ఈసీ తీరుపై సెల్ టవర్ ఎక్కిన ఎమ్మెల్యే అభ్యర్థి | Ichapuram Independent candidate Johnson angry on Election commission | Sakshi
Sakshi News home page

ఈసీ తీరుపై సెల్ టవర్ ఎక్కిన ఎమ్మెల్యే అభ్యర్థి

Published Sun, May 4 2014 9:36 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

ఎన్నికల సంఘం తనకు కేటాయించిన గుర్తు ఒక్కటైతే....బ్యాలెట్ పేపర్లో మరో గుర్తు ముద్రించారంటూ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఆందోళనకు దిగాడు.

ఎన్నికల సంఘం తనకు కేటాయించిన గుర్తు ఒక్కటైతే....బ్యాలెట్ పేపర్లో మరో గుర్తు ముద్రించారంటూ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఆందోళనకు దిగాడు. ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా సెల్ టవర్ ఎక్కాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా జాన్సన్ ఎన్నికల బరిలోకి దిగాడు. అయితే అతడికి ఎన్నికల సంఘం పెన్ గుర్తు కేటాయించింది.

 

కానీ .... బ్యాలెట్ పేపర్లో మాత్రం జాన్సన్ పేరు ఎదుట పెన్ స్టాండ్ గుర్తు ముద్రించి ఉండటంతో అతడు ఆందోళన చెందాడు. ఓ గుర్తు కేటాయించి మరో గుర్తు ఎలా ముద్రిస్తారంటూ జాన్సన్ ఉన్నతాధికారులను ప్రశ్నించాడు. అందుకు వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో... ఈసీ తీరుకు నిరసనగా ఆదివారం స్థానిక సెట్ టవర్ ఎక్కి తన ఆందోళన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement