మ షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం ఒక మహిళ వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడమనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. వైఎస్ షరి్మలమ్మ అప్పడు పాదయాత్ర ద్వారా నాటి న విత్తనమే ఇప్పుడు మహావృక్షంగా ఈ స్థాయి లో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిలమ్మ, వైఎస్ జగన్ అందరూ ఇచ్ఛాపురంలోనే పాదయాత్ర ముగించారు. ఆ కుటుంబంతో ఇచ్ఛాపురానికి విడదీయలేని అనుబంధం ఉంది. – పిరియా సాయిరాజ్, డీసీఎంఎస్ చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కన్నీటితో కడుపు నింపలేక..
మందులు కొనడమనే మాట మర్చిపోయి అన్నం పెడితే చాలు అనుకునే స్థితికి వచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన వదిలేసి ఆ పూటకు కడుపు నింపితే అదే పదివేలు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టడం, వారు చక్కగా ఎదగడం.. పేదల బతుకుల్లో కనిపించే సంతోషాలివే. కానీ ఆ దంపతులకు ఈ సంతోషం కూడా మిగల్లేదు. కడుపున పుట్టిన బిడ్డ కదల్లేక మంచంపై పడి ఉంటే కనీసం చికిత్స కోసం ఆలోచన చేయలేని దుస్థితి వారిది. కూలికి ఒకరు.. బిడ్డ వద్ద కాపలాకు మరొకరుగా ఉంటూ బతుకీడుస్తున్నారు. కూలి డబ్బులతో కుటుంబం గడవడం కష్టమవుతున్న తరుణంలో బిడ్డ భవిష్యత్ కోసం చేతులు చాచి సాయం కోరుతున్నారు. ఇచ్ఛాపురం మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మ దంపతులు చేస్తున్న అభ్యర్థన ఇది. సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : ఇచ్ఛాపురం మండలం కొఠారీ గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మలకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మోహనరావు. కొడుకు పుట్టగానే తమకు వంశోద్ధారకుడు పుట్టాడన్న సంతోషంతో ఆ దంపతులు మురిసిపోయారు. 7వ తరగతి వరకు ఎంతో చలాకీగా ఉన్న మోహనరావు ఆ తర్వాత ఒక్కసారిగా నీరసించిపోయాడు. కాళ్లు ముందుకు పడకపోవడం చే,తుల్లో చలనం లేకపోవడంతో మంచానికే పరిమితమైపోయాడు. కూలి చేసుకుని బతికే ఆ దంపతులకు కొడుకు పరిస్థితి అర్థం కాలేదు. అప్పులు చేసి మరీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, బరంపురం ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఫలితం కనిపించలేదు. రోజూ కూలి పనికి వెళ్తే గానీ వారి కడుపు నిండదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.లక్షలు ఖర్చు పెట్టి కుమారుడికి చికిత్స చేయించడం వారికి అసాధ్యమైపోయింది. ఎదిగొచ్చిన కొడుకుకు తల్లి తోయమ్మ చిన్నపిల్లాడిలా సపర్యలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 64 శాతం అంగ వైకల్యం ఉన్న ట్లు ధ్రువీకరణ పత్రం ఉండగా, స్థానిక టీడీపీ నేతలు కేవలం వెయ్యి రూపాయలు పింఛన్ ఇప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రా వడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగులకు రూ.3 వేలు అందిస్తున్నారు. అయితే తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు కూలికి వెళ్లేవారు. కానీ మోహనరావు పరిస్థితి మారినప్పటి నుంచి ఒకరు బిడ్డ వద్ద ఉంటే మరొకరు పనికి వెళ్తున్నారు. ఒకరి కూలి డబ్బులతో కుటుంబం గడవడం, మోహనరావుకు మందులు కొనడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులు సాయం కోరు తున్నారు. బిడ్డ భవిష్యత్ను కాపాడడానికి దాతలు చేయూతనిస్తారని ఆశ పడుతున్నారు. సాయమందించాలనుకునే వారు 90590 67952 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు. -
పాఠశాలకు ప్రేమతో..!
సాక్షి, ఇచ్ఛాపురం : విద్యాబుద్ధులు నేర్పిన గురువు, పాఠశాల రుణం తీర్చుకోవాలనే ఆలోచన ప్రతిఒక్కరికి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాటిని ఆచరణలోనికి తీసుకురాలేని పరిస్థితి. కొద్దిమంది మాత్రమే ఆచరణలోనికి తీసుకొచ్చి అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వారిలో ఇచ్ఛాపురం వ్యాపారవేత్త వజ్రపు వెంకటేశ్వరరావు ఒకరు. ఈయనతో పాటు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడటం, సరైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందిపడటం చూసి చలించిపోయారు. అదనపు గదులను నిర్మించాలని గతేడాది ఆగస్టులో సంకల్పించారు. అందుకు తగ్గట్టుగా అప్పటి కలెక్టర్ కె.ధనంజయ్రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులను స్వయంగా కలిసి నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందారు. ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలను 1903లో శ్రీసురంగి రాజావంశీలయులు నిర్మించారు. ప్రస్తుతం గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం 1358 మంది విద్యార్థులు చదువుతున్నారు. వెంకటేశ్వరరావు ఇదే పాఠశాలో 1985లో విద్యాభ్యాసం ప్రారంభించారు. బడి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో కోటీ 50 లక్షల రూపాయంతో 10 అదనపు భవనాలు నిర్మించారు. ఈ నెల 28న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
చాలా.. ఇంకా కావాలా?
సాక్షి, శ్రీకాకుళం : గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న ఈ ఘోరం చూస్తే టీడీపీ నేతలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అధికారులు డమ్మీలైపోయారు. నేతలే లబ్ధిదారుల ఎంపిక చేసేశారు. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాత్ర గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఇచ్ఛాపురం మండలంలోనే 1490 ఒంటరి మహిళ పింఛన్లు అనర్హమైనవని తేలాయంటే ఇక ఆ నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం అర్బన్, కవిటి, కంచిలి, సోంపేటలో ఎంత మేర అక్రమాలు జరిగాయో పరిశీలించాలి. ఇంకా దారుణమేంటంటే వితంతువులు కానప్పటికీ వితంతు పింఛన్లు పొందుతున్న వారు 232మంది ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం కానప్పటికీ మత్స్యకార పింఛన్లు ఇద్దరు పొందారు. వృద్ధాప్యంలో లేకపోయినప్పటికీ ఒకరు వృద్ధాప్య పింఛను పొందుతున్నారు. దీన్నిబట్టి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అక్రమాల దందా ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతుంది. ముందే చెప్పిన సాక్షి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అనేక రకాలుగా అవినీతి జరిగింది. భూములను ఆక్రమించారు. ఇసుక దోపిడీకి పాల్పడ్డా రు. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారు. ఔట్ సోర్సింగ్, పౌష్టికాహారం పోస్టులను అమ్ముకున్నారు. గత ఐదేళ్లుగా ఇలా అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డారు. ఇందులో ఎవరి హస్తమేంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. అన్నింటికన్నా భర్తలు ఉన్నప్పటికీ ఒంటరి మహిళ కోటాలో పింఛన్లు మంజూరు చేసిన ఘనత ఇక్కడి టీడీపీ నేతలకు దక్కింది. వితంతువులు కాకపోయినప్పటికీ వితంతు పింఛ న్లు మంజూరు చేయించిన ఘనాపాటీలు ఇక్కడున్నారు. ఇదే విషయంపై గతనెల 20వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘అమ్మో ఇచ్ఛాపురం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. నియోజకవర్గంలో జరిగిన ఒంట రి మహిళ పింఛన్ల బాగోతాన్ని ఈ కథనం బట్టబయలు చేసింది. అధికారుల విచారణలో కూడా అక్రమాలు వెలుగు చూశాయి. ఎవరా ఘనుడు? భర్తలున్న వారికి ఒంటరి మహిళ పింఛన్లు, వితంతువులు కాని వారికి వితంతు పింఛన్లు మంజూరు చేయించిన ఘనుడు ఎవరో అక్కడి టీడీపీ నేతలే చెప్పాలి. నియోజకవర్గంలో రింగ్ మాస్టర్గా పేరొందిన కీలక ప్రజాప్రతినిధి ఇందులో ప్రధాన భూమిక వహించారు. ఎంత దారుణమంటే భర్తలను తహసీల్దార్ కార్యాలయాలకు తీసుకొచ్చి ఒంటరి మహిళ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించిన ఘనత అక్కడి టీడీపీ నేతలకు దక్కింది. చెప్పాలంటే అధికారుల చేత గత ప్రభుత్వంలో తప్పలు చేయించారు. దీనిబట్టి టీడీపీ హయాంలో అర్హతల కన్న సిఫార్సులే కొలమానంగా పింఛన్లు ఎంపిక చేశారన్నది స్పష్టమైంది. జిల్లావ్యాప్తంగా పరిస్థితేంటి? ఒక్క ఇచ్ఛాపురం మండలంలోనే 1490 ఒంటరి మహిళ పింఛన్లు, 232 వితంతు పింఛన్లు అక్రమమని తేలాయంటే నియోజకవర్గంలోని మిగతా మండలాలు, జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఇంకెన్ని ఉంటాయో చూడాల్సిన అవసరముంది. ఇచ్ఛాపురం మండలాన్ని శాంపిల్గా తీసుకుంటే జిల్లావ్యాప్తంగా ఇంకెన్ని ఘోరాలు జరిగాయో అర్థం చేసుకోవల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయన్నదానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలి. చేసింది తప్పు... ఆపై అధికారులపై ధ్వజం ఇచ్ఛాపురం మండలంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి అక్కడి టీడీపీ నేతలు అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఒకటి రెండు పింఛన్లకు సంబంధించి తేడాలొస్తే వాటిని సాకుగా చూపించి అధికారులను బెదిరిస్తున్న పరిస్థితి నెలకొంది. చేసింది తప్పు ఆపై ఎదురుదాడి చేస్తున్నారు. గత ఐదేళ్లు చేసిన ఘన కార్యాలు బయటపడుతుంటే తట్టుకోలేక అక్కసుతో అధికారులను లక్ష్యంగా చేసుకుని తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. -
అమ్మో.. ఇచ్ఛాపురం!
ఇచ్ఛాపురంలో అంతమంది ఒంటరి మహిళలా... ఎక్కడా లేని విధంగా ఒక్క నియోజకవర్గంలోనే 3681 ఒంటరి మహిళ పింఛన్లా? అంతమంది భర్తలు భార్యలను విడిచి పెట్టేశారా? జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనిది ఇక్కడే ఎందుకీ పరిస్థితి? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడేదో జరిగిందని మల్లగుల్లాలు పడుతున్నారు. వాటి సంగతేంటో చూడాలని... విచారణ జరిపి వాస్తవాలేంటో తెలుసుకోవాలని... అక్కడ జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలని నిఘా పెట్టారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వృద్ధాప్య పింఛన్కు ఎంపిక కాలేదా? వితంతు పింఛను వర్తించదా? వికలాంగ పింఛన్కు అర్హత పొందలేదా? అయితే ఒంటరి మహిళ పింఛను కింద తోసేయండి. మేము చూసుకుంటాం... తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పత్రం ఇప్పిస్తాం అని చెప్పి గత ప్రభుత్వంలో అధికారుల చేత తప్పులు చేయించేశారు. భర్త ఉన్నప్పటికీ ఒంటరి మహిళ కింద పింఛన్లు మంజూరుచేసేశారు. టీడీపీ హయాంలో అర్హతల కన్న సిఫార్సులే కొలమానంగా పింఛన్లు మంజూరు చేయడంతో అనర్హులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అత్యధికంగా ఒంటరి మహిళ పింఛన్ల కింద అక్రమాలు జరిగాయి. దీనివెనక అక్కడి ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులపై ఒత్తిడి చేసి అనర్హులకు సైతం ఒంటరి మహిళలు పింఛన్లు మంజూరు చేయించినట్టుగా ఆరోపణలున్నాయి. జిల్లావ్యాప్తంగా 3 వేలకు పైగా అనర్హులు ఒంటరి మహిళ పింఛన్లు పొందుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి సామాజిక పింఛన్ల ఎంపికలో సిఫార్సులే ప్రామాణికమయ్యాయి. 2004కు ముందు.. ఉన్న పింఛనుదారులు చనిపోతేనే కొత్తగా పింఛన్ మంజూరు చేసేశారు. దీంతో కొత్తగా పింఛన్ పొందే వారి సంఖ్య సింగిల్ డిజిట్లోనే ఉండేది. ఇక 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అర్హతలు పక్కన పెట్టి జన్మభూమి కమిటీ సిఫార్సులున్నవారికే పింఛన్లు ఇచ్చేవారు. వయస్సు మార్పులతోనూ, వికలాంగ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతోనూ, భర్తలున్న వారికి సైతం వితంతు పింఛన్లు, చివరికి భర్తలు విడిచిపెట్టారని చెప్పి ఒంటరి మహిళ పింఛన్లను మంజూరు చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది. ఈ విధంగా చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి అర్హులకు చుక్కలు చూపించిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నేతల సిఫార్సులే అర్హతగా తీసుకున్నారే తప్ప వాస్తవ పరిస్థితులను పరిశీలనలోకి తీసుకోలేదు. వాస్తవంగా భర్తలు విడిచి పెట్టిన మహిళలకు పింఛన్లు మంజూరు కాలేదు గాని భర్తలున్న వారికి మాత్రం ఒంటరి మహిళ కింద పింఛన్లు మంజూరు చేసిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఒంటరి మహిళ కింద అడ్డగోలుగా పింఛన్లు మంజూరు చేసేశారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యికిలోపే ఒంటరి మహిళ పింఛన్లు ఉన్నాయి. టెక్కలిలో 1099 పింఛన్లు ఉన్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గం విషయానికొస్తే ఏకంగా 3681 పింఛన్లు ఒంటరి మహిళ కేటగిరీలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 10,724 ఒంటరి మహిళ పింఛన్లు ఉంటే ఒక్క ఇచ్ఛాపురంలోనే 3681 పింఛన్లు ఉండటమేంటని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఒక్క నియోజకవర్గం నుంచి వెయ్యి మందికి పైగా అర్హత లేనివారికి ఒంటరి మహిళ పింఛన్లు ఇచ్చేశారని ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇదే విషయమై జిల్లా అధికారులు అక్కడి అధికారులను వివరణ కోరేసరికి ఏం చేస్తాం... ఒత్తిడి అలాంటిదని చెప్పుకొచ్చినట్టు సమాచారం. భర్తతో వచ్చి ఒంటరి మహిళ కింద ధ్రువీకరణ పత్రాలు పొందినట్టుగా తెలుస్తోంది. అలాగే మిగతా నియోజకవర్గాల నుంచి ఒంటరి మహిళ పింఛన్లపై ఫిర్యాదులొస్తున్నాయి. కళ్ల ముందు భర్తలు కనబడుతున్నా... వారికెలా ఒంటరి మహిళ కింద పింఛన్లు ఇచ్చారని గ్రామాల నుంచి ఫిర్యాదులు చేస్తున్నారు. ఒంటరి మహిళ పింఛన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు జిల్లాలో ఒంటరి మహిళ పింఛన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ జరుపుతున్నాం. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఫిర్యాదులు ఆధారంగా అర్హులా.. అనర్హులా? అన్న దానిపై విచారణ జరుపుతున్నాం. అక్రమాలు జరిగినట్టు తేలితే రద్దు చేస్తాం. – కళ్యాణ చక్రవర్తి, డీఆర్డీఎ ప్రాజెక్టు డైరెక్టర్, శ్రీకాకుళం -
చలనమే..సంచలనమై!
అడుగులు కదపలేని స్థితి నుంచి ఆయన గురించి గర్వంగా అడిగి తెలుసుకునే స్థాయికి ఎదిగారాయన. కాళ్లలో చలనం లేని స్థితి నుంచి సంచలనం సృష్టించేంత ఎత్తులో నిలబడ్డారాయన. చంద్రబోస్ ఒక పాటలో చెప్పినట్టు పిడికిలి బిగించి చేతిరాత మార్చుకున్నారు. చెమట్లు చిందించి నుదుటి గీత రాసుకున్నారు. అంతులేని పట్టుదలతో ఆదర్శప్రాయంగా మారారు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదనే వాక్యానికి రుజువుగా నిలిచారు. ఇచ్ఛాపురంలో పుట్టి తెలంగాణకు ఆటలో ప్రాతినిథ్యం వహించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన తులసయ్య గురించి సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ : ఇచ్ఛాపురం మండలం కుగ్రామం తులసిగాం గ్రామానికి చెందిన పండూరు జోగయ్య, దాలమ్మ దంపతులకు నాల్గో సంతానంగా జన్మించిన తులసయ్య 18 నెలల వరకు అందరి పిల్లల్లానే ఉండేవాడు. తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. విధి వక్రీకరించింది. జ్వరం బారిన పడిన తులసయ్యకు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అసలే బీద కుటుంబం, ఆపై కొడుక్కి పెద్ద కష్టం రావడంతో వేలాది రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. తులసయ్య ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ధర్మపురం ఉన్నత పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి తొలి విజయాన్ని అందుకున్నారు. తోటి స్నేహితులు, అన్నదమ్ముల సాయంతో ఇచ్ఛాపురం జ్ఙానభారతిలో ఇంటర్, శ్రీకాకుళంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత విద్య చదవాలన్న కోరిక ఉన్నప్పటికీ తనవారి గురించి ఆలోచించి హైదరాబాద్లో ఓ చానెల్లో వెబ్ రిపోర్టర్గా చేరాడు. అనుకోని అవకాశం.. పాఠశాలలో తోటి స్నేహితులతో క్రీడలపై ఆసక్తిని కనబర్చే తులసయ్యకు అనుకోని అవకాశం ముంగిట చేరింది. ఓ రోజు తులసయ్య ఆఫీసుకు వెళ్తుండగా అదే దారిలో చంద్రశేఖర్ అనే దివ్యాంగుడు పరిచయమయ్యాడు. తాను వీల్చైర్ బాస్కెట్బాల్ ఆటగాడినని, ఆసక్తి ఉంటే తనతో రమ్మంటూ ఆహ్వానం పలికాడు. ఆటలపై మక్కువ ఉన్న తులసయ్య తన సత్తాను నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశంగా భావించాడు. తెలంగాణా వీల్చైర్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పద్మతో పాటు కోచ్ సొహయిల్ ఖాన్లు తులసయ్యలో ఉన్న ప్రతిభను గుర్తించారు. సుమారు నెలన్నర రోజుల పాటు శిక్షణ పొందిన తులసయ్య అనతి కాలంలోనే వీల్చైర్ బాస్కెట్బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు చెన్నై ఈరోడ్లో జరిగిన 5వ జాతీయ వీల్చైర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జూన్ 24 నుండి 29 వరకు చంఢీఘర్ రాష్ట్రం మొహాలీలో జరిగిన 6వ జాతీయ వీల్ చైర్ బాస్కెట్బాల్ చాంపియన్ షిప్లో పాల్గొని మళ్లీ నాల్గో స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తులసయ్య ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికై బహుమతులు కైవసం చేసుకున్నాడు. మొక్కవోని దీక్షతో కష్టబడితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నాడు తులసయ్య. ప్రభుత్వం ప్రోత్సహిస్తే... నాకు ఆటలంటే చాలా ఇష్టం. క్రికెట్, అథ్లెటిక్స్ కూడా ఆడుతాను. కానీ నాకు అంత ఖరీదైన వీల్చైర్ లేదు. ఈ ఏడాది డిసెంబర్లో దివ్యాంగులకు రంజీ క్రికెట్ పోటీలు ఉన్నాయి. అందులో ఆడి సత్తా నిరూపించుకోవాలని ఉంది. ప్రభుత్వం నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని క్రీడల్లో రాణించాలని ఉంది. ప్రస్తుతం నేను తెలంగాణ వీల్చైర్ బాస్కెట్ బాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను. అవకాశం వస్తే శ్రీకాకుళం జిల్లాలో నా పేరును చిరస్థాయిగా నిలుపుకోవాలని ఉంది. – పి.తులసయ్య, వీల్చైర్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు -
మేఘాల పల్లకిలోనా దిగివచ్చింది ఈ దేవకన్య
సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : నేస్తాలు వచ్చేశాయి. మేఘాల పల్లకిపై ఉద్దానం వాకిటకు సంతానోత్పత్తి కోసం వేంచేశాయి. ఆడబిడ్డ పురుటి కోసం ఇంటికి వచ్చినంత సంబరంగా స్థానికులు ఈ పక్షి నేస్తాలను ఆహ్వానిస్తున్నారు. రెక్కల చప్పుడుతో చినుకులను వెంట తీసుకువచ్చే విహంగాల సంరక్షణ తమ బాధ్యతని చెబుతుంటారు. ఎక్కడో సుదూర తీరాన ఉన్న సైబీరియా నుంచి ఎగురుకుంటూ ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి వరకు ప్రయాణం చేసిన విహంగాలకు ఇక్కడ రెక్కలు విరిగిన వృక్షాలే స్వాగతమిచ్చాయి. గత ఏడాది వరకు తమ చేతులారా ఆహ్వానించిన వృక్ష రాజాలు నేడు మోడువారిన కాండాలనే పక్షి నేస్తాలకు ఆవాసాలుగా మలచనున్నాయి. పక్షుల సందడితో తేలుకుంచి పులకించిపోతోంది. కొమ్మకొమ్మకు పురిటి కేంద్రాలు చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి రెండు నుంచి ఆరు గుడ్లు వరకు పెడుతుంది. సుమారు 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లను పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి లేదా మగ పక్షి గూళ్లో వీటికి కాపలాగా ఉంటాయి. ఆడపడుచుల్లా విదేశీ పక్షులు శతాబ్దాల నుంచి వలస వచ్చే విదేశీ విహం గాలపై ఈ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దుల్లేవు. నిజానికి వాటిని పురుడు పోసుకునేందుకు వచ్చిన ఆడపడుచుల్లా భావిస్తారు. వాటితో విడదీయరాని అనుబంధం ఈ గ్రామస్తులతో పెనవేసుకుంది. రావాల్సిన సమయంలో పక్షులు గ్రామాని కి చేరకపోతే ఇక్కడ ప్రజలు ఆందోళన పడతారు. ఏటా జూన్ మాసంలో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మ కం. వీటి రాకతోను తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయ ని గ్రామంలో ఉండే వృద్ధులు చెబుతుంటారు. తాము కూర్చున్న చోట, పక్కలో పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎలాంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారి నుంచి గ్రామస్తులమే రక్షిస్తుం టామని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తామని హెచ్చరిస్తారు. పక్షుల ప్రత్యేకతలు ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్ నెలలో సైబీరియా నుంచి వస్తున్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు) అంటారు. వీటి శాస్తీయ నామం ‘అనస్థోమస్’. ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. దవడల మధ్యన (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్ బిల్ స్టార్క్స్ అని అంటారు. పగలంతా తంపర భూముల్లో, వరి చేలల్లో తారుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా ఈసుకుంటాయి. ఆరు నెలలు పాటు త మ పిల్లలతో గడిపిన పక్షులు పక్షి పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరి నెలల్లో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. సంరక్షణ గాలికి పక్షులను సంరక్షించాల్సిన అటవీ, పర్యావరణ శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో గాయాలపాలైన పక్షులకు ప్రథమ చికిత్స అందించిన అధికారులు అనంతరం వాటిని సంరక్షించాలన్న సంగతిని మరిచారు. గ్రామంలో చెట్లు పెంచా ల్సిన అటవీశాఖ సిబ్బంది జాడే లేకుండా పోయింది. ప్రత్యమ్నయంగా పక్షులు గూళ్లు పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఇనుప టవర్ పంజరాలు అక్కరకు రాకుండా పోయాయి. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ మూడేళ్ల కిందట పర్యాటక శాఖ అధికారులతో పర్యటించి రూ.25లక్షలతో సుమారు ఎకరా దేవదాయ భూమిలో పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తానంటూ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. విహంగాలకు విడిది లేదు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విహంగాలకు తేలు కుంచిలో విడిది లేని పరిస్థితి నెలకొంది. వరుస తిత్లీ, పైలాన్ తుఫాన్ తీవ్రతకు చెట్లు నేలకొరిగాయి. అంతే కాకుండా గత తిత్లీ తుఫాన్కు వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40 శాతం తగ్గుముఖం పట్టా యి. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు ఉండేందుకు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగుల బారిన పడి పక్షులు మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. -
గేటు వేస్తే... గంట ఆగాల్సిందే...!
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): మండలంలోని ఎం.తోటూరు– రత్తకన్న వద్ద ఉన్న రైల్వే నార్త్ కేబిన్ ఎల్సీ రైల్వే గేటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి పాలిట శాపంగా మారింది. ఈ గేటు వద్ద ఫ్లైౖ ఓవర్ నిర్మాణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ గేటు పడిదంటే చాలు ప్రయాణికులు సుమారు అరగంట వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 22 గ్రామాల ప్రజలు ఎదురు చూపులు ఇక్కడ వంతెన నిర్మాణం కోసం ఆంధ్రా– ఒడిశా గ్రామాలతో పాటు ఇచ్ఛాపురం, చీకటి నియోజకవర్గాలకు చెందిన 22 గ్రామాల ప్రజలు నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా మండపల్లి తోటూరులో రెండు కాన్వెంట్లతో పాటు ప్రైవేటు జూనియర్, సీనియర్ కళాశాలు, మున్సిపాలిటీ పరిధి రత్తకన్నలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ప్రైవేటు కాన్వెంట్ ఉంది. ఎం.తోటూరులో సినిమా హాల్ ఉండడంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇదిలా ఉండగా, బిర్లంగి, కొళిగాం ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉండడంతో నిత్యం ఇటుక లారీలు, ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తునే ఉంటున్నాయి. గేటు పడితే అంతే సంగతి..! ప్రతీ పదిహేను నిమిషాలు, అరగంటకో రైలు వస్తుండడంతో పది నిమిషాలు ముందుగానే గేటు వేయడంతో వాహనాలు కిలో మీటర్ పొడవునా బారులుగా తీరుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు వెళ్లేం దుకు కూడా ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బిర్లంగి బాహుదానదిలో మునిగిపోయిన నాథం కమల కొన ఊపిరితో ఉండగా, వాహనంపై ఇచ్ఛాపురం సామాజికి ఆస్పత్రికి తరలిస్తుండగా, సుమారు 15 నిమిషాల పాటు గేటు వేయడంతో ఆస్పత్రికి చేరుకునే కొద్ది క్షణాల్లోనే ఆమె మృత్యు ఒడిలోకి చేరుకుంది. నీటిమూటలుగా ఎంపీ, ఎమ్మెల్యే హామీ గతంలో ఇచ్ఛాపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కె.రామ్మోహన్నాయు డు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి స్థానికుల ఫ్లై ఓవర్ పరిస్థితిని వివరించారు. వెంటనే సమస్యను పరిష్కారిస్తామంటూ హామీ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కానీ నేటికి సుమారుగా రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీ మాత్రం నీటి మూటలుగా మిగిలిపోయాయి. మరుగునపడ్డ ప్రతిపాదనలు రైల్వే అధికారులు ఎల్సీ గేటును పరిశీలించిన తరువాత దాసన్నపేట యర్కర చెరువు జంక్షన్ నుంచి బెల్లుపడ కాలనీ మీదుగా భవానీపురం వరకు ఫ్లై ఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ ఆ ప్రతిపాదనలు మరుగునపడ్డాయి. తప్పని తిప్పలు రైల్వే గేటుకు ఇరువైపులా విద్యాసంస్థలు, ఆస్పత్రులు, తహసీల్దార్, ఎంపీడీఓ తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో అటు విద్యార్థులకు, ఇటు ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు. సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలే విద్యార్థులు నష్టపోతుంటే...సమయానికి బయోమెట్రిక్ వేయకపోతే పూట సెలవు పెట్టాల్సిందేనని ఉద్యోగులు వాపోతున్నారు. గేటు పడితే ద్విచక్రవాహనాలు, పాదాచారులు వెళ్లేందుకు ఉన్న ఒక్కగానొక్క అండర్ పాసేజ్ పూర్తిగా మురికి నీటితో నిండిపోయింది. ఇటీవల రైల్వే ట్రాక్ పక్కన మట్టి పోయడంతో ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిస్తే అటువైపుగా వెళ్లేందుకు వాహనచోదకులు సాహసించడంలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు, పాలకులు స్పందించి ఫ్లై ఓవర్ వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, అండర్ పాసేజ్ను మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయోజనం లేకపోకపోయింది ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాను. ప్రతి అరగంటకో రైలు వస్తుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఫ్లై ఓవర్ కోసం పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించినా ప్రయోజనం లేకపోకపోయింది. – యు.సూర్య, డ్రైవర్, ఎం.తోటూరు నిరుపయోగంగా అండర్పాసేజ్ గేటు పడినప్పుడు ద్విచక్రవాహనదారులు అండర్పాసేజ్ గుండా వస్తుండడంతో పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. మా సేవా సంస్థ ద్వారా పలుమార్లు శ్రమదానం చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసినప్పటికీ వర్షాలు కురిసినప్పడు మురుగునీరుతో ఈ రహదారి పూర్తిగా మూసుకుపోతుంది. ప్రస్తుతం జనాభాతో పాటు వాహనాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత సమస్య ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. – ఎం.రాంబాబు, యువసూర్య చారిటీబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎం.తోటూరు -
బడి తెరిచినా... భృతి లేదు
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఇచ్ఛాపురం నియోజకవర్గం... ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు విధులు నిర్వహించాలంటే పనిష్మెంట్గా భావిస్తారు. అందుకే ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సైతం స్థానికంగా నివాసం ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అందుకు కారణం ఈ ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి తీవ్రంగా ఉండడమే. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో ఉన్న బడుల్లో విద్యార్థుల నిష్పత్తికి తగ్గ ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ బడుల్లో విద్య పడకేసింది. గతేడాది ఆగస్టు నెలలో అప్పటి జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని స్థానిక విద్యావంతులు కోరారు. దీంతో స్పందించిన ఆయన కిడ్నీ వ్యాధి ప్రభావిత మండలాల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేసి, అందుకు రూ.కోటి 46 లక్షల నిధులు కేటాయించడం జరుగుతుందని ప్రకటించారు. అనుకున్న విధంగానే ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలకు సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 400 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేస్తున్నట్టు అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రోస్టర్ విధానంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే(ఎస్జీటీ, భాషా పండితులు) అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే (స్కూల్ అసిస్టెంట్) అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల కు రూ.7 వేలు చొప్పున్న గౌరవ వేతనాలు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసి గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో విధుల్లోకి తీసుకున్నారు. ఒక్క నెల కూడా అందని వేతనం తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ సమయంలో తమ భవిష్యత్ను లెక్కచేయకుండా ఆయా పాఠశాలల్లో విధులు నిర్వహించిన వీరికి జిల్లా విద్యాశాఖాధికారి చుక్కలు చూపించింది. సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం పూర్తయిన ఏప్రిల్ 23 వరకు విధులు నిర్వహించారు. విద్యా సంవత్సరం పూర్తయి మరలా బడులు తెరుచుకున్నప్పటికీ వీరికి ఒక్కనెల కూడా వేతనాలు అందకపోవడంతో గమనార్హం. తమకు వేతనాలు అందుతాయో లేదో అన్న సందేహంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు కొట్టిమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు అందించాలని అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు కోరుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు మూత్రపిండాల వ్యాధి ప్రభావిత మండలాల్లో గతేడాది సెప్టెంబర్ నెలలో నియోజకవర్గంలో 400 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నియమించింది. మున్ముందు డీఎస్సీ ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయిన ఏప్రిల్ 23 వరకు విధులు నిర్వహించాం. ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదు. మా గురించి ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. – కె.మీనూ, అకడమిక్ ఇన్స్ట్రక్టర్, కేశుపురం యూపీ స్కూల్, ఇచ్ఛాపురం మండలం వేతనాలు విడుదల చేసి ఆదుకోండి ఉద్దానం ప్రాంతంలో ఉన్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో 400 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను కలెక్టర్ చొరవతో విధుల్లో చేరారు. వీరి రాకతో పాఠశాలలు మరింత బలోపేతమయ్యాయి. ఇప్పటికి ఎనిమిది నెలలు దాటుతున్నా ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా రాకపోవడం దురదృష్టకరం. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల ద్వారా వారికి త్వరగా వేతనాలు అందించాలని కోరుతున్నాము. – బి.శంకరం, ఆపస్ మండల ప్రధాన కార్యదర్శి, ఇచ్ఛాపురం మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికే ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అధికారులు సైతం స్పందించారు. త్వరలో ప్రతీ అకడమిక్ ఇన్స్ట్రక్టర్కు వేతనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో కలెక్టర్ ఆదేశాలు మేరకు గతంలో పనిచేసిన విద్యా వలంటీర్లను ఈ నెల 12 నుంచి నియమించడం జరిగింది. – కురమాన అప్పారావు, మండల విద్యాశాఖాధికారి, ఇచ్ఛాపురం మండలం -
అన్ని వర్గాలకు సమన్యాయం
సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపిస్తే పూర్తిగా అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని, అయినప్పటికీ వెరవకుండా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు చేశానని పేర్కొన్నారు. సోంపేట ధర్మల్ పవర్ప్లాంట్ రద్దుకు మూడేళ్లపాటు అవిశ్రాంతంగా పోరాడానన్నారు. 15 రోజుల పాటు శ్రీకాకుళం సబ్జైల్లో కూడా ఉన్నానని గుర్తుచేశారు. కిడ్నీరోగులను ఆదుకోవడానికి ఉద్దానం ఫౌండేషన్ ఏర్పాటు చేసి వ్యాధి పీడిత గ్రామాల్లో మినరల్ వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సోంపేట ప్రభుత్వాస్పత్రిలో సొంత ఖర్చులతో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేశానన్నారు. ఇలా పలు అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రశ్న: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు? జవాబు: ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఒకసారి 2009లో శాసనసభ్యునిగా ఎన్నికై సేవలందించిన అనుభవం ఉంది. అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాటాలు చేశాను. తద్వారా అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన అనుభవం ఉంది. ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన సమస్యలేమిటి? జవాబు: నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది. సాగునీటి సమస్య, నిరుద్యోగంతో వలసలు, మౌలిక సౌకర్యాల కల్పన కూడా మిగతా నియోజకవర్గాలతో పోల్చితే తక్కువే. ముఖ్యంగా ఉద్దాన ప్రాంత ప్రజల్ని కిడ్నీవ్యాధి మహమ్మారి ఎందర్నో బలి తీసుకుంటుంది. ప్రశ్న: సమస్యల పరిష్కారానికి ఎలా కృషిచేస్తారు? జవాబు: నియోజకవర్గంలో ఉన్న శాశ్వత సమస్యలన్నీ పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తాను. నేను గుర్తించిన ప్రతీ సమస్యపై రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతనిచ్చి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాను. ప్రశ్న: ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వ్యూహం ఏమిటి? జవాబు: ప్రత్యేకంగా వ్యూహం అంటూ ఏమీ లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫేస్టోలో పేర్కొన్న అంశాలు నా విజయానికి దోహదపడతాయి. అంతకు ముందు నేను చేసిన ప్రజాహిత సేవా కార్యక్రమాలు, నా వ్యక్తిత్వం, విద్యార్హతలు, గడచిన టీడీపీ పాలనలో చోటుచేసుకొన్న అవినీతి కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అవే నన్ను గెలిపిస్తాయి. ప్రశ్న: మీరు ఎన్నికైతే అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఒకే విధంగా ప్రాధాన్యత ఇస్తారా? జవాబు: ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి పరిపాలిస్తాను. వారికి అన్నింటా గౌరవం దక్కేలా వ్యవహరిస్తాను. గడచిన టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అటువంటి పరిపాలన నాకు నచ్చదు. అందర్నీ కలుపుకొని పోతాను. మొదటిసారి ఎన్నికైనప్పుడే నా పాలనలో అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇచ్చాననేది రుజువయ్యింది కూడా. ప్రశ్న: వ్యక్తిగతంగా ఏమైనా సేవాకార్యక్రమాలు చేపట్టారా? జవాబు: అవును.. నేను పదవితో సంబంధం లేకుండా సొంతంగా ఉద్దానం ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి కిడ్నీబాధిత గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, ఉచిత మెడికల్ క్యాంపులు, ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మాజీ అయ్యాక కూడా నాకు వచ్చిన గౌరవ వేతనాన్ని పూర్తిగా కిడ్నీబాధితుల కుటుంబాలకు నెలవారీ వారి అకౌంట్లలో వేసి వారికి సాయం చేస్తున్నాను. రాజకీయ నేపథ్యం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా సాయిరాజ్ ఇప్పటికే 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. పదవీ కాలం చివరిలో తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగాను, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిశీలకునిగా కూడా సేవలందించారు. ప్రశ్న: టీడీపీ పాలనలో పలు ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? జవాబు: అవును టీడీపీ పాలనలో ఎంతో మంది అర్హులైన పేదలకు ఇళ్లు, సామాజిక పింఛన్లు రాలేదు. ఇలా చాలా మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించలేదు. అటువంటి వారందరికీ పార్టీలకతీతంగా అర్హత ఉన్న మేరకు ప్రాధాన్యమిచ్చి న్యాయం చేస్తాను. -
కోడ్ వీరికి వర్తించదా..?
సాక్షి,ఇచ్ఛాపురం రూరల్: ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంది. అయితే టీడీపీ నాయకులు ఉన్న గ్రామాల్లో మాత్రం కోడ్ వర్తించని విధంగా ఉంది. ఇచ్ఛాపురం మండలం కొఠారీ, తులసిగాం గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ సుజలధార ట్యాంక్పై బొమ్మలను అధికారులు తొలగించలేదు. అదే విధంగా ఇన్నేశుపేట జంక్షన్లో ఉన్న విశ్రాంతి భవనంపై ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లతో ఉన్న బోర్డు, పాఠశాలల గోడలపై ఉన్న టీడీపీ ప్రచార బోర్డులను తొలగించేందుకు అధికారులు సైతం జంకుతున్నారు. -
మీ బాధలు నన్ను కదిలించాయి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏదోఒక సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వేచిచూస్తున్న రాష్ట్ర ప్రజ లు తనపై పెట్టుకున్న ఆశలు తనను మరింత బలవంతుడిని చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సంద ర్భం గా తన మనస్సులో నెలకొని ఉన్న భావోద్వేగాలను ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ‘‘పాదయాత్ర సమయంలో మీరు చూపిన ప్రేమానురాగాలు నన్ను వినమ్రుడిని చేస్తున్నాయి. మీ బాధలు, వేదనలు నన్ను కదిలించాయి. మీరు నాపై పెట్టుకున్న ఆశలు నాలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్న నా కృతనిశ్చయం నన్ను కార్యదక్షత దిశగా మరింత బలవంతుడిని చేస్తోంది’’అని పేర్కొన్నారు. -
నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటా: వైఎస్ జగన్
సాక్షి, ఇచ్చాపురం : అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాదయాత్ర అనుభవాలను ప్రజలతో పంచుకున్న వైఎస్ జగన్.. అధికారంలోకి వస్తే చేసే పనులను వివరించారు. గ్రామానికో సెక్రటేరియేట్.. ‘ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియేట్ను తీసుకొస్తాం. స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పథకం పేదవాడి ఇంటి ముందుకే వచ్చే విధంగా చేస్తాం. ప్రతి 50 ఇళ్ళకు ఒకరికి గ్రామ వాలంటీయర్గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. వాలంటీయర్ ఆ 50 ఇళ్ళకు జవాబుదారీగా ఉంటూ.. గ్రామ సెక్రటేరియేట్తో అనుసంధానమై పనిచేస్తూ.. నవరత్నాలు నుంచి రేషన్ బియ్యం వరకూ.. నేరుగా ఇంటికే చేరేలా చేస్తాం. పగటిపూటే 9 గంటల ఉచిత కరెంట్.. రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆక్వా రైతుకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తాం. గిట్టుబాటు ధరల కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. ఈ రోజు లీటర్ పాలు రూ.26కు అమ్ముకుంటున్నారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు డైరీలను నాశనం చేశాడు. హెరిటేజ్లో మాత్రం అర లీటరు పాలు రూ.45కు అమ్ముతున్నారు. పాడి ప్రోత్సాహం కోసం.. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తాం. సహకార రంగం డైరీలను ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా.. రూ. 4 వేల కోట్లు(రూ. 2వేల కోట్లు రాష్ట్రం ప్లస్ రూ. 2 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది) ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెడతాం. కొబ్బెరి చెట్లుకు పరిహారం రూ. 3 వేలు ఇస్తాం. జీడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ. 30 వేలును రూ.50 వేలుకు పెంచుతాం. రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే.. వైయస్ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తాం. ఆ నష్టపరిహారం పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదు. ప్రతి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాం.’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. డ్రాక్రా మహిళల కోసం వైఎస్సార్ ఆసరా.. 89 మంది లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో దాన్ని నాలుగు విడతలుగా చెల్లింపు. ఫించన్లు: ప్రస్తుతం ఉన్న ఫించన్ల వయస్సు 65 నుంచి 60కు తగ్గింపు. అవ్వతాతకి రూ.2000 ఫించన్, వికలాంగులకు రూ. 3000. అమ్మఒడి : పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడొద్దు. పిల్లలను బడికి పంపితే చాలు ఏడాదికి ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు రూ. 500, ఇద్దరు పిల్లలకు రూ. 1000. ఆరో తరగతి నుంచి పదో తరగతి వారికి ఒక్కోక్కరి రూ.1000 చొప్పున ఇద్దరికి రూ. 2 వేలను నేరుగా తల్లలుకే అందజేత. హౌసింగ్: పేదలకు 25 లక్షల ఇళ్లు, జన్మభూమి కమిటీలతో పనిలేకుండా ఇళ్ల కేటాయింపు ఆరోగ్యశ్రీ : ఆరోగ్య శ్రీకి బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపు. సంపాదించే వ్యక్తికి ఆపరేషన్ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్. ఫీజు రీయింబర్స్మెంట్: ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్, ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేల సాయం. జలయజ్ఞం : పోలవరం సహా అన్ని ప్రాజెక్ట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి. మద్య నిషేధం: మూడు దశల్లో మద్య నిషేధం, మొదటి దశలో దుకాణాల సంఖ్య తగ్గింపు. ఊరురా వెలిసిన బెల్ట్షాపులపై ఉక్కుపాదం. షాక్ కొట్టేలా మద్యం ధరల పెంపు. రెండో దశలో పేద మధ్యతరగతికి మద్యం అందుబాటులోలేకుండా నిషేధం. మూడో దశలో ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం. తయారు చేసినా అమ్మినా ఏడేళ్లు జైలు శిక్ష పడేలా చట్ట సవరణ -
ప్రజల గుండె చప్పుడు విన్నాను : వైఎస్ జగన్
సాక్షి, ఇచ్చాపురం : ‘ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ఆ గుండె చప్పుడిని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నడిచింది తానైనా.. నడిపించింది మాత్రం ప్రజలేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు హయాంలో దగాపడ్డ రైతన్నా.. మోసపోయిన డ్వాక్రా అక్కా చెళ్లెమ్మలు.. ఉద్యోగం రాక నిరాశలో ఉన్న యువతను పాదయాత్రలో కలిసానని, వారి గోడును విన్నానని తెలిపారు. ‘ఇలా ప్రతి ఒక్కరిని కదిలిస్తే.. చంద్రబాబు పాలనపై ఏమంటున్నారో తెలుసా.. చంద్రబాబును నమ్మం అంటున్నారు’ అని వైఎస్ జగన్ తన పాదయాత్ర అనుభవాలను పంచుకున్నారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. ఇంత ఊహించలేదు.. ‘ఇడుపులపాయలో తొలి అడుగువేసినప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని, ఇన్ని కోట్ల మంది ప్రజాభిమానం లభిస్తుందని ఊహించలేదు. నడిచింది నేనైనా.. నడిపించింది మీరూ(ప్రజలనుద్దేశించి).. పైనున్న ఆ దేవుడు. నాన్నగారి ఆశీస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రికార్డు స్థాయిలో పాదయాత్ర విజవంతమైందంటే.. మీ ఆశీస్సులేనని నిస్సంకోచంగా చెబుతాను. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎంత మందిని కలిసి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర విభజన నష్టం ఒక వైపు.. చంద్రబాబు దోపిడీ మరోవైపు. రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం ఒక వంకా.. నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబు నైజం మరోవంక. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చేసిన వాగ్ధానాలు. ఆ 600 హామీలు మోసం చేసిన విధానం. ఇవన్నీ చూస్తే గుండె మండుతోంది. పిల్లలను అవిటిగా మార్చి అడుక్కునే వారికి.. ప్రజలు కష్టాల్లో ఉన్నా.. విపరీతంగా దోచుకుంటున్న చంద్రబాబుకు ఏమైనా తేడా ఉందా? అని అడుగుతున్నా? ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర విషయాలు చెబుతా.. అనంతపురం రైతు శివన్న.. అనంతపురంలో శివన్న అనే రైతు నన్ను కలిశాడు.. రెయిన్ గన్ల గురించి కంటికి కట్టినట్లు చెప్పాడు. వ్యవసాయం ఎలా కుదేలైందో.. లక్షమంది ఎలా వలుస వెళ్తున్నారో వివరించాడు. 90వేల అప్పు చేసి తన పొలంలో వేరుశనగ పంట వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. ఇంకేముందన్నా.. బాబుతో కరువు కలిసొచ్చిందన్నా..అని చెప్పాడు. అనంతపురం పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామని, దీనికి ఆయన అయ్యో కరువా? నాకు అధికారులు చెప్పనేలేదని వారిని తిట్టాడని చెప్పాడు. రెయిన్గన్ల ద్వారా పంటను కాపాడుతానన్నారు. ఆ తర్వాత ఏమైందన్నా.. చంద్రబాబు వచ్చి ఆ రైన్ గన్ ప్రారంభి.. అలా అలా నాలుగు నీళ్లు చల్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అనంతరం ఆయన వెళ్లిపోయాడన్నా.. ఆ సాయంత్రమే అధికారులు వచ్చి రెయిన్ గన్ పట్టుకుపోయారని .. శివన్నా.. చంద్రబాబుతో దిగిన ఫొటోలు.. పేపర్ కట్టింగ్లు పట్టుకోని నాకు చూపించాడు. ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట వేస్తే బస్తా రాలేదన్నా.. ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి వడియాలు అమ్ముకుంటున్నా అని తెలిపాడు. ఇక ఈ విషయంపై బహిరంగ సభలో మాట్లాడుతానని మైక్ అందుకోని.. క్రిందటి సారి చంద్రబాబుకు ఓటేసా.. మనకు చంద్రబాబు సావాసం వద్దబ్బా అని పిలుపునిచ్చాడు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం జాతీయ రాజకీయాలని కొత్త డ్రామా మొదలుపెడుతాడు. బెంగళూరుకు వెళ్లి కుమార స్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే ఉన్న అనంతపురం రైతన్నను మాత్రం పట్టించుకోడు. మరుసటి రోజు చెన్నైకి వెళ్లి స్టాలిన్తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటాడు. కానీ పక్కనే ఉన్న సొంత జిల్లా చిత్తూరు రైతులను పట్టించుకోడు. ప్రభుత్వ సొమ్మే కదా అని ప్రైవేట్ విమానంలో కోల్కతాకు వెళ్లి మమతాబెనర్జీతో చికెన్ తింటాడు. కానీ ప్రజల సమస్యలు పట్టించుకోడు. నమ్మం అంటే నమ్మం బాబు.. రాష్ట్రంలో పంటలు దిగుబడి చూస్తే గుండెతరక్కుపోతుంది. దివంగత నేత వైఎస్సార్ హయాంలో సాగు విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. కానీ ఈ పెద్ద మనషీ నదుల అనుసంధానం అంటాడు. దేశంలోనే వ్యవసాయంలో మనరాష్ట్రమే నెంబర్ వన్ అంటాడు. అందుకే చంద్రబాబు నాయుడి ప్రజలు నమ్మం అంటే నమ్మం బాబు అంటున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం వ్యవసాయం నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున 28 స్థానంలో ఉంది. చంద్రబాబు రైతు రుణమాఫీ మోసం వల్లే రైతులు దారుణంగా నష్టపోయారు. రైతు రుణమాఫీ కనీసం వారి వడ్డీలకు కూడా సరిపోలేదు. వడ్డీ లేకుండా బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేవి. ఆ వడ్డీని ప్రభుత్వాలు కట్టేవి. కానీ చంద్రబాబు దీన్ని పూర్తిగా మరిచిపోయారు. దీంతో రైతులంతా చంద్రబాబును నమ్మం అంటున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అడుగుతున్నా? (రాలేదు ప్రజల నుంచి సమాధానం.) దళారీ వ్యవస్థకు కెప్టెన్.. హెరిటేజ్ కోసం చంద్రబాబు దళారీ వ్యవస్థకు కెప్టెన్ అయ్యాడు. హెరిటేజ్ లాభాల కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ప్యాక్ చేసి రెండింతల రేట్లకు అమ్ముతున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదు. ఉద్దానం, పలాసలో జీడిపప్పు చాలా ఫేమస్. ఈ జీడిపప్పును ఇక్కడి రైతులు కేజీ రూ.600కు అమ్ముకోలేని పరిస్థితి. కానీ చంద్రబాబు హెరిటేజ్లో కేజీ రూ.1100లకు అమ్ముతున్నారు. ఇలా రైతులను మోసం చేస్తున్నాడు కాబట్టి వారంతా చంద్రబాబు నమ్మం అంటున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు చెల్లించలేదని మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బందులు దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు తాళిబొట్లు తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. నిరాశలో నిరుద్యోగ యువత ఉన్నారు. బాబు వచ్చాడు కానీ జాబు రాలేదని, నిరుద్యోగులు నన్ను కలిశారు. బాబు వచ్చాడు.. 30 వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా..? గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయుష్ పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. సాక్షర భారత్లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న 85 వేల మంది ఉద్యోగాలు గోవిందా.. విభజన సమయానికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో మెర 90వేలు ఖాలీ అయ్యాయి. మొత్తం సుమారు 2 లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. చంద్రబాబు మాత్రం 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫీజులు కట్టలేక ఆత్మహత్య.. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేశారు. 6వేల పాఠశాలలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మూసించేశారు. మధ్యాహ్న భోజన పథకానికి 6 నెలలుగా బిల్లులు చెల్లించని దుస్థితి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గోపాల్ అనే వ్యక్తి కలిశాడు. తన కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడని, కట్టాల్సిన ఫీజు లక్ష ఉండగా.. రీయింబర్స్ మెంట్ 30 వేలు ఇచ్చాడన్నా అని ఆవేదన చెందాడు. తొలి ఏడాది అప్పు చేసి రూ. 70వేలు ఫీజు కట్టానన్నాడు. ఫీజులు కట్టలేకపోతున్నానని తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. చంద్రబాబు హయాంలో ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పేదవాడికి వైద్యం అందడం లేదు.. చంద్రబాబు పాలనలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఉద్దానంలో 4 వేల మంది కిడ్నీ బాధితులుంటే.. కేవలం 1400 మందికి మాత్రమే సాయం చేస్తున్నారు. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్ పేషెంట్లకు ముష్టి వేసినట్లు రూ. 2500 మాత్రమే ఇస్తున్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే.. టైర్ పంక్షర్ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్లు లేక మెంటాడలో బస్సులో ప్రసవించింది. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గ్రామాల్లో మాఫియా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఏర్పాటు చేశారు. రేషన్ కార్డు, ఇల్లు సహా చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్ కోసం వృద్ధులు కోర్టుకెళ్లిన పరిస్థితి. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటిలోను దోపిడియే ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబులోభయం పట్టుకుంది. ఆదరణ-2 అంటూ కొత్తనాటాకాలకు తెరలేపుతున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. మీ బిడ్డకు తోడుగా ఉండండి.. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చండి. నవరత్నాల మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ఓటు వేయరు. ఆరు నెలలు కలిసి ఉంటే. వారు వీరు.. వీరు వారవుతారు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. జరిగే యుద్ధం ఒక్క నారాసురుడితో మాత్రమే కాదు. ఈ నారాసురుడికి ఎల్లో మీడియా ఉంది. జిత్తులు మారి ఈ మాయావి చంద్రబాబు పొత్తులు, ఎత్తులను, అన్యాయాలను జయించేందుకు మీరంతా తోడుగా ఉండాలి.’ అని వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతిఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఈ చారిత్రక ఘట్టానికి సాక్షిగా ఇచ్చాపురంలో వైఎస్ జగన్ విజయసంకల్పస్థూపం (పైలాన్)ను ఆవిష్కరించారు. -
విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, ఇచ్ఛాపురం: చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. వైఎస్ జగన్ పైలాన్ను ఆవిష్కరించే దృశ్యాన్ని అపురూపంగా తిలకించారు. పైలాన్ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్ కాలినడకన పాత బస్టాండ్ వద్దకు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అంతకు ముందు వైఎస్ జగన్ పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇలాంటి పాదయాత్ర దేశంలో ఎవరు చేయలేదు
-
వైఎస్సార్ సీపీలో చేరిన భానుచందర్
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సినీ నటుడు భానుచందర్ వైఎస్సార్ సీపీలో చేరారు. జననేత పార్టీ కండువా కప్పి భానుచందర్ను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్ర ముగింపు ఘట్టంలో పాల్గొన్న భానుచందర్ మాట్లాడుతూ... ప్రజల కోసం తపించే వైఎస్ జగన్ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. జనంతో ఇంతగా కలిసిపోయే నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని పేర్కొన్నారు. 2019 నుంచి మరో 20 సంవత్సరాల పాటు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వ్యాఖ్యానించారు. కాగా కొన్నిరోజుల క్రితమే భానుచందర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గతేడాది డిసెంబర్లో వైఎస్ జగన్ను భానుచందర్ కలిశారు. ఆరోజే తాను పార్టీలో చేరే విషయంపై చర్చించారు. -
మాటలు రానివాడంటే లోకేశ్..
సాక్షి, ఇచ్ఛాపురం: చంద్రబాబు దోపిడీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు సిండికేట్లా తయారయి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని భూముల నుంచి ఇసుక వరకు ప్రతిదాంట్లోనూ దోపిడీ పర్వం కొనసాగుతోందని విమర్శించారు. అందుకే చంద్రబాబుకు ‘అవినీతి చక్రవర్తి’ బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం ఇచ్ఛాపురం వచ్చిన ఆమె ‘సాక్షి’టీవీతో మాట్లాడారు. ఇచ్ఛాపురం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నలుమూలల జనం నుంచి తరలిరావడంతో ఇసుక వేసినా రాలనంతగా జనం కనబడుతున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిని ఆమె ఎద్దేవా చేశారు. ‘మాటలు రానివాడంటే లోకేశ్, మాటలు చెప్తే అర్థంకాకపోతే ఆయన పవన్ కళ్యాణ్. మాట తప్పితే అది చంద్రబాబు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుంటారు కనుక తామంతా జగన్ వెంట ఉన్నామ’ని డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. -
పాదయాత్ర సక్సెస్కు కారణం అదే: పృథ్వీ
సాక్షి, ఇచ్ఛాపురం: వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని సినీ నటుడు పృథ్వి అన్నారు. తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరో నటుడు కృష్ణుడుతో కలిసి ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. మహానేత వైఎస్సార్ లేని లోటు తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్ వెంట నడిచారని వెల్లడించారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని పృథ్వి గుర్తు చేశారు. చంద్రబాబు విఫలం: కృష్ణుడు టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని నటుడు కృష్ణుడు అన్నారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యల గురించి చెప్పుకున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రతో వైఎస్ జగన్ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం వైఎస్సార్ కుటుంబం ఎంతో చేసిందన్నారు. -
ఇచ్ఛాపురం బహిరంగసభకు తరలిరండి
-
విజయ 'సంకల్పం'
ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శివార్లలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న పైలాన్ చిరస్మరణీయంగా నిలిచిపోనుంది. అనితర సాధ్యం.. అనన్య సామాన్యంఅన్న రీతిలో ఇప్పటికి 3,593.6 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన వైఎస్ జగన్.. ఈ నెల 9న తన ప్రజా సంకల్ప యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది అభిమానులు, ప్రజల మధ్య ఈ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర.. అప్రతిహతంగా కొనసాగుతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత.. 2019 జనవరి 9వ తేదీ నాటికి ఇచ్ఛాపురం చేరుకోనున్నారు. తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ‘ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం’ వరకూ నడుస్తూ లక్షలాది మంది ప్రజలతో మమేకమవుతున్నారు. వారి కష్టాలను తెలుసుకుంటూ భవిష్యత్తుపై వారికి భరోసానిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా.. పైలాన్ నిర్మాణానికి శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. ఆకర్షణీయంగా.. ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు.. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో.. యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న ఈ పైలాన్ పనులు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న పటిష్టమైన ఈ నిర్మాణానికి మరో వైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉంది. దీంతో అటు వాహనాల్లో, ఇటు రైల్లో వెళ్లేవారి దృష్టిని ఈ కట్టడం ఆకర్షించనుంది. ఈ పైలాన్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలు, జగన్ పాదయాత్ర సందర్భంగా తీసిన ఫొటోలు, అనునిత్యం జనంతో మమేకమై వారి వెతలు వింటూ భరోసా ఇస్తున్న దృశ్యాలను నిబీడీకృతం చేయనున్నారు. 13 జిల్లాలకు గుర్తుగా.. 13 మెట్లు పైలాన్ చుట్టూ చిన్నపాటి లాన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లాన్ నుంచి పైలాన్ బేస్కు చేరుకునేందుకు 13 మెట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేసినందున ఒక్కో జిల్లాకు చిహ్నంగా ఒక్కో మెట్టును ఏర్పాటు చేశారు. ఇక పైభాగాన వైఎస్సార్ కాంగ్రెస్ పతాకంలోని మూడు రంగులతో కూడిన ఒక టోంబ్ను అమర్చారు. నిర్మాణం అగ్రభాగాన పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల మీదుగా ఏ ఏ మార్గాల్లో వైఎస్ జగన్ నడిచారో తెలియజేస్తూ ఒక మ్యాప్ను కూడా ఇందులో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్నో దర్శనీయ స్థలంగా, ఆకర్షణీయమైనదిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో రెడీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు గర్వించేలా.. వారిలో స్ఫూర్తిని నింపేలా.. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదల, సంకల్పానికి చిహ్నంగా నిర్మిస్తున్న ఈ పైలాన్ మరో రెండు రోజుల్లో దాదాపుగా పూర్తవుతుందని ప్రజా సంకల్ప యాత్ర ఏర్పాట్లను తొలి నుంచీ పర్యవేక్షిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ చెప్పారు. ప్రధాన పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఇక మెరుగులు దిద్దే పని ఉందన్నారు. గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కఠోర దీక్షతో తన సంకల్పాన్ని పూర్తి చేశారని.. ఇది పార్టీలో అందరికీ గర్వకారణమన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇప్పటికే అడుగు పెట్టిన జగన్.. కొర్లాం, బారువ క్రాస్, సోంపేట, కవిటి, రాజపురం, కొజ్జీరియా మీదుగా పాదయాత్ర సాగిస్తూ ఇచ్ఛాపురం చేరుకుంటారని తెలిపారు. ఈ నెల 9న పైలాన్ను ఆవిష్కరించాక ఇచ్ఛాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారని తలశిల రఘురామ్ వివరించారు. -
ఇడుపులపాయ - ఇచ్ఛాపురం విజయసంకల్పం
-
ప్రజాసంకల్పయాత్రకు గుర్తుగా విజయసంకల్ప స్థూపం ఏర్పాట్లు
-
కిడ్నీ బాధితులకు రూ.10వేల పెన్షన్ ఇస్తాం : వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం : అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్ అందిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ను లోహరబంధ పరిధిలోని ఏడు గ్రామాల కిడ్నీ బాధితులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. కిడ్నీ బాధితులకు ఎలాంటి పెన్షన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని మొరపెట్టుకున్నారు. రోగులకు సరిపడా డయాలసిస్ సెంటర్లు కూడా లేవని చెప్పారు. కిడ్నీ, తిట్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు వివక్షత చూపిస్తున్నారని జననేతకు చెప్పుకున్నారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. వంశధార మహేంద్రతనయ నుంచి మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీల పట్ల కిడ్నీ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 336వ రోజు పాదయాత్ర ఇచ్చాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు ఇచ్చాపురం ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. -
ప్రాణం తీసిన మద్యం
ఇచ్ఛాపురం రూరల్ : మద్యం మహమ్మారికి ఓ నిండు ప్రాణం బలైంది. స్నేహితులతో కలసి ఫూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి.. ఆ మత్తులో కల్వర్ట్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఫలితంగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామానికి చెందిన కొచ్చెర్ల భాస్కరరావు(37) ఒడిశా కె.సువాని వద్ద వెల్డర్గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసైన ఆయన శుక్రవారం ఉదయం పంట పొలానికి వెళ్లొస్తానని భార్య స్వాతికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు. స్నేహితులతో కలసి ఫూటుగా మద్యం తాగి లొద్దపుట్టి జాతీయ రహదారి పక్కనున్న కల్వర్ట్ గోడ(కానా)పై కూర్చున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదవశాత్తూ తూలి వెల్లకిలా లోతుగా ఉన్న కల్వర్ట్ గోతిలో పడిపోయారు. కింద ఉన్న రాళ్లకు తల బలంగా ఢీకొంది. దీనిని గమనించిన స్థానికులు కొందరు వెంటనే కల్వర్ట్లోకి దిగి భాస్కర్ను పైకి తెచ్చారు. అప్పటికే భాస్కరరావు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు హుటాహుటిన ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించే సమయానికే మృతిచెందారు. మృతుడికి భార్య స్వాతితో పాటు కుమారులు దిలీప్(8), జనార్దన్(7) ఉన్నారు. బంధువులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. మద్యం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. భార్య స్వాతి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్ ఏఎస్ఐ ఇ.నాగార్జున కేసు నమోదు చేశారు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపించారు. -
హడలెత్తించిన చైన్ స్నాచర్లు
శ్రీకాకుళం : జిల్లాలో చైన్స్నాచర్ల ఆగడాలు పెరుగుతున్నాయి. ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా దాడులు చేసి వారి వద్ద గల బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు. పథకం ప్రకారం ద్విచక్రవాహనాలపై వచ్చి.. దొంగతనాలు చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో మూడు చోట్ల పట్టపగలే ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇచ్ఛాపురం: పట్టపగలే మహిళమెడలో బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన కలకలం రేపింది. పట్టణంలో బాసుదేవపేటలో విశ్రాంత ఉపాధ్యాయుడు కొణతాల మోహన్రావు, భార్య జానకి నివసిస్తున్నారు. ఆమె శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంటి వద్ద పూలు కోస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకరు వాహనం దిగి వెనుక నుంచి వచ్చి మెడలోని 2 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలో పుస్తెల తాడు తెగిపోవడంతో అందులోని పుస్తెలు, పూసలు కిందపడిపోయాయి. వెంటనే జానకి గట్టిగా అరవడంతో భర్త, కుమారుడు బయటకి వచ్చారు. వారిని వెంబడించే సరికి దుండగులు ద్విచక్రవాహనంపై వేగంగా పారిపోయారని భర్త మోహన్రావు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.మంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరిపై దాడి కాశీబుగ్గ: 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళలపై పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో దుండగులు దాడిచేసి మూడు తులాల బంగారు తాడును లాక్కెళ్లిపోయారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం జరిగింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు జామియా మసీదుకు చెందిన రాజేశ్వరి శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. వెనుక నుంచి వచ్చిన ఇద్దరు దొంగలు పథకం ప్రకారం.. 3 తులాల బంగారు గొలుసును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో నెట్టేసి పారిపోయారు. ఈ దృశ్యాలు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇది మరో ఘటనలో 15 నిమిషాల వ్యవధిలో మధ్యాహ్నం భోజనం తీసుకుని వస్తున్న ఉషారాణిపై దాడిచేసి 3 తులాల బంగారు తాడును దొంగిలించుకుపోయారు. ఆమె విలపిస్తు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పలాస–కాశీబుగ్గలో ఇంతవరకు సుమారుగా నాలుగేళ్లలో 30 గొలుసు దొంగతనాలు జరిగాయి. జిల్లా యంత్రాంగంపై ఎస్పీ ఆగ్రహం జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ అధికారులపై మండిపడ్డారని విశ్వసనీయ సమాచారం. తరచూ గొలుసు దొంగతనాలు జరుగుతున్నా వాటిని అదుపు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో అత్యధికంగా పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురంలో జరుగుతున్నాయని నిందితులను పట్టుకోవాలని అదేశాలు జారీచేశారు. -
బాల్య వివాహాలకు బ్రేక్
ఇచ్ఛాపురం రూరల్ : పదో తరగతి విద్యార్థినికి పెళ్లి చేస్తున్నారన్న సమాచారం మేరకు గెస్ట్ చైల్డ్లైన్ బృందం బాల్యవివాహానికి బ్రేక్ వేసింది. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు ఈ నెల 28న వివాహం చేస్తున్నట్లు 1098 చైల్డ్ లైన్కు వచ్చిన సమాచారం మేరకు గురువారం తహసీల్దార్ కార్యాలయానికి చైల్డ్లైన్ సిబ్బంది వెళ్లారు. బాలిక కుటుంబ సభ్యులను తీసుకొ చ్చి తహసీల్దార్ ఎం.సురేష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నిర్ణీత వయసు వచ్చే వరకు బాలికకు వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెస్ట్ చైల్డ్లైన్ కోఆర్డినేట ర్ జాస్మీన్ కుమారీ, అంగన్వాడీ సూపర్వైజర్ జయలక్ష్మి, ఆర్ఐ కృష్ణప్రసాద్ రౌళో, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, అంగన్వాడీ కార్యకర్త కృష్ణవేణి పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ : మండలంలోని పెదపాడు పరిధిలోని గాంధీనగర్లో శుక్రవారం జరగాల్సిన ఓ వివాహానికి ఐసీడీఎస్, చైల్డ్లైన్ అధికారులు గురువారం అడ్డుకట్ట వేశారు. గాంధీనగర్కు చెందిన 13 ఏళ్ల బాలికను పెదపాడుకు చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు ఇరువర్గాలు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే మే 9న పెదపాడులో జరగాల్సిన మరో బాల్య వివాహాన్ని కూడా అడ్డుకుని ఇరువర్గాల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. -
హాస్టల్లో 17మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం బి.సి. బాలుర వసతి గృహంలో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో 17మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. -
విలువైన ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం
ఇచ్ఛాపురం : కూరగాయల పెట్టెల చాటున గుట్టుగా తరలిస్తున్న ఖైనీ ప్యాకెట్ల బాక్సులను గురువారం ఇచ్ఛాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజా, మిరాజ్ ఖైనీ ప్యాకెట్ల బాక్సులతో వస్తున్న ఏపీ16 టీఏ 0575 నంబరు గల ఎయిచెర్ వ్యాన్, పైలట్గా వ్యవహరిస్తున్న ఏపీ 31 సీడబ్ల్యూ 2488 నంబరు గల మారుతి డిజైర్ కారును ఇచ్ఛాపురం శివారులోని ధనరాజ్ తులసమ్మ ఆలయం సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా కూరగాయల స్ట్రేల మాటున 190 బాక్సుల్లో రూ.8,65,200 విలువైన ఖైనీ ప్యాకెట్ల బాక్సులు కనిపించాయి. ఈ ఘటనలో కోన వెంకట బాల సింహాచలం అలియాస్ శ్రీను, ద్వారపూడి స్వామినాయుడు అలియాస్ బుజ్జి, పెంటకోట శివప్రసాద్ అలియాస్ శివ, లగుడు సత్యనారాయణ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి, బరంపురం నుంచి వీటిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన వ్యాపారి ఈ వ్యానును బుక్ చేసుకొని మాములు సరుకును ఒడిశాకు తీసుకెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఖైనీ పాకెట్లను తీసుకువస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. కొత్తవలస పోలీసులకు కూడా సమాచారం అందించామని తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. గతంలోనూ ఈ వాహనం పట్టుబడి కేసు నమోదైనట్లు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డీఎస్పీ వివేకానంద తెలిపారు. వీరితో పాటు సీఐ అవతారం, ఎస్ఐలు మంగరాజు, చిన్ననాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబు సర్కారుకు పవన్ హెచ్చరిక
-
15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే
- ప్రభుత్వానికి జనసేన అల్టిమేటం - శ్రీకాకుళం కిడ్నీ బాధితులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సహా 11 మండల్లాల్లో కిడ్నీ వ్యాధి సమస్యను ఘోర విపత్తుగా పేర్కొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, కనీసం కారణాలను కనిపెట్టే ప్రయత్నం చేయలేకపోవడం గర్హనీయమని విమర్శించారు. జనసేన ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్.. కిడ్నీ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ’పుష్కరాల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. క్యాపిటల్ కోసం లెక్కలేనంత డబ్బు వెచ్చిస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లా కిడ్నీ బాధితులవైపు మాత్రం కన్నెత్తి చూడటంలేదు. అంతుచిక్కని విధంగా ఏళ్లుగా కొనసాగుతోన్న మరణాలపై కనీసం ఇక్కడి ప్రజాప్రతినిధులైనా మాట్లాడకపోవడం, పరిష్కార మార్గాలపై దృష్టిసారించకపోవడం దారుణం. ఇక్కడి నేతల తీరును జనసేన పార్టీ ఖండిస్తోంది’అని పవన్ కల్యాణ్ అన్నారు. 15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే ఉద్దానం సహా ఇతర మండలాల్లో కిడ్నీ వ్యాధులకు గురైనవారిని ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే ఒక కమిటీని ఏర్పాటుచేసి ఆర్థిక, ఆరోగ్య ప్యాకేజీలు ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధులపై జనసేన ఆధ్వర్యంలో ఐదుగురు డాక్టర్ల కమిటీని ఏర్పాటుచేస్తున్నామని, 15 రోజుల్లోగా ఒక రిపోర్టు తయారు చేయించి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ’మేం రిపోర్టు ఇచ్చిన 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతం’అని ప్రకటించారు. తక్షణ సాయంగా కిడ్నీ బాధిత కుటుంబాల్లో అనాథలైన చిన్నారుల బాధ్యతలను ప్రభుత్వాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్ మండిపడ్డారు. డయాలసిస్ అనేది చికిత్సకాదన్ని ఇంగితం మంత్రికి లేదా? అని ప్రశ్నించారు. ఉద్దానం.. భయంభయం 11 మండలాల్లో 20వేల మరణాలు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన శ్రీకాకుళం కిడ్నీవ్యాధిగ్రస్తుల సమస్య ఈ నాటిదికాదు. 11 మండల్లాలోని 104 గ్రామాల్లో కనీసం 25 వేల మంది కిడ్నీ వ్యాధులకు గురయ్యారు. మరో 20 వేలమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కవిటి మండలం ఉద్దానం, పొందూరు మండలం భగవానుదాసుపురం, పలాస, సోంపేట, టెక్కలి, వజ్రపుకొత్తూరు, కంచిలి, మందస, ఇచ్ఛాపురం, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లో కిడ్నీ రోగులు అధికంగా ఉన్నారు. అసలు ఎందుకీ సమస్య: మూడేళ్ల కిందట హార్వర్డ్ యూనివర్సిటీ బృందం జిల్లాలో కిడ్నీ రోగాలకు గల కారణాల్ని అన్వేషించింది. ఇక్కడి ప్రజలు వినియోగిస్తున్న నీటిలో సిలికాన్ అధిక మోతాదులో ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. ఆతర్వాత పలు యూనివర్సిటీలు, దేశవైద్య బృందం కూడా సర్వేలు జరిపాయి. అయినాసరే, కారణాన్ని కనుగొనలేకపోయారు. కారణాల సంగతి ఎలావున్నా, కిడ్నీ రోగులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయి. జిల్లాలో డయాల్సిస్ యూనిట్లు ఉన్నా.. నెఫ్రాలజిస్టులు లేరు. దీంతో బాధితులు వైద్యం కోసం విశాఖ, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తున్నది. -
రెచ్చిపోతున్న టీడీపీ ఎమ్మెల్యే
-
కట్టుకున్నోడే కాలయముడు!
ఇచ్ఛాపురం: మండలంలోని ఈదుపురంలో వివాహిత హత్య ఘటన సంచలనం రేపుతోంది. గ్రామానికి చెందిన దువ్వు దమయంతి(50) భర్తతో కలిసి జీడి తోటకు వెళ్లి హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆమెను భర్త బైరి హత్యచేసి పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. సోమవారంత రాత్రంతా మృతదేహం వద్ద పోలీసులు కాపలా కాశారు. ఇన్చార్జి సీఐ సూరినాయుడు, రూరల్ ఎస్సై బి.రామారావు మంగళవారం ఉదయం సంఘటన స్థలం వద్దకు వెళ్లి మృతదేహాన్ని నిశితంగా పరిశీలించారు. దమయంతి ఎడమ నుదిటి పైన, తల వెనుక భాగంలో కత్తి లాంటి ఆయధంతో నరికిన గుర్తులున్నాయి. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం దమయంతి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. ఉదయమే హత్య? సోమవారం రాత్రి హత్య గురించి తెలిసినప్పటికీ ఉదయమే జరిగినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దమయంతి, ఆమె భర్త జీడి తోట పనులకు వెళ్తున్నారు. రోజూ కారియర్లో భోజనం తీసుకువెళ్లి మధ్యాహ్నం అక్కడే భోంచేసి, సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. అయితే మృతదేహానికి సమీపంలో కారియర్ ఉంది.అందులో భోజనం అలానే ఉండటంతో భోజనానికి ముందే అంటే తోటకు వెళ్లిన కొద్ది సేపటికే హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చాలా కాలంగా ఇంటిలో తన తల్లిని తండ్రి వేధిస్తున్నాడని, తరచూ తన తల్లి భయం వ్యక్తం చేసేదని దమయంతి కుమార్తె రాజులు తమకు వివరించారని రూరల్ ఎస్సై రామారావు తెలిపారు. భర్త బైరికి గతంలో నేరచరిత్ర ఉందని చెప్పారు. ప్రస్తుతం బైరి పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఇచ్ఛాపురంలో థర్మల్ అంటే పోరాటమే
ఈదుపురం (ఇచ్ఛాపురం): ఇచ్ఛాపురం మండలాన్ని థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదిస్తే, అందుకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేయాలని ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన స్వదేశీ మత్స్యకారులు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మండలంలోని ఈదుపురం గ్రామంలో ఆయా సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్ఛాపురంలోనూ థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తే 5 వేల కుటుంబాలకు చెందిన వేలాది మంది స్వదేశీ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి రోడ్డు పడతారని, ప్రజలను నాశనం చేసే ప్లాంటు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాటానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సోంపేట థర్మల్కు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే, మళ్లీ మరో థర్మల్ ప్లాంటుకు ప్రతిపాదించడం దారుణమన్నారు. ఇచ్ఛాపురం, కవిటి, ఈదుపురం ప్రాంతాల్లో వరుస సమావేశాలు నిర్వహించి థర్మల్ వ్యతిరేక పోరాటానికి కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తీర్మానించుకున్నారు. సమావేశంలో ఇచ్ఛాపురం స్వదేశీ మత్సకారుల సంఘం ప్రతినిధులు మదన్ బెహరా, నవీన్ బెహరా, డైరక్టర్ గుర్నాథ్ బెహరా, మున్సిపల్ కౌన్సిలర్ రవి బెహరా, కిరణ్ కుమార్ బెహరా, ఈదుపురం సంఘం అధ్యక్షుడు తరుణ్ బెహరా, కార్యదర్శి డిల్లేశ్వర బెహరా, పెద్దలు రామచంద్ర బెహరా, రఘునాథ్ బెహరా, భీమ్ సేన్ బెహరా, కవిటి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రామచంద్ర బెహరా, కార్యదర్శి ఎం.త్రినాథ బెహరా, ఉపాధ్యక్షుడు ఎ.కమలలోచన బెహరా, డెరైక్టర్ ఎన్.నరోత్తమ్ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
బీల బూడిదే!
ఇచ్ఛాపురం:మరో బొగ్గుల కుంపటి రాజుకుంది. అసంతృప్తి సెగలు రేపుతోంది. ఉద్యమ జ్వాల రగిలిస్తోంది. ఇప్పటికే ఉద్యమాలు, కాల్పులు, మరణాలతో పచ్చని బీల ప్రాంతంపై గత పాలకులు నెత్తుటి మరకలు అద్దారు. వాటిని తుడిచేస్తామని, గత ప్రభుత్వం ఎన్సీసీ విద్యుత్ ప్లాంట్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మరో విద్యుత్ కుంపటిని బీల ప్రజల గుండెలపై పెట్టేందుకు ప్రయత్నిస్తుండటం ఇక్కడి ప్రజల గుండెలను రగిలిస్తోంది. ఎన్సీసీ ప్లాంట్కు సంబంధించిన 1107 జీవోను రద్దు చేస్తూ నేడో రేపో ఉత్తర్వులు జారీ అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు, ఉద్యమకారులకు ప్రభుత్వ తాజా ప్రయత్నాలు అశనిపాతంగా మారాయి. పిడుగుపాటుకు గురి చేశాయి. సోంపేట, కవిటి మండలాలే కాకుండా మొత్తం ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలంతా ఐక్య పోరాటాలకు సంసిద్ధమవుతున్నారు. పర్యవరణ, మత్స్యకార ఐక్య వేదిక నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఉద్యమ వేడి రగిలిస్తున్నారు. మరోవైపు భూముల స్వాధీనానికి బీల గ్రామాల సర్పంచులు ససేమిరా అంటున్నారు. 70 కి.మీ. పరిధిలో బూడిదే కొత్త ప్లాంట్ ఏర్పాటుకు తెరవెనుక ఇప్పటికే జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. సుమారు 26 గ్రామాల్లో భూసేకరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. దీనివల్ల సుమారు 40వేల మంది ఊళ్లొదిలిపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు ఆరేడువేల మంది ఉపాధి కోల్పోతారని, విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద కారణంగా చుట్టుపక్కల సుమారు 70 కిలోమీటర్ల పరిధిలో పంటపొలాలు నాశనమయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గతంలో 2500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికే భారీ వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది ఇప్పుడు బారువ ప్రాంతంలో ఏకంగా 4వేల మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం ఏర్పాటుకు జపాన్లోని సుమిటొమొ సంస్థతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుకూల సర్పంచ్లతో తీర్మానాలకు ప్రణాళిక కాగా థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు అనుకూలంగా పంచాయతీల్లో తీర్మానాలు చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి చెందిన పలువురు సర్పంచ్ల ద్వారా పంచాయతీ తీర్మానాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే పలువురు సర్పంచులు తీర్మానాలకు అంగీకరించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం దీనిపై స్పందించడం లేదు. కాగా ఎన్సీసీ ప్లాంట్ రద్దుకు ఇప్పటికే పోరాడుతున్న పలు సంఘాలు.. ఇప్పుడు కొత్త ప్లాంట్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. సమష్టిగా పోరాటం చేస్తాం బారువ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పూనుకుంటే దాన్ని ఆపడానికి మండల ప్రజలంతా సమష్టిగా పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకునేది లేదు. -పాతిన శేషగిరి, సోంపేట మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కాంగ్రెస్ గతే పడుతుంది ఎన్సీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టిన గతే, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి పడుతుంది. ప్రాణాలకు తెగించి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిపాదనను విరమించుకోవాలి. - యర్ర తారకేశ్వరరావు, బారువ సర్పంచ్ మత్స్యకారుల జీవనాధారం పోతుంది బారువ ప్రాంతంలో విద్యుత్ కేంద్రం నిర్మిస్తే మత్స్యకారులకు జీవనాధారం పోతుంది. అందువ్ల మత్స్యకారులు, రైతులు ఐక్యంగా పోరాటం చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకోవడం ఖాయం. - సూరాడ చంద్రమ్మ, ఉప్పలాం సర్పంచ్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సహించం ఈ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సహించేది లేదు. గతం నుంచి దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తాజా ఉత్తర్వులు ఈ ప్రాంతవాసుల్ని మరింత కుంగదీస్తున్నాయి. దీనిపై ఉద్యమిస్తాం. -యారడి ఆనందరావు, గోకర్ణపురం సర్పంచ్, కంచిలి మండలం -
బాలికపై లైంగిక దాడి, హత్య!
తులసీగాం(ఇచ్ఛాపురం): అభం, శుభం తెలియని 16 ఏళ్ల యువతి శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇచ్ఛాపురం మండలం తులసీగాంలో సంచలనం సృష్టించింది. అయితే మృగాళ్ల పైశాచానికే బాలిక భవానీ బిసాయి మృతి చెందింద న్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒంటిపై గాట్లు, రక్తపు మరకలు చూస్తే కనీసం ఇద్దరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. లైంగికదాడికి పాల్ప డి ఆతర్వాత హతమార్చారని స్థానికులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... నిరుపేద కుటుంబానికి చెందిన భవానీ తండ్రి చనిపోవడం, తల్లి సోదరుడు రమేష్తో పాటు చెన్నైకు వలస వెళ్లిపోవడంతో నాయనమ్మ పార్వతితో కలిసి తులసీగాంలో పూరింట్లో నివాసముంటోంది. పార్వతి శుక్రవారం పర్లాకిమిడి వెళ్లడంతో భవానీ ఒక్కర్తే ఇంట్లో ఉంది. ఉదయం 8 గంటలకు కుళాయి నీటికోసం వచ్చే భవానీ ఎంతకీ రాకపోవడంతో ఆమె పిన్ని లక్ష్మి ఇంటికి వచ్చి తులపు కొట్టింది. ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఇంటి వెనుక భాగం నుంచి వెళ్లి తాళాలు తీసి లోపలకు వెళ్లగా భవానీ రక్త కారుతూ పడి ఉండడాన్ని చూసి అవాక్కయింది. ఇరుగుపొరుగు వారిని పిలిచి భవానీని మంచం మీదకు చేర్చింది. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించి చూపించగా భవానీ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఇచ్ఛాపురం సీఐ శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ బి.రామారావు సంఘటనా స్థలానికి చేరి స్థానికులను విచారించారు. సాయంత్రం కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్ క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు. మృతదేహం పడివున్న తీరు, ఒంటిపై ఉన్న గాయాలు పరిశీలిస్తే లైంగికదాడి చేసి హతమార్చారన్న అనుమానం కలుగుతోందని స్థానికులు అంటున్నారు. రహస్య భాగాల్లో రక్తపు మరకలు ఉన్నాయని చెబుతున్నారు. భవానీ చేయి, మెడ, జబ్బపై రక్తం మరకలు కనిపించాయి. కుడిచేయి మణికట్టు తాడుతో కట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. కాగా మృతదేహంపై చీమలు పాకుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లోంచి కేకలు వినిపించాయని కొందరు అంటున్నారు. రెండు పూరిళ్ల మధ్య ఉన్న చూరు నుంచి దుండగులు లోపలకు ప్రవేశించి ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసి పర్లాకిమిడి నుంచి భవానీ నాయనమ్మ పార్వతి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపింద్దామనుకుంటే ఇలా జరిగిందని రోదించారు. చెన్నైలో ఉన్న భవాని సోదరుడు,తల్లి స్వగ్రామానికి బయలుదేరారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనకు సంబంధించి ధర్మపురం గ్రామానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాత్రి ఒంటి గంటకు బాలిక ఫొన్లో మిస్డ్ కాల్ ఉందని, దాని ఆధారంగా కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సంఘటనను గూర్చి ముందుగా అందరికి సమాచారం ఇచ్చిన మరో యువకుడుపై కూడా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ యువకుడు శనివారం రాత్రి గ్రామం నుంచి పరారైనట్లు తెలిసింది. అనుమానాస్పద స్థితిలో మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. -
6 గంటలు.. రూ.1.48 లక్షలు!
ఇచ్ఛాపురం: శనివారం అర్ధరాత్రి.. సమయం 1.30 గంటలు దాటింది..అది ఇచ్ఛాపురం సమీపంలోని పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర ఉమ్మడి చెక్పోస్టు ప్రాంగణం..వాహనాలు వస్తున్నాయి.. ఆగుతున్నాయి.. కొందరు కౌంటర్ల వద్దకు వెళ్లి ముడుపులు ముట్టజెబుతున్నారు.. పత్రాలపై ఆమోద ముద్రలు వేయించుకుంటున్నారు. వాహనాలు ముందుకు కదులుతున్నాయి. షరా మాములే అన్నట్లు ఈ వ్యవహారం సాఫీగా సాగిపోతోంది..ఇంతలో నాలుగు వాహనాలు వచ్చి అక్కడ ఆగాయి.. వాటిలోంచి దిగిన వ్యక్తులు.. వెనువెంటనే చెక్పోస్టు ప్రాంగణంలోకి చొచ్చుకుపోయారు. వీరిని గమనించిన కొందరు పరుగులు తీశారు. మరికొందరు దొరికిపోయారు. వచ్చినవారు ఏసీబీ అధికారులని కొన్ని క్షణాల్లోనే అందరికీ తెలిసిపోయింది. దాంతో ఒకటే కలకలం. సిబ్బందిగా మారి పరిశీలన విశాఖపట్నం, విజయనగరం ఏసీబీ డీఎస్పీలు నర్సింహారావు, సి.హెచ్.లక్షీపతిల ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, సుమారు 25 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు నాలుగు ప్రత్యేక వాహనాల్లో నేరుగా చెక్పోస్టు ఆవరణకు చేరుకున్నారు. ఎప్పుడూ పట్టణంలోని రహదారి గుండా వచ్చే అధికారులు.. ఈసారి జాతీయ రహదారి మీదుగా వచ్చారు. వారి రాకను గమనించిన దళారులు, ప్రైవేటు వ్యక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆవరణ బయటే ఉన్న మార్కెట్ కమిటీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కౌంటర్ల సిబ్బంది కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. కాగా అదే ఆవరణలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అధికారులు అదపులోకి తీసుకున్నారు. అనంతరం చెక్పోస్టు లోపల ఉన్న వివిధ విభాగాల కౌంటర్ల వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందితో కలిసిపోయారు. తాము సిబ్బందిలాగే అక్కడ ఉండి పరిశీలన మొదలుపెట్టారు. ఇదేమీ తెలియని వాహనాల సిబ్బంది కౌంటర్ల వద్దకు వచ్చి ఎప్పటి మాదిరిగానే మామూళ్లు చెల్లించుకొని.. తమ పత్రాలపై రాజముద్రలు వేయించుకొని వెళ్లిపోవడాన్ని గమనించారు. ఇలా ఉదయం ఆదివారం ఉదయం 7.30 గంటల వరకు పరిశీలించగా రూ.1.48 లక్షలు వసూలయ్యాయి. తనిఖీల జాప్యంతో లారీల సిబ్బంది అసంతృప్తి ఏసీబీ దాడుల కారణంగా పత్రాల తనిఖీ ఆలస్యంగా సాగుతుండటంతో వాహనాల సిబ్బంది పెద్ద సంఖ్యలో నిలిచిపోయారు. వారంతా అసంతృప్తితో కేకలు వేయడంతో కౌంటర్ల వద్ద గందరగోళం ఏర్పడింది. అయితే ఏసీబీ దాడుల విషయం తెలుసుకొని మౌనం వహించారు. కాగా మార్కెట్ కమిటీ, ఎక్సైజ్ కౌంటర్ల సిబ్బంది పరారు కావడంతో తనిఖీలకు ఎవరూ లేకుండాపోయారు. దాంతో కొందరు వాహనాల డ్రైవర్లే పత్రాలపై స్టాంపులు కొట్టుకొని వెళ్లిపోయారు. అక్రమ వసూళ్లు పునరావృతం:ఏసీబీ డీఎస్పీ ఈ సందర్భంగా విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ గతంలో మూడుసార్లు వరుసగా దాడులు నిర్వహించడంతో అక్రమ వసూలు తగ్గినా.. మళ్లీ కొద్దికాలానికే పెరిగిపోయాయన్నారు. తాజా దాడుల్లో రూ.1.48 లక్షలు దొరకడం దీన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఈ దాడుల్లో ఐదుగురు అనధికార సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు వి.రమణమూర్తి, రమేష్, రామకృష్ణ, లక్ష్మోజీ, గణేశ్, అజాద్లు పాల్గొన్నారు. దాడులు దాడులే.. దందా దందాయే అక్రమ వసూళ్లు.. దళారుల దందా చెక్పోస్టుకు షరా మామూలే. ఏసీబీ దాడులు జరిగినప్పుడు కొద్దిరోజులు తోకముడవడం.. తర్వాత యథాప్రకారం దందా సాగించడం ఇక్కడ నిత్యకృత్యం. ఏడు నెలల క్రితం వరుసగా మూడుసార్లు దాడులు చేసి చెక్పోస్టు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తించినా వారిలో మార్పు రాలేదని ప్రస్తుత వసూళ్లు స్పష్టం చేశాయి. గత ఏడాది డిసెంబర్ 21న జరిపిన దాడుల్లో రూ.2.15 లక్షలు, అదే నెల 29 నాటి దాడుల్లో రూ.1.25 లక్షలు లభించగా.. ఈ ఏడాది జనవరి 18న జరిపిన దాడుల్లో కేవలం రూ.6వేలు మాత్రమే పట్టుబడ్డాయి. అలాగే మొదటి దాడిలో 5గురు చెక్పోస్టు సిబ్బంది, పదిమంది అనధికార వ్యక్తులపై కేసులు నమోదు చేయగా, రెండో దాడిలో 6గురు చెక్పోస్టు సిబ్బంది, 7గురు అనధికార వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. దీంతో వసూళ్ల దందా తగ్గిందనుకున్నారు. కానీ అది తప్పని తాజా దాడుల్లో వెల్లడైంది. దీంతో మళ్లీ వరుస దాడులు తప్పవేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరచూ దాడులు నిర్వహిస్తే తప్ప మామూళ్ల సంస్కృతికి అడ్డుకట్ట పడదన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. -
సౌదీలో ఏఎస్పేట వాసి మృతి
ఇచ్ఛాపురం : మున్సిపాల్టీ పరిధిలోని అమీన్సాహేబ్ పేట గ్రామానికి చెందిన సాలిన గోపాల్ (34) సౌదీఅరేబియాలో అనుమానస్పద స్థితిలో ఆదివారం మరణించాడు. ఈ విషాదవార్త ఆదివారం రాత్రి గోపాల్ కుటుంబీకులకు తెలిసింది. అయితే గోపాల్ మృతదేహాం తమ గ్రామానికి వస్తుందో తెలియక అతని కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. గోపాల్ తో కొంత కాలం పనిచేసి ప్రస్తుతం ఇక్కడే ఉన్న సాలిన సంతోష్, గోపాల్ కుటుంబ సభ్యులు, 3 వ వార్డు కౌన్సిలర్ సాలిన ఢిల్లీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.సౌది అరేబియా లొజుబేలా అనే ప్రాంతంలో ఎన్ఎస్హెచ్ కంపెనీలో గోపాల్ రిగ్గర్ గా పనిచేస్తున్నాడు. గతంలొ రెండేళ్ళు పనిచేసిన గోపాల్ కొద్దికాలం కిందటే దేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి గ్రామంలో కుటుంబం వద్ద ఉన్నాడు. రెండు నెలల కిందటే మరలా సౌదీ అరేబియా వెళ్ళాడు.ఆదివారం మధ్యాహ్నం విదుల్లో ఉండగా ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురై మరణించాడు.ప్రస్తుతం జుబేలాకు సమీపంలో ఉన్న దమల్ ప్రాంతంలోని ఉన్న ఆసుపత్రిలో ఆతని మృత దేహం ఉన్నట్లు చెప్పారు. సౌదీలొ ఉన్న స్థానిక కొళిగాం ప్రాంతానికి చెందిన రాపాక మోహనరావు తమకు సమాచారం అందించాడని తెలిపారు.గోపాల్ మృతికి సంబంధించిన ఎలా మరణించాడనే ఖచ్చితమైన సమాచారం లేదని,అక్కడ అధికారులు గోపాల్ మృతదేహాన్ని దేశానికి పంపిస్తారో లేదో అనే ఆందోళనలో కుటింబీకులు ఉన్నారు. జిల్లాలోని వివిద ప్రాంతాలకు చెందిన సుమారు 3 వందల మంది తెలుగువారు అక్కడ ఉన్నారని,గోపాల్ మృతదేహాన్ని భారతదేశం పంపాలని వారు అక్కడ యాజమాన్యం పై ఒత్తిడి చేసి,అవసరమైతే సమ్మెకు దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వదేశం తీసుకువచ్చేలా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. గోపాల్కు భార్య ఈశ్వరమ్మ కుమారులు హరి(8),హేంబాబు (5)కుమార్తె ప్రవల్లిక (6) తల్లి నూకాలమ్మ ఉన్నారు. -
ఈసీ తీరుపై సెల్ టవర్ ఎక్కిన ఎమ్మెల్యే అభ్యర్థి
ఎన్నికల సంఘం తనకు కేటాయించిన గుర్తు ఒక్కటైతే....బ్యాలెట్ పేపర్లో మరో గుర్తు ముద్రించారంటూ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఆందోళనకు దిగాడు. ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా సెల్ టవర్ ఎక్కాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా జాన్సన్ ఎన్నికల బరిలోకి దిగాడు. అయితే అతడికి ఎన్నికల సంఘం పెన్ గుర్తు కేటాయించింది. కానీ .... బ్యాలెట్ పేపర్లో మాత్రం జాన్సన్ పేరు ఎదుట పెన్ స్టాండ్ గుర్తు ముద్రించి ఉండటంతో అతడు ఆందోళన చెందాడు. ఓ గుర్తు కేటాయించి మరో గుర్తు ఎలా ముద్రిస్తారంటూ జాన్సన్ ఉన్నతాధికారులను ప్రశ్నించాడు. అందుకు వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో... ఈసీ తీరుకు నిరసనగా ఆదివారం స్థానిక సెట్ టవర్ ఎక్కి తన ఆందోళన వ్యక్తం చేశాడు. -
రెండు నెలలు ఓపిక పట్టండి
మీ కష్టాలన్నీ తీరుస్తా ప్రజలకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్ఛాపురంలో రోడ్షోకు ప్రజల బ్రహ్మరథం ఉత్కళాంధ్ర సీమలో జన నేతకు నీరాజనం జాతీయ రహదారిపై వెల్లువెత్తిన జనాభిమానం శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని ఉత్కళాంధ్ర సాంస్కృతిక సీమ ఇచ్ఛాపురంలో పర్యటించారు. మున్సిపాలిటీలోని ఇరుకు వీధుల్లో కూడా ఆయన పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇచ్ఛాపురం పట్టణంలో రోడ్ షో ప్రారంభించింది మొదలు సాయంత్రం వరకు పోటెత్తిన జనప్రవాహం మధ్య ఆయన పర్యటన సాగింది. జగన్ను చూసేందుకు.. పలకరించేందుకు మహిళలు, వృద్ధులు భారీగా తరలి వచ్చారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా తన కోసం వచ్చిన వారందరితో జగన్ మనసారా మాట్లాడారు. ‘నాలుగున్నరేళ్లుగా మీరు పడుతున్న బాధలు తెలుసు. రాష్ట్రమంతా తిరిగి కళ్లారా చూశాను. రెండు నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. పేదలందరి బాధలు తీరుస్తా’ అని భరోసా కల్పించారు. జగన్ను చూడాలని.. జగన్మోహన్రెడ్డి తమ వద్దకు వస్తున్నారని తెలిసి.. ఆయనను చూడాలని ఇచ్ఛాపురంలో నాగుల గంగు(102) అనే వృద్ధురాలు అతి కష్టం మీద ఇంటి బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఆయన కాన్వాయ్ వెళ్లిపోయింది. దాంతో నిరాశతో కూర్చుండిపోయిన నాగుల గంగును ఒక యువకుడు చేతులపై మోసుకుని జగన్ వాహనం వద్దకు తీసుకువెళ్లగా... ఆమెను చూసిన జగన్మోహన్రెడ్డి వాహనం దిగి దగ్గరకు వెళ్లారు. తనకు రూ.200 మాత్రమే పింఛను వస్తోందని, అది సరిపోవడం లేదని చెప్పిన ఆమెతో... ధైర్యంగా ఉండవ్వా.. నీకు రూ.700 పింఛన్ నేను ఇస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇచ్ఛాపురం దాసన్నపేటలో సరోజ అనే మహిళ వచ్చి తన వికలాంగ కుమారుడు హిమతేజకు ఇస్తున్న పింఛన్ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఆమెకు జగన్ ధైర్యం చెబుతూ తాను అధికారంలోకి రాగానే పింఛను రూ.1,000కు పెంచుతానని చెప్పారు. కండ్ర వీధిలో కండ్ర కులస్తులు కలిసి తమను ఎస్సీల్లో చేర్చాలని కోరగా..‘‘తప్పకుండా ఎస్సీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటాను. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాను’’ అని హామీ ఇచ్చారు. వెల్లువెత్తిన జనసందోహం.. జగన్మోహన్రెడ్డి రోడ్షో సందర్భంగా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ జన జాతరను తలపించింది. మున్సిపాలిటీలోని 23 వార్డుల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు. దాంతో కాన్వాయ్ ముందుకు సాగడమే గగనమైపోయింది. ఇచ్ఛాపురం దాసన్నపేట నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంతానికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ప్రజాభిమానం వెల్లువెత్తిందో తెలుస్తోంది. కండ్ర వీధి, కస్పా వీధి, బ్రాహ్మణ వీధి, పంజా వీధి, కాపు వీధి, హరిజన వీధుల మీదుగా రోడ్ షో సాగింది. అప్పటికే సమయం మించిపోవడంతో రోడ్షోను ముగించాలని భావించారు. కానీ ఉప్పాడ వీధి, బెల్లుపడలకు చెందిన ప్రజలు వచ్చి తమ ప్రాంతానికి రావల్సిందేనని పట్టుబట్టారు. అప్పటికే మధ్యాహ్న భోజన వేళ మించిపోయింది. అయినా వారి మాట కాదనకుండా జగన్ ఉప్పాడ వీధి, బెల్లుపడ వెళ్లారు. రోడ్షో ముగించిన అనంతరం శ్రీకాకుళం మీదుగా విశాఖపట్నానికి బయలుదేరారు. జాతీయరహదారిపై పలుచోట్ల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి జగన్ను చూసేందుకు పోటీ పడ్డారు. దాంతో ఆయన తన వాహనాన్ని ఎక్కడికక్కడ ఆపి కిందకు దిగి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అలా లొద్దపుట్టి, శిలగాం, మఖరాం పురం జంక్షన్, అంపురం జంక్షన్, పలాసపురం, కొర్లాం తదితర చోట్ల వేలాదిగా ప్రజలు తరలివచ్చి జగన్కు ఘనంగా వీడ్కోలు పలికారు. నీ వైద్యానికి నాదీ భరోసా సుభాష్చంద్ర, ప్రమీల అనే పేద దంపతులు ఇచ్ఛాపురంలో జగన్ను కలిసి ‘‘అన్నా... మా పాప కాళ్లు చచ్చుబడి ఇంట్లో ఉంది. ఒకసారి వచ్చి చూడన్నా..’’ అని కోరడంతో జగన్ వెంటనే వాహనం దిగి వారి ఇంటికెళ్లారు. రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన వారి కుమార్తె సుమిత్రా నందాను చూసి చలించిపోయారు. ఏమైందని అడిగారు. ఏదో వ్యాధి సోకి తమ అమ్మాయి నడుం నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయాయని వారు చెప్పారు. రూ.లక్ష అప్పు చేసి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. ‘నాకూ అందరిలో నడవాలని ఉంది సార్’అని సుమిత్ర అనడంతో చలించిపోయిన జగన్.. లోక్సభ అభ్యర్థి రెడ్డి శాంతి, పార్టీ నేత నర్తు రామారావులకు ఆ అమ్మాయి బాధ్యత అప్పగించారు. ఆమెకు కావల్సిన వైద్యం చేయించాలని చెప్పారు. తాము పిలిచిన వెంటనే వచ్చి.. ఆదుకుంటామని మాటిచ్చారంటూ సుభాష్ నందా, ప్రమీల కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. -
డిగ్రీ ప్రశ్నపత్రం తారుమారు
కంప్యూటర్ కోర్సుకు బదులు కంప్యూటర్ స్కిల్స్పేపరు పంపిణీ ఆందోళనలో ఫస్టియర్ విద్యార్థులు ఇచ్ఛాపురం,న్యూస్లైన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న మొదటి సంవత్సవరం డిగ్రీ పరీక్షలలో ప్రశ్నాపత్రం మారడంతో విద్యార్థులు ఇబ్బంది పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా రాత్రి వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా కంప్యూటర్ కోర్సు పేపరు రాయల్సి ఉండగా, వారికి కంప్యూటర్ స్కిల్స్ పేపరు అందజేశారు. దీంతో విద్యార్థులు చూసుకోకుండా ఆ సబ్జెక్టు పేపరుకు పరీక్ష కూడా పూర్తి చేశారు. పరీక్ష పూర్తై తర్వాత జరిగిన పొరపాటును గ్రహించిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు రాసిన సమాధానాల పత్రాలకు వారు రాసిన ప్రశ్నాపత్రాన్నే జత చేసి బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి పంపారు. డిగ్రీ జనరల్ విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు పేపర్, వోకేషనల్ విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పేపరు ఇవ్వాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు కూడా ఇక్కడే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం సుమారు 550 మంది విద్యార్థులకు 13 గదుల్లో పరీక్ష నిర్వహించారు. జనరల్ విద్యార్థులున్న ఒక పరీక్ష గదిలో కంప్యూటర్ కోర్సుకు బదులు కంప్యూటర్ స్కిల్స్ ప్రశ్నాపత్రం ఇచ్చారు. వారు పరీక్ష కూడా రాసి సమాధానపత్రాలిచ్చిన తర్వాత జరిగిన పొరపాటు తెలుసుకున్నారు. దాంతో చాలా మార్కులు కొల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్ రోబిన్కుమార్ పాడి వివరణ ఇస్తూ ప్రశ్నాపత్రం మారిన మాట వాస్తవమేనన్నారు. కొన్ని పరీక్ష గదుల్లో విద్యార్థులు పొరపాటును గమనించి చెప్పడంతో వారికి సరైన ప్రశ్నాపత్రం అందజేశామని, మరో గదిలోని విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత పొరపాటును గమనించి తమ దృష్టికి తెచ్చారన్నారు. వెంటనే బీఆర్ఏయూ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ప్రశ్నాపత్రం మారినా సుమారు 60 శాతం ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదన్నారు. -
3 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు
శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు. ఇచ్ఛాపురం అసెం బ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ ఏకైక సమన్వయకర్తగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియమితులయ్యారు. అదే విధంగా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా రెడ్డి శాంతిని నియమించారు. ఇక ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నర్తు నరేంద్రయాదవ్ నియ మితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిద్దరిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ధర్మాన ప్రసాదరావు జిల్లాలో 30 ఏళ్లుగా కీలక రాజకీయ నేతగా ఉన్నారు. 1989, 1999 ఎన్నికల్లో నరసన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన శ్రీకాకుళం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్. ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. అనంతరం రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన రెడ్డి శాంతి కూడా జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారే. ఆమె సీనియర్ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం కుమార్తె. రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు ఐఎఫ్ఎస్ అధికారిగా ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఈమె ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఇచ్ఛాపురం ఏకైక సమన్వయకర్తగా నియమితులైన నర్తు నరేంద్ర ఇటీవలి వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు. ధర్మా న ప్రసాదరావు, రెడ్డి శాంతి, నర్తు నరేంద్రల నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. -
హస్త విధీ!
జయజయ ధ్వనాలు.. నేతల అడుగులకు మడుగులొత్తే అనుచరగణంతో నిన్నటివరకు అధికార భోగం అనుభవించిన కాంగ్రెస్ నేడు పిలిచినా పలికే నాథుడు లేని దీనావస్థలోకి జారుకుంది. ఎన్నికల్లో అవకాశం కోసం నిన్నటి వరకు వెంపర్లాడిన కాంగ్రెస్ శ్రేణులు నేడు ఆ ఊసెత్తితేనే ఆమడ దూరం పారిపోతున్నారు. కనిపిస్తే.. ఎక్కడ బలవంతంగా పోటీలోకి దింపుతారోనన్న భయంతో ముఖం చాటేశారు. అనేక మంది వేరే దారులు వెతుక్కుంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం జిల్లాలో కాంగ్రెస్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకత వార్డుస్థాయి ఎన్నికల్లో సైతం నిలబడేందుకు వెనుకంజ వేసేలా చేసింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో చాలా వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులు లేకపోవడమే దీనికి నిదర్శనం. శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో పలు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ఏకంగా మూడు చోట్ల అత్యధిక వార్డుల్లో నామినేషన్లు వేయలేని దుస్థితిలో పడిపోయింది. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 91 వార్డులుండగా, వాటిలోని 31 వార్డుల్లో ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డుల్లో దొరకని అభ్యర్థులు..! కనీసం వార్డు బరిలో దిగేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణు లు ముందుకు రాకపోవడంతో జిల్లా కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసిపోగా.. చివరి క్షణం వరకు అభ్యర్థుల కోసం ఈ పార్టీ నేతలు ప్రయత్నాలు సాగించినా ఫలితం లేకపోయింది. ఇచ్ఛాపురంలో 1, 2, 3, 19, 21, 22.. మొత్తం ఆరు వార్డుల్లో, పలాస-కాశీబుగ్గలో 1, 2, 6, 8, 12, 15, 17, 19, 20.. మొత్తం 9 వార్డుల్లోనూ, పాలకొండ నగర పంచాయతీలో అత్యధికంగా 1, 2, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17.. మొత్తం 13 వార్డుల్లోనూ, ఆమదాలవలసలో 3, 7, 23.. మొత్తం మూడు వార్డుల్లోను కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. వీటిలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మున్సిపాలిటీలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం పరిధిలోవే కావడం విశేషం. గతంలో ఎన్నడూ లేనివిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కొరత, కాంగ్రెస్ పతనావస్థను స్పష్టం చేస్తోంది. గతంలో ఇదే కాంగ్రెస్ తరపున వార్డు స్థానాల కోసం పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో వివాదాలు, గొడవలు జరిగిన విషయం విదితమే. తాజా పరిణామల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుగానే నామినేషన్ల దశలోనే కాడి దించేసినట్లేనని ఆ నేతలే అంగీకరిస్తునారు. రాష్ట్ర విభజన అంశమే తమ కొంప ముంచిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మద్దతిచ్చేందుకు సిద్ధం కావడంతో రాన్ను మున్సిపల్తో పాటు సాధారణ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గడ్డు పరిస్థితులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
వారిద్దరు ప్రేమించుకున్నారు. కానీ పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఈలోగా యువకుడికి పెళ్లి కుదిరింది. దాంతో కలిసి జీవించలేనప్పుడు.. కలిసి తనవు చాలించాలనుకున్నారు. పురుగుల మందు తాగారు. చివరికి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇచ్ఛాపురం, న్యూస్లై న్: ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించలేక క్షణికావేశంలో ఓ ప్రేమ జంట పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందులో ప్రేమికుడు తనువు చాలించగా, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో వైద్యసేవలు పొందుతోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలో గొల్లవీధికి చెందిన సాలిన యోగేశ్వరరావు, ఫకీరుపేటకు చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలియకపోవడంతో యోగేశ్వరరావుకు ఇటీవల మేనకోడలితో నిశ్ఛితార్థమైంది. మే నెలలో పెళ్లి జరిపేందుకు పెద్దలు ముహూర్తం కూడా నిర్ణరుుంచారు. దీంతో కలత చెందిన ప్రేమికులిద్దరూ నిరాశకు గురయ్యూరు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణరుుంచుకుని ఫకీరుపేటలోని ప్రియురాలి అమ్మమ్మ ఇంటి వెనుక గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో పురుగుల మందు సేవించారు. ఈ విషయూన్ని రాత్రి 2 గంటల సమయంలో ప్రియుడి స్నేహితులకు ప్రియురాలు ఫోన్ చేసి తెలిపింది. దీంతో స్నేహితులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రియుడు శుక్రవారం వేకువజామున మృతిచెందాడు. ప్రియురాలిని మెరుగైన వైద్యసేవల కోసం బరంపురం మెడికల్ సెంటర్కు తరలించారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో వైద్యసేవలు పొందుతోంది. మృతుడు యోగేశ్వరరావు తండ్రి చనిపోగా తల్లి దానమ్మ, తమ్ముడు ఢిల్లీరావులు ఉన్నారు. ఉపాధి కోసం విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. ప్రియురాలిది ఒడిశా రాష్ట్రం. ఫకీరుపేటలోని అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. మృతుడి సోదరుడు ఢిల్లీరావు ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్ఐ రాము కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు చంద్రబాబు పర్యటన
శ్రీకాకుళం టౌన్, న్యూస్లైన్ : ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శనివారం పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు చంద్రబాబు ఇచ్ఛాపురం చేరుకుంటారని, అక్కడ పర్యటించాక పలాస నియోజకవర్గానికి వెళతారని వివరించారు. సాయంత్రం శ్రీకాకుళంలో పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేస్తారని, ఆదివారం ఉదయం శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గా ల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో సంభవించిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, కింజరాపు రామ్మోహన్ నాయుడులు మాట్లాడుతూ సీఎం కిరణ్ జిల్లా పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. నష్టాల అంచనాలో రాజకీయ జోక్యం ఉండడం దురదృష్టకరమన్నారు. గుర్తింపు కార్డుల్లేని మత్స్యకారులకు నష్టపరిహారం అందించటంలో అన్యాయం జరుగుతోందన్నారు. సమావేశంలో కొర్ను ప్రతాప్, పి.వి.రమణ, మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, ఎస్వీ రమణ మాదిగ, అరవల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నిరాశ నడుమ.. జిల్లాలో చంద్రబాబు పర్యటన నిరాశ నిస్పృహల నడుమ సాగుతుం దనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆయన పర్యటనకు పార్టీ క్యాడర్ దూరంగా ఉండనుందని సమాచారం. సమైక్యాంధ్ర విషయంలో స్పష్టత ఇవ్వని ఆయనకు మద్దతివ్వడం సరికాదని కార్యకర్తలు భావిస్తున్నారు. ఫలితంగా ఆయనకు చేదు అనుభవం ఎదురవక తప్పదని పరిశీలకులు అంటున్నారు. సమైక్యవాదులు ఆయన పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాగా, శ్రీకాకుళంలో చంద్రబాబు నిర్వహించనున్న సమీక్షకు సైతం దూరంగా ఉండాలని కొందరు నాయకులు భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధినేత ఏకపక్ష ధోరణే దీనికి కారణమని సమాచారం. అంతేకాకుండా కిమిడి, కింజరాపు వర్గాల ఆధిపత్య పోరులో నలిగిపోతున్నామని మరికొందరు వాపోతున్నారు. -
మరో ఇండోనేసియాగా సీమాంధ్ర
గుడివాడ/బాపట్ల, న్యూస్లైన్: తడ నుంచి ఇచ్ఛాపురం వరకు ఎనిమిది లైన్ల రోడ్డు వేసేందుకు కేంద్రప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. ఆ రోడ్డు పూర్తయితే సీమాంధ్ర మరో ఇండోనేసియాగా మారుతుందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ, గుంటూరు జిల్లా బాపట్లల్లో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడాలని కోరారు. సీమాంధ్రలో పలు సంస్థలు స్థాపించాలని జీవోఎంను కోరినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్ను యూటీ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచే కాంగ్రెస్ తరఫున పోటీచేస్తానని, కాంగ్రెస్లోనే కొనసాగుతానని మంత్రి స్పష్టం చేశారు. -
ఇచ్చాపురంలో పర్యటిస్తున్న విజయమ్మ
శ్రీకాకుళం :పై-లిన్ తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారు శ్రీకాకుళం చేరుకున్నారు.ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆమె పర్యటన కొనసాగుతోంది. ఇచ్చాపురం నియోజకవర్గం కంచలి వెళ్తారు. ఆ మండలంలోని పెద్దకొజ్జిరియా, జాడుపూడి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం కవిటి మండలం రాజపురం, జగతి, ఇద్దివానిపాలెంతోపాటు కళింగపట్నం వెళ్తారు. అక్కడి నుంచి సోంపేట మండలం ఇసుకలపాలెం చేరుకొని అటు తరువాత తలతంపర మీదుగా బారువ వెళ్తారు. ఆయా ప్రాంతాల్లో తుఫాన్ నష్టాలను పరిశీలించడంతోపాటు బాధితులను పరామర్శించి వారి కష్టనష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. విజయమ్మతో పాటు పార్టీ నేతలు ధర్మాన కృష్ణాదాసు, కొణతాల రామకృష్ణ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంతకు ముందు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విజయమ్మకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణం మారుమ్రోగింది. వారందరికీ అభివాదం చేస్తూ విజయమ్మ శ్రీకాకుళం పర్యటనకు బయల్దేరారు. -
వైఎస్ఆర్ కుటుంబంపై వెల్లువెత్తిన అభిమానం
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్ కుటుంబంపై రాష్ట్ర ప్రజలు అభిమాన వర్షం కురిపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కుఠిల, కుతంత్రాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు బాసటగా రాష్ట్రంలో సాగించిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన జ్ఞాపిక వద్ద ఏర్పాటు చేసిన సభ జన సందోహంతో నిండిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జనం ఇచ్ఛాపురానికి తలిరావడం ప్రారంభించారు. పాదయాత్రలో ఉన్న షర్మిల నేరుగా సాయత్రం నాలుగు గంటలకు విజయప్రస్థాన స్థూపం వద్దకు చేరుకున్నారు. తండ్రి వైఎస్ ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన స్థూపం వద్ద రాజన్నకు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ విగ్రహంతో ఏర్పాటు చేసిన విజయప్రస్థాన స్థూపాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా వేదిక మీదకు వచ్చారు. అప్పటికే వేదిక జనంతో నిండిపోయింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. షర్మిలతో పాటు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేసిన వారు ఆమె వెన్నంటే ఉన్నారు. నేతల ప్రసంగాలు పూర్తయిన తరువాత కూడా జనం అలాగే నిల్చుండిపోయారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడిన తరువాత షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, చేపట్టిన పథకాలు, విజయవంతమైన తీరును ఒక్కొక్కటిగా షర్మిల వివరించారు. ప్రజలపై ఎటువంటి భారం పడకుండా ఐదేళ్ల కాలం వైఎస్ ప్రజల కోసం ఏమిచేశారో కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆయన మరణించారనే వార్త వినగానే ప్రతి కుటుంబం తన ఇంటి పెద్దను కోల్పోయామనే బాధతో ఎంతో మంది మరణించారని షర్మిల పేర్కొన్నారు. ప్రజలకు ఏమి అవసరమో, ఎలా చేస్తే ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉంటారో ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టారని, ఆ పథకాల ద్వారా ప్రతి కుటుంబం సుఖంగా జీవించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ రెక్కల కష్టంమీద వచ్చిందనే విషయాన్ని ఈపాలకులు గుర్తించకుండా ఆయన చనిపోయిన తరువాత అతని పేరును ఎఫ్ఆర్లో చేర్చి దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పూ చేయని జగనన్నను కూడా అకారణంగా జైలులో పెట్టి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని నెలలు జైలులో ఉంచినందుకు సీబీఐని దోషిగా గుర్తించాలని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్రలను ఛేదించేందుకు ప్రజలే న్యాయనిర్ణేతలు కావాలని పిలుపు నిచ్చారు. ప్రజా కోర్టులోకి వచ్చి ఢీకొనే సత్తా కాంగ్రెస్కు కాని, దానికి కొమ్ముకాస్తున్న టీడీపీకి కాని లేదని స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతానికి నష్టం చేకూరే విధంగా వ్యవహరించిందని, అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందిన తరువాత విడగొడితే బాగుండేద నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతలు గాజులు తొడుక్కొని కూర్చున్నారా? అంటూ అనడంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించివేదిక వద్ద నుంచి జనం జేజేలు పలుకుతూ జిందాబాద్లు కొట్టారు. విభజన జరిగిన తరువాత హైదరాబాద్లో బతకడం అంటే పాకిస్థాన్లో బతకడమే అవుతుందన్నారు. ఓ తండ్రి అన్నదమ్ములకు భాగ పంపకాలు చేయాలంటే అందరినీ సమాన దృష్టితో చూస్తాడని, ఈ పాలకులు అలా కాకుండా వ్యత్యాసాలు చూపారన్నారు. పలు అంశాలపై సమగ్రమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడని, నిజం చెబితే ఆయన తల ముక్కలవుతుందని శాపం ఉందని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం జనాన్ని ఉద్వేగానికి గురిచేసింది. తన భర్త జనం గురించి నిత్యం ఆలోచించారు. ఆయన మరణానంతరం జగన్ మీ వద్దకు వచ్చారు. ఆయనను మీ నుంచి కాంగ్రెస్ వారు దూరం చేశారు. నా బిడ్డలను మీ చేతుల్లో పెట్టాను, వారిని ఆదరించి అక్కున చేర్చుకోమని చెప్పాను. షర్మిలను మీచేతుల్లో పెట్టాను. మరోప్రజా ప్రస్థానంలో నా బిడ్డ జీవితంలో ఎన్నో మలుపులు సంభవించాయి. వైఎస్ అపురూపంగా షర్మిలను పెంచుకున్నాడు. షర్మిలకు గాయమైనప్పుడు పడిన బాధను చూసినప్పుడు నాకు చాలా చాలా కష్టమనిపించింది. నా మనస్సు అప్పుడు చాలా బాధపడింది అంటూ ఉద్వేగానికి గురయ్యారు. అమ్మా ఎంత మంచి బిడ్డలను కన్నావమ్మా ఎంతైనా పులిబిడ్డ పులిబిడ్డలేనమ్మ అంటూ జనం అంటుంటే నాకు కళ్ళ నిండా నీళ్లు వచ్చినా సంతోషంగా ఉండేది. అందుకే షర్మిల జగన్ సంధించిన బాణంగా రాష్ర్టంలో పాదయాత్ర చేసిందన్నారు.షర్మిల వేదక వద్దకు మరో ఐదు నిమిషాల్లో వస్తుందనగా పావుతక్కువ నాలుగు గంటల సమయంలో పూల వర్షం కురిసింది.జనం కేరింతలు కొట్టారు. ఇచ్ఛాపురంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని విజయమ్మ వివరించారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వంశీకృష్ణ యాదవ్, కొయ్యప్రసాదరెడ్డి, చెంగల వెంకటరావు, ఉషాకిరణ్, బలిరెడ్డి సత్యారావు, గండి బాబ్జీ, బి.సూర్యారావు, జహీర్ అహ్మద్, తిప్పలనాగిరెడ్డి, ఎస్.రవిరాజు, కోలా గురువులు, పూడి మంగపతిరావు, వంజంగి కాంతమ్మ, కిలారి సర్వేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్, కోరాడ రాజబాబు, పెట్ల ఉమాశంకర్, కొత్తపల్లి గీత, భూపతిరాజు శ్రీనివాసరాజు, సత్తిరామకృష్ణారెడ్డి, కాకర్లపూడి శ్రీకాంతరాజు, బి.పూలరెడ్డి, దాడి రత్నాకర్, గొలగాని శ్రీనివాసరావు, ఏఆర్కె రాజు, గల్ల అప్పారావు, ఎన్.శివారెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, చిక్కాల రామారావు, ప్రభాగౌడ్, రవిరెడ్డి, కంపా హనుక్, ఎం.మనోజ్బాబు, గంపల గిరిధర్విజయనగరం జిల్లా నేతలు పెనుమత్స సాంబశివరాజు, అవనాపు విజ య్, గురాన అయ్యలు, కడుబండి శ్రీనివాసరావు, పెనుమత్స సురేష్బాబు, గొర్లె వెంకటరమణ, గేదెల తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్, బోకం శ్రీనివాస్,వేచలపు చినరామునాయుడు, డాక్టర్ పెద్ది నాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కాకర్ల పూడి శ్రీనివాసరాజు, మక్కువ శ్రీధర్, జమ్మాన ప్రసన్నకుమార్, శ్రీవాణి, రాయల సుందరరావు, ప్రశాంత్, తూర్పుగోదావరి జిల్లా నేతలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏబి బుచ్చిమహేశ్వరరావు, కర్రి పాపారాయుడు, మందపాటి కిరణ్కుమార్,బొడ్డు వెంకట అనంత చౌదరి, టికె విశ్వేశ్వరరెడ్డి, చెలమశెట్టి సునీల్, రావూరి వెంకటేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా నేతలు ఆళ్ల నాని, తానేటి వనిత, మద్దాల రాజేష్, శ్రీరంగనాధరాజు, ముదునూరు ప్రసాదరాజు, చెలుమూరు అశోక్ గౌడ్, తలారి వెంకటరావు పాల్గొన్నారు. -
బలరాంపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర ఆదివారం బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సరవదేవిపేట, అయ్యవారిపేట,లొద్దపుట్టి మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురం పట్టణం చేరుకుంటారు. దాంతో ఆమె ప్రారంభించిన పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇచ్చాపురంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. నేటితో ఆమె ప్రారంభించిన పాదయాత్ర 230వ రోజుకు చేరుకుంది. 9 నెలల కాలంలో 14 జిల్లాల్లోని 116 నియోజకవర్గాల మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగింది. 3,112 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్రలో భాగంగా నడిచి దేశరాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డును సృష్టించారు.