elections 2014
-
ఆత్మావలోకనం అవసరం
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది. ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం. రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు! ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా? -
Telangana: రూ. 50 వేలకు మించి తీసుకెళ్లొద్దు
నిజామాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల(mlc elections) నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అభ్యర్థుల ప్రచారాలు, హడావుడి అంతగా లేకపోవడంతో ఎన్నికల కోడ్(Election Code) విషయం చాలా మందికి తెలియడం లేదు. చాలా చోట్ల సాధారణ రోజుల మాదిరిగానే నగదును తీసుకొని ప్రయాణిస్తున్నారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదుతో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ఆధారాలు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, (Nizamabad)మెదక్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56, టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీసినట్లు తెలిసింది. దీంతో ఎన్నికల అధికారులు నగదు తరలింపు, ఇతర వ్యవహారాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు దృష్టి సారించారు.ఆధారాలు లేకపోతే సీజ్ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే సంబంధిత ఆధారాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే వాటిని సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన నగదు, అప్పుగా, పంటలు అమ్మిన వచ్చిన డబ్బులతోపాటు బంగారం, వెండి కొనుగోలు చేసినా వాటికి ఇచ్చే రసీదులను వెంట ఉంచుకోవాల్సిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం, వెండి, చీరలు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులను వెంట పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.సరిహద్దుల్లో కట్టుదిట్టంజిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాది మంది నిజామాబాద్తోపాటు కామారెడ్డి, హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, కార్లు, వాహనాలను చెక్పోస్టుల వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. సరైన ఆధారాలు చూపని నగదు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగదు తీసుకెళ్లే వారు ఏమరుపాటుగా ఉండకుండా జాగ్రత్త వహిస్తూ ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, లేకపోతే నగదు సీజ్ అయ్యే ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.సరైన ఆధారాలు ఉండాలికోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశాం. పెళ్లిళ్లు, పంట విక్రయాలు చేసేవారు నగదు తీసుకువెళ్లేటప్పుడు తప్పనిసరిగా రసీదులు, ఆధార పత్రాలను వెంట ఉంచుకోవాలి. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల లోపు నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సరైన ఆధారాలు చూపిస్తే ఎన్నికల అధికారుల ద్వారా తిరిగి అందజేస్తాం.– రాజావెంకట్రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్ -
ఆంధ్రప్రదేశ్లో కూటమి దౌర్జానాల మధ్య సగం చోట్ల ఎన్నికల వాయిదా. 3 కార్పోరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు జరగాల్సి ఉండగా 5 చోట్ల జరగని ఎన్నికలు
-
సాక్షి కార్టూన్
-
Year Ender 2024: అయోధ్యలో నూతన రామాలయం.. ట్రంప్ పునరాగమనం.. ఈ ఏడాదిలో ఆసక్తికర పరిణామాలివే
2024 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యంలో పెద్దపండుగలాంటి లోక్సభ ఎన్నికలు భారతదేశంలో జరగగా, అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన ఎన్నికల ఘట్టం ముగిసింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న రాజకీయాలు, ఆర్థికరంగ పరిణామాలు, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ ఇలా మరెన్నో రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.బోయింగ్కు కలసిరాని ఏడాదిఏవియేషన్ దిగ్గజ సంస్థ బోయింగ్ తమ 737 మ్యాక్స్కు గత ఏడాది ఎదురైన సమస్యలు పరిష్కారమవుతాయని భావించింది. అయితే 2024 మొదట్లో అలాస్కా ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్ విమానం ప్రయాణం మధ్యలో దాని వెనుక డోర్ ప్లగ్-ఇన్ పనితీరులో విఫలమయ్యింది. ఈ ఘటనలో ఎటువంటి భారీ ప్రమాదం జరగనప్పటికీ, 737 మ్యాక్స్ 9 తరహాకు చెందిన విమానాల తయారీ నిలిచిపోయింది. ఈ ఏడాది బోయింగ్కు పరిస్థితులు అనుకూలించలేదు. మరోవైపు బోయింగ్కు చెందిన మాజీ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జాన్ బార్నెట్ అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు.స్టార్లైనర్ అంతరిక్ష నౌక ప్రయోగం విఫలంబోయింగ్ సంస్థ 2024లో చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాన ప్రయోగం అర్థాంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. వ్యోమగాములు సునీత, విల్మోర్లు ఎనిమిది రోజుల మిషన్ కోసం జూన్లో అంతర్జాతీయ స్సేస్ స్టేషన్కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా, స్టార్ లైనర్లో లోపాలు తలెత్తాయి. థస్టర్ విఫలమవడం, హీలియం లీక్ కావడంతో సునీత, విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే 2025 ఫిబ్రవరిలో వారిద్దరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయోధ్యలో నూతన రామాలయం2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకతో ఈ ఏడాది హిందువులకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హిందువుల కల నెరవేరింది. నాటి నుంచి బాలరాముని దర్శనం కోసం లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు.ట్రంప్ పునరాగమనం2024లో అగ్రగాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ విజయం సాధించారు.మరింత ధనవంతుడైన ఎలన్ మస్క్ ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్కి 2024 కలసివచ్చింది. పలు వెంచర్లలో మస్క్ విజయాలను అందుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ విజయంతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సంపద ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఉక్రెయిన్ చేతికి రష్యా ప్రాంతాలు2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 2024లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2024 ఆగస్టులో ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ ఒబ్లాస్ట్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఉక్రెయిన్ ఇతర ప్రాంతాల్లో ఓడిపోయినప్పటికీ కుర్స్క్పై నియంత్రణను కొనసాగించింది.ఇది కూడా చదవండి: Christmas And New Year Trip: రూ. ఐదువేలతో సూపర్ టూర్ ప్లాన్ -
సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ మూక దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి బృందంపై శుక్రవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై 50 మంది టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశాయి. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు గాయాలయ్యాయి. కెమెరా ధ్వంసమైంది. జర్నలిస్టులపై దాడి దుర్మార్గంపులివెందుల నియోజకవర్గం, వేముల మండల కేంద్రం లో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్తుల పై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డైమండ్ చేశారు.కవరేజీకి వెళ్లిన సాక్షి టివి కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము , సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గం అన్నారు. అంతేకాక కెమెరాలను, సెల్ ఫోన్లను కూడా పగులగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీసు స్టేషన్కు తీసుకెళ్ళారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని సురక్షితంగా ఇంటికి పంపాలని పోలీసులను కోరారు.కూటమి ఆగడాలపై ఫిర్యాదుఇప్పటికే జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూటమి ఆగడాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోడ్యూస్ సర్టిఫికెట్ వీఆర్ఓలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు.పెద్దముడియం, మైలవరం, జమ్మలమడుగు మండలాలకు సంబంధించి వీఆర్ఓలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. కొంతమంది వీఆర్ఓలను సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారన్నారు. ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు ఉన్నారని వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ శుక్రవారం అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.సాగునీటి సంఘాల ఎన్నికలపై హైకోర్టు కాలువలకు సాగు నీరు ఎప్పుడు కావాలి? ఎంత కావాలి అనేది రైతులకు పూర్తి అవగాహన ఉంటుంది. నీటి సంఘాల్లో వీరిని భాగస్వామ్యుల్ని చేసేలా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. అందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.👉చదవండి : ప్రశాంతంగా నీటి సంఘాల ఎన్నికలు -
యూటీలు ఎటో?
కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) మొదటి నుంచీ జాతీయ పార్టీలదే ఆధిపత్యం! గత ఎన్నికల్లో యూటీల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి మరిన్ని సీట్లపై కన్నేయగా, వాటిల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది... 2019 లోక్సభ ఎన్నికల్లో యూటీలను బీజేపీ కొల్లగొట్టింది. ఢిల్లీలో మొత్తం 7 సీట్లనూ చేజక్కించుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్ల్లో 3 సీట్లు నెగ్గింది. చండీగఢ్ ఎంపీ సీటును కాషాయ పార్టీ తరఫున ప్రముఖ నటి కిరణ్ అనుపమ్ ఖేర్ వరుసగా రెండోసారి గెలిచారు. అంతక్రితం ఈ సీటు కాంగ్రెస్ గుప్పిట్లో ఉండేది. డామన్ డయ్యు స్థానమూ బీజేపీ హస్తగతమైంది. 1987లో ఏర్పాటైన ఈ యూటీలో కాంగ్రెస్ 5 సార్లు, బీజేపీ 6 సార్లు నెగ్గాయి. అయితే 2009 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. అండమాన్ నికోబార్లో మాత్రం బీజేపీ సీటును కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది! 2009, 2014ల్లో బీజేపీ గెలిచిన ఈ స్థానం 2019లో కాంగ్రెస్ పరమైంది. దాద్రానగర్ హవేలీ సీటును 2021 ఉప ఎన్నికల్లో శివసేన గెలుచుకుంది. ఇక్కడ పలు పార్టీల తరఫున ఏకంగా ఏడుసార్లు నెగ్గిన మోహన్భాయ్ సంజీభాయ్ దేల్కర్ 2019లో స్వతంత్రునిగా నెగ్గారు. 2021లో అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆయన భార్య కాలాబెన్ మోహన్భాయ్ దేల్కర్ శివసేన తరఫున పోటీ చేసి నెగ్గారు. ఇక లక్షద్వీప్లో కాంగ్రెస్ హవాకు 2019లో ఎన్సీపీ అడ్డుకట్ట వేసింది. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షదీ్వప్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. మోదీ పర్యటన తర్వాత టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. పుదుచ్చేరిపై పార్టీల గురి పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలైన ఎన్ఆర్ కాంగ్రెస్ (ఎన్ఆర్సీ), డీఎంకేతో పాటు కాంగ్రెస్ కూడా చక్రం తిప్పుతున్నాయి. ఈ ఎంపీ సీటును 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్ఆర్సీ గెలుచుకుంది. 2019లో దీన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుని బీజేపీ, ఎన్ఆర్సీలతో కూడిన ఎన్డీఏ కూటమికి షాకిచి్చంది. ఎన్.రంగస్వామి కాంగ్రెస్ నుండి విడిపోయి ఎన్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. నాటినుంచి ఇక్కడ కాంగ్రెస్ తేరుకోలేకపోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో ఎన్ఆర్సీ 10 చోట్ల గెలిచింది. బీజేపీకి 6 సీట్లు రావడంతో రంగస్వామి మళ్లీ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న యానాం కూడా ఉండటం విశేషం! కశ్మీర్..బీజేపీ బ్రహ్మాస్త్రం 2019లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ జమ్మూ కశ్మీర్పై మోదీ సర్కారు ఫోకస్ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలి్పస్తున్న ఆర్టికల్ 370ను 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 6 లోక్సభ స్థానాలున్నాయి. 2019లో జమ్ము, లద్ధాఖ్లోని 3 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాశ్మీర్ లోయలోని 3 సీట్లను జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీ) చేజిక్కించుకుంది. 2014లో కూడా బీజేపీకి 3 సీట్లు రాగా పీడీపీకి 3 దక్కాయి. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లలో గెలిచి ముఫ్తీ మహమ్మద్ సయీద్ సీఎంగా సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. 2016లో ఆయన మరణించడంతో కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఏడాది సెపె్టంబర్ లోపు అక్కడ జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత దానికి మళ్లీ రాష్ట్ర హోదా దక్కే అవకాశాలున్నాయి. గతంలో ఇక్కడ చక్రం తిప్పిన కాంగ్రెస్ గులాంనబీ ఆజాద్ రాజీనామాతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సొంత పార్టీ పెట్టుకున్న ఆజాద్ చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్ములోని 2 సీట్లలో కాంగ్రెస్కు ఎన్సీ, పీడీపీ మద్దతివ్వనున్నాయి. కాశ్మీర్ లోయలోని 3 సీట్లపై మాత్రం పీటముడి పడింది. మూడింట్లోనూ పోటీ చేస్తామని ఎన్సీ ప్రకటించింది. పీడీపీ కూడా వెనక్కి తగ్గడం లేదు. సర్వేల అంచనాలు ఇలా... ఈసారి కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ బలం మరింత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీలో మళ్లీ క్లీన్స్వీప్తో పాటు పుదుచ్చేరి, లద్దాఖ్, చండీగఢ్ ఆ పార్టీ పరం అవుతాయంటున్నాయి. జమ్ము కశ్మీర్లో 2, దాద్రానగర్, డామన్ డయ్యు, అండమాన్ సీటు కూడా బీజేపీవేనన్నది వాటి అంచనా. కాంగ్రెస్ లక్షదీ్వప్లో మాత్రం నెగ్గవచ్చని, కశ్మీర్లోని 3 సీట్లలో ఎన్సీ గెలుస్తుందని అన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జోరు జోరుగా.. హుషారుగా.. కాంగ్రెస్!
వికారాబాద్: రాష్ట్రమంతా కాంగ్రెష్ జోష్ ఉందని.. కార్యకర్తలంతా పార్టీ గెలపుకోసం కలిసికట్టుగా పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ బూత్ కో ఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నందున అధికార పార్టీ నేతలు సైతం హస్తం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపు వ్యూహమే మన రాష్ట్రంలో అమలు చేస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు మరింత శ్రద్ధతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటుగా అధికార పార్టీ సర్వేలోనూ పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడం ఖాయమే ప్రచారం జోరుగా సాగుతోందన్నారు. బూత్ కోఆర్డినేటర్స్ ఎన్నికల ప్రక్రియను తెలుసుకోవడంతో పాటుగా క్షేత్రస్థాయిలో సైతం ఓటు వేసే విధానాల గురించి వివరించాలన్నారు. అనంతరం గద్దర్ మృతికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ ఎంపీపీ అంజిలయ్య, యువజన విభాగం అధ్యక్షుడు జంగయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శులు యాదయ్య, సత్యనారయణ, కుల్కచర్ల ఎంపీటీసీ సభ్యుడు ఆనందం, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రాంచందర్, బీసీ సెల్ అధ్యక్షుడు మహేశ్, మండల ఉపాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, పార్టీ మీడియా కోఆర్డినేటర్స్ భాస్కర్, భరత్ కుమార్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో బీజేపీ పాలనే.. బీఆర్ఎస్ ఇక నాలుగు నెలలే..
నిజామాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా నాలుగు నెలలేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం కల్వరాల్, సదాశివనగర్ మండల కేంద్రంలో వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతివృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టాన్ని చూసి బాధిత రైతుల కంటతడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు లకు పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబందు పేరుతో ఎకరాకు రూ. 5 వేలు ఇస్తూ ఇతర పథకాలను ఎత్తివేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మండలాధ్యక్షుడు నర్సింరెడ్డి, ఎంపీటీసీలు మహిపాల్ యాదవ్, భైరవరెడ్డి, నా యకులు పైళ్ల కృష్ణారెడ్డి, పొతంగల్ కిషన్రావు, కొప్పుల గంగారెడ్డి, మర్రి రాంరెడ్డి, సురేందర్రెడ్డి, మార రమేశ్రెడ్డి, నర్సారెడ్డి, స్వామి గౌడ్, గంగాధర్రావు, భూంరావ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ జీ.. అప్పుడిచ్చిన హామీ ఏమైంది?
విదేశాలలో మన నల్లధనం గుట్టలకొద్దీ మూలుగుతోందని, అదంతా తెచ్చి దేశ పౌరుల ఖాతాల్లో వేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పెద్ద నోట్ల రద్దుకు ముందు.. చెప్పారు. పెద్ద నోట్లు రద్దయ్యాయి కానీ, అకౌంట్లలో చిన్నమొత్తమైనా వచ్చి పడలేదు. ఎక్కడి నల్ల ధనం అక్కడే ఉండిపోతే ఎలా పడుతుంది. పన్నుల ఎగవేత, అవినీతి, గుప్తధనం అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు, దొంగ రవాణా.. వీటివల్ల నల్లధనం జమ అవుతూ ఉంటుంది. 1956లో మన నల్ల ధనం దేశ జీడీపీలో 4.5 శాతం ఉండగా, 1980–83 మధ్య ఇది 18 నుంచి 21 శాతానికి పెరిగింది. 2012లో భారత్లో మొత్తం నల్లధనం పరిమాణం రూ.63 లక్షల కోట్లని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అధ్యయనంలో వెల్లడయింది. అవినీతి నిరోధక చట్టం (1988), బినామీ లావాదేవీల చట్టం (1988), అక్రమ ధన చలామణి నిరోధక చట్టం (2002), లోక్పాల్, లోకాయుక్త చట్టాలు, ఆఖరికి పెద్ద నోట్ల రద్దు కూడా నల్లధన వ్యాప్తిని నిరోధించలేక పోయాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ‘అనుబంధం’ నల్లధనం ఉత్పత్తికి ప్రధాన కారణంగా చెబుతున్న సామాజిక అభివృద్ధి అధ్యయనవేత్తలు.. మరో ఇరవై ఐదేళ్లకైనా నల్లధనం ఉత్పత్తి, విస్తృతి తగ్గితే గొప్ప సంగతేనని అంటున్నారు. 2020లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్, నార్వే.. అతి తక్కువ అవినీతి గల దేశాలుగా నిలిచాయి. ఇది కూడా చదవండి: ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్ -
ఆ మోదీ వేరు... ఈ మోదీ వేరు
ఈ దొంగలందరి పేర్లలో మోదీ అన్న పదం ఎందుకుందో...అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తే...ఆ మోదీ వేరు...మేం వేరు అంటున్నారు మోదీనగర్ వాసులు. రాహుల్ వ్యాఖ్యలతో తమకే సంబంధం లేదని, తామెవరం దొంగలం కామని వారు స్పష్టం చేస్తున్నారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య మోదీనగర్ పేరుతో ఉన్న పట్టణవాసులకు ఇబ్బందికరంగా మారింది. లలిత్ మోదీ తాతగారి ఊరైన ఈ మోదీనగర్ ఢిల్లీకి ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘజియాబాద్–మీరట్ మధ్యలో ఉన్న ఈ పట్టణం ఒకప్పుడు పలు రకాల మిల్లులు, ఫ్యాక్టరీలతో చరిత్ర ప్రసిద్ధిగాంచింది. రాహుల్ వ్యాఖ్యలతో ఈ పట్టణం రాజకీయ రొంపిలో చిక్కుకుంది. రాజకీయ రొంపిలోకి తమను లాగవద్దని వారు కోరుతున్నారు. మోదీ అన్నది మా పట్టణం పేరు. ఇది దొంగల నగరం కాదు. రాహుల్ అలా అనడం తప్పు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేశ్ కుమార్ అగర్వాల్ అనే మోదీనగర్ వాసి. ‘ఇక్కడ మోదీ పేరుతో చక్కెర కర్మాగారం ఉంది. పరిశ్రమలున్నాయి. ఆలయం కూడా ఉంది. మోదీ అన్న పేరు ఇక్కడ ఎంతో గొప్పది’అని అగర్వాల్ స్పష్టం చేశారు. 1923 ప్రాంతంలో లలిత్మోదీ తాతగారైన రాజ్ బహదూర్ గుజర్మల్ మోదీ పాటియాలా నుంచి ఇక్కడికి వచ్చి అనేక ఫ్యాక్టరీలు, డిగ్రీ కాలేజీ పెట్టారు. ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా అందజేసింది.మొదట్లో ఈ పట్టణాన్ని బేగమాబాద్ అని పిలిచేవారని, గుజర్మల్ మోదీ చేసిన అభివృద్ధికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఆయన పేరు పెట్టిందని 76 ఏళ్ల మిథిలేశ్ చెప్పారు. మోదీలను కించపరచడానికి వారు కేవలం ఏదో ఒక వర్గం వారు కాదని, పార్శీలు, ముస్లింలు, ఇతర సామాజిక వర్గాల వారిని ఇక్కడ వృత్తిరీత్యా మోదీలుగా పిలుస్తారని మిథిలేశ్ తెలిపారు. నిజాయితీకి, కష్టించే తత్వానికి ప్రతీకగా మోదీ పేరు నిలుస్తుందన్నారు. -
మేనిఫెస్టోల్లో ప్రజాసమస్యలు మాయం
భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా సమస్యల ప్రస్తావన మచ్చుకైనా మేనిఫెస్టోల్లో లేకపోవడం విచారకరం. బీజేపీతోసహా రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవు. ప్రతి ఎన్నికల ప్రచారం వివాదాలకు ఆజ్యం పోయడంతోనే ముగుస్తోంది. మానవాభివృద్ధి నివేదికల్లో మన దేశం చిన్న చిన్న దేశాల కంటే అట్టడుగుస్థానంలో పడిపోయింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నిద్రపోతున్న దయనీయమైన స్థితి, 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తుండటం.. ఇవేవీ మేనిఫెస్టోల్లో చోటుచేసుకోకపోవడం గర్హనీయం. ఎవరైతే సమాజగమనాన్ని మార్చడానికి నిరంతరం శ్రమిస్తారో, పరిష్కారమార్గాలకోసం పరితపిస్తారో, తమ కార్యాచరణ ద్వారా ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు కారణమవుతారో, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల మనసుల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తం గానూ ఎందరో త్యాగధనులు దేశ భవిష్యత్తుకోసం తమ జీవితాలను ధారపోశారు. కానీ ఇటీవల మన దేశంలో జరుగుతున్న పరిణామాలనూ, నడుస్తున్న చరిత్రనూ గమనిస్తే నిరాశే మిగులుతుంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు చాలా ఉత్సాహంతో, ప్రణాళికలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. సభల్లో అధినాయకుల ప్రసంగాల్లోనూ ప్రజలకు హామీలు గుప్పించేస్తున్నారు. అయితే చాలా వరకు రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, ఓటర్ల సాక్షిగా నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవనడంలో సందేహం అక్కర్లేదు. ప్రజల సమస్యలు పాక్షికంగానే ప్రస్థావనకు వచ్చాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలకు వాళ్ళ ప్రణాళికల్లో, ప్రసంగాల్లో చోటు దక్కడంలేదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రణాళికను గమనిస్తే మరింత ఆందోళన కలుగుతోంది. ఈ దేశంలో అన్ని విషయాలతో పాటు కులం ఒక నిజం. కులం ఒక వర్గీకరణ మాత్రమే కాదు. అది వివక్షకూ, అణచివేతకూ, అసమానతలకూ ప్రతిరూపం. ఇప్పటికీ అంటరానితనానికీ, అవమానాలకూ గురవుతున్న దళితుల విషయంగానీ, సమాజానికి దూరంగా అడవుల్లో నివసిస్తూ, తమ జీవితాలతో పాటు అల్లుకొని వున్న అటవీ సంపదనూ, ఖనిజవనరులనూ కొల్లగొడుతుంటే చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోతున్న ఆదివాసుల ఊసుగానీ ఈ ప్రణాళికల్లో కనిపించకపోవడం గమనించాల్సిన విషయం. అలాగే వృత్తులనూ, ఉపాధినీ కోల్పోయి పొట్టచేత పట్టుకొని ఎక్కడెక్కడికో వలసపోతున్న బీసీ కులాల గురించిగానీ, మతం పేరుతో వివక్షకూ, హింసకూ గురవుతున్న మైనారిటీల గురించిగానీ ఎన్నికల ప్రణాళికలు పట్టించుకున్న పాపాన పోలేదు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ప్రస్థావన మచ్చుకైనా ప్రణాళికల్లో లేకపోవడం గర్హనీయమైన విషయం. గతంలో ఇదే బీజేపీ ప్రణాళికల్లో మాట వరసకైనా ఈ విషయాలను చేర్చింది. కానీ ఈసారి అవేవీ వీరి దృష్టినైనా తాకకపోవడం విచారకరం. పైగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదల కోసం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్ల విషయం మాత్రం చాలా ప్రముఖంగా పేర్కొన్నారు. ఆ పార్టీలో కొనసాగుతున్న ఈ వర్గాల నేతలుగా కొనసాగుతున్న వారు కూడా ఎందుకు నోరు మెదపడంలేదో అర్థం కాని విషయం. పైగా, ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో పేదరికం, ఆకలి, అభద్రత, ఆరోగ్యం, విద్య లాంటి సమస్యలు కూడా ఏ ఎన్నికల ప్రణాళికలోనూ చర్చకు రావడం లేదు. ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార స్థితిగతులపై 2018లో విడుదలైన ఒక నివేదిక ఎన్నో కఠినమైన విషయాలను బయటపెట్టింది. ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధ్యయనంలో దాదాపు 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తున్నట్టు తేలింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉంటున్న దయనీయ స్థితి ఉన్నదని తెలిసింది. దేశంలోని 21 శాతం మంది పిల్లలు వయసుకి తగ్గ శారీరక ఎదుగుదల లేక అనారోగ్యంతో బతుకులీడుస్తున్నారని కూడా ఆ సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్త ఆకలి సూచికలో మన దేశం 103వ స్థానంలో ఉంది. ఈ సంస్థ సర్వే చేసిన దేశాలు 119 మాత్రమే. అంటే మన దేశం అ«ట్టడుగు స్థితిలో 7వ స్థానంలో ఉంది. వీటన్నింటితో పాటు, గ్రామీణ, పట్టణ పేద మహిళలు దాదాపు 51.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తీవ్ర ఆందోళన కలిగించే ఇలాంటి అంశాలేవీ ఈ అతిపెద్ద ఎన్నికల్లో చర్చకు నోచుకోకపోవడం గమనార్హం. చర్చలే జరగకపోతే, మన పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు సైతం ఆకలి సూచికలో మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ మార్చిలో విడుదలైన ఏడవ ప్రపంచ సంతోషదాయక నివేదిక మన దేశంలో గూడుకట్టుకున్న దుఃఖాన్ని ప్రతిబింబించింది. మన పొరుగుదేశమైన భూటాన్ ఆలోచన ప్రకారం మనిషికి ఆర్థికంగా అందే ప్రయోజనాలతో పాటు, ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరా? అనేది కూడా పరిశీలించాలనే ప్రయత్నం మొదలైంది. మార్చి 21న ప్రతి సంవత్సరం సంతోష దినోత్సవం జరుపుతూ గత ఏడేళ్ల నుంచి ఐరాస నివేదికలను విడుదల చేస్తున్నది. అందులో మన దేశం మొదటి నుంచీ వెనుకబడే ఉంది. 2013లో 111వ స్థానం, 2015లో 117వ స్థానం, 2016లో 118వ స్థానం, 2017లో 122వ స్థానం, 2018లో 122వ స్థానం. ఇక 2019లో 140వ స్థానానికి పడిపోవడం మన దేశ దుస్థితినీ, ప్రజల్లోని అసంతృప్తినీ చాటిచెపుతోంది. దేశ ప్రజల సంతోషం గ్రాఫ్ విషయంలో పాక్, బంగ్లాదేశ్, లాంటి దేశాలు కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. ఈ నివేదికలో గృహ వసతి, ఆదాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఉద్యోగం, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు, ఆయుర్దాయం, రక్షణ లాంటి విషయాలను పరిగణనలోనికి తీసుకున్నారు. మన దేశంలో ఆదాయాలు ఎక్కువగా ఉన్న వర్గాలు కూడా సంతోషంగా లేవని ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆరోగ్యంపై పెరుగుతున్న భారం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల విద్య విషయంలో అవుతున్న వ్యయం కూడా ఈ వర్గాలను వేధిస్తున్నది. ముఖ్యంగా నగరీకరణ పెరుగుతుం డటం వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలు ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. నగరాలలోకి ఆడపిల్లలను పంపాలనే ఆలోచన కూడా తల్లిదండ్రులను భయపెడుతున్నది. గత ఐదేళ్ళలో భిన్న విశ్వాసాలు, ప్రజల్లో పెరుగుతున్న వైషమ్యాలు కూడా ఈ దేశంలోని ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు కారణంగా భావించొచ్చు. వీటన్నింటితో పాటు దేశానికి శక్తివంతమైన మానవ వనరులు మన యువత. ఈ దేశంలోని కోట్లాది మంది యువతీ, యువకులు అభద్రతలో కొట్టుమిట్టాడుతున్నారు. 2018లో మన నిరుద్యోగం రేటు 3.5 శాతం. దాదాపు 40 కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగానే జీవితాలను గడుపుతున్నారు. ఇది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే అంశం. ఎందుకంటే, సమాజ స్థితిని తెలియజేసేది యువత ఎదుగుదల మాత్రమే. ఈ ప్రమాదకర పరిస్థితి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇన్ని సమస్యలున్నా భారతదేశం పేద దేశం మాత్రం కాదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశమే. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మన స్థూల జాతీయదాయం చూస్తే మన దేశ ఆర్థిక పురోగతి అర్థం అవుతుంది. 1951 నుంచి మన సరాసరి స్థూల జాతీయాదాయం 6.21 శాతంగా ఉండింది. కానీ 2010లో 11.40 శాతాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. మన దేశ స్థూల జాతీయాదాయం దాదాపు రెట్టిం పైంది. అయితే ఇది ప్రజల బతుకుల్లో ఎక్కడా కనిపించడంలేదు. మన దేశంలో దేశ సంపద పెరుగుతున్నది. కానీ అది కొద్దిమంది చేతుల్లోకే చేరుతున్నది. ‘పెరుగుతున్న అంతరాలు’ పేరుతో ఆక్స్ఫామ్ అనే అంతర్జాతీయ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆదాయాల్లో అంతరాల గురించి సవివరంగా పేర్కొన్నారు. మనదేశంలోని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ 59 వ నివేదికలో ఇదే రకమైన ఆందోళనను వ్యక్త పరిచింది. దేశంలో అంతరాలు 1990 నుంచి పెరగడం ఎక్కువైంది. సరళీకరణ ఆర్థిక విధానాలూ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల ఆదాయాల్లో అంతరాలు ఆకాశాన్నంటుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. 2017లో వెలువరించిన ప్రపంచ సంపద నివేదికలో పేర్కొన్నట్టు, 2002లో పది శాతం మంది చేతుల్లో 52.9 శాతం సంపద ఉండగా, 2012 కి వచ్చేసరికి 62.1 శాతానికి పెరిగింది. అదేవిధంగా 2002లో 15.7 శాతం సంపద కేవలం ఒక్కశాతం మంది చేతుల్లోనే పోగుపడింది. 2012లో అది 25.7 శాతానికి మించి పోయింది. దీనివల్ల దేశంలో ప్రజల్లో ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం పెరిగిపోతున్నది. ఈ విషయాలేవీ కూడా ఈ ఎన్నికల్లో చర్చకు కూడా రాకపోవడం గమనార్హం. దీనికి బలమైన కారణం ఉన్నది. ఈ దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులూ, వ్యాపారులూ, పారిశ్రామిక వేత్తలూ, వాణిజ్యవేత్తలూ, అవినీతిమయమైన బ్యూరోక్రసీ ఒక కూటమిగా ఏర్పడింది. దీనితో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఏర్పడిన బడ్జెట్లూ, సహజ వనరులైన భూమి, అడవి, భూగర్భ సంపద అంతా కొందరి చేతుల్లోకి పోయింది. దానితో లక్షల రూపాయల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న వాళ్ళు అనతికాలంలోనే వేలకోట్లకు అధిపతులుగా మారుతున్నారు. ఈ స్థితిలో జరుగుతున్న ఎన్నికలు ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబించకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. కానీ సమాజం దీన్ని సమస్యగా భావించకపోవడమే నేరమౌతుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
బీజేపీ చరిత్రలో తొలిసారిగా...
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్సభ బరిలో అత్యధిక అభ్యర్థులను బరిలో నిలపనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకుగాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటి వరకు 408 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. మరో 30 స్థానాలకు గెలుపుగుర్రాల కోసం అన్వేషిస్తోంది. దీంతో బీజేపీ చరిత్రలో అత్యధికంగా లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన ఎన్నికగా రికార్డు సృష్టించనుంది. దేశ వ్యాప్తంగా గల 543 స్థానాలకు గత ఎన్నికల్లో 428 మంది బరిలో నిలపిన విషయం తెలిసిందే. అంతకుముందు 2009 ఎన్నికల్లో 433, 2004లో 364, 1999 ఎన్నికల్లో 339 అభ్యర్థులను కమలం పార్టీ బరిలో నిలపింది. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు.. ఏడు లోక్సభ స్థానాలు గల ఢిల్లీలో టికెట్ కోసం ఎంతోమంది పోటిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల ఒప్పందంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో సరైన అభ్యర్థుల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. 80 లోక్సభ స్థానాలు గల యూపీలో కూడా మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పంజాబ్, హర్యానాలో శిరోమణీ అకాలీదళ్తో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ.. ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మధ్యప్రద్శ్లో మరో ఎనిమిది స్థానాలకు పెండింగ్లో ఉంచింది. ఏపీ, తెలంగాణలో గత ఎన్నికల్లో కేవలం 12 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఈసారి ఒంటరిగా మొత్తం 42 స్థానాల్లోనూ బరిలో నిలిచింది. గత ఎన్నికల మాదిరీగానే ఈసారి కూడా కే్ంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుంతుందని ఆ పార్టీ నేతలు ధీమావ్యక్తం చేస్తున్నారు. కాగా 2014 ఎన్నికల్లో 280పైగా స్థానాలను కైవసం చేసుకుని తొలిసారి ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
2014 ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాకయ్యాయి
-
మళ్లీ తెరపైకి వామపక్ష ఐక్యత!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పరస్పర పోటీలు, అవి ముగిశాక ఐక్యతా ప్రయత్నాలు అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి. వామపక్షాల ఐక్యత అంటూ కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో ఈ పార్టీలకు కనీసం ఒక్క సీటైనా దక్కకపోగా ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువగా ఓట్లు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఈ పార్టీల పరిస్థితి నిరాశాజనకంగా తయారైంది. ఎన్నికలకు ముందు ఇరు పార్టీల నేతలు తాము పోటీచేస్తున్న కూటముల విషయంలో పరస్పరం బహిరంగ విమర్శలకు సైతం దిగారు. కనీసం కలిసి పోటీ చేసే పరిస్థితులు లేకపోవడమే కాకుండా పరస్పర విమర్శలు చేసుకుంటుండటంతో ప్రస్తుతం ఈ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు ముందుగా రాష్ట్ర స్థాయిలో వామపక్ష ఐక్యతపై దృష్టి పెట్టాలంటూ ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వామపక్ష ఐక్యత అంటూ మళ్లీ రెండు పార్టీల మధ్య రాజీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతకుముందు తలోదారి.. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమిలో సీపీఐ చేరింది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర పక్షాలు, ప్రాంతీయ పార్టీలను ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నాలకు ఇది ఊతమిస్తుందని ఆ పార్టీ భావించింది. వచ్చే లోక్సభ ఎన్నికల కల్లా జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పడకపోయినా, రాష్ట్ర స్థాయిల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య స్నేహం పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని సీపీఐ జాతీయ నాయకత్వం భావించింది. అందుకే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరేందుకు మొదటి నుంచీ సీపీఎం ఉత్సాహం చూపలేదు. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తామంటూ గతంలో జాతీయపార్టీ చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. సీపీఐ, ఇతర వామపక్షాలు, సామాజిక సంఘాలు, సంస్థలతో కలిసి తన ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకే సీపీఎం మొగ్గుచూపింది. ఇందులో భాగంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ను ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ప్రయోగాలు విఫలం కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. మరోవైపు సీపీఐ, సీపీఎం జాతీయ పార్టీలు కూడా ముందు వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ తాజాగా సూచించడంతో రాష్ట్ర స్థాయిలో కమ్యూనిస్టు పార్టీల ఐక్యతా ప్రయత్నాల్లో భాగంగా స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై ఈ పార్టీలు దృష్టి సారించాయి. -
రాజ్భవన్ ముట్టడి యత్నం విఫలం
సాక్షి, బెంగళూరు: గవర్నర్ వజూభాయ్ వాలా సంఖ్యాబలం లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్వీన్స్క్రాస్ రోడ్డులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాజ్భవన్లోనికి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి సమీపంలోని కబ్బన్పార్కుకు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. గవర్నర్, పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ సమీపంలోని ఇండియన్ ఎక్స్ప్రెస్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ‘ఛలో రాజ్భవన్’ కార్యక్రమంలో ఎంపీ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధారాలతో ఆడియో క్లిప్పును విడుదల చేసింది. చిత్రదుర్గ గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దడ్డల్కు మంత్రి పదవితో పాటు భారీగా డబ్బు ఆశచూపినట్లు అందులో ఉంది. -
బీజేపీ తరఫునే సీఏ పనిచేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరఫున పనిచేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన ‘స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ లాబరేటరీస్ (ఎస్సీఎల్–గ్రూప్)’కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ), అంతకుముందు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎన్నికల్లో కూడా తన సేవలను అందించిందన్న విషయంపై చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. 2010లో బీహార్ ఎన్నికల్లో జేడీయూ తరఫున మొదటి సారి భారత ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఆ తర్వాత ఏయే ఎన్నికల్లో ఏయే పార్టీల తరఫున పనిచేసిందో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో సీఏ సంస్థ ఓ రాజకీయ పార్టీ తరఫున పనిచేసిందని, అందులో 300 మంది శాశ్వత సిబ్బంది, 1400 మందిని తాత్కాలిక ఉద్యోగులతో తన సేవలను అందించిందని ‘క్వార్ట్స్జ్’ డాట్ కామ్ తాజాగా సేకరించిన డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. భారత్లోని అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, కటక్, గజియాబాద్, గువహటి, ఇండోర్, కోల్కతా, పట్నా, పుణె అనే నగరాలను కేంద్రంగా సీఏ తన సేవలను అందించింది. భారత్ ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా పనిచేసిందని, బహూశ తమ క్లైంట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చని ఈ కంపెనీ మాజీ ఉద్యోగి ఈనెల 27వ తేదీన బ్రిటీష్ పార్లమెంటరీ కమిటీ ముందు అంగీకరించడం, కాంగ్రెస్ పార్టీ క్లైంట్ కాదని కంపెనీ వర్గాలు ప్రకటించడం తెల్సిందే. వీటిలో ఎవరి మాట నిజమైందో తెలియదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఏ నిజంగా పనిచేసినట్లయితే కంపెనీ పరువు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తాము సేవలందించిన స్థానాల్లో 92 శాతం తన క్లైంట్ అభ్యర్థులు విజయం సాధించారని కంపెనీ తెలిపింది. ఈ లెక్కన ఆ కంపెనీ బీజేపీ పార్టీ తరఫునే సేవలు అందించి ఉండాలి. స్పష్టత కోసం సీఏ, ఎస్సీఎల్ యాజమాన్యం నుంచి సమాధానాన్ని కోరింది. అయితే వారి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. వాస్తవానికి సీఏ 2013లో ఆవిర్భవించినప్పటికీ దాని మాతృసంస్థ ఎస్సీఎల్ 2003లో ఏర్పాటైన నాటి నుంచి భారత్లో ఎన్నికలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. 2003లో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో ప్రధాన రాష్ట్ర పార్టీ సంస్థాగత బలం, ఓటర్ల ప్రవృత్తి, రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలపై అదే సంవత్సరం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ తరఫున ఓటర్ల నాడి, ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మళ్లే ఓటర్లను గుర్తించడం లాంటి అంశాలపై సంస్థ అధ్యయనం జరిపింది. 2007లో జిహాది గ్రూపుల నియామకాలను ఎలాంటి ప్రచారం ద్వారా ఎదుర్కోవాలి అన్న అంశంపై కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, జార్ఖండ్, యూపీ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. 2010 బీహార్ ఎన్నికల్లో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసినట్లు డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఈ సేవల కోసం సీఏ సంస్థ ఓటర్ల ఫేస్బుక్ ఖాతాలను వాడుకుందనే విషయం వెలుగులోకి రావడంతో ఈ అంశంపై గొడవ జరుగుతున్న విషయం తెల్సిందే. -
మొదలైన కౌటింగ్.. ఎవరిదో గెలుపు?
-
మొదలైన కౌటింగ్.. ఎవరిదో గెలుపు?
లక్నో: ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ లో 75 జిల్లాల్లోని 78 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. లక్నోలో కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పంజాబ్ లోని 24 ప్రాంతాల్లోని 54 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లుధియానా కౌంటింగ్ కేంద్రంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మణిపూర్ లోని 11 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. గెలుపెవరిదన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. విజయంపై ఆయా పార్టీల అభ్యర్థులు దీమాగా వ్యక్తం చేస్తున్నారు. -
'దేశ' ఎజెండానే రామ మందిర నిర్మాణం!
లక్నో:అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనేది దేశ ప్రజల అభిలాషని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) స్పష్టం చేసింది. ఇందుకు ప్రభుత్వానికి చాలా సమయం ఉందని ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ తెలిపారు. చట్టపరిధిలో రామమందిరం నిర్మించడానికి ప్రభుత్వానికి 2019 వరకూ సమయం ఉందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కర్యాకారి మదల్ సమావేశం తొలిరోజు కార్యక్రమంలో భాగంగా హాజరైన దత్తాత్రేయ మీడియాతో్ మాట్లాడారు. 'రామ మందిరం అనేది దేశ ఎజెండా. అది యావత్తు జాతి కోరిక. ఇందులో భాగంగానే వీహెచ్ పీకి మేము మద్దతు తెలుపుతున్నాం'అని తెలిపారు. ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణంపై బీజేపీ తీసుకున్ననిర్ణయంతోనే కేంద్రంలో పూర్తి ఆధిక్యంతో పగ్గాలు చేపట్టందన్నారు. అయితే అదే డిమాండ్ ను తాము మళ్లీ ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న రామ మందిర నిర్మాణంపై ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
అధికారంలో ఉంటే వీరంగం సృష్టిస్తారా?
-
ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో నాశనం చేశారు!
-
'టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారు'
-
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది
-
'పచ్చ'స్వామ్యం
-
తప్పుడు హామీలు మనం ఇవ్వలేదు.. ఇవ్వలేం కూడా..
-
ఉత్తరాంధ్ర బాగుకే అమ్మను నిలబెట్టా!
-
'పార్టీలో నష్టనివారణ చర్యలు ప్రారంభించాం'
విశాఖ: పార్టీలో నష్ట నివారణ చర్యల ప్రారంభించామని వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీకి నష్టం కలిగించిన వారిపై పార్టీ పెద్దలు లోతుగా దృష్టిపెట్టారన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ధర్మాన..త్రిసభ్య కమిటీ నివేదికను బట్టే పార్టీకి నష్టం కలిగించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. రాజధాని విషయంలో తెరచాటు వ్యవహార మంచిది కాదన్నారు. విశాల దృక్పధంతో రాజధాని ప్రాంతం గుర్తించాలన్నారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాన సూచించారు. విశాఖ రూరల్జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాల్లో పరిస్థితిపై అనకాపల్లిలో సమీక్ష నిర్వహించామన్నారు. దీనిని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సమీక్షలో చర్చించామన్నారు. స్థానిక సంస్థల ఫలితాల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ప్రస్తుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలుతోపాటు పార్టీ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యకర్తలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన ప్రణాళికలకు చర్యలు చేపట్టామన్నారు. -
గెలుపోటములు సహజం
పార్టీకి ఆదరణ ఉంది కార్యకర్తలూ.. నిరుత్సాహం వద్దు మాజీ మంత్రి ధర్మాన 9 నియోజవర్గాలపై సమీక్ష మునగపాక, న్యూస్లైన్ : ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, లోపాలను సరిదిద్దుకొని పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి అవసరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి, త్రిసభ్యకమిటీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. అనకాపల్లిలో పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా మునగపాక వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ ఉందన్నారు. మోసపూరిత హామీలు, డబ్బు ప్రభావంతో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ రూరల్జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాల్లో పరిస్థితిపై అనకాపల్లిలో సమీక్ష నిర్వహించామన్నారు. దీనిని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సమీక్షలో చర్చించామన్నారు. స్థానిక సంస్థల ఫలితాల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలుతోపాటు పార్టీ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యకర్తలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైనప్రణాళికలకు చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గాలవారీ సమీక్ష అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరా తీశారు. ధర్మాన ప్రసాద్రావు, జోగి రమేష్, సాయి రాజులతో కూడిన బృదం పట్టణంలోని న్యూకాలని రోటరీ కల్యాణమండపంలో ఆదివారం గ్రామీణ జిల్లాలోని చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, యలమంచిలి, నర్సిపట్నం, పాయకరావుపేట, పెందుర్తి నియోజకర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలుపొందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు. కార్యకర్తలు, నాయకులతో సమీక్షించారు. జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అధ్యక్షతన నియోజకవర్గాల వారీ సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, కిడారి సర్వేశ్వరావు, గిడ్డ ఈశ్వరి,అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పార్టీ నాయకులు గండి బాబ్జి, కరణం ధర్మశ్రీ, చెంగల వెంకట్రావు, ప్రగడ నాగేశ్వరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్సీపీ నాయకులు మళ్ల సంజీవరావు,పిన్నమరాజు వెంకటపతిరాజు(చంటిరాజు),మళ్ల బుల్లిబాబు, పెంటకోట శ్రీనివాసరావు, భీశెట్టి జగన్, టెక్కలి కొండలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మోడీ నుంచి జనం కోరేదిదీ!
-
ఎవరికి వారు సీఎం అవ్వాలనుకుంటే.. ఇదే గతి!
-
కేసీఆర్కు ఇక 'పరీక్షా' సమయం
-
లోక్సభ సభ్యులూ 'పెద్దలే'
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎంపీ కావాలంటే ఆషామాషీ విషయం కాదు. లోక్సభకు పోటీచేసి గెలవాలంటే రాజకీయాల్లో తలపండిపోవాలి. చాలా తక్కువ మందికి మాత్రమే తక్కువ వయసులో గెలిచే అవకాశం ఉంటుంది. 16వ లోక్సభనే చూసుకుంటే.. మనకున్న మొత్తం 543 మంది ఎంపీలలో, ఏకంగా 253 మందికి 55 ఏళ్లకు పైగా వయసుంది. అదే గత లోక్సభలో అయితే ఈ వయసు దాటినవాళ్లు 234 మందే. దేశ చరిత్రలోనే ఇంత ఎక్కువ మంది పెద్దవయసు వాళ్లు లోక్సభకు ఎంపిక కావడం ఇదే ప్రథమమని అంటున్నారు. కాగా, ప్రతిసారీ లోక్సభకు ఎన్నికవుతున్న పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నా.. లోక్సభకు మాత్రం పెద్దవాళ్లే ఎన్నికవుతున్నారు. ఈసారి లోక్సభలో కురువృద్ధుడు లాల్కృష్ణ అద్వానీ. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయనకంటే పెద్ద వయస్కులు ఎవరూ ఈ సభలో లేరు. ఇక మరో సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి వయసు 80 ఏళ్లు. మాజీ ప్రధాని దేవెగౌడకు 81 ఏళ్లు. ఇక ఇప్పటివరకు లోక్సభకు అత్యంత ఎక్కువసార్లు ఎన్నికైన సభ్యుడు.. కాంగ్రెస్ ఎంపీ కమల్నాథ్ (67). ఆయన మధ్యప్రదేశ్లోని ఛింద్వారా నుంచి ఇప్పటికి తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. లోక్సభలో 40 ఏళ్లలోపు వయసున్న ఎంపీలు కేవలం 13 శాతం మందే.. అంటే 71 మంది మాట. ఈసారి అత్యంత పిన్నవయస్కులలో ఐఎన్ఎల్డీ అధినేత ఓంప్రకాష్ చౌతాలా మనవడు దుష్యంత్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ ఉన్నారు. ఈ జాబితాలో ఇంకా. చెన్నైకి చెందిన డాక్టర్ జె.జయవర్ధన్, హీనా గవిత్, రక్షా నిఖిల్ కూడా ఉన్నారు. -
ఎందుకు ఓడిపోయామంటావ్..!
-
ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్సీపీదే హవా
ఒంటరిగా పోటీ చేసి అత్యధిక శాతం ఓట్లను సాధించిన పార్టీగా రికార్డు అన్నాడీఎంకే, బీజేడీ, తృణమూల్ కంటే అత్యధికం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే అరుదైన గౌరవం సాధించింది. ఈ ఎన్నికల్లో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో సొంత రాష్ట్రంలో ఎక్కువ ఓట్ల శాతం సాధించిన పార్టీగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. పొత్తులేవీ లేకుండా ఒంటరిగా పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో అత్యధిక శాతం ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు వారి సొంత రాష్ట్రంలో తెచ్చుకున్న ఓట్ల శాతం కంటే వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంతంలో సాధించిన ఓట్ల శాతం ఎక్కువ. ఈ ఎన్నికల్లో లోక్సభలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా స్థానం దక్కింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ప్రాంతీయ పార్టీల్లో ఏఐడీఎంకే 37 స్థానాలతో మూడో స్థానం, 34 సీట్లతో తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్కు 20, మహారాష్ట్రకు చెందిన శివసేనకు 18, టీడీపీ 16, టీఆర్ఎస్ 11 సీట్లు వచ్చాయి. తొమ్మిది సీట్లతో జాతీయ పార్టీ సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రెండూ సమానంగా నిలిచాయి. ఓట్ల శాతం విషయానికొస్తే.. ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే తమిళనాడులో సాధించిన ఓట్ల కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 0.1 శాతం అదనంగా ఓట్లు తెచ్చుకోగలిగింది. అన్నాడీఎంకేకు తమిళనాడులో 44. 3% ఓట్లు రాగా, బిజూ జనతాదళ్కు ఒడిశా రాష్ట్రంలో 44.1% ఓట్లు, తృణమూల్కు పశ్చిమబెంగాల్లో 39.3% ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో 44.4% ఓట్లను సాధించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ సైతం తెలంగాణ ప్రాంతంలో పోలైన మొత్తం ఓట్లలో కేవలం 34.75% ఓట్లనే సాధించగలిగింది. చివరకు సీమాంధ్రలో అధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి కూడా.. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లకన్నా దాదాపు 4% తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ- టీడీపీ కూటమిగా పోటీ చేయడం ద్వారా ఆ రెండు పార్టీలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్కన్నా 2% అదనంగా ఓట్లను తెచ్చుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్లో బలీయంగా ఉన్న ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీలు ఈ ఎన్నికల్లో వరుసగా 19.6%, 22.3% ఓట్లు మాత్రమే సాధించగలిగాయి. -
పొన్నూరులో టిడిపి దాడులు
-
టీడీపీ దాడి.. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి విషమం
అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా మారింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే వినుకొండ సమీపంలో ఓ వ్యక్తిని చంపేశారు. శనివారం నాడు పొన్నూరు మండలంలో బాలరాజు, సత్యానందం అనే ఇద్దరు వ్యక్తులను హతమార్చే ప్రయత్నం చేయగా, వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో వాళ్లను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సన్నిహితులు. టీడీపీకి ఎందుకు ఓటేయలేదు, వైఎస్ఆర్సీపీలో కొనసాగితే ఊరుకునేది లేదని బెదిరించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఎప్పుడు ఎవరొచ్చి దాడులు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి కాలంలో టీడీపీ వర్గాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ డాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే దాడులు చేశారు. -
పదవులొచ్చినా పగ్గాలేవి!
సాక్షి, ఏలూరు : జిల్లాలో నగర, పురపాలక సంఘాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినా పాలకవర్గాలు ఎప్పుడు కొలువు తీరతాయనే దానిపై స్పష్టత కొరవడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గెలిచిన అభ్యర్థులు పదవులు చేపట్టకుండా స్తబ్దుగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానిక సంస్థలు దాదాపు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. పాలన గాడిన పడే రోజు కోసం ప్రజలు, పదవి చేపట్టే సమయం కోసం గెలిచిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రెండు నెలల నిరీక్షణ 2010 సెప్టెంబర్తో పాలకవర్గం గడువు ముగిసిన ఏలూరు నగరపాలక సంస్థ, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 4 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవం కాగా, 287 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. నిజానికి ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అదేనెల 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టాలని నిర్ణయించారు. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కిం పు వాయిదా పడింది. ఈ నెల 12న పురపాలక ఫలితాలు ప్రకటించారు. ఇందుకోసం 43 రోజులు ఎదురుచూసిన అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా పదవి చేపట్టడానికి నిరీక్షించక తప్ప డం లేదు. మునిసిపల్ కౌన్సిల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటా రు. కొన్ని సందర్భాల్లో వీరి ఓటు అత్యంత కీలకం అవుతుంటుంది. అయితే గత శాసనసభ రద్దు కావడంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైతే తప్ప పాలకవర్గం ఏర్పాటుకు మార్గం ఏర్పడలేదు. ఈనెల 7న సార్వత్రిక ఫలితాలు వచ్చాక కూడా పురపాలక సంఘాల పాలకమండళ్ల ఏర్పాటుపై చలనం లేదు. ఎంపీల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. జూన్ రెండు తర్వాత కొత్త ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవీ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఏర్పాటవుతాయి. పాలకవర్గాలు ఉంటే తప్ప నిధులు విడుదలచేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పడంతో మునిసిపాలిటీలకు రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అవి రావాలంటే మరికొంత సమయం వేచి చూడక తప్పదు. -
అధినేత్రి వద్ద గోడు వెళ్లబోసుకున్న మాజీలు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణలో పార్టీ ఓటమి గల కారణాలను ఏకరువు పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకొస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయామని సోనియా వద్ద మాజీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతగా అపాయింటెడ్ డే రోజున వేడుకలు జరుపుతామని అధినేత్రిని కోరారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో ఆపార్టీ రెండు ఎంపీ స్థానాల మాత్రమే గెల్చుకుంది. -
'తెలంగాణ ఏర్పాటులో భాగమైనందుకు గర్వపడుతున్నాం'
-
ఓటమికి కారణమేమి‘టి’..?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు లోక్సభ ఎన్నికల్లో పరాజయానికి కారణాలు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినా ఓటమిపాలవడానికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి నివాసంలో టీ మాజీ ఎంపీలంతా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, వివేక్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరు జైపాల్రెడ్డితో చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్పార్టీనే అన్న అంశాన్ని జనంలోకి బలంగా తీసుకుపోవడంలో విఫలమయ్యామని వారు విశ్లేషించుకున్నట్టు సమాచారం. రాష్ట్ర సాధనలో సమష్టిగా పోరాడినట్టే ఎన్నికల ప్రచారంలో కలిసి ముందుకు వెళ్లలేకపోయామని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఇన్చార్జీలు, ఇతర ద్వితీయ శ్రేణి నాయకుల వ్యవహార శైలి కారణంగానే ఓటమి పాలయ్యామని మరికొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తమకు స్వేచ్ఛ ఇవ్వలేదని, అభ్యర్థుల ఎంపికలో కొందరు సీమాంధ్ర నాయకుల మాటలను పరిగణనలోకి తీసుకున్నారన్న వాదనలు కొందరు వినిపించినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గెలిచే అభ్యర్థులకు, తమకు అనుకూలంగా ఉండే వారికి సీట్లు ఇప్పించుకుని ఉంటే వారంతా తమ గెలుపునకు సహకరించేవారన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చినట్టు సమాచారం. కాగా, తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై ఓ నివేదికను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపాలని వీరు తీర్మానించినట్టు తెలిసింది. -
రాహుల్ బృందంపై కాంగ్రెస్లో విమర్శలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్లోని ఓ వర్గం నేతలు ‘రాహుల్ బృందం’పై మాటల దాడికి దిగారు. రాహుల్ సలహాదారులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేదని విమర్శించారు. పోల్ మేనేజ్మెంట్లో ఎటువంటి పాలనానుభవం లేని వ్యక్తులే కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై కలత చెందే తాను ఈ విమర్శలు చేస్తున్నానని...పార్టీపై తనకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ తిరిగి పుంజుకోవాలన్నదే తన వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఇకపై క్షేత్రస్థాయిలో పాలనానుభవం ఉన్న వారికే నాయకత్వ పదవులు ఇవ్వాలని సూచించారు. దేవ్రా వ్యాఖ్యలను పార్టీలోని సీనియర్ నేత సత్యవ్రత్ చతుర్వేది సమర్థించారు. పార్టీలోని సమస్యలు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు నిష్కర్షగా, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాదత్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ప్రజలతో పార్టీ నేతలు మమేకం కాకపోవడం వల్లే మహారాష్ట్రలో పార్టీ దెబ్బతిన్నదని ఆమెకు వివరించారు. దేవ్రా, ప్రియాదత్లు లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలవడం తెలిసిందే. మరోవైపు ఈ నెల 24న ఢిల్లీలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. -
సీఎం పదవి వదులుకోను: వీరభద్ర సింగ్
న్యూఢిల్లీ: తన పదవికి రాజీనామా చేయబోనని కాంగ్రెస్ నాయకుడు, హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ స్పష్టం చేశారు. తనను ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదని చెప్పారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆయన కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని, ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓటు వేశారని పేర్కొన్నారు. తమకు రెండు లేదా మూడో స్థానం దక్కినంత మాత్రానా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో హిమచల్ ప్రదేశ్ లోని నాలుగు స్థానాలను బీజేపీ గెల్చుకున్న సంగతి తెలిసిందే. -
ములాయం, మాయ, కాంగ్రెస్ ల కొంప ముంచిన యూపీ ఫలితాలు
తాజా ఎన్నికల ఫలితాలతో ములాయం, మాయావతిలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇరు పార్టీలు, వీటితో పాటు కాంగ్రెస్ పూర్తిగా యూపీలో తుడిచిపెట్టుకుపోయాయి. మొత్తం 80 లోకసభ స్థానాల్లో 71 స్థానాలను బిజెపి గెలుచుకుంది. కులాల ఆధారంగా ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా లెక్కలో లేకుండా పోయాయి. మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్ పీకి ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ఈ సారి లోకసభలో బిఎస్ పీ సభ్యులు ఒక్కరు కూడా ఉండరు. కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మినహా మరెవరూ గెలవలేదు. అయిదుగురు మంత్రులు సహా మొత్తం 14 మంది సిట్టింగ్ ఎంపీలు మట్టి కరిచారు. ఇక ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి అయిదు సీట్లు వచ్చాయి. అయితే ఈ అయిదుగురు ములాయం కుటుంబ సభ్యులే. ములాయం రెండు సీట్లనుంచి, ఆయన అల్లుళ్లు అక్షయ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ లు మాత్రమే గెలవగలిగారు. లోకసభ ఎన్నికల ఫలితాల ప్రకారం బిజెపికి 335 అసెంబ్లీ స్థానాలు రావచ్చు. సమాజ్ వాదీ పార్టీ కేవలం 37 సీట్లలో తొలి స్థానంలో ఉంది. ఇక బిఎస్ పీ కేవలం 9 మంది ఎమ్మెల్యేలను గెలుచుకునే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కి 13 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. కుర్మీ కులస్తుల్లో బలంగా ఉన్న అప్నా దళ్ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పార్టీ దాదాపు 11 సీట్లు గెలుచుకోవచ్చు. బిజెపి అన్ని కులాల్లో బలాన్ని పెంచుకుంది. ముఖ్యంగా ఓబీసీలు పార్టీ పైపు భారీ సంఖ్యలో వచ్చారు. బిజెపి తరఫున గెలిచిన వారిలో అయిదుగురు లోధాలు, ఆరుగురు కుర్మీలు, ఇద్దరు గుజ్జర్లు, అయిదుగురు జాట్లు ఉన్నారు. యాదవ ఓట్లలోనూ భారీ ఎత్తున చీలిక వచ్చింది. దీంతో ములాయం పార్టీ మట్టి కరిచింది. ఇప్పుడు ఫలితాల తరువాత ములాయం సిగ్ పార్టీ యూపీ యూనిట్ ను రద్దు చేశారు. బీఎస్ పీ కూడా మొత్తం తన పార్టీ రాష్ట్ర స్థాయి యూనిట్టన్నిటినీ రద్దు చేసింది. ఆరుగురు జోనల్ సంయోజకులను కూడా తొలగించింది. ఎస్ పీ, బీఎస్ పీ, కాంగ్రెస్ లు ఇప్పుడు మోడీ సునామీని రాబోయే రోజుల్లో ఎలా తట్టుకోవాలన్న విషయంపై తర్జన భర్జనలు పడుతున్నాయి. మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తూండటంతో దానికి తగిన వ్యూహాలను పదును పెట్టుకునే పనిలో పడ్డాయి. -
పరాజయ భారంతో.. నేడు రాజీనామా!
ఈశాన్య రాష్ట్రమైన అసోంను ఏకఛత్రాధిపత్యంగా పదమూడేళ్లుగా అప్రతిహతంగా పాలిస్తున్న తరుణ్ గొగోయ్.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని, ఇకమీదట ముఖ్యమంత్రి పదవి వద్దని చెబుతూ గురువారం నాడే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే అసోంలో ఈసారి బీజేపీ పాగా వేసింది. అక్కడ మొత్తం 14 లోక్సభ స్థానాలుండగా.. ఏడింటిని బీజేపీ సొంతం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మూడంటే మూడే స్థానాలు దక్కాయి. మరో మూడు స్థానాలను అస్సాం యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏయూడీఎఫ్) గెలుచుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ మాత్రం ఎలాగోలా తమ కుటుంబ ప్రతిష్ఠను కాపాడుతూ కలియాబార్ పార్లమెటరీ నియోజకవర్గంలో 94వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. 2001 నుంచి అసోంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. గొగోయ్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే క్రమశిక్షణ రాహిత్యం, ముఠాతత్వం లాంటివి ఇటీవల అక్కడ ఎక్కువైపోయాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుందని తెలుస్తోంది. 2009లో ఏడు సీట్లను సాధించిన కాంగ్రెస్, ఈసారి వాటిలో నాలుగింటిని కోల్పోయింది. ఆరు స్థానాల కంటే తక్కువ వస్తే రాజీనామా చేస్తానని ముందే చెప్పినందున అలా చేస్తున్నట్లు గొగోయ్ చెప్పారు. -
ఒంటరులే.. విజేతలు!!
నేను సింగిల్.. అవుదాం మింగిల్ అనుకుంటూ పాటలు పాడేస్తున్నారా? కాసేపు ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఓసారి విశ్లేషించి చూసుకుంటే, ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో కూడా పెళ్లికెందుకు తొందర అని మీరు అనుకోక తప్పదు. కొత్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం పురుచ్చితలైవి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వీళ్లంతా ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్లే. మరో పోలిక ఏమిటంటే.. వీళ్లంతా ఒంటరులే. కొత్త ప్రధాని నరేంద్రమోడీకి పెళ్లయినా కూడా చాలాకాలంగా ఆయన బ్రహ్మచర్యాన్నే పాటిస్తున్న విషయం ఇప్పుడు బహిరంగ రహస్యం. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి, రోజుకు ఐదారు బహిరంగం సభల్లో పాల్గొని, ఎన్నికల వ్యూహాలు రూపొందించి.. ఒకరకంగా ఒంటిచేత్తో బీజేపీకి ఎవరితోనూ కూటమి కట్టాల్సిన అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ అందించారు. ఒడిషాలో బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఘోటక బ్రహ్మచారి. దేశమంతా నరేంద్రమోడీ గాలి వీస్తున్నా.. దానికి ఎదురొడ్డి నిలిచి గెలిచిన విజేత ఈయన. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగిన ఒడిషాలో నవీన్ సారథ్యంలోని బీజేడీ విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 115 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే మొత్తం 21 లోక్సభ స్థానాలకు గాను 20 స్థానాలు గెలుచుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా బ్రహ్మచారిణే. రాష్ట్రంలో తన ప్రాభవాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉండగా, ప్రతిపక్ష డీఎంకేకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకంగా 37 సీట్లు ఎగరేసుకుపోయారు. మిగిలిన రెండింటిలో కూడా ఒకచోట బీజేపీ, మరోచోట పీఎంకే గెలిచాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలు గెలుచుకున్నా.. ఈసారి ఆ పార్టీని జయయలిత అథఃపాతాళానికి తొక్కేశారు. శారదా చిట్ఫండ్ స్కాంతో ప్రతిష్ఠ మసకబారినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు దాటినా, ప్రభుత్వంపైన.. సీఎం పైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా కూడా మమతా బెనర్జీ తన దమ్మేంటో చూపించారు. వామపక్షాల దుమ్ము దులిపేశారు. పశ్చిమబెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉంటే, వాటిలో 34 సీట్లను సొంతం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో కేవలం 19 సీట్లే గెలుచుకున్నా, ఈసారి వామపక్షాల ఖాతాలోని మొత్తం 15 సీట్లనూ కొల్లగొట్టి తృణమూల్ బలాన్ని 34కు చేర్చారు. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న రెండు స్థానాలను మాత్రమే లెఫ్ట్ఫ్రంట్ గెలుచుకోగలిగింది. మమతా బెనర్జీ కూడా ఘోటక బ్రహ్మచారిణే అన్న విషయం కూడా తెలిసిందే. ఇలా.. ఈసారి ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన నలుగురూ ఒంటరి జీవితాలు గడుపుతున్నవాళ్లే. దీనిపై ఓ పరిశోధన కూడా జరిగింది. ఒంటరి జీవితం గడిపేవాళ్లకు ఎక్కువ సమయం ఉంటుందని, ఇంట్లో ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి సులభంగా పనులు చేసుకోగలరని అంటున్నారు. అలాగే ఇంట్లో ఎవరితో గొడవలు కూడా కావు కాబట్టి పని సులభంగా అవుతుందనీ చెబుతున్నారు. అందుకే.. సోలో బతుకే సో బెటరు!! -
బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి
* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నాలుగేళ్లు కూడా నిండకుండానే సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి తన సత్తా చాటింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, సార్వత్రిక ఎన్నికలలోనూ తొలిసారి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించింది. దేశంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు అనేక పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. దశాబ్దాల చరిత్రగల పార్టీలు ఒక్క లోక్సభ స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవాన్ని చవిచూశాయి. వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి బలంగా వీచి మోడీ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగలిగింది. రాష్ట్రంలో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినిమా హీరో పవన్ కళ్యాణ్ను వెంటబెట్టుకొని తిరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, నాయకురాలు షర్మిలలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గణనీయమైన ఫలితాలు సాధించారు. వారి శ్రమకు ఫలితం దక్కింది. గ్రామీణ ప్రాంతాల ఓట్లర్లు ఆ పార్టీ పట్ల మంచి ఆదరణ చూపారు. * 2014 స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలోని 2571 మునిసిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 53 వార్డులను, సిపిఐ 16, బిజెపి 12, సిపిఎం 8, బిఎస్పి 5 వార్డులను మాత్రమే గెలుచుకోగా, తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి 942 వార్డులను గెలుచుకుంది. టిడిపి 1428 వార్డులను గెలుచుకుంది. * కార్పోరేషన్లలో అయితే టిఆర్ఎస్ 48, బిజెపి 4, కాంగ్రెస్ 2, సిపిఎం 3, సిపిఐ 2, బిఎస్పి ఒక్క స్థానంలో మాత్రమే గెలవగా, వైఎస్ఆర్ సిపి 124 స్థానాలను గెలుచుకుంది. మునిసిపల్ ఎన్నికలలో పోలైన ఓట్లలో టిడిపికి 45.18 శాతం ఓట్లు పోల్ కాగా, వైఎస్ఆర్ సిపికి 40.54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య 4.64 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. * ఈ ఎన్నికలలో 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది. 30 ఏళ్ల అనుభవం గల టిడిపి 5,216 ఎంపిటిసి స్థానాలను, 373 జడ్పిటిసి స్థానాలను గెలుచుకోగా, తొలిసారి పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి 4,199 ఎంపిటిసి స్థానాలను, 275 జడ్పిటిసి స్థానాలను గెలుచుకుంది. ఇంత చేసి ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం 3.07 శాతం మాత్రమే. * పార్టీ ఆవిర్భవించి కొద్ది కాలమే అయినా ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి క్రమశిక్షణ గల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఎటువంటి గొడవలకు తావులేకుండా లోక్సభ, శాసనసభ సీట్లను కేటాయించింది. కొత్తవారికి అనేకమందికి టిక్కెట్లు ఇచ్చినా ఎటువంటి వివాదాలకు తావులేకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ అభ్యర్థులకు సహకరించారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో టిడిపి, బిజెపిలలో వివాదాలు చెలరేగాయి. ఈ పార్టీల తరపు తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టిడిపి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. * వైఎస్ఆర్ సిపి విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అన్ని వర్గాల టిక్కెట్లు ఇచ్చింది. తిరుపతి, కుప్పంలలో మాజీ ఐఏఎస్ అధికారులను, మల్కాజ్గిరిలో మాజీ ఐపిఎస్ అధికారిని, అరకులో మాజీ గ్రూప్1 అధికారిని నిలిపింది. ఇంకా పిహెచ్డి, పిజి చేసిన అనేక మంది విద్యావంతులకు అవకాశం ఇచ్చింది. * టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి ప్రధాన్యత. కాపులకు, బిసిలకు, మైనార్టీలకు తగిన స్థాయిలో అవకాశం. * కొత్తవారికి, యువతకు అవకాశం ఇచ్చింది. ఎంపిలుగా గెలిచిన 9 మందిలో ఏడుగురు కొత్తగా లోక్సభలో అడుగుపెట్టనున్నారు. శాసనసభకు ఈ పార్టీ తరపున 45 మంది కొత్తవారు ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది గతంలో ఇతర పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరపున నిలిచి గెలిచారు. అటువంటి వారిలో సినీనటి రోజా, విశ్వేశ్వర రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి వంటి వారు ఉన్నారు. * పార్టీ కోసం శ్రమించిన శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డలో నామినేషన్ దాఖలు చేసిన తరువాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ తరపున మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బ్యాలెట్ పేపర్లో ఆమె పేరునే ఉంచారు. మరణించినా జనం ఆమెనే 17,928 ఓట్ల మెజార్టీతో ఎన్నుకొని ఘన నివాళులర్పించి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. * ఏపిలో అత్యధిక స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి కాబోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి అధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఆ జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలు ఉండగా, 8 స్థానాలలో వైఎస్ఆర్ సిపి విజయం సాధించింది. బిజెపి మొదటి సారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు రెండు లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 30 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ పార్టీ 282 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 2001లో ప్రారంభమైన టిఆర్ఎస్ 2004లో ఎన్నికలలో పోటీచేసి 26 శాసనసభ స్థానాలను, 5 లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఎన్నికలలో పోటీచేసి 16 శాసనసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగారు. ఆర్ఎస్ వంటి పార్టీ 63 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి రావడానికి 14 ఏళ్లు పట్టింది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వేవ్లో 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క లోక్సభ సీటును గానీ, ఒక్క శాసనసభ స్థానాన్ని గానీ గెలుచుకోలేకపోయింది. ఉభయ కమ్యూనీస్టు పార్టీలు, లోక్సత్తా పార్టీ పరిస్థితి కూడా అంతే. అవి ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఇటు దక్షిణాదిలో డిఎంకె(ద్రవిడ మున్నెట్ర కజగం), అటు ఉత్తరాదిలో బహుజన సమాజ్వాది పార్టీ, ఆస్సాం గణపరిషత్, నేషనల్ కాన్షరెన్స్ పార్టీలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవానికి గురయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న సమాజ్వాది పార్టీ కేవలం 5 స్థానాలతో, బీహార్లో అధికారంలో ఉన్న జెడి(యు) 2 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించింది. టిడిపికి గట్టి పోటీ ఇచ్చి 70 శాసనసభ స్థానాలను, 9 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. నాలుగేళ్లు (29.11.2010) కూడా నిండని వైఎస్ఆర్ సిపి అనతి కాలంలోనే ఇంతటి పోటీని తట్టుకొని ఇన్ని స్థానాలను గెలుచుకోవడం గొప్ప విజయంగా భావించవచ్చు. మోడీ గాలిలో కూడా ప్రజలు ఈ పార్టీని ఇన్ని స్థానాలతో గెలిపించి బలమైన ప్రతిపక్షంగా నిలిపారు. -
ఉత్తరాంధ్రలో మారిన లెక్కలు!
ఓటరు నాడి ఓ పట్టాన చిక్కదనడానికి తాజాగా జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని బట్టి విశదమవుతోంది. ఓటరు తీర్పు ఎప్పటికప్పుడు విలక్షణంగానే ఉంటుందనేది మరోసారి విస్పష్టమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పది, విజయనగరం జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 15 మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం జిల్లాలోని విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, తూర్పు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల మినహా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేచి చూడగా పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ఉత్తరాంధ్రలోని 29 నియోజకవర్గాల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస, నరసన్నపేటల్లోనే ఆధిక్యం కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందడం గమనార్హం! అయితే, ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిన పాతపట్నం, పాలకొండ, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేయడం విశేషం! ఆమదాలవలస పరిధిలో స్థానిక ఎన్నికల్లో 5,229 ఓట్ల ఆధిక్యం కనిపించినా, అసెంబ్లీకి వచ్చేసరికి ఈ నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి తమ్మినేని సీతారాం (వైఎస్సార్సీపీ)పై ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక నరసన్నపేటలో స్థానిక ఎన్నికల్లో 3,260 ఓట్ల ఆధిక్యాన్ని వైఎస్సార్సీపీ కనబరిచినా, అసెంబ్లీ ఫలితాల్లోకి వచ్చేసరికి ఇక్కడ బగ్గు రమణమూర్తి (టీడీపీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్సీపీ)పై 4,889 ఓట్ల మెజారిటీ సాధించారు. పాతపట్నం పరిధిలో స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, వైఎస్సార్సీపీకి ప్రత్యర్థి టీడీపీ కన్నా 1317 ఓట్లు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ అభ్యర్థి కలమట వెంకటరమణ (వైఎస్సార్సీపీ) తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (టీడీపీ)పై 3,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. పాలకొండలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 3,504 ఓట్ల ఆధిక్యం వచ్చినా, అసెంబ్లీ స్థానాన్ని మాత్రం వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజాంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ 4289 ఓట్ల ఆధిక్యం కనబరిచినా, అసెంబ్లీ ఫలితం వచ్చేసరికి కంబాల జోగులు (వైఎస్సార్ సీపీ) మాజీ స్పీకర్ ప్రతిభాభారతి (టీడీపీ)పై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈ జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, ఎచ్చెర్ల, టెక్కలి, శ్రీకాకుళం స్థానాలు స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో ఆధిక్యత కనబరిచిన టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. విజయనగరం జిల్లా ఫలితాలను విశ్లేషిస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబరిచిన బొబ్బిలి సెగ్మెంట్లో ఆ పార్టీయే గెలుపొందింది. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీకి 6384 ఓట్ల ఆధిక్యం రాగా.. అసెంబ్లీ అభ్యర్థి సుజయ్ కృష్ణరంగారావు టీడీపీ అభ్యర్థి లక్ష్మునాయుడుపై 7330 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ జిల్లాలో మరోరెండు స్థానాలను వైఎస్సార్సీపీ గెలుపొందింది. కురపాంలో స్థానిక ఎన్నికల ఫలితాల్లో 525 ఓట్లు తగ్గినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి పి.పుష్పశ్రీవాణి టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్పై 19వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం! సాలూరులో స్థానిక ఫలితాల్లో టీడీపీ 1654 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచినా, అసెంబ్లీకి వచ్చేసరికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజన్నదొర టీడీపీ అభ్యర్థి భాంజ్దేవ్పై సుమారు ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ జిల్లాలో మిగిలిన పార్వతీపురం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట సెగ్మెంట్లలో స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో టీడీపీదే పైచేయిగా ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా ఫలితాల సరళిని చూస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరిచిన పాడేరు (9282), అరకులోయ (21824), మాడుగుల (45) సెగ్మెంట్లలో ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఆధిక్యం కన్నా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పాడేరులో జి.ఈశ్వరి పాతికవేలకు పైగా, అరకులోయలో కిడారి సర్వేశ్వరరావు 33వేల పైగా, మాడుగులలో బూడి ముత్యాలనాయుడు ఐదు వేలపైగా ఓట్ల మెజారితో విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో స్థానిక ఫలితాల సరళిని బట్టి చూస్తే ఆరు నియోజకవర్గాల్లో ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. -అవ్వారు శ్రీనివాసరావు -
మన్యంపై వైఎస్ఆర్సీపీ పట్టు
సీతంపేట: సీమాంధ్ర పరిధిలోని మన్యంపై వైఎస్ఆర్సీపీ పట్టు సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి మినహా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్లోని ఐదు జిల్లాల పరిధిలో ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరుచోట్ల వైఎస్సార్సీపీకే ఏజెన్సీ వాసులు పట్టం కట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి ముడియం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి, విజయనగరం జిల్లా కురుపాం నుంచి పాముల పుష్పశ్రీవాణి, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో గిరిజనులకు సంబంధించిన పథకాల అమలు, పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిబంధనల ప్రకారం గిరిజన సలహా మండలిని ఏర్పాటుచేయాలి. దీనికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. వివిధ శాఖలకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. నాన్ అఫీషియల్ సభ్యులుగా ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. వీరంతా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించి, దాని అమలును పర్యవేక్షిస్తారు. అలాగే.. నిధుల వ్యయం, ఇతరత్రా అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఉండేవారు. ప్రతిపక్షానికి చెందిన ఒకరిద్దరినే నియమించేవారు. అది కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరిగేది. ఇప్పుడు పరిస్థితి వేరు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీలో ఒక్కరే ఎస్టీ ఎమ్మెల్యే ఉండటం, మిగిలిన వారంతా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకే చెందిన వారు కావడంతో ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారిని సలహా మండలి సభ్యులుగా నియమించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు శాసనసభ ఎస్టీ కమిటీలోనూ వీరికే ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది. ఫలితంగా గిరిజన సమస్యలపై స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసే అవకాశం వైఎస్ఆర్సీపీకి దక్కనుంది. -
టీఆర్ఎస్ మిత్రపక్షంగా బీఎస్పీ?
ఆదిలాబాద్: తెలంగాణలో ఖాతా తెరిచిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) టీఆర్ఎస్ సర్కారుకు మిత్రపక్షంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీఎస్పీ ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి (నిర్మల్), కోనేరు కోనప్ప (సిర్పూర్) గురువారం కేఆర్ఎస్ను కలిసి తమ మద్దతు ప్రకటించనున్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ ఎమ్మెల్యేలిద్దరు విజయం సాధించిన విషయం విధితమే. ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకునే స్థాయిలో బీఎస్పీ జిల్లాలో బలంగా లేకపోయినప్పటికీ, ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత చరిష్మాతో విజయం సాధించారు. కాగా, సర్కారు ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ టీఆర్ఎస్కు ఉన్నప్పటికీ, ఆ పార్టీ ఎంఐఎం మద్దతు కోరుతోంది. అలాగే, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ సర్కారుకు మిత్రపక్షంగా ఉండాలని యోచిస్తుండటం గమనార్హం. మరోవైపు నిర్మల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తోంది. ఇంద్రకరణ్రెడ్డి తన అనుచరులను బీఎస్పీ తరపున బరిలోకి దించిన విషయం విదితమే. -
లోక్సభకు ఎన్నికైన ఏకైక జంట
పాట్నా: బీహార్కు చెందిన పప్పు యాదవ్ దంపతులు లోక్సభలో అడుగుపెట్టనున్నారు. 16వ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వీరు పార్లమెంట్ దిగువసభలో కొలువుదీరనున్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక జంట వీరే కావడం విశేషం. పప్పు యాదవ్ గా ప్రసిద్ధుడైన రాజేష్ రంజన్ ఐదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మాధేపురా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ను 56 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. సపాల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పప్పు యాదవ్ భార్య రంజీత్ రంజన్... జెడీ(యూ) అభ్యర్థి దిలేశ్వర్ కామైత్పై దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి లోక్సభకు ఎన్నిక కావడం విశేషం. అయితే తమ సిద్ధాంతాలు, దారులు వేరైనా తమ లక్ష్యం ఒకటేనని పప్పు యాదవ్ దంపతులు నవ్వుతూ చెప్పారు. -
ఇక రొటీన్ !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయం ముగిసింది... ఎన్నికలు అయిపోయాయి... వాటి ఫలితాలూ వచ్చేశాయి. దీంతో జిల్లా ప్రజలు మళ్లీ యథాతథ జీవనంపై దృష్టి సారించారు. ఒకేసారి దూసుకొచ్చిన మూడు ఎన్నికలలో వివిధ పార్టీల తరఫున పనిచేసిన కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇప్పుడు రిలాక్స్గా ఫీలవుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయ బిజీతో పెండింగ్లో పెట్టిన పనులను పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇప్పటిదాకా రాజకీయ చర్చలతో కాలం గడిపిన వారంతా ఇక సొంత పనులు చక్కబెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ పాత వృత్తుల్లో నిమగ్నమైపోయారు. అధికార యంత్రాంగం విషయానికి వస్తే... ఎన్నికల కారణంగా పెండింగ్లో పెట్టిన పనులపై కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన గ్రీవెన్స్డే సోమవారం తిరిగి ప్రారంభమయింది. సాధారణ పనులు మొదలు పెట్టినప్పటికీ.. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావడానికి మాత్రం మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమై ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే పెండింగ్లో ఉన్న వాటితో పాటు నూతన అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెపుతున్నారు. ప్రస్తుతానికి విభజన లెక్కలు... ఇన్నాళ్లూ ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్న జిల్లా యంత్రాంగం ఇప్పుడు రాష్ట్ర విభజన లెక్కలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మూడు రకాల ఎన్నికల నిర్వహణ, వాటి ఫలితాల వెల్లడి ఘట్టాలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర లెక్కల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఉద్యోగుల పంపిణీతో పాటు నూతన రాష్ట్రంలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమయ్యే నిధులు, వార్షిక బడ్జెట్ ప్రణాళికలకు అనుగుణంగా నిధులు వ్యయం చేయాల్సిన తీరుపై ఉన్నతాధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించిన యంత్రాంగం ఏ శాఖలో ఎవరు తెలంగాణలో ఉండాలి, ఎవరు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే వరకు ఈ విభజన లెక్కల్లోనే ఉంటామని అధికారులు చెపుతున్నారు. పోలవరం ముంపు ప్రాంతంలోని గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన నేపథ్యంలో సరిహద్దుల ఏర్పాటు, నిర్వాసితుల పరిహారం ఫైళ్లు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇంకా కొన్ని పూర్తి కావాలి... విభజన లెక్కల పరిస్థితి అలా ఉంటే... జిల్లాలో మళ్లీ అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి మరో నెలరోజులు పట్టే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు జిల్లాలో కొత్త అభివృద్ధి పనులు ప్రారంభం కావని వారు చెపుతున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు పాలకవర్గాల ఏర్పాటు, జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికలాంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే ప్రజాప్రతినిధులు కొత్త పనుల ప్రారంభంపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనులు కొనసాగుతున్నప్పటికీ.. కొత్తగా ప్రారంభించాల్సిన వాటికి మాత్రం కొంత సమయం పట్టనుంది. అలా వెళ్లొద్దామా..! దాదాపు మూడు నెలలుగా రాజకీయాలతో బిజీగా గడిపిన వారంతా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎండాకాలం కావడంతో ఇప్పటికే చాలా మంది ఊర్లకు వెళ్లిపోగా, పాఠశాల సెలవులు కూడా ముగిసే సమయం వస్తుండడంతో వీలున్నంత త్వరగా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చోటా మోటా నాయకులు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. గెలిచిన వారు మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరగా, ఓడిన పార్టీ వారు కుటుంబాలతో కలిసి వెళుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పోలీసులు కూడా వరుస సెలవులు పెట్టి విహారయాత్రలకు పయనమవుతున్నారు. -
టీడీపీలో వెన్నుపోటుదారులెవరు..?
గిద్దలూరు, న్యూస్లైన్ : టీడీపీలో వెన్నుపోటుదారులున్నారని ఆ పార్టీ తరఫున గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన అన్నా రాంబాబు అనడంతో.. వారెవరా..? అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అన్నా రాంబాబు.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. తన ఓటమికి పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులే కారణమని, వారంతా సభ నుంచి ఇప్పుడే వెళ్లిపోవాలని అనడంతో కార్యకర్తలంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఎవరా వెన్నుపోటుదారులనుకుంటూ చర్చించుకున్నారు.రాంబాబు మాటలకు వేదికపై కూర్చున్న ఇద్దరుముగ్గురు నాయకులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారి మొహాల్లో కనిపించింది. దీంతో వారినుద్దేశించే రాంబాబు అలా మాట్లాడారేమోనని అక్కడున్నవారంతా అనుకున్నారు. అప్పులు తీర్చుకున్నసీజనల్ నాయకులు... రాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన సీజనల్ నాయకులు, గిద్దలూరు పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎన్నికల సీజన్లోనే ప్రజలకు కనిపిస్తారు. వీరెంతటి వారంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కోట్ల రూపాయలు తమ చేతిలో పెట్టి నిశ్చంతగా ఉండమంటారు. కానీ, ఈసారి ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలిచ్చినా వారి జేబులు నిండలేదు. అన్నా రాంబాబుకు సంబంధించి ఓటర్లకు చేరాల్సిన నగదును ఈ సీజనల్ నాయకులే దిగమింగారన్న వార్తలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. తన ఓటమికి కారణం అదేనని రాంబాబు మనసులోనూ తట్టబట్టే వందలాది మంది కార్యకర్తల ముందు వెన్నుపోటుదారుల గురించి మాట్లాడారని ప్రజలు చెప్పుకుంటున్నారు. భారీగా నగదుతో ఓ లాడ్జిలో ఉన్న రాంబాబు వర్గీయులను అదే పార్టీలో ఉన్న రాచర్లకు చెందిన ఓ సీజనల్ నాయకుడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పట్టించినట్లు తెలిసింది. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా రాంబాబు మాఫీ చేసుకున్నట్లు సమాచారం. కేవలం తనకు కోటి రూపాయల ప్యాకేజీ ఇవ్వలేదనే అక్కసుతోనే రాచర్లకు చెందిన ఆ సీజనల్ నాయకుడు ఇలా చేశాడని టీడీపీ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. హాస్యాస్పదంగా రాంబాబు మాటలు... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాక్షాత్తూ తన సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి అప్పట్లో అధికారంలోకి వచ్చాడని యావత్ రాష్ర్టం కోడై కూస్తోంది. అలాంటి పార్టీ తరఫున పోటీచేసిన రాంబాబు.. తన ఓటమికి పార్టీలోని వెన్నుపోటుదారులే కారణమని అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఉంటూ వెన్నుపోటుదారులు బయటకు వెళ్లాలని మాట్లాడటం చూస్తే..చంద్రబాబును కూడా బయటకు పొమ్మన్నట్లుగా రాంబాబు మాటల తీరు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓటమికి కారణాలేవైనప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరినీ రాంబాబు అనుమానించి దూషించడం సరికాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఈవీఎంలపై రగడ
చీరాల, న్యూస్లైన్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఒక కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు అధికారులు ప్రయత్నించిన వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం రాత్రి తరలించేందుకు ప్రయత్నించగా..సమాచారం అందుకున్న టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కాలేజీ వ ద్దకు ఇరుపార్టీల కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ క్షణంలో అయినా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో టియర్గ్యాస్, ప్రత్యేక బలగాలను తరలించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి ఈవీఎంలు ఉంచిన గదిని పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవోను సైతం టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని..ఈవీఎంలు ఉంచిన గది వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం..రాత్రివేళ ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం..స్ట్రాంగ్ రూం కిటికీలు తెరచి ఉంచడంపై తమకు సమాధానం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భర్త పోతుల సురేష్ నిలదీశారు. స్థానిక అధికారులు ముందుగా గదిలో ఉన్న ఈవీఎంల నంబర్లు తమకు ఇవ్వలేదని, ఇందులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రిటర్నింగ్ అధికారి పద్మజపై ఆరోపణలు చేశారు. స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని..ఎన్నికల అధికారి భన్వర్లాల్ పర్యవేక్షణలో ఈవీఎంల అక్రమ తరలింపుపై విచారణకు నాయకులు డిమాండ్ చేశారు. స్ట్రాంగ్రూంలో ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలే ఉన్నాయని డీఆర్వో, ఆర్డీవోతో పాటు స్థానిక అధికారులు చెప్పినా టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించి విచారణ జరిపించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా చీరాలలో ఉంచిన ఈవీఎంలను తరలించపోవడం వెనుక రెవెన్యూ అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నరహర ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. వీడిన అనుమానం.. ఈవీఎంల వ్యవహారంపై స్థానిక, జిల్లా అధికారులతో కాకుండా ఇతర అధికారులతో విచారణ చేయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ను టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణాధికారులుగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి ఆర్డోఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల తహశీల్దార్ వెంకటేశ్వర్లును నియమించింది. సాయంత్రానికి చీరాల వచ్చిన విచారణాధికారులు పార్టీల నాయకులతో చర్చించారు. అనుమానం ఉన్న ఈవీఎంలను అభ్యర్థుల సమక్షంలోనే సీలు తీసి పరిశీలించారు. మొత్తం అందులో ఉన్న 71 ఈవీఎంలను తనిఖీ చేశారు. అన్ని ఈవీఎంలలో రిజల్ట్ సున్నాలు రావడంతో అది రిజర్వ్, ట్రైనింగ్ ఈవీఎంలుగా విచారణాధికారులు నిర్ధారించారు. ఆ ఈవీఎంలలో అవకతవకలు లేవు కాలేజీలో భద్రపరచిన ఈవీఎంల పరిశీలన అనంతరం విచారణాధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో ఎటువంటి పోలు కాలేదని, అవి రిజర్వ్లో ఉంచినవని చెప్పారు. అయితే ఈవీఎంలను భద్రపరిచే విషయంలో స్థానిక ఎన్నికల, రెవెన్యూ అధికారులు నిబంధనలు విస్మరించారని, స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం వలనే వివాదం తలెత్తిందని తమ పరిశీలనలో తేలిందన్నారు. దీనిపై అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్కు నివేదించనున్నామన్నారు. దీంతో 24 గంటలుగా చీరాలలో ఉద్రిక్తతకు కారణమైన ఈవీఎంల వివాదానికి తెరపడింది. -
ఏం చేద్దాం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇచ్చిన చేదు ఫలితాలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహిం చని ఫలితాల దిగ్భ్రమ నుంచి ఆ పార్టీ దిగ్గజా లు ఇంకా తేరుకోవడం లేదు. ‘తెలంగాణ’ ఏ ర్పాటును సా నుకూలంగా మార్చుకోలేకపోయామన్న బాధతోపాటు, రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ ఆ పార్టీ నేతలలో సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుండగా, తమ వ్యూ హం ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. ప్రతికూల పరిస్థితులు, ఫలితాల నేపథ్యంలో ఏం చేయాలనే ఆలోచనలో వారు పడిపోయారు. రెండు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై కాంగ్రెస్లో అంతర్మథనం సాగుతుండగా, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపేందుకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు డీసీసీ సన్నాహాలు చేస్తోంది. ఇంతటి ఘోర పరాజయమా! సార్వత్రిక ఎన్నికలలో ఊహించని ఫలి తాల నుంచి కాంగ్రెస్ సీనియర్లు ఇంకా తేరుకోలేదు. అన్ని స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై ఇంకా ‘పోస్టుమార్టం’ సాగుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ, సురేశ్ షెట్కార్ ఓటమి కూడా వారిని ఆలోచనలో పడవేసింది. కొద్దిగా ప్రశాంతత కోసం కేడర్కు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి. వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మహ్మద్ షబ్బీర్అలీతోపాటు మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి ‘అసలేం జరిగిందో’నని ఫలితాలను విశ్లేషిస్తున్నారు. గెలుపు ధీమాలో ఉన్న ఈ ముగ్గురు నేతలకు ఓటమితో ఊహించని షాక్ తగిలింది. బాల్కొండ నుంచి ఆర్మూరుకు మారడంతో మాజీ స్పీకర్ సురేశ్రెడ్డికి కలిసి రావడం లేదు. ఆయన కూడా వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఈరవత్రి అనిల్ సైతం ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గ్రూపుల పోరూ కొంప ముంచింది. జిల్లాలో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితా లు రావడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి, సరైన మార్గదర్శనం, ప్లానింగ్ లేకపోవడంతోనే ఫలితాలు దారుణం గా వచ్చాయంటున్నారు. టీపీసీసీ తీరుపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తెలంగాణ’కు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలంగా వ్యవహరిం చిన అంశాన్ని ప్రచారంలో సానుకూలం గా మార్చుకోవడంలో టీపీసీసీ వైఫల్యం చెందిందన్న ఆరోపణలున్నాయి. ఇది లా ఉంటే జిల్లా కాంగ్రెస్లో ఉన్న గ్రూపు ల పోరు, ప్రత్యర్థులకు కలిసొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ‘తెలంగాణ ’ ప్రకటన సందర్భంగా పలు జిల్లాల్లో నేతలం తా కలిసికట్టుగా ‘కృతజ్ఞత’సదస్సులు నిర్వహించగా.. జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల నడుమ సంబరాలు జరుపుకోవడం అప్పట్లో చర్చనీయాం శం అయ్యింది. డీఎస్, సుదర్శన్రెడ్డి, షబ్బీర్అలీ, సురేశ్రెడ్డి, ఈరవత్రి అనిల్ వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్లో నాలుగు స్తంభాలాట నడుస్తుందని ప్రచారం కూడ జరిగింది. ఇవన్నీ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపగా.. ఇప్పటికైనా గ్రూపులు వీడుతారా? అన్న చర్చ కూడ జరుగుతోంది. -
ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు
వినాయక్నగర్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా గత నెల 22 వ తేదీన నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా ఆయన వచ్చారు. ఈ సభకు బంజారాల గురువు రామారావు మహారాజ్ మహారాష్ట్ర నుంచి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై నరేంద్రమోడీకి మహారాజ్ ‘విజయోస్తూ’ అంటూ ఆశీర్వదిం చారు. దేశంలో మోడీని ప్రధానిగా చూడాలని కాంక్షించిన నేపథ్యంలో ఇందూరు గడ్డపై మహారాష్ట్ర మహారాజ్ ఆశీర్వదం ఎంతగానో తోడైందని బంజారవర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో బీజేపీకి దేశప్రజలు అఖండ మెజారిటీని అందించారు. దీంతో ఆయన నవభారత నిర్మాణానికి పూనుకునేందకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
నీతి, నిజాయతీతో వ్యవహరిస్తాం
బెల్లంపల్లి, న్యూస్లైన్ : ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నీతి, నిజాయతీతో పనిచేసి ఉత్తమ సేవలు అందిస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశాలి భవన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజా వ్యతిరేక పాలనకు విసిగిపోయి ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలిపారు. రహదారులు, వాగులపై వంతెనలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దుకు తోడ్పడతానన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇద్దరు పేద బిడ్డలను గెలిపించి గుండెలకు హద్దుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది విద్యార్థి యువజనుల త్యాగఫలితంగానే తాము ఎన్నికల్లో విజయం సాధించామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా బెల్లంపల్లికి వచ్చిన ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, రాష్ట్ర నాయకులు ఎస్.నర్సింగం, జెడ్పీటీసీ సభ్యులు ఎం.సురేశ్బాబు, కొడిపె భారతి, అల్లి మోహన్, ఆర్.సత్తయ్య, బెల్లంపల్లి పట్టణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పి.సురేశ్, బి.అర్జయ్య పాల్గొన్నారు. -
జెడ్పీపై గులాబీ జెండాఎగరేస్తాం
సిద్దిపేటటౌన్, న్యూస్లైన్: జెడ్పీపై గులాబీ జెండాను ఎగరేస్తామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు చేరడంతో టీఆర్ఎస్ బలం 24కు పెరిగిందన్నారు.మరి కొందరు జెడ్పీటీసీ సభ్యులు త్వరలో పార్టీలో చేరుతారన్నారు. మెదక్, గజ్వేల్ మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకుంటామని చెప్పారు. మరో రెండు ఎంపీపీలపై గులాబీ జెండా ఎగురువేస్తామన్నారు. జిల్లాలోని మెజార్టీ ఎంపీపీలను కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీలను గెలుచుకున్నామని, జహీరాబాద్లో స్వల్ప మెజార్టీతో సీటు కొల్పోయామని చెప్పారు. నారాయణఖేడ్లో అన్నదమ్ముల పోటీ వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిసారి ఎదురుగాలి
చేవెళ్ల, న్యూస్లైన్: మూడు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్లోళ్ల కుంటుంబానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురుగాలి వీచింది. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో, 1999 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో అన్నీ తామై నడిపిన ఆ కుంటుబానికి నేడు ప్రాతినిథ్యం కరువైంది. 30 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చిన ప్రజల నుంచి మొదటిసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక కుటుంబం నుంచి ఒకేసీటు అనే నినాదాన్ని ఏఐసీసీ అమలుచేయడంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాలో ఆధిపత్యం చలాయించిన మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్రెడ్డి కోసం పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ను కార్తీక్రెడ్డికి కేటాయించింది. అయితే కార్తిక్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 26,685 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్పార్టీలో చేరినా ప్రజలు ఆదరించారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి సబితారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సైతం ఆమె విజయం సాధించారు. ఇలా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, సబితారెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 వరకు పట్లోళ్ల కుటుంబ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీకి రిజర్వ కావటంతో సబితారెడ్డి మహేశ్వరం జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నిరాశలో కార్యకర్తలు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతో నాలుగైదేళ్లుగా క్షేత్ర స్థాయిలో కార్తిక్రెడ్డి పనిచేశారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్ను కాపాడుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ నవనిర్మాణ పాదయాత్ర పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ వద్దగల ఆరెమైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల మీదుగా తాండూరు వరకు 101 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన రావడంతో ఎంపీ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారని భావించారు. రాహుల్ దూతలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించారు. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో పోటీ నెలకొన్నప్పటికి కార్తిక్రెడ్డి అధిష్టానం నుంచి టికెట్ సాధించగలిగారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. అనూహ్యంగా కార్తిక్రెడ్డి కంటే తెరాస అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చే వెళ్లతో పాటు నవాబుపేట, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండ లాల్లో ఏ ఒక్క చోటా కార్తిక్రెడ్డికి ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల్లోనూ వెనుకబడి పోవటం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అంతర్మథనంలో పడిపోయారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో లోక్సభకు మొత్తం 1,61,971 ఓట్లు పోలవగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి అత్యధికంగా 79,781 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 53,096 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా సబితాఇంద్రారెడ్డి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. -
ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ
సాక్షి, ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో మహా గెలుపును సాధించిన బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటి నుంచే కనీసం 150 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటోంది. 288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో శివసేన 171 స్థానాలు, బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన 45 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 46 స్థానాలు దక్కించుకుంది. దీంతో శివసేనకంటే ఒక్క స్థానం అధికంగా లభించడంతో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. 1994లో అధిక స్థానాలు దక్కించుకున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అధిక స్థానాలున్న శివసేనకే ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. అయితే 2009లో ఒక్కసీటు కారణంగా ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సీన్ మరింతమారేలా చేసింది. అధిక స్థానాలతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహాకూటమికి మొత్తం 51 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో బీజేపీకి 27.57 శాతం, శివసేనకు 20.82 శాతం ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. మారనున్న ఫార్ములా..? సీట్ల పంపకాలలో కొత్త ఫార్ములాతో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలకుపైగా శివసేన, బీజేపీల కూటమి కొనసాగుతోంది. దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే, దివంగత బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్ల హాయాంలో లోక్సభలో బీజేపీకి అధికంగా, అసెంబ్లీలో శివసేనకు అధిక సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 48 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ కోటాలోకి 26 రాగా, శివసేనకు 22 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో శివసేన కోటాలో 171, బీజేపీ కోటాలో 117 స్థానాలున్నాయి. అయితే గతంలో శివసేన, బీజేపీలే మిత్రపక్షాలుగా ఉండగా, ఈసారి మహాకూటమిగా మారిన ఈ కూటమిలో ఆర్పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని షేత్కారీ పార్టీ తదితరాలున్నాయి. దీంతో ఫార్ములా మార్చాల్సి రానుంది. శివసేన, లేకపోతే బీజేపీ నుంచి కొన్ని స్థానాలను వీరికి కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు బలం పెరగడంతో బీజేపీ 150 స్థానాల్లో పోటీచేస్తే శివసేన, ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించనున్నారనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమచారం. అయితే కొత్తఫార్ములాకు శివసేన ససేమిరా అంటుంది. పాతఫార్ములాతోనే పోటీ చేసినా కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయిస్తామని శివసేన పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మారుతున్న సీన్...? కాషాయ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత బాల్ఠాక్రే హాయాంలో ఏ నిర్ణయమైన ఆయనతో సంప్రదింపుల అనంతరమే తీసుకునేవారు. శివసేనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. అయితే బాల్ఠాక్రే మరణానంతరం మార్పువచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. సామ్నా దినపత్రికలో బాల్ఠాక్రే తనదైన శైలిలో ప్రత్యర్థులతోపాటు అవసరమైన సమయంలో మిత్రపక్షమైన బీజేపీపై కూడా విమర్శలు సంధించి తమ ప్రాధాన్యత ఏమిటన్నది చాటుకునేవారు. ఇటీవలే గుజరాతీయుల అంశంపై ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై నరేంద్ర మోడీ నిరసన తెలిపినట్టు సమాచారం. దీంతో వెంటనే ఉద్ధవ్ఠాక్రేతోపాటు ఇతర నాయకులు సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయంతో పార్టీ నాయకత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో సంజయ్ రావుత్ అధికారాలను కూడా కొంచెం తగ్గించారు. దీన్నిబట్టి కాషాయకూటమి(మహాకూటమి)లో కొంత సీన్ మారిందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమి లేదని శివసేన, బీజేపీలు పేర్కొంటున్నాయి. పాత పద్ధతిలోనే పోటీ: ఉద్ధవ్ సాక్షి, ముంబై: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్డీయేతో సమావేశం తర్వాత ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పటిష్టం చేసేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని, మంత్రి పదవులపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మంత్రి పదవులపై శివసేన తొందరపడడం లేదని, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే చర్చిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైన కలిసే తీసుకుంటామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని, దీంతో తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐకమత్యంతో శాసనసభ ఎన్నికలకు వెళతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏ విధంగా తిరస్కరించారో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని, ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును ఇప్పటికీ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు, ఒకవేళ అది మంచిది, సురక్షితమే అయితే దేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకైనా తరలించాలి. కానీ ఈ ప్రాజెక్టు మాకొద్దు అని స్పష్టం చేశారు. ఒకవేళ విద్యుత్ అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ‘మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకూటమి ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళతార’న్నారు. ఇతర అంశాలతోపాటు నష్టపరిహారం గురించి చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గురించి విలేకరులడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ నోరు విప్పలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ఏదైన అఘాయిత్యానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. -
మోడీ దెబ్బ ఆ పార్టీలకు గట్టిగానే తాకింది!
-
'ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తాం'
-
అఖిలేష్ మంత్రి వర్గం నుంచి 36 మందికి ఉద్వాసన
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ తన మంత్రి వర్గంలోని 36 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. సార్వత్రిక ఎన్నికలలో సవాజ్వాది పార్టీ ఓటమికి ఆ మంత్రులను బాధ్యులను చేస్తూ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చాలా తక్కువ స్థానాలను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉండగా, 71 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. సమాజ్వాది పార్టీ కేవలం 5 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అప్నాదల్ పార్టీలు చెరో 2 స్థానాలను గెలుచుకున్నాయి. -
సుపరిపాలనే ప్రధాన ఎజెండా: రాజ్నాథ్
న్యూఢిల్లీ: సుపరిపాలనే తమ ప్రధాన ఎజెండా అని, ఈ నినాదంతోనే ముందుకెళతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. స్వావలంబన, ఆర్థిక స్థిరత్వమున్న దేశాభివృద్ధే తమ లక్ష్యమన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ రోజు చరిత్రాత్మకమైందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లవిరిసిందన్నారు. దేశ చరిత్రలో అత్యధిక ఓట్లు నమోదు కావడం ఇదే ప్రథమం అన్నారు. పది రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించిందని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఎక్కువ స్థానాలు సాధించామని వెల్లడించారు. -
'సీఎం అవుతానని ఊహించలేదు'
పాట్నా: నేను ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రినవుతానని ఊహించలేదని బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జితన్ మంజీ అన్నారు. ముఖ్యమంత్రి కావడం ఆశ్చర్యం కలిగించిందని జీతన్ అన్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేయడం, రాజీనామా ఉపసంహరణకు ఆయన ససేమిరా అనడంతో జేడీయూ కొత్త సీఎంను ప్రకటించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో జితన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రిగా వ్యవహరించిన జితన్ రామ్ మంజీను నితీష్ ఎంపిక చేశారు. జితన్ ఎంపిక కూడా రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగింది. నితీశ్కు 68 ఏళ్ల జితన్ అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడనే పేరుంది. జెహానాబాద్ జిల్లాలోని మఖ్దుమ్పూర్(ఎస్సీ) నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మాజీ సీఎం కనబడుట లేదు!
శీర్షిక చదివి చకితులవకండి. ఇది నికార్సైన నిజం. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి నల్లారి వారు నలుసైపోయారు. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి నాలుగు రోజులైనా ఆయన దర్శనం లేదు. కనీసం మాట కూడా వినిపించలేదు. సమైక్య చాంపియన్ నేనేనంటూ భుజాలెగరేసి తన పార్టీని బరిలోకి దింపి భంగపడ్డారు కిరణయ్య. 'జై సమైక్యాంధ్ర'తో ప్రజలు జేజే అందుకోవాలన్న ఆయనగారి ఆశలు ఫలించకపోవడంతో ముఖం చాటేశారా? సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 150పైగా స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట కూడా ఆ పార్టీ విజయం గెలవలేదు. సొంత నియోజకవర్గం పీలేరు సీటైనా వస్తుందనుకున్న కిరణ్కు చేదుఅనుభవమే ఎదురైంది. అత్యధిక స్థానాల్లో జై సమైక్యాంధ్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఎన్నికల ఫలితాలు విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. పార్టీ ఓటమిపైన కానీ, పోలింగ్ సరళిపైన కానీ తన స్పందన వెల్లడించలేదు. అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులు ఎన్నికల ఫలితాలపై తమ స్పందన తెలిపారు. చివరి బంతి వరకు వేచిచూసే అలవాటున్న కిరణ్ ఈ విషయంలోనే అదే పంథా అనుసరిస్తున్నట్టు కనబడుతోంది. కిరణ్ ప్రత్యర్థులు మాత్రం మాజీ సీఎం కనబడుట లేదు అంటూ జోకులు పేలుస్తున్నారు. ఇప్పటికైనా పలుకైనా కిరణ్ పలుకుతారో, లేదో? -
ముంచింది నిర్లక్ష్యమే..!
- ఓటమిపై జిల్లా కాంగ్రెస్ నేతల పోస్ట్మార్టం - స్వయంకృతాపరాధం.. - కారు స్పీడే కారణం - టీపీసీసీకి డీసీసీ నివేదిక సాక్షి, మహబూబ్నగర్: అధికార పక్షం కాంగ్రెస్ జిల్లాలో ఆశిం చిన స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, విభేదాలే కొంపముంచాయనే అభిప్రాయానికి వచ్చారు. అందువల్లే జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు రెండోస్థానం లభించిందని.. కొన్నిచోట్ల స్వల్పఓట్ల మెజార్టీతోనే ఓడిపోయామని నివేదికలో జిల్లా కమిటీ పేర్కొంది. మరికొన్ని నియోజకవర్గాల్లోనైతే చివరివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం వంటి విషయాలు కూడా నష్టాన్ని కలుగజేశాయని వివరించింది. 2009 ఎన్నికల్లో ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత ఎన్నికల్లో కంటే ఒక సెంబ్లీ స్థానాన్ని అదనంగా సాధించుకున్నప్పటికీ.. చేరుకోవాల్సిన లక్ష్యాన్ని అధిగమించలేకపోయామని నివేదికలో పేర్కొంది. కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లో మూడోస్థానం, మహబూబ్నగర్లో నాలుగోస్థానానికి పార్టీ పడిపోవడానికి అనేక కారణాలను విశ్లేషించింది. నియోజకవర్గాల వారీగా.. మహబూబ్నగర్లో చివరివరకు అభ్యర్థి ఎంపికలో అధిష్టానవర్గం అవలంభించిన ఊగిసలాట ధోరణి, కొత్తగా కాంగ్రెస్లో చేరిన ఒక నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం వంటి విషయాల నేపథ్యంలోనే నాలుగో స్థానంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లినట్లు తేల్చింది. - నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పార్టీకి చెందిన కొందరు నాయకులు పలు ప్రలోభాలకు తలొగ్గి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కొంత నష్టం కలిగించిందని పేర్కొంది. కల్వకుర్తి నియోజకర్గంలో ఓ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించకపోవడం తీవ్రఇబ్బందికి గురిచేసినట్లు ప్రస్తావించారు. - షాద్నగర్, జడ్చర్ల, కొల్లాపూర్, దేవరకద్ర, అచ్చంపేట నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గాలి బాగా వీయడం కాంగ్రెస్కు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. నారాయణపేటలో కొత్త వారికి టికెట్ ఇవ్వడం వల్ల మొదటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారు సహాయ నిరాకరణ చేయడంతో ఇక్కడ ఓడిపోయినట్లు వివరించారు. - కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని టీఆర్ఎస్ బరిలో నిలపడం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని నాయకులు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు పార్టీ నుంచి వలస వెళ్లినప్పుడు కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులను ఆ నియోజకవర్గంలో కాపాడుకోవడంలో విఫలమవడం వంటి అంశాలు తీవ్రనష్టానికి గురిచేసినట్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో చతికిలపడిన టీడీపీ గెలుపొందిందని ఆ నివేదికలో పీసీసీ ఆవేదన వ్యక్తం చేసింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ తరువాత కారణాల నేపథ్యంలోనే తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొంది. ఈ గుణపాఠాల వెల్లువలో జిల్లాలో కాంగ్రెస్ను సంస్థాగతపరంగా భవిష్యత్లో మరింత పటిష్టం చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగుతామని ఆ నివేదికలో డీసీసీ వివరించింది. -
రచ్చ గెలిచి.. ఇంట గెలవకున్నా..
* పద్ధతి మార్చుకోని కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు * ఇక్కడ ఓడినా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ రెచ్చగొట్టే ర్యాలీ * పట్టణంలో ఓ సామాజికవర్గమే లక్ష్యంగా షాపులపై దాడులు * భయంతో షాపులు మూసి పరుగులు తీసిన వ్యాపారులు * తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలు కందుకూరు, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఓడామన్న బాధను బయటకు కనిపించకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివరాలు.. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దివి శివరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. నియోజకవర్గంలో ఓటమిపాలైనా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ పట్టణంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. కోటారెడ్డినగర్లోని దివి శివరాం ఇంటి నుంచి ఓవీరోడ్, పోస్టాఫీసు సెంటర్, పామూరు రోడ్, ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశారు. తమకు ఓట్లు వేయలేదని భావిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారి షాపులను టార్గెట్ చేశారు. పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న వేముల పాపయ్యగుప్తా జ్యూయలర్స్ (వీపీజీ జ్యూలయర్స్) ఎదుట కొందరు ద్విచక్ర వాహనాలు ఆపి హంగామా చేశారు. అనంతరం ఆ జ్యుయలరీ షాపును టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. షాపు అద్దాలు పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీలు కాకపోవడంతో పక్కనే ఉన్న సైకిల్ను బలంగా విసరడంతో షాపు అద్దాలు ధ్వసమయ్యాయి. దీంతో అప్పటికే షాపులో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో పాటు కూలీలు, యజమాని గజగజలాడిపోయారు. భయభ్రాంతులకు గురై షాపు షెట్టర్ వేసుకుని లోపలే ఉండిపోయారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు మొత్తం భయంతో తమ షాపులు మూసివేసి పరుగులు తీశారు. ర్యాలీ పామూరురోడ్డులోకి వచ్చే సరికి వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత దాడి జరిగిన వీపీజీ జ్యుయలరీ వద్దకు వచ్చిన దివి శివరాం.. షాపు యజమానితో మాట్లాడారు. ఏదో పొరపాటున అద్దాలు ధ్వంసమయ్యాయని సర్దిచెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. ఓట్లు పడలేదని నిర్ధారించుకునేదాడులు గెలుపు కోసం టీడీపీ నాయకుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వరుసగా మూడోసారి శివరాం ఓటమి పాలుకావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలన్నిటినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పట్టణంలో అధిక సంఖ్య లో ఓటర్లు ఉన్న ఓ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించగా ఎన్నికల్లో వారికి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలో అధిక మంది ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. తాము ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓట్లు సైతం తమకు పడలేదనే బాధ టీడీపీ నేతల్లో ఉంది. ఓటమికి గల కారణాలను అన్వేషించిన టీడీపీ నేతలు పట్టణంలో ఆ సామాజికవర్గం వారి షాపులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. పాత సంప్రదాయం పునరావృతం కందుకూరు అర్బన్, న్యూస్లైన్ : కందుకూరులో పాత సంప్రదాయం పునరావృతమైంది. నియోజకవర్గంలో ఓటమి తట్టుకోలేని టీడీపీ శ్రేణులు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంపై అక్కసు వెల్లగక్కాయి. నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఓడినా ఆ పార్టీ కార్యకర్తలు పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ ముందుగా ఊహించిన విధంగానే జరిగింది. టీడీపీ ఓటమిని తట్టుకోలేని ఆ పార్టీ కార్యకర్తలు తొలి రెండు రోజలు మౌనం వహించారు. తమ ఉనికిని ఏ విధంగానైనా చాటుకోవాలని భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న పేరుతో కందుకూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కోవూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం మీదుగా కావాలనే సాగించారు. అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఫ్లెక్సీలను చించేసి బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు భయంతో తలుపులు ముసికొని లోపలే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మీ అంతు చస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ రఫీ పూల కొట్టు ఎదురుగా తారాజువ్వలు కాలుస్తూ భయనక వాతావరణం సృష్టించారు. రఫీపై దాడి చేసేందుకు పక్కనే ఉన్న దేవాల యంలో 20 మంది టీడీపీ యువకులు సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ మధుబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన జ్యుయలరీ షాపును పోలీసులు పరిశీలించారు. సీఐ ఎం.మధుబాబు, పట్టణ ఎస్సై రమణయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్లో ఫిర్యాదు చేయాలని షాపు యజమానికి సూచించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వైఎస్సార్ సీపీ దూకుడు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు పడ్డాయి. పరిషత్పోరులో ఇప్పటికే ఆధిక్యత చాటుకుని జెడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్న ఆపార్టీ ... సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బలీయమైన శక్తిగా అవతరించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమైంది. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇటు లోక్సభ, అటు శాసనసభ ఎన్నికల్లోనూ ఆపార్టీకి ఓట్లశాతం కూడా గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 14 శాతం ఓట్లు అధికంగా వైఎస్సార్ సీపీకి నమోదుకావడం విశేషం. మొత్తంమీద జిల్లాలో ఓట్లశాతంలో, సీట్ల సాధనలో వైఎస్సార్ సీపీ దూసుకుపోయింది. గిరగిరమంటూ ‘ఫ్యాన్’గాలి జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీలు, నెల్లూరు కిందనున్న కందుకూరు అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి పోలైన ఓట్లను పరిశీలిస్తే.. 49.06 శాతం మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి జేజేలు పలికారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 24.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో 20,85,923 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్ సీపీకి 9,80133, టీడీపీకి 9,72,310, కాంగ్రెస్కు 16,837 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీకి పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకి 46.98 శాతం, టీడీపీకి 45.99, కాంగ్రెస్కు 0.76 శాతం ఓట్లు లభించాయి. లోక్సభ అభ్యర్థులకు పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకే అధికంగా 49.06 శాతం నమోదుకావడం విశేషం. ఆధిక్యతల విషయంలోనూ టీడీపీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రికార్డు సాధించింది. జిల్లాలోని 12 అసెంబ్లీలకు గాను 6 స్థానాల్లో పార్టీ పాగా వేసింది. యర్రగొండపాలెంలో పోలైన ఓట్లు మొత్తం 1,57,090 కాగా, ఇందులో 85,417 ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్రాజుకు అనుకూలంగా పడ్డాయి. సమీప టీడీపీ ప్రత్యర్థి బూదాల అజితారావు కంటే 19,150 ఓట్లు అధికంగా డేవిడ్రాజుకు మెజార్టీ రావడం విశేషం. గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్రెడ్డి 12,893 ఓట్ల మెజార్టీ సాధించారు. మిగిలిన నాలుగుస్థానాల్లో 10 వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇదే ఉత్సాహం.. ఊపును భవిష్యత్లోనూ చూపేందుకు ఉద్యమ చైతన్యాన్ని పార్టీకేడర్లో నూరిపోసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. -
మాగుంట నిర్వేదం
సాక్షి, ఒంగోలు: చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి. ఓటమితో కొందరు నేతల్లో నిర్వేదం మొదలైంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజకీయ భవిష్యత్పై అంతర్మథనంలో ఉన్నారు. ఆయన ఓటర్లకు పంపిణీ చేయాలని అందించిన డబ్బును సక్రమంగా వినియోగించకపోవడమే ఓటమికి కారణమని సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్కు గుడ్బై..చెప్పిన తర్వాత కొంతకాలం పార్టీ మార్పుపై సుదీర్ఘ మంతనాలు జరిపి టీడీపీ లోకొస్తే, పార్టీశ్రేణుల వైఖరి కారణంగా తనకెదురైన పరాభవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల కార్యాలయంలో సాంకేతిక సిబ్బందిని ఇతర పనులకు ఉపయోగించాలని... ఎన్నికల హంగులన్నీ తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై చివరి వరకు ఆశతో ఎదురుచూసిన మాగుంట ...ఫలితం అనుకూలంగా రాకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర నిర్వేదానికి లోనై టీడీపీ శ్రేణులపై అలకబూనినట్లు సహచరవర్గాల ద్వారా తెలుస్తోంది. మాగుంట ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బుపంపిణీ చేశారు. ఒంగోలు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఆర్థిక సహకారం భారీగానే సమర్పించుకున్నట్లు వినికిడి. అయితే, అందులో సగం కూడా ఓటర్లకు పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒంగోలు లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపులో వైవీ సుబ్బారెడ్డికి 5,84,209 ఓట్లు పడగా, మాగుంటకు మాత్రం 5,69,118 ఓట్లు పోలైనట్లు తేలింది. వైవీ సుబ్బారెడ్డి 15,095 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో తనకు తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరుల ద్వారా విచారణ చేయించగా, అక్కడ డబ్బు పంపిణీ సరిగ్గా చేయలేదనే విషయం బయటపడింది. రాజ్యసభ పదవికి ప్రయత్నాలు.. పార్టీని నమ్ముకుని రావడమే కాకుండా.. ఆర్థిక ఆసరా కల్పించిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఏదో ఒకటి నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని జిల్లా టీడీపీ పెద్దలు నడుంకట్టారు. ఇందులో భాగంగానే పలువురు నేతలు మాగుంటను కలిసి.. ఓటమిపై దిగులుపడొద్దని ఓదార్చినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీకాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పదవిని భర్తీచేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈస్థానం దక్కొచ్చు. నెల్లూరు జిల్లాతో సత్సంబంధాలు నడిపే మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజ్యసభ పదవిపై కన్నేశారు. ఎలాగైనా, ఆ పదవినైనా తనకు ఇప్పించాలని ఇప్పటికే పలువురు పార్టీపెద్దల వద్ద ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. ఆయనకు సుజనాచౌదరి మద్దతు ఉండటంతో .. జిల్లా నుంచి కరణం బలరాంతో పాటు పలువురు నేతలు గట్టిహామీనిచ్చారు. దీంతో కొందరు ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు సోమవారం హైదరాబాద్కు పయనమై వెళ్లారు. అయితే, చంద్రబాబు మాత్రం ఈపదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు...మాగుంటకు ఎంత వరకు అవకాశాలుంటాయనేది చెప్పలేమంటూ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. -
చీరాలలో ఈవీఎంల కలకలం
చీరాల, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు అధికారులు ఓ అభ్యర్థికి పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అధికారుల ఈవీఎంల తరలింపు ప్రయత్నం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా అధికారులు ఓ స్వతంత్ర అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి అతని గెలుపునకు కారణమయ్యారంటూ ఫలితాల అనంతరం నుంచి చీరాలలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టణ బంద్కు కూడా పిలుపునిచ్చారు. వివరాలు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల కోసం తెచ్చిన ఈవీఎంలను ఇప్పటి వరకు చీరాలలో ఉంచడంతో పాటు వాటిని అందరికీ అనుమానం వచ్చే రీతిలో రాత్రి వేళలో పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం కూడా ఇవ్వకుండా రహస్యంగా తరలించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.ఈవీఎంల తరలింపు వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఈవీఎంలు భద్రపరిచిన వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులెవ్వరూ అక్కడకు రాకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గ ఫలితాలపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టింది. సోమవారం రాత్రి రెవెన్యూ శాఖకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్, పోలింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వ్యక్తి, మున్సిపల్ సిబ్బంది కలిసి వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నం చేశారు. గది సీల్ తీసే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న కళాశాల వాచ్మెన్ తమ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఈ సమయంలో తీసుకెళ్తే తనకు ఇబ్బంది అవుతుందని, ప్రిన్సిపాల్ అనుమతి తీసుకోవాలన్నాడు. ఎన్నికల డీటీ ఝాన్సీరాణి కూడా వాటిని తీసుకెళ్లేందుకు అంగీకరించనట్లు సమాచారం. మిగిలిన వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ విషయం టీడీపీ, వైఎస్సార్ కార్యకర్తలకు తెలిసింది. పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, నాయకులను చూసి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది రెండు కార్లలో అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ వాహనాల్లో వెంబడించినా వారు కనిపించకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
ప్రజలకు అందుబాటులో ఉంటా..
జనగామ, న్యూస్లైన్ : తనను ఆదరించిన జనం రుణం తీర్చుకోలేనిది.. వారికి నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన తదుపరి సోమవా రం ఆయన తొలిసారి జనగామకు వచ్చా రు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ అభిమానాన్ని ఉద్యమం రూపంలో చూపిన ప్రజలు ఇప్పుడు ఓటు రూపంలో చూపి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. గెలుపు ఆనందం కన్నా హామీల బాధ్యతలు ఎక్కువయ్యాయని, వాటిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పా రు. కేబినెట్ ప్రారంభమైన వారం రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండా యాదగిరిరెడ్డి, నాయకులు కన్నా పరుశరాములు, రంగారెడ్డి, చేవెల్ల సంపత్, పసుల ఏబెల్, తిప్పారపు ఆనంద్, ఆలూరి రమేష్, ఆకునూరి వెంకన్న, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పొత్తుతో నష్టపోయాం
హన్మకొండ సిటీ, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు వద్దని పార్టీ శ్రేణులన్నీ మొత్తుకున్నా జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ ఓట్లు టీడీపీకి లాభించాయని, ఆ పార్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన వారి నాయకులు సహకరించలేదని ఆరోపించారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచామని, జిల్లాలో టీడీపీ గెలిచిన పరకాల, పాలకుర్తి సీట్లు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే సాధ్యమయిందని చెప్పారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా వారి నుంచి సహకారం అందలేదని, ఈ పరిస్థితి పునరావృతమైందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కష్టాలకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రబీ సీజన్లో మూడు సార్లు అకాల వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొత్త దశరథం, కాసర్ల రాంరెడ్డి, కుమారస్వామి, గాదె రాంబాబు, రావు అమరేందర్రెడ్డి, ఏదునూరి భవాని, కూచన రవళి పాల్గొన్నారు. -
కల్వకుర్తి కాంగ్రెస్దే..
బీజేపీ అభ్యర్థిపై 78 ఓట్లతో గెలిచిన వంశీచంద్రెడ్డి కల్వకుర్తి, న్యూస్లైన్: ఈవీఎంలో సాంకేతిక లోపంతో నెలకొన్న మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి విజేత ఎవరో తేలిపోయింది. హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి టి.ఆచారిపై 78 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సోమవారం వెల్దండ మండలం జూపల్లి గ్రామంలోని 119వ పోలింగ్బూత్లో జరిగిన రీపోలింగ్ విజేతను నిర్ణయించింది. ఈ బూత్ పరిధిలో వంశీచంద్రెడ్డికి 328 ఓట్లు, ఆచారికి 450, టీఆర్ఎస్ అభ్యర్థి జి.జైపాల్యాదవ్కు 55 ఓట్లు పడ్డాయి. ఈనెల 16న సాధారణ ఎన్నికల లెక్కింపు సందర్భంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జూపల్లి గ్రామ 119వ పోలింగ్ బూత్కు సంబంధించిన ఈవీఎం సాంకేతిక లోపంతో ఫలితాన్ని చూపలే కపోయింది. దీంతో ఫలితాన్ని నిలిపివేశారు. సోమవారం ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు. తర్వాత చల్లా వంశీచంద్రెడ్డిని విజేతగా ప్రకటించారు. కాగా, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,61,799 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి 42,782 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి టి. ఆచారికి 42,704 ఓట్లు వచ్చాయి. 29,844 ఓట్లతో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి జి.జైపాల్యాదవ్ మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డికి 13,818, స్వతంత్ర అభ్యర్థి కె.నారాయణరెడ్డికి 24,095 ఓట్లు పోలయ్యాయి. -
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్లైన్: ఎవ్వరూ అధైర్యపడవద్దు... ఓటమి కి కుంగిపోవద్దు... ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే... ప్రజాతీర్పును శిరసావహించి ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం తన నివాసంలో అర్బన్ నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజాతీర్పును గౌరవించాలని సూచించా రు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు తన ఇంటి తలుపులు తెరచి ఉంటాయని భరోసా ఇచ్చారు. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో మూడేళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిందన్నారు. ఇరుపార్టీల నడుమ ఓట్ల శాతం అతి స్వల్పమేనన్నారు. 67 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుని సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలిచామన్నారు. పాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పోరుబాట పడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా... పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసినా ఏనా డూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందేనన్నారు. ఈ ఐదేళ్లు ప్రజ ల మధ్యలో ఉండి, వారి సమస్యల పరి ష్కారానికి కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆదరిస్తారని సూచించారు. సమావేశంలో మైనార్టీ నేత సాలార్బాషా, పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్రెడ్డి, సిటీ యూ త్ అధ్యక్షుడు మారుతీనాయుడుతో పా టు గెలుపొందిన కార్పొరేటర్లు, డివిజన్ కమిటీ నాయకులు, మహిళా విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
టీడీపీకి ఓటేయలేదని పొట్ట కొడుతున్నారు!
సాక్షి, అనంతపురం : ఎన్నికల హడావుడి ముగిసిందో, లేదో అప్పుడే గ్రామాల్లో ‘రాజకీయాలు’ మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్న నెపంతో పలుచోట్ల టీడీపీకి చెందిన సర్పంచులు ఉపాధి హామీ పథకం కూలీల పొట్టకొడుతున్నారు. పనులకు అనుమతి నిరాకరిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూలీలు ఉన్నతాధికారులకు వివరిస్తున్నా లాభం లేకుండా పోతోంది. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో పనుల కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం ఆనవాయితీ. అయితే.. స్థానికంగానే పనులు కల్పించి వ లసలు ఆపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామాల్లో పనులు మంజూరు చేయాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమై తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని టీడీపీకి చెందిన సర్పంచులు కక్ష సాధిస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకిమద్దతు తెలిపారనే నెపంతో పనులకు ఆమోదం తెలపకుండా వాయిదా వేస్తున్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాప్తాడు మండలం గాండ్లపర్తిలో ఉపాధి పనులు కావాలని కూలీలు రెండు నెలలుగా అడుగుతున్నా గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ అనుమతి ఇవ్వడం లేదు. స్థానికసంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో తాము చెప్పిన పార్టీకి కాదని.. మరో పార్టీకి మద్దతు తెలిపారనే కారణంతో కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేది లేక పలువురు కూలీలు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని 838 గ్రామ పంచాయతీల్లో 3,173 పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకంటే రెట్టింపు పనులు కావాలని కూలీలు అడుగుతున్నా గ్రామాల్లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు. ఇంతకుముందు ఎన్ని పనులు అడిగితే అన్ని మంజూరు చేసేవారని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించి.. వారి స్థానంలో టీడీపీ సర్పంచులకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్రామాల్లో పనులు కల్పించకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు నిలిపివేసే పరిస్థితి ఉంది. అప్పుడు వారంతట వారే వెళ్లిపోయేలా వ్యూహాలు రచిస్తున్నారు. మా దృష్టికి వచ్చింది కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఉపాధి పనులకు ఆమోదం తెలపడం లేదని మా దృష్టికి వచ్చింది. అయితే.. రాజకీయాలు వేరు, పనులు వేరని ఇప్పటికే ఎంపీడీఓల ద్వారా సర్పంచులకు తెలియజేశాం. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం. - సంజయ్ ప్రభాకర్, పీడీ, డీడబ్ల్యూఎంఏ -
ఎంపీపీ పదవుల కోసం హంగ్లారుస్తూ..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రాదేశిక ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చిన మండల పరిషత్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. ఆయా మండలాల్లో కీలకంగా మారిన ఇతర పార్టీల ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు నడుపుతున్న వారు తమకు మద్దతు పలికితే వైస్ ఎంపీపీ పదవులతో పాటు కార్లు, ఇళ్లు, భూ ములు, పెద్ద ఎత్తున డబ్బు నజరానా ఇచ్చేందుకు సిద్ధపడు తున్నట్టు తెలిసింది. అయితే అందరికీ ఒకే రకమైన ఆఫర్లు ఇస్తుండడంతో అసలు ఎవరికి వైస్ ఎంపీపీ పదవులు కట్టబెడతారన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 12 మండలాల్లో కీలకం కానున్న టీడీపీయేతర ఎంపీటీసీలు జిల్లాలో 34 మండలాలు ఉండగా, ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 12 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికీ దక్కని పరిస్థితి ఏర్పడింది. బాడంగి, బలిజి పేట, భోగాపురం, దత్తిరాజేరు, గుర్ల, మక్కువ, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పార్వతీపురం, రామభద్రపు రం, సాలూరు మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. దీంతో అక్క డ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆయా మండల పరిషత్లను కైవసం చేసుకునేందుకు టీడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. అక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులతో పాటు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, గెలుపొందిన అభ్యర్థులు కీలకంగా మారారు. బంపర్ ఆఫర్లు.... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ఎలాగైనా జిల్లాలో పట్టు సాధించేందుకు హంగ్ ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ పదవులకు దక్కించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈ మేరకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గెలిచిన స్వతంత్రులను ఇప్పటికే రహ స్య ప్రదేశాలకు తరలించారు. వారిలో కొందరిని విహార యాత్రల పేరుతో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లా, షిర్డీ వంటి సూదూర ప్రాంతాలకు తీసుకువెళ్లారు. అయితే స్వతంత్రులు వచ్చినా కలిసి రాని మండలాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీల నుంచి పోటీ చేసి గెలుపొందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరికి స్వతంత్రుల కన్నా భారీ ఎత్తు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా మండల ఉపాధ్యక్ష పదవితో మరికొన్ని ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ఒకే మండలంలో ఇద్దరు ముగ్గురికి ఇదే తరహాలో ఆఫర్లు ఇస్తుండడంతో చివరికి ఆ పదవిని ఎవరికి కట్టబెడతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాజకీయాలను గమనిస్తున్న మరికొంతమంది గెలుపు వీరులు భారీ మొత్తంలో నజరానాలు ఆశిస్తుండడంతో వారి కోర్కెల చిట్టా తీర్చేందుకు స్థానిక నాయకులు జేబులు చింపుకోవాల్సి వస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
ఎంపీటీసీలుగా భార్యాభర్తలు
వేపాడ, న్యూస్లైన్: మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన భార్యభర్తల ఎంపీటీసీలుగా ఎన్నికయ్యా రు. సోంపు రం జంక్షన్ వద్ద నివాసం ఉంటున్న గళ్ల శ్రీరాములునాయుడు, ఆయన భార్య దంతేశ్వరీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పాటూరు నుంచి గళ్ల దంతేశ్వరి 956 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా.. గళ్ల శ్రీరాములునాయుడు దబ్బిరాజుపేట నియోజ కవర్గంనుంచి 42 ఓట్ల మెజార్టీతో విజయం సాధిం చారు. గతంలో పాటూరు ఎంపీటీసీగా దంతేశ్వరి ఐదేళ్ల పాటు ఎంపీపీగా పని చేశారు. -
కాంగ్రెస్, టీడీపీ దోస్తీ
ఎంపీటీసీ ఎన్నికల్లో పలుచోట్ల హంగ్ - ఎంపీపీ స్థానాల కోసం ఎత్తుకు పైఎత్తులు - చిరకాల ప్రత్యర్థులతోనూ చెలిమి - డోన్, బండిఆత్మకూరులో బొమ్మాబొరుసుతో నిర్ణయం - ఓర్వకల్లులో అధ్యక్ష ఎంపిక వాయిదా - మరో ఏడు స్థానాల కోసం పోటాపోటీ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమైంది. మండల పరిషత్ ఎన్నికల ఫలితాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. పలు మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారిపోతున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆలింగనం చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. జిల్లాలో ఇటీవల వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే తొమ్మిది స్థానాల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోవడంతో హంగ్ నెలకొంది. వీటిని ఎలాగైనా తమ ఖాతాలో జమ చేసుకోవాలనే తలంపుతో ఆ రెండు పార్టీలు రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. కొందరు స్వతంత్రులతో మంతనాలు నెరుపుతుండగా.. మరికొందరు శుత్రువులతో సైతం చేతులు కలుపుతున్నారు. గతంలో ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లోనే ఎంపీపీ ఎంపిక పూర్తయ్యేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంపీపీల ఎంపికకు సమయం ఉండటంతో.. రాజకీయ పార్టీలు శిబిరాల ఏర్పాటు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరిని రహస్య ప్రాంతాలకు తరలించారు. ఎంపీటీసీ అభ్యర్థులకు ఏమి కావాలో అడిగి తెలుసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో 53 ఎంపీపీ స్థానాలు ఉండగా.. 23 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 21 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన 9 స్థానాల్లో అధిక్యత కోసం పోటాపోటీ నెలకొంది. వెల్దుర్తిలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో 6 వైఎస్సార్సీపీ, 5 టీడీపీ, మరో 6 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ మద్దతు కోరుతున్నట్లు సమాచారం. కల్లూరులో 3 వైఎస్ఆర్సీపీ, 8 టీడీపీ, 6 స్వతంత్రులు, సీపీఎం ఒకటి గెలుచుకున్నాయి. ఎంపీపీ కోసం టీడీపీ పట్టుబడుతోంది. మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతోంది. కోడుమూరులో వైఎస్సార్సీపీ 8, కాంగ్రెస్ 7, టీడీపీ 2, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ఎంపీపీ పదవిని ఇతరులకు కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. - డోన్లోవైఎస్సార్సీపీ 9, టీడీపీ 9 స్థానాలను దక్కించుకోగా.. రెండు పార్టీల నేతల్లో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఎంపీపీ పదవి ‘అదృష్టం’పై ఆధారపడి ఉంది. - పాణ్యం మండల పరిషత్లో టీడీపీ బొక్క బోర్లా పడింది. ఎంపీపీ స్థానం ఎస్టీకి రిజర్వు అయ్యింది. అయితే టీడీపీ తరఫున ఎస్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్టీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో టీడీపీకి 8 ఎంపీటీసీ స్థానాలు వచ్చినా ప్రయోజనం లేకపోతోంది. ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకోనుంది. - బండిఆత్మకూరులో వైఎస్సార్సీపీ, టీడీపీకి చెరి ఏడు స్థానాలు దక్కాయి. ఇక్కడ ఎంపీపీ పదవి ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. - గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, కాంగ్రెస్ 3, టీడీపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. - ఓర్వకల్లులో వైఎస్సార్సీపీ 8, టీడీపీ 3, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలుపొందారు. కన్నమడకల స్థానం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి తిక్కలి వెంకటస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో అధ్యక్ష ఎంపిక వాయిదా పడనుంది. - సి.బెళగల్లో వైఎస్సార్ కాంగ్రెస్కు 6, టీడీపీకి 7, కాంగ్రెస్కు 3 ఎంపీటీసీ స్థానాలు లభించాయి. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీకి మద్దతిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకే ఎంపీపీ పదవి దక్కనున్నట్లు సమాచారం. -
‘కారు’దే జోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక ఎన్నికల్లో కారు రయ్మంటూ దూసుకెళ్లింది. జిల్లాలో పెద్దగా ప్రభావం లేని ఆ పార్టీ.. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బలపడి సత్తాచాటింది. మునుపెన్నడూ లేనంతగా.. అత్యధికంగా ఓట్లు సాధించి బలమైన పార్టీగా అవతరించింది. గత ఎన్నికల కంటే 22.27శాతం ఓట్లు అధికంగా సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే పార్టీలవారీగా వచ్చిన ఓట్లలో తెలుగుదేశం పార్టీ ముందువ రుసలో ఉండగా.. తెలంగాణ రాష్ట్ర సమితి రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో గత రెండు సాధారణ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతం (2009 ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాల్లో పోటీ చేయగా, 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా 4 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది.) జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 8 సీట్లు కైవసం చేసుకోగా టీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4స్థానాల్లో ‘కారు’దే జోరు పోటీ చేయగా ఒక సీటును సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2సీట్లతో సరిపెట్టుకుంది. ఓట్ల పరంగా టీడీపీ మొదటి స్థానంలో ఉంది. టీఆర్ఎస్ ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నికలు చెంపపెట్టుగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకత.. దీనికితోడు పార్టీలో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఈసారి 9.16శాతం ఓట్లు తగ్గి సీట్ల సంఖ్య భారీగా పడిపోయింది. టీడీపీకి ఈసారి సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓట్లు 1.46 శాతం మాత్రమే పెరిగాయి. తెలంగాణ రాష్ట్రసమితి అనూహ్యంగా బలపడింది. తెలంగాణ సెంటిమెంటు, దానికితోడు ప్రముఖ నేతలంతా పార్టీలో చేరి పోటీచేయడంతో కారుజోరు పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు ఓట్ల శాతం భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 6.64శాతం ఓట్లు సాధించగా.. తాజా ఎన్నికల్లో 28.92శాతం ఓట్లు పోలయ్యాయి. ఏకంగా 22.27 శాతం ఓట్లు పెరగడం విశేషం. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ సైతం బలపడింది. నాలుగుస్థానాల్లో పోటీ చేసి ఒక సీటు సాధించింది. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి 6.86శాతం ఓట్లు రాగా.. ఈసారి కేవలం నాలుగు స్థానాల్లో పోటీ చేయగా 5.92శాతం ఓట్లు వచ్చాయి. -
బదిలీల గుబులు
సాక్షి, రాజమండ్రి: అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడ్డాయి. కాంగ్రెస్ పాలన పూర్తిగా అంతరించింది. పదేళ్ల విరామం తర్వాత జిల్లాలో సింహభాగం సీట్లు గెలిచిన తెలుగు తమ్ముళ్లు ఇక నుంచి రాజ్యమేలనున్నారు. ఈ నేపథ్యంలో నేతల కు ఓటమి దిగులు పట్టుకుంటే.. అధికారుల్లో బదిలీల గుబులు పుట్టుకొస్తోంది. కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు అనుకూలంగా ఉండే అధికారులను తమ ప్రాంతాల్లో నియమించుకునేందుకు చర్యలు చేపట్టే అవకాశాలు ఉండడంతో జిల్లావ్యాప్తంగా అధికారుల్లో బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. ‘ఎస్.. సర్’ అనేవారి కోసం అధికారులకు ప్రతినిధులే ముఖ్యం కానీ రాజకీయ పార్టీలు కాదు. కానీ ఇంతవరకూ కాంగ్రెస్ పాలనలో పనిచేసిన అధికారులను మాత్రం కొత్తగా ఏర్పడుతున్న టీడీపీ ప్రతినిధులు సాగనంపాలని చూస్తున్నట్టు సమాచారం. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే, ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఈ దిశగా కొత్త ఎమ్మెల్యేలు రంగంలోకి దిగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలువగా, 12 మంది తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. ఒకరు ఇండిపెండెంట్, ఒకరు బీజేపీ తరఫున స్థానం దక్కించుకున్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో మాత్రం ఉన్న అధికారులను సాగనంపి అనుకూలంగా పనిచేసేవారిని రప్పించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ స్థాయి అధికారులతో పాటు, ఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్టుల ఉన్నతాధికారుల నుంచి మండల స్థాయి అధికారులపై కూడా నేతల వత్తిడి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను చిక్కుల్లో పెట్టాలంటే పోలీసు శాఖలో అనుయాయులు ఉండాల్సిందే. అందుకే ఎస్పీ నుంచి డీఎస్పీ, ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారుల వరకూ తమ మాటకు ‘ఎస్.. సర్’ అనే వారిని రప్పించుకోవాలని కొత్త నేతలు ఉబలాటపడుతున్నారు. సీనియర్లే చక్రం తిప్పనున్నారు కొత్తవాళ్లకు పరిపాలనా పరమైన అనుభవం ఉండదు కాబట్టి వీరు అధికారుల జోలికి పోకపోవచ్చు. టీడీపీ ప్రభుత్వం కావడంతో ఇతర పార్టీలు అధికారుల జోలికి వెళ్లే అవకాశాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు, సిట్టింగులు ప్రధానంగా అధికారులపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా నెగ్గిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి 1999 వరకూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఈయన కొన్ని శాఖల అధికారులపై గుర్రుగా ఉన్నారు. గత ఏడాది రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు గృహ నిర్మాణ శాఖ అధికారులకు బహిరంగంగా హెచ్చరికలు జారీచేశారు. రాజానగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తి వెంకటేష్ రెండోసారి గెలిచారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు తన నియోజకవర్గంలో సహకరించలేదని అసంతృప్తితో ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈయన గతం నుంచి జిల్లా యంత్రాంగంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా సిట్టింగ్ స్థానం నుంచి గెలిచారు. కాకినాడ సిటీ నుంచి గెలిచిన వనమాడి వెంకటేశ్వరరావు 1999లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ పదవి వరించడంతో తన పనులు సవ్యంగా పూర్తవ్వాలంటే తమకు కావల్సిన అధికారులను నియమించుకోవాలనే భావనతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. పనులవ్వాలంటే మనవారే ఉండాలి అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు తమ ఆదేశానుసారం జరిగేలా సహకరించే అధికారులు తమ వద్ద ఉంటే తమకు ఎదురు ఉండదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఐఏఎస్లను కూడా గతంలో తమకు అనుకూలంగా ఉన్నవారిని జిల్లాకు రప్పించుకునేందుకు సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. -
గజ్వేల్ లో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ
గజ్వేల్, న్యూస్లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు గజ్వేల్ నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఓ రకంగా గజ్వేల్ కాంగ్రెస్కు కంచుకోటగా మారింది. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు పార్టీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ముఖ్యనాయకులు సోమవారం హైదరాబాద్లోనితెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బస్సులు, డీసీఎం, సుమోలు, ఇతర వాహనాల్లో నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. వీరంతా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు కేకే, హరీష్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణల సమక్షంలో గులాబీ కండువాలను ధరించి టీఆర్ఎస్లో చేరిపోయారు. చేరికలు ముగిశాక కేసీఆర్ను ఆయన నివాసంలో కలుసుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నేతలు వీరే.. కాంగ్రెస్కు చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు జి.ప్రతాప్రెడ్డి, సలీం, వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట ముత్యాలు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ జనార్దన్రెడ్డి, ములుగు, తూప్రాన్, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు సింగం సత్తయ్య, సుమన, చిట్టి మాధురి, నియోజకవర్గంలోని సహకార సంఘాల చైర్మన్లు వెంకట్నర్సింహారెడ్డి, పోచిరెడ్డి, నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, మహీపాల్రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు విజయభాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అనంతుల నరేందర్, విద్యాకుమార్తోపాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లతోపాటు ముఖ్యనాయకులు ఇటిక్యాల లక్ష్మారెడ్డి, నిమ్మ రంగారెడ్డి, నాయిని యాదగిరి, ఊడెం కృష్ణారెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి కోసమే చేరిక: నర్సారెడ్డి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో... ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్ఎస్లో చేరినట్టు తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్కు కొందరు నాయకులు నియోజకవర్గంలో మిగిలి ఉన్నారని, వారిని కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. -
కలసి రాకనే...
సాక్షి ప్రతినిధి, గుంటూరు :టీడీపీ ముఖ్యనేతలు, ఆ పార్టీ పరాజిత అభ్యర్థుల మధ్య పరస్పరం ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. అధికారం వచ్చి వారం రోజులు కాకమునుపే ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. తన ఓటమికి నియోజకవర్గంలోని కొందరు నేతలే కారణమని ఓడిన అభ్యర్థులు ఆరోపిస్తుంటే.. ఆడలేక మద్దెల వోడన్నట్లు సమర్ధత లేక తమపై అభాండాలు వేస్తున్నారని అభ్యర్థులను తప్పుపడుతున్నారు నాయకులు. అభ్యర్థుల ఓటమిపై జిల్లా అధ్యక్షుడు, ముఖ్యనేతల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో త్వరలో అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితులపై సమీక్ష జరగనుంది. దీనికి ముందే పరాజిత అభ్యర్థులు తమ ఓటమికి కొందరి నాయకుల వెన్నుపోటు కారణమని పేర్కొంటుంటే, ఆ నాయకులు వీరి ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి మద్దాళి గిరిధర్ తన ఓటమికి నియోజకవర్గ ఇన్ఛార్జి జియావుద్దీన్ కారణమని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. అధినేతకు ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జయావుద్దీన్ డివిజన్లో తనకు వచ్చిన ఓట్లు ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఆ డివిజన్లో జియావుద్దీన్, అతని బంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ తనకు కేవలం 63 ఓట్లు వచ్చాయని గిరిధర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ వాదనను జియావుద్దీన్ పూర్తిగా ఖండిస్తున్నారు. తాను అన్ని విధాలుగా సహకరించానని, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆ డివిజన్లో ఎక్కువగా ఉన్న మైనార్టీలు ముస్తఫాకు ఓటు వేశారని చెబుతున్నారు. ఈ విధమైన ఆరోపణలు చేసి పార్టీలో తన కెరీర్కు ఆటంకం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జియావుద్దీన్ చెబుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సహాయ నిరాకరణపై బీజేపీ గుర్రు... నరసరావుపేటలో పరిస్థితి మరో విధంగా ఉన్నది. పొత్తు కుదుర్చుకున్న టీడీపీ నరసరావుపేటను బీజేపీకి కేటాయించింది. అక్కడి అభ్యర్థి డాక్టర్ నలబోతు వెంకటరావు జిల్లాలోని మిగిలిన అభ్యర్థులు కంటే ఎక్కువ డబ్బు ఖర్చుచేసినా టీడీపీ నేతలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్లనే ఆయన ఓటమి పాలయ్యారనే అభిప్రాయం బీజేపీలో వినవస్తోంది. ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కోడెల శివప్రసాద్కు సత్తెనపల్లిలో సీటు రావడంతో ఎక్కువ మంది అక్కడికి వెళ్లి ప్రచారం చేసినట్టు చెబుతున్నారు. ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారంలో పాల్గొనకుండా నాటకాలాడారని, పోలింగ్ రోజున టీడీపీ శ్రేణులు ఎవరి ఓట్లు వారు వేసుకొని చెట్ల కింద కాలక్షేపం చేశారే కాని మిగిలిన ఓట్లు పడటానికి ప్రయత్నించలేదని చెబుతున్నారు. తమను టీడీపీ నాయకులు మోసం చేశారని చెబుతూ ఇందుకు ఉదాహరణలు పేర్కొంటున్నారు. టీడీపీకి పట్టు ఉన్న యలమంద, రావిపాడు గ్రామాల్లో తమను ఆ పార్టీ వర్గీయులు పట్టించుకోకపోవటంతో వైఎస్సార్సీపీకి ఎక్కువగా ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. కోడెల పోటీచేస్తే కనీసం నియోజకవర్గంలో 16 గ్రామాల వరకు 75 శాతం పోలింగ్ టీడీపీకి అనుకూలంగా పడేదని, తమ అభ్యర్థి పోటీ వల్ల టీడీపీ వర్గీయులు పట్టించుకోకపోవటంతో ఆయా గ్రామాల్లో వైఎస్సార్సీపీకి సగం ఓట్లు పోలయ్యాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీటితోపాటు టీడీపీ ఓటమి పాలైన మంగళగిరి, బాపట్ల, మాచర్ల నియోజకవర్గాల్లోని కొందరు టీడీపీ నేతలు సొంతపార్టీ అభ్యర్థులకు సహకరించలేదని చెబుతున్నారు. గెలిచిన చోట్ల కూడా మెజార్టీ తక్కువ రావడానికి గల కారణాలు, మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలపై మూడు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్రెడ్డికి కొందరు ముఖ్యనేతలు సహకరించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమీక్ష సమావేశాల్లో నియోజకవర్గాల పరిస్థితులు వెలుగులోకి రానున్నాయి. -
దేశం..అధికార దర్పం
సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఆధిక్యం చాటుకున్న టీడీపీ ఇప్పుడు స్థానిక పాలనలో ముఖ్యమైన పరిషత్తు పీఠాల్ని కైవసం చేసుకునేందుకు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తోంది. జిల్లాలో ‘హంగ్’ ఏర్పడిన మండలాల్లో సంఖ్యాబలాన్ని సమీకరించేందుకు తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. వైఎస్సార్ సీపీ మెజార్టీ సాధించిన మండలాల్లోనూ తమ ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కైనా అధికార పీఠాన్ని సాధించేందుకు ఎత్తులు వేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశంతోనే నేతలు మండల పరిషత్తుల్ని కైవసం చేసుకునేందుకు ఎంపీటీసీలతో రాయ‘బేరాలు’ సాగిస్తున్నారు. గెలుపొందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలపై సామ, భేద, దాన, దండోపాయాల్ని ప్రయోగిస్తున్నారు. అధికారంలోకొచ్చినా, స్థానిక పాలనపై పట్టు లేకపోతే ఏమీ సాధించలేమని గెలుపొందిన వారికి నజరానాల ఎర వేస్తున్నారు. స్థానిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినా జూన్ 2 తర్వాతే పాలకవర్గాలు పగ్గాలు చేపట్టే వీలుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం తర్వాతే పాలకవర్గాలు కొలువుతీరనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిషత్తులకు ఎమ్మెల్యే, ఎంపీల ఓటు అవసరం లేకున్నా, మున్సిపల్ పాలకవర్గాలు కొలువుతీరిన తర్వాతే పరిషత్తు పాలకవర్గాలు పదవులు చేపట్టే అవకాశం ఉంది. దీంతో గెలుపు కిక్కుతో ఉన్న తెలుగు తమ్ముళ్లు శిబిరాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. స్వతంత్రులపై తీవ్ర ఒత్తిళ్లు జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 11 చోట్ల టీడీపీ మెజార్టీ సాధించింది. జిల్లాలో ఒక్క తాడేపల్లి మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ మట్టి కరిచింది. ఇక జిల్లాలోని 57 మండలాల్లో 30 మండల పరిషత్తుల్ని టీడీపీ కైవసం చేసుకోగా, వైఎస్సార్ సీపీ 22 మండల పరిషత్తులలో గెలుపొందింది. అన్ని మండలాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు వైఎస్సార్ సీపీ, టీడీపీ నడుమే సాగింది. రెండు నియోజకవర్గాల్లోని మండలాల్లో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మంగళగిరి, నరసరావుపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు. బాపట్ల, పిట్టలవానిపాలెం, ప్రత్తిపాడు, అచ్చంపేట నాలుగు మండల పరిషత్తులు హంగ్ దిశగా ఫలితాలు సాధించడంతో వీటిపై తెలుగు తమ్ముళ్ళు కన్నేశారు. కొన్ని మండలాల్లో వైఎస్సార్ సీపీ ఇండిపెండెంట్ల సహకారంతో పరిషత్తు పీఠాల్ని కైవసం చేసుకోనుండగా, ఇండిపెండెంట్లపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. మంగళగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబు గుంటూరు-విజయవాడ నడుమ రాజధాని ఏర్పాటు అంటూ టీడీపీ వర్గాలు గత మూడ్రోజుల్నుంచీ ప్రచారం తీవ్రతరం చేశాయి. మంగళగిరి నియోజకవర్గంలో మండల పరిషత్తులు, అధిక పంచాయతీలు వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. ఈ నియోజకవర్గంలో రెండు మునిసిపాలిటీలలో మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ ఆధిక్యం సాధించింది. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, మిగిలిన పార్టీలు కలిస్తే టీడీపీకి గడ్డు కాలమే. తాడేపల్లి మున్సిపాలిటీలో టీడీపీ చావుదెబ్బ తింది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ నేతల భూ దందాలు ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తుండటంతో ఎలాగైనా మంగళగిరి మండలాన్ని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ నేతల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మంగళగిరి విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్గా ఉండటంతో తెలుగు తమ్ముళ్ళు అంతర్మథనం చెందుతున్నారు. శిబిరాలకు ప్రతినిధుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయడం పరిశీలనాంశం. -
జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తా
జహీరాబాద్, న్యూస్లైన్: టీఆర్ఎస్ తరఫున జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన భీంరావు బస్వంత్రావు పాటిల్ సోమవారం జహీరాబాద్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు రాజేష్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జాతీయ రహదారిపై ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కుమార్ హోటల్ వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ టాపులేని జీపులో పార్టీ నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ఆయన ప్రజలకు అభివాదం చేశారు. ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు డప్పు, వాయిద్య కళాకారులు నృత్యం చేశారు. పలువురు కళాకారులు కూడా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు. ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు కె.మాణిక్రావు, ఎం.శివకుమార్, సి.బాగన్న, డి.లక్ష్మారెడ్డి, గౌని శివకుమార్, పి.నర్సింహారెడ్డి, జి.విజయకుమార్, మాణిక్యమ్మ, ఎం.పాండురంగారెడ్డి, ఎండీ యాకూబ్, అలీ అక్బర్, నామ రవికిరణ్, మురళీకృష్ణాగౌడ్, గౌసొద్దిన్, రాములు నేత, మంజులా కౌలాస్, రమాదేవి, రాములునేత, బండి మోహన్, లక్ష్మణ్ నాయక్, శంకర్నాయక్తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అన్నివిధాల అభివృద్ధి చేస్తా విజయోత్సవ ర్యాలీకి ముందు బీబీ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం తనకు ఆధిక్యతను ఇచ్చిందన్నారు. ప్రజల మద్దతను ఎన్నటికీ మర్చిపోనన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ , ఉపాధి రంగాలపై కూడా దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు మూలంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ఆయన హయాంలోనే తెలంగాణ పునర్నినిర్మాణం సాధ్యపడుతుందన్నారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సిద్దిపేట జిల్లా ఏర్పాటు తథ్యం!
సిద్దిపేట టౌన్, న్యూస్లైన్: సిద్దిపేట ప్రాంత వాసుల దశాబ్దాల ఆకాంక్ష త్వరలో నెరవేరనుంది. ప్రత్యేక జిల్లా ఆవిర్భావానికి మార్గం సుగమం కానుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టనుండడంతో కొత్త జిల్లా ఏర్పాటుపై ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురించాయి. మెదక్ జిల్లాలో సిద్దిపేట అతి పెద్ద పట్టణం. ఇది జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి145 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాం తంలోని నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే అనేక వ్యయప్రయాసాలకు ఓర్చుకోవాల్సి వస్తోంది. జిల్లాస్థాయి అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలోనే ఉండడంతో వివిధ పనులపై అక్కడికి వెళ్లడ ం అనివార్యం. కష్టనష్టాలను భరించి అక్కడికి వెళ్తే సంబంధిత అధికారి అందుబాటులో లేకపోతే మరింత వ్యధ. ఈ పరిస్థితిని దూరం చేసుకోవాలని నాలుగు దశాబ్దాలుగా పాదయాత్రలు, ఆందోళనలు, ప్రముఖులకు విజ్ఞాపనపత్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఎన్నికల ముందు ఈ నినాదం మార్మోగి ఆశలను రేపిం ది. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. కాగా ఆయన మరణంతో అది కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ.. 2001 సంవత్సరం నుంచి ప్రతి ప్రధాన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామంటూ హమీలిస్తున్నారు. తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీని సాధించడంతో చిరకాల స్వప్నం సాకారమయ్యే అవకాశం ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి దూరంగా ఉండడం.. తెలంగాణలో రెండో స్థానంలో సిద్దిపేట ఉండడం, సిద్దిపేట గడ్డ కేసీఆర్, హరీష్రావు రాజకీయ ఎదుగుదలకు కీలకంగా మారడంతో సిద్దిపేట జిల్లా తథ్యమని భావిస్తున్నారు. ప్రతిపాదిత సిద్దిపేట జిల్లా.. సిద్దిపేటతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలు సైతం జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, రామాయంపేట, తుప్రాన్, గజ్వేల్, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్, సిరిసిల్లా, హుస్నాబాద్, బెజ్జంకి, ఇల్లంతకుంట, నల్గొండ జిల్లా రాజాపేట, వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతాలను కలిపి సిద్దిపేట కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ప్రతిపాదనలను ఇప్పటికే రూపొందించారు. కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనలు పరిశీలించి యథాతథంగా లేదా స్వల్ప మార్పులతో ఆమోదిస్తే దశాబ్దాల కల కొన్ని నెలల్లోనే నిజం కానుంది. -
జగ్గారెడ్డి దారేది..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారా..? అవుననే అంటున్నాయి మారుతున్న రాజకీయ సమీకరణాలు. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ను సోమవారం అతని నివాసంలో జగ్గారెడ్డి కలుసుకోవడం వెనుక ఆంతర్యమిదేనని చర్చ జరుగుతోంది. మెదక్ లోక్సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన లోక్సభ స్థానానికి ఎన్నికైన నాటి నుంచి 15 రోజుల్లో రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లో మెదక్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యం కానుంది. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ చేతిలో 29 వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన జగ్గారెడ్డి ఇప్పుడు మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కేసీఆర్నే ఓడిస్తానని సార్వత్రిక ఎన్నికలకు ముందు జగ్గారెడ్డి పలుమార్లు సవాలు విసిరడం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తోం ది. ఈ క్రమంలోనే ఆయన పవన్ కల్యాణ్ మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒక వేళ జగ్గారెడ్డి పోటీకి సిద్ధమైతే, ఏ పార్టీ తరఫున బరిలో దిగుతారన్న అంశంపై ఊహగానాలు రేగుతున్నాయి. ఇంకా జనసేన పార్టీ నిర్మాణం పూర్తి కానందున, పవన్ కల్యాణ్ సహాయంతో బీజేపీ టికెట్ సంపాదించేందుకు జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జగ్గారెడ్డి తెలంగాణకు అవసరమని.. ఆయన సేవలను వినియోగించుకుంటామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొనడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. పవన్ అండ లభించేనా..? బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగ్గారెడ్డికి తొలినాళ్లలో ఆ పార్టీ దివంగత నేత ఆలె నరేంద్ర గాడ్ ఫాదర్గా ఉండేవారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరాక కూడా నరేంద్ర అండదండలు మెండుగానే ఉండేవి. ఆ తర్వాత కాలంలో కేసీఆర్తో విభేదించి కాంగ్రెస్లో చేరిన జగ్గారెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రులందరితో సన్నిహితంగా మెలిగారు. విలక్షణ వ్యవహార శైలి, వివాదస్పద వ్యాఖ్యలు, దుందుడుకు స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. అంతేకాకుండా సీఎంగా ఎవరుంటే వారికి మద్దతుగా ప్రతిపక్షపార్టీల నేతలపై ఆరోపణలు గుప్పించేవారు. అవసరమైతే సొంత పార్టీ వారినిసైతం వదిలేవారు కాదు. దీంతో టీ-కాంగ్రెస్లో ఆయన ఒంటరిగా మిగిలారు. కిరణ్కుమార్రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత జగ్గారెడ్డి తన దూకుడును తగ్గించుకున్నప్పటికీ సొంతపార్టీ నేతల మద్దకు దక్కలేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అండతో మళ్లీ కొత్తగా జనం ముందుకు వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతోంది. -
అసెంబ్లీపై రాజ్ గురి
సాక్షి, ముంబై: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన షాక్తో డీలాపడ్డ మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ఠాక్రే మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉబలాటపడుతున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మంచి జోష్ నింపి అనుకూల ఫలితాలు రాబట్టాలనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీని కిందిస్థాయి నుంచి పటిష్ట పరిచేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 స్థానాలను మించి ఎక్కువ స్థాయిలో సీట్లు దక్కించుకొని ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్గా మారాలని అనుకుంటున్న రాజ్ఠాక్రే ప్రజలను తమవైపునకు తిప్పుకునేలా వ్యూహ రచన సాగిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిచి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలనుకుంటున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంటుందని, శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారన్న ఆశాభావంతో ఉన్న రాజ్ఠాక్రే ప్రత్యర్థి పార్టీలకు దీటుగా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. శివసేనను చావుదెబ్బ తీయాలని భావించి బొక్కబోర్లా పడ్డ ఎమ్మెన్నెస్ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో అచితూచి అడుగులు వేయాలనుకుంటోంది. మోడీ గాలి బలంగా వీయడంతోనే శివసేన విజయం సాధించిందని అంటున్న రాజ్ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలే ఎక్కువ ప్రభావం చూపే అవకాశముండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకుంటామంటున్నారు. మహాకూటమి జోరును తట్టుకొని నిలబడగలిగే సత్తా ఉందని అంటున్న రాజ్ లోక్సభ ఎన్నికల్లో ఓటమి నుంచి ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకున్నామని, ఇది మా విజయానికి బాటలు పరుస్తుందని ఆశాభావంతో రాజ్ ఉన్నారు. వంద స్థానాలకు శివసేన గురి... లోక్సభ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టిన శివసేన అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. వందకుపైగా స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన నేతలెవరూ? ఎవరికి టికెటిస్తే గెలుస్తారు? స్థానిక సామాజిక లెక్కలు ఎలా ఉన్నాయి? వీటన్నింటిని బేరీజు వేసుకుంటోంది. మహాకూట మి అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు రావడంతో ఎమ్మెన్నెస్ ఇబ్బందుల్లో పడింది. అనేకచోట్ల శివసేనతో పోలిస్తే ఎమ్మెన్నెస్ అభ్యర్థులకు తక్కువ ఓట్లు పోలవడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటుందని శివసేన అంచనా వేస్తోంది. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలే శివసేనకు చాలా మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 171 స్థానాల్లో పోటీచేసిన శివసేన కేవలం 45 స్థానాలు గెలిచింది. ఇందులో ఎమ్మెన్నెస్ కారణంగా దాదాపు 27 స్థానాల్లో శివసేన ఓడిపోయింది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సదరు 27 స్థానాల్లో దృష్టిసారిస్తే ఈ ఎన్నికల్లో మహాకూటమికి భారీగా ఓట్లు పోలయ్యాయి. దీంతో మహాకూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కనీసం గతంలో వచ్చిన 12 స్థానాలైనా దక్కుతాయా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. -
కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపు
మహబూబ్నగర్: కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి ఆచారిపై 72 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలోని 119వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో ఈ రోజు రీపోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆ తరువాత ఓట్లను లెక్కించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపుతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 21కి చేరింది. -
రీపోలింగ్లో రిగ్గింగ్!
కొండాపురం: బ్యాలెట్ పేపర్లను చెదలు తినేయడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పుయర్రబల్లి ఎంపీటీసీ పరిధిలో ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని పొట్టిపల్లి, ఇస్కదామెర్ల, మన్నంవారిపల్లిలో పోలింగ్ జరిగింది. అయితే పొట్టిపల్లిలో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలిపారు. తమ ఏజెంట్లను బయటకు నెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఒక్కొక్కరు రెండు, మూడు ఓట్లు వేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామన్నారు. -
నితీశ్ ఔట్, బీహార్ కొత్త సీఎంగా మాఝీ
మోడీ ఎఫెక్ట్ తో ఒక పెద్ద వికెట్ పడిపోయింది. నితీశ్ కుమార్ స్థానంలో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జీతన్ రామ్ మాఝీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో బీహార్ లో అధికార జనతాదళ్ యునైటెడ్ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో చివరికి జనతాదళ్ యునైటెడ్ మాఝీని పార్టీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాడు. మాఝీ మక్దూమ్ పురా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం బీహార్ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు నితీశ్ మాఝీని వెంట తీసుకుని వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఆ తరువాత తన స్థానంలో మాఝీ సీఎంగా ఉంటారని ప్రకటించారు. బీజేపీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి జనతాదళ్ వేరుపడ్డ తరువాత జరిగిన ఎన్నికల్లో మొత్తం నలభై స్థానాల్లో జేడీయూ కేవలం 2 స్థానాలు గెలుచుకుంది. బిజెపి నుంచి వేరుపడాలని నితీశ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన శరద్ యాదవ్ వర్గం ఆయన రాజీనామాను కోరుతోంది. అయితే తన అనుచరుడినే సీఎంగా చేసి నితీశ్ యాదవ్ పై పైఎత్తు వేశారు. మరో వైపు 2015 ఎన్నికల్లో పార్టీ మళ్లీ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా నితీశ్ స్పష్టం చేశారు. -
ఎంపీలో ముగ్గురు 'ముదురు' ఎంపీలు
ఇండోర్: మధ్యప్రదేశ్లో లోక్సభకు కొత్తగా ఎన్నికైన 29 ఎంపీల్లో ముగ్గురు 70ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మరో 12 మంది 50 ఏళ్లు పైబడి వారున్నారు. సాగర్ స్థాన్ నుంచి ఎన్నికైన లక్ష్మీనారాయణ్ యాదవ్(73) అందరికంటే వయసులో పెద్దవారు. ఖజురహో ఎంపీ నరేంద్ర సింగ్(72), ఇండోర్ నుంచి వరుసగా 8వసారి ఎంపీగా ఎన్నికైన సుమిత్రా మహాజన్(71) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధార్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి గెలిచిన 35 ఏళ్ల సావిత్రి థాకూర్ చిన్న వయసున్న ఎంపీల్లో ముందున్నారు. మధ్యప్రదేశ్ 29 లోక్సభ స్థానాలుండగా అధికార బీజేపీ 27 స్థానాల్లో విజయం సాధించింది. -
ఆ తప్పు ఎందుకు చేశానని బాధపడుతున్న అజిత్ జోగీ
తను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఏమిటో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగీని చూస్తే తెలుస్తుంది. జోగీ బ్రహ్మాండమైన వ్యూహకర్త. ఊహకందని వ్యూహాలు వేయడం ఆయనకే చెల్లుతుంది. కానీ ఇప్పుడు అతి వ్యూహమే ఆయన ఎన్నకల వోటమికి కారణమైంది. ఛత్తీస్ గఢ్ మహాసముంద్ నుంచి పోటీచేసిన జోగీ, తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు, ఆయన ఓట్లు చెల్లాచెదరు కావడానికి తన ప్రత్యర్థి పేరే ఉన్న పదిమందిని బరిలోకి దింపారు. బిజెపి అభ్యర్థి చందురామ్ సాహుకి పోటీగా పది మంది చందూరామ్ సాహూలను రంగంమీదకి రప్పించారు. దీనిపై బిజెపి ఫిర్యాదు కూడా దాఖలు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఇంత చేసినా వెయ్యి ఓట్లతో జోగీ ఓడిపోయారు. ఇప్పుడు పది మంది చందూరామ్ ల ఓట్లు కూడా బిజెపి చందూరామ్ ఖాతాలో పడ్డాయన్నదే జోగీ గారికి అనుమానం. ఎన్నికల అధికారులు డమ్మీల ఓట్లన్నిటినీ బిజెపి చందూరామ్ లెక్కల్లో వేసేశారని ఆయన ఒక ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. 'నేను రోజురోజంతా లీడింగ్ లో ఉన్నా, రాత్రయ్యే సరికి నేను వెయ్యి ఓట్లతో ఎలా ఓడిపోయాను' అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఆరోపణల్లో నిజమెంతో తెలియదు కానీ 'ఇంతమంది సాహూలను దింపినందుకు కొంప మునిగింది' అని ఇప్పుడు జోగీ గారు బాధపడుతున్నారు. -
పాల్వాయిపై వేటుకు సిఫారసు
హైదరాబాద్: సొంత పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఏఐసీసీకి సిఫార్సు చేసింది. గాంధీభవన్లో నేడు జరిగిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పాల్వాయికి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసిన తన కూతురు స్రవంతి తరపున పాల్వాయి ప్రచారం చేయడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. అంతేకాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్సింగ్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలే ప్రధాన కారణమని పాల్వాయి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లులో ఆయనను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కేసీఆర్ వస్తే వాళ్లకు సీఎం పదవి దక్కదనే దురాశతో వ్యతిరేకించారని ఆరోపణలు చేశారు. -
తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ!!
తెలంగాణలో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నిర్ణయించుకున్నాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నందున భవిష్యత్తులో పెట్టుకోబోయే పొత్తులపై త్వరలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య చర్చలు జరగనున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఎంఐఎం తమకు మిత్రపక్షంగానే ఉంటుందని, తమకు పూర్తి సహకారం అందించేందుకు అసదుద్దీన్ ఒవైసీ అంగీకరించారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ రెండు పార్టీలు కలిసి నెరవేఉస్తామని అన్నారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. టీఆర్ఎస్ లౌకికవాద పార్టీ అని, త్వరలో తాము కేసీఆర్ను కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేసేందుకు రెండు పార్టీలు యోచిస్తున్నాయి. -
'మాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు'
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. తమ పార్టీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కలమట వెంకట రమణ డిమాండ్ చేశారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన అన్నారు. -
అప్పుడు ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతిపక్షం లేదు: వెంకయ్య
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ప్రభుత్వముందా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైందని.. అందుకే ప్రతిపక్ష స్థానం హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా ఓటర్లు తీర్పు నిచ్చారని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. యూపీఏలో ప్రభుత్వం మనుగడ లేదని.. ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి కూడా స్థానం లేదు అని వెంకయ్య అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగదల, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు లోనయ్యారని వెంకయ్య అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలకు నరేంద్రమోడీ భరోసా ఇచ్చారని.. విశ్వాసం కలిగించారన్నారు. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెసేతర ప్రభుత్వానికి భారీ మెజార్టీని కట్టబెట్టారని ఆయన అన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడంపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ)నేత నితీష్ కుమార్ మనోవ్యధకు గురవుతున్నారన్నారు. రాజకీయ లబ్ది కోసం రాజీనామా ఆస్త్రం జేడీ(యూ)కు ఎలాంటి ప్రయోజనం కలిగించిందని వెంకయ్య విమర్శించారు. -
'రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదు'
న్యూఢిల్లీ: రాజీనామాలు సమర్పించడం వలన సమస్యలకు పరిష్కారం లభించదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో పార్టీ నేతలు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు సమర్పించడంపై మనీష్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారపోసిన వాళ్లు పార్టీలో ఉన్నారు. సమస్యలు రాజీనామాకు పరిష్కారం కాదు అని మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు చాలా సహజం. ఓటమికి కుంగిపోకూడదు.. ఓటమి కారణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి విశ్లేషిస్తోంది. ఓటమి కారణాలపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయానికి వస్తుందన్నారు. -
యూపీ విజయం వెనుక ఏమా మంత్రదండం?
ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు బీజేపీ బలం.. కేవలం పది లోక్సభ స్థానాలు. మరిప్పుడో.. ఏకంగా 73 సీట్లు. ఆ రాష్ట్రంలో ఉన్న బలమైన ప్రాంతీయ శక్తులు సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా తుడిచిపెట్టేసి భారీ సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంది. యూపీ దక్కితే కేంద్రంలో అధికారం చేజిక్కినట్లేనని చెబుతారు. అలాంటి యూపీని బీజేపీ గెలుచుకోవడానికి కారణం ఎవరు? నరేంద్రమోడీ మ్యాజిక్ ఒక్కటే అంతపని చేసిందా? సం'కుల' సమరం సాగుతుండే ఉత్తరప్రదేశ్లో దాదాపు 11 నెలల పాటు ముమ్మరంగా కసరత్తు చేసి, తనకు ఎదురైన అవమానాలు, పరాభవాలను కూడా అవకాశాలుగా మలచుకుని, 73 ఎంపీ సీట్లను పళ్లెంలో పెట్టి నరేంద్రమోడీకి అప్పగించిన ఘనత గుజరాత్ మంత్రి అమిత్షాకే దక్కుతుంది. ఇప్పటివరకు యూపీలో బీజేపీకి గరిష్ఠంగా దక్కిన స్థానాలు.. 57 మాత్రమే. అదీ 1998లో. కానీ ఇప్పుడు ఏకంగా 91% స్థానాలను దక్కించుకుంది. దానివల్లే జాతీయస్థాయిలో 280కి పైగా సీట్లు సాధించగలిగింది. కులమతాల కుమ్ములాటలు ఎప్పుడూ జరుగుతుండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమిత్షా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 నెలల పాటు మకాం వేశారు. ఆయనను గుజరాత్ రాష్ట్రంలో ఉండొద్దని కోర్టు ఆదేశించినప్పుడు దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన బాస్ మోడీ ఆదేశాలతో వెంటనే ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయి, అక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా అంచనా వేశారు. యూపీలో ప్రధానంగా ముస్లింలు, జతావాలు, యాదవులు కలిసి దాదాపు 41 శాతం వరకు ఉంటారు. వీళ్లంతా ఇన్నాళ్ల బట్టి బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలో అధికారం లేదు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు గట్టిగా ప్రచారం చేయడానికి కరిష్మా ఉన్న నాయకుడు కూడా ఎవరూ లేరు. కళ్యాణ్ సింగ్ లాంటి నాయకులు అప్పటికే వయసు మీరడంతో పాటు వాళ్లకు మాస్ అప్పీల్ లేదు. మరోవైపు మాయావతి లాంటి నాయకులు ఉధృతంగా ప్రచారం చేస్తారు. ఇన్ని ప్రతికూలాంశాలను తట్టుకోవాలంటే ఏం చేయాలో పక్కా వ్యూహాన్ని రూపొందించుకున్నారు అమిత్ షా. ఇన్నాళ్లుగా తమకు మద్దతు ఇవ్వని వర్గాల వద్దకు ఇంటింటికీ వెళ్లి వాళ్లకు నచ్చజెప్పారు. రాష్ట్రంలో మొత్తం 450 ర్యాలీలు నిర్వహించారు. ఇందుకోసం 450 వీడియో రథాలు ఉపయోగించి వాటిద్వారా నరేంద్రమోడీ ప్రసంగాలను అన్నిచోట్లా వినిపించారు. కులసంఘాల పెద్దలందరితో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ మంచి చేసుకున్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయకపోవడంతో దూరమైన ప్రజలందరినీ మళ్లీ దగ్గరకు తెచ్చుకున్నారు. లక్ష్యం సాధించారు. 80 సీట్లకు గాను 73 స్థానాల్లో పాగా వేసి మోడీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. -
కల్వకుర్తి నియోజకవర్గంలో రీ పోలింగ్
-
కల్వకుర్తి నియోజకవర్గంలో రీ పోలింగ్
కల్వకుర్తి : మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. 119వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు కొనసాగనుంది. మరోవైపు రీ పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. కాగా ఈ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
అటు కారు.. ఇటు ఆటో...
సాక్షి, హన్మకొండ: అనుకున్నట్లే అయింది... ఊహిం చిందే జరిగింది. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు కేంద్ర మాజీ మంత్రి బలరాం విజ యావకాశాలకు దెబ్బకొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన కారు జోరుకు ఆటో వేగం సైతం తోడయ్యింది. ఫలి తంగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యూరు. గత ఎన్నికల సమయానికి జిల్లాలో పెద్దగా ఎవరికి పరిచయం లేకుం డా చివరి నిమిషంలో మహబూబాబాద్ పార్లమెం ట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిల్చున్న బలరాం నాయక్... ఏకంగా కేంద్ర మం త్రి పదవిని దక్కించుకున్నారు. 2014 మార్చిలో ఎన్నికల సీజన్ మొదలయ్యే నాటికి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో కాంగ్రెస్ నుంచే కాకుండా ప్రత్యర్థి పార్టీ ల్లో సైతం ఆయనకు గట్టిపోటీ ఇచ్చే నాయకులు కనుచూపుమేరలో ఎవరూ లేరు. మానుకోట, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన హవానే కొనసాగింది. ఈ ఎన్నికల్లో బలరాంనాయక్ గెలుపు నల్లేరుపై న డకే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. తీరా... ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించే సరికి ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ చేతిలో 30,654 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దొంతి దెబ్బ ఎన్నికలు సమీపించే నాటికి కేంద్రమంత్రి బలరాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతిమాధవరెడ్డి మధ్య సత్సంబంధా లు ఉండేవి. కాంగ్రెస్ చివరి నిమిషంలో దొంతిని కాదని నర్సంపేటలో కత్తి వెంకటస్వామిని బరిలో నిలిపింది. దీంతో దొంతి మాధవరెడ్డి రెబల్గా బరిలో నిలి చి ఆటో గుర్తుపై పోటీ చేశారు. ఆటో, కా రు రెండు గుర్తులు పోలి ఉన్న నేపథ్యం లో ఓటర్లు పొరబడే అవకాశముండడం తో దొంతి మాధవరెడ్డి తన ప్రచారంలో రెండు ఓట్లూ ఆటోకే వేయాలని ముమ్మర ప్రచారం చేశారు. దీర్ఘకాలంపాటు నర్సం పేట కేంద్రంగా రాజకీయాలు నెరిపిన దొంతి తనకంటూ సొంత వర్గాన్ని తయా రు చేసుకున్నారు. పైగా చివరి నిమిషం లో టికెట్ నిరాకరించడంతో ఆయనకు సానుభూతి కూడా తోడయింది. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సైతం దొంతి వెంట న డిచాయి. ఫలితంగా నర్సంపేటలో దొం తి ప్రచారం చేసిన ఆటో గుర్తుకు భారీగా ఓట్లు వచ్చి పడ్డాయి. అసెంబ్లీకి పోటీ చేసిన దొంతి మాధవరెడ్డికి 76,144 ఓట్లు రాగా... కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కత్తి వెంకటస్వామికి కేవలం 6,638 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పార్లమెంట్కు సంబంధించి బలరాంనాయక్కు కేవలం 13,404 ఓట్లే వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి 66,777 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి 75,400 ఓట్లు వచ్చాయి. కానీ... పార్లమెంటుకు వచ్చే సరికి క్రాస్ఓటింగ్ జరిగి బలరాంనాయక్కు 5,633 ఓట్ల ఆ ధిక్యం వచ్చింది. ఈసారి పరిస్థితి తారుమారై కాంగ్రెస్ ఓట్లు పార్లమెంటు పరిధి లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పా యం చందర్రావుకు పడ్డాయి. ఇక్కడ ఆ యనకు కేటాయించిన ఆటో గుర్తుకు మొ త్తం 60,583 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో తొంభై శాతం దొంతి సానుభూతి పరులవే. ఈ ఓట్లన్నీ బలరాంనాయక్కు వచ్చి ఉంటే విజయం ఆయన పక్షానే నిలిచేది. చీలిన లంబాడ ఓట్లు గత ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్కు టికెట్ ఇవ్వగా... మహా కూటమి తరఫున కోయ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అ ప్పుడు చాలా నియోజకవర్గాల్లో లంబాడ ఓట్లు చీలి బలరాంనాయక్కు పడ్డాయి. ఇల్లందు, ములుగులో అసెంబ్లీకి సంబంధించి టీడీపీకి చెందిన కోయ ఎమ్మెల్యే గెలుపొందగా... ఈ రెండు చోట్ల పార్లమెంట్ మెజార్టీ కాంగ్రెస్కు వచ్చింది. కానీ... ఈసారి కాంగ్రెస్తోపా టు టీఆర్ఎస్ లంబాడ వర్గానికి సీట్లు కేటాయించడం బలరాంకు కలిసిరాలేదు. -
ఒకే ఒక్కడు: సీతారాం
వరంగల్, న్యూస్లైన్: జిల్లాలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ మినహా... తొలి ఎన్నికల అనుభవం పలువురికి చేదుజ్ఞాపకాలనే మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికల్లో సంచలనాత్మక తీర్పునిచ్చిన జిల్లా ఓటర్లు... కొత్త నేతలకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన నేతలకు అవకాశం కల్పించలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలున్నారుు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఒక ఎంపీ, 12 మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 13 మంది ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వారే. గత ఎన్నికల్లో పోటీచేసిన అనుభవంతోనే తొలిసారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం వారికి సులువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ గాలి వీయడంతో జిల్లాలో మెజార్టీ స్థానాలు ఆ పార్టీకి దక్కారుు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టి షాకిచ్చి మార్పును కోరుకున్నారు. తొలిసారి పోటీచేసిన వారికి అవకాశం కల్పించకుండా అనుభవానికి, పాతనేతలకే పట్టం కట్టారు. తొలి పోటీ చేదు జ్ఞాపకం ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన నేతలందరికీ చేదు అనుభవమే మిగిలింది. ఒకే ఒక్కరికి మాత్రం పదవీయోగం దక్కింది. మహబూబాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ను విజయం వరించింది. ఈయన తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఇక జిల్లాలో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ తరఫున ముద్దసాని సహోదర్రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమిపాలయ్యారు.గతంలో ఎమ్మెల్సీగా పోటీచేసి విజయం సాధించినప్పటికీ వరంగల్ పశ్చిమ నుంచి ఆర్ఎల్డీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి పర్యాయం పోటీచేసిన కపిలవాయి దిలీప్కుమార్ ఓటమి చవిచూశారు. భూపాలపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గండ్ర సత్యనారాయణరావును జనం ఆదరించలేదు. నర్సంపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన పెద్ది సుదర్శన్రెడ్డి, కత్తి వెంకటస్వామిలకు ఓటమి తప్పలేదు. మహబూబాబాద్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బానోతు మోహన్లాల్, మహబూబూబాద్, డోర్నకల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తొలిసారి పోటీచేసిన బాలుచౌహాన్, రామచంద్రునాయక్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. వరంగల్ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన రావు పద్మకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఓటమి నుంచి తొలి గెలుపు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ గతంలో పోటీచేసి ఓడిపోయినవారే. జనగామ నుంచి గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గతంలో వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. పరకాల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి గతంలో పరకాల నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. నర్సంపేట నుంచి విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి గతంలో ఇక్కడే ఓడిపోయారు. మహబూబాబాద్ నుంచి గెలిచిన బానోత్ శంకర్నాయక్ గతంలో ఇక్కడే పోటీచేసి ఓటమి చవిచూశారు. వర్ధన్నపేట నుంచి గెలిచిన ఆరూరి రమేష్ గత ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్లో పోటీచేసి ఓడారు. పాతవారికే పట్టం జిల్లా ప్రజలు ఈ సారి సిట్టింగ్లకు కోలుకోలేని షాకిచ్చారు. ఇద్దరు టీఆర్ఎస్, ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్ప, కాంగ్రెస్కు చెం దిన సిట్టింగ్లందరూ ఓటమిబాటపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో డాక్టర్ రాజయ్య, వినయ్, ఎర్రబెల్లి మాత్రమే విజయం సాధించా రు. అరుుతే జిల్లా ఓటర్లు సిట్టింగ్ల మార్పు కోరుకున్నప్పటికీ... పా తవారికే పట్టం కట్టారు. భూపాలపల్లి, ములుగు, డోర్నకల్, వరంగల్ తూర్పులో గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మధుసూదనాచారి, చందూలాల్, రెడ్యానాయక్, కొండా సురేఖకు అవకాశం కల్పించా రు. వరంగల్ ఎంపీగా మాజీ మంత్రి శ్రీహరిని గెలిపించారు. -
మా స్వయంకృతాపరాధమే
దేవరకొండ, న్యూస్లైన్: ‘నిజాలను చెప్పలేకపోయాం.. అబద్దాలను ఆడలేకపోయాం.. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వలేకపోయాం.. ప్రజలను మోసగించలేకపోయాం.. అందుకే ఓటమి పాలయ్యాం.. ఇది మా స్వయంకృతాపరాధమే..’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం తెలంగాణ సాధన కోసం కష్టించి పని చేసిన సహచర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులను ప్రజలు న్యాయంగా గెలిపించాల్సి ఉందని అన్నారు. కానీ, ప్రజల తీర్పును గౌరవించాలని, తన గెలుపు సంతోషకరమే అయినా మిత్రుల ఓటమి బాధ కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రత చట్టం, భూపంపిణీ, నిర్బంధ విద్యా చట్టం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ్మ, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, పార్టీ దేవరకొండ మండల అధ్యక్షుడు మేకల శ్రీను, చం దంపేట మండల అధ్యక్షుడు గోవిందు, పార్టీ నాయకులు గిరిశేఖర్, జావీద్, ఇద్రిస్, ఆప్కో సత్తయ్య, సైదులు, దేవేందర్, మంజ్యనాయక్, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నాటి పరాభవానికి..నేడు ప్రతీకారం!
శ్రీకాకుళం, న్యూస్లైన్:సార్వత్రిక ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం ద్వారా వైఎస్ఆర్సీపీ నేత కంబాల జోగులు గతంలో తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గతంలో జోగులుపై ఎవరు దాడి చేశారు?.. ఆ దాడికి ఇప్పటి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటని అనుకుంటున్నారా??.. అయితే ఒక్కసారి గతంలోకి వెళ్లాల్సిందే.. 2004 ఎన్నికల్లో కంబాల జోగులు పాలకొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో తాజా మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ ఎచ్చెర్ల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006 ప్రాంతంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఒక సమావేశంలో జోగులుపై కోండ్రు దాడికి పాల్పడ్డారు. అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఆ శాఖ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణాలకు సంబంధించి జోగులు పలు ప్రశ్నలు సంధించారు. దాంతో రెచ్చిపోయిన కోండ్రు.. మంత్రినే ప్రశ్నించేంత వాడివయ్యావా? అంటూ జోగులుపైకి దూసుకెళ్లి ఆయన మెడలోని కండువా పట్టుకొని దాడి చేశారు. ఈ సంఘటనలో జోగులు చొక్కా కూడా చిరిగిపోయింది. సౌమ్యునిగా పేరున్న జోగులుపై దాడి చేయడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తోటి దళిత శాసనసభ్యుడిని కోండ్రు దాడి చేసి, అవమానించడం పట్ల ఆ వర్గంలోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. తనపై జరిగిన దాడితో మనస్తాపానికి గురైన జోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినా.. తర్వాత ఎందుకులే.. అనుకొని వదిలేశారు. అక్కడి నుంచి ప్రస్తుతానికి వస్తే.. ఈ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి కోండ్రు, జోగులు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన జోగులుకు 69,192 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ మంత్రి హోదాలో పోటీ చేసిన కోండ్రు మురళీకి 4790 ఓట్లు మాత్రమే వచ్చాయి. జోగులు విజయం సాధించగా.. కోండ్రు డిపాజిట్ కూడా గల్లంతై తీవ్ర పరాభవానికి గురయ్యారు. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటన్న పలువురు గతంలో తనపై జరిగిన దాడికి జోగులు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. -
‘బంగారు తల్లి’కి బెంగ
కోటబొమ్మాళి, న్యూస్లైన్: సుమారు ఏడాది క్రితం.. మే ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బంగారు తల్లి పథకానికి అంకురార్పణ చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు దశలవారీగా ఆర్థికంగా చేయూత అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపికైన వారికి ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.2.16 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నది లక్ష్యం. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉన్న తరుణంలో హడావుడిగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ ఎన్నికల పథకమేనన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేందుకే దీన్ని ప్రారంభించారన్న విమర్శలు కూడా వినిపించాయి. అందుకు తగినట్లే ఇప్పుడు ఈ పథకానికి గ్రహణం పట్టుకుంది. జిల్లాలోని 31 మండలాల నుంచి 9014 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,613 మందిని అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సుమారు రూ.1.40 కోట్లు కూడా జమ చేశారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా 3,401 దరఖాస్తులను అధికారులు పెండింగులో పెట్టారు. దీంతో దరఖాస్తుదారులు నిరాశ చెందారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయినా దరఖాస్తుదారులు కొత్త అనుమానాలతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ ప్రభుత్వం రద్దయ్యింది. కొత్తగా అధికారంలోకి రానున్న టీడీపీ ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఏ వైఖరి అవలంభిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుందన్నది తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకే టీడీపీ ప్రభుత్వం కిందా మీదా పడాల్సిన పరిస్థితులు ఉన్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించిన ఈ పథకం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పథకం అమలు, పెండింగు దరఖాస్తుల విషయంలో అధికారులు సైతం నోరు మెదపడం లేదు. దీనిపై వివరణ కోరేందుకు ‘న్యూస్లైన్’ ప్రయత్నించగా డీఆర్డీఏ అధికారులు ఏవరూ అందుబాటులో లేరు. -
ఎంపీపీ పీఠానికి త్రిముఖ పోటీ!
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్, న్యూస్లైన్ : మహిళకు కేటాయించిన ఆమదాలవలస మండలాధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరికి వారే ఈ పదవిని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్టీవాడ ఎంపీటీసీ సభ్యురాలు కొరుకొండ ఇందుమతి, కొర్లకోట సభ్యురాలు సువ్వారి రూపవతి, చీమలవలస సభ్యురాలు సనపల పద్మావతి ఎంపీపీ పీఠం కోసం పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మండలంలోని అధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. కలివరం నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున బరిలోకి దిగిన తమ్మినేని ఇందువతమ్మని తొలుత ఎంపీపీ అభ్యర్థిగా సూచాయగా ప్రకటించారు. అయితే ఆ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం, ఇందువతమ్మ ఓటమి పాలవడంతో మిగిలిన సభ్యుల్లో ఎంపీపీ పదవిపై ఆశలు రేకెత్తాయి. కోరుకొండ ఇందుమతి కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం, ఆమె భర్త జీకేవలస సర్పంచ్ రమణ మాజీమంత్రి తమ్మినేని అనుచరుడు కావడంతో ఎంపీపీ పదవి ఇందుమతికి దక్కే అవకాశం ఉందనే గురగుసలు వినిపిస్తున్నాయి. అలాగే జెడ్పీటీసీ సభ్యురాలు బంధువుగా, సీతారాంకు కష్టకాలంలో అండగా ఉంటూ.. కొర్లకోట ఎంపీటీసీ స్థానంలో గెలుపొందిన సువ్వారి రూపవతికి కూడా పదవి దక్కే అవకాశం మెండగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరితోపాటు చీమలవలస సర్పంచ్ జి. శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో తమ్మినేని చేరినప్పటి నుంచి ఆయన వెంటే ఉంటున్నారు. దీంతో ఇదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు పద్మవతికి ఎంపీపీ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందో కొద్దిరోజులు వేచి చూడాలి. -
టీడీపీలో ‘పుర’ పోరు !
పాలకొండ,న్యూస్లైన్: అధికాం వచ్చిం ది. ఇక పదవుల పందేరాలు మొదలయ్యాయి. పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులుండగా, తొలిసారి జరిగిన పురపోరులో అత్యధికంగా టీడీపీ 12 , స్వతంత్రులు ఐదుగురు, వైఎస్సార్సీపీ తరఫున ముగ్గురు విజయం సాధించారు. అయితే ఇప్పుడు పురపాలక పదవుల్లో కొందరు ‘పెద్దల’ జోక్యంతో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ముందుగానే నిర్ణయించిన విధంగా మున్సిపల్ చైర్మన్గా పల్లా విజయనిర్మలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైస్చైర్మన్ పదవిపై అందరి దష్టి పడింది. కాపు సామాజిక వార్గనికి చెందిన వ్యక్తికే ఇవ్వాలంటూ కొందరు, మైనార్టీలకు ఇవ్వాలంటూ మరికొందరు రేసులో ఉన్నారు. ఈ మేరకు పెద్ద నేతల గడపలు తొక్కుతూ ఆశీస్సులందుకునే పనిలో పడ్డారు కొంతమంది. మహిళలకే రెండు కీలక పదవులు వద్దంటూ మరికొందరు పట్టుబడుతున్నారు. దీంతో ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాపులకే ‘వైస్’ ఇవ్వాలని పట్టు ! పాలకొండ నగర పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం మరికొద్ది రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ఇప్పుడంతా వైస్ చైర్మన్ పదవిపై తీవ్ర స్థాయి చర్చలు సాగుతున్నాయి. యాదవ కులానికి చెందిన మహిళకు చైర్పర్సన్ అవకాశం దక్కగా, వైస్చైర్మన్ పదవి మాత్రం పట్టణంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికే ఇవ్వాలన్న డిమాండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఈ మేరకు ఈ సమాజిక వర్గానికి చెందిన నలుగురు కౌన్సిలర్లు పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఏడోవార్డు కౌన్సిలర్ ఎస్.చూడామణి పేరు ప్రచారంలోకి రాగా, మరోవైపు టీడీపీ రెబల్గా పోటీచేసి స్థానిక పట్టణ టీడీపీ అధ్యక్షుడిపై భారీ మెజార్టీతో విజయం సాధించిన గుమ్మిడి సింహాద్రి పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే రెబల్గా పోటీ చేసిన కారణంగా మున్సిపల్ ఎన్నికలకు ముందే సింహాద్రిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకష్ణ అప్పట్లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేగా జయకష్ణ ఓడిపోవడంతో పరిస్థితుల్లో తీవ్ర మార్పులు వచ్చాయి. మున్సి పల్ ప్రాంతమంతా పల్లా కొండబాబే నిర్వహణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది. ఈమేరకు ఆయన భార్య విజయనిర్మలకు చైర్మన్ పదవి స్వీకరించనున్నారు. వైస్ పదవి ఆశిస్తు న్న రెబల్ అభ్యర్థి సింహాద్రి గెలిచిన వెంటనే కొండబాబును కలిసి టీడీపీతోనే ఉంటానని ప్రకటించారు. దీంతో పాటు సీనియర్ నేత కళా వెంకటరావు ఆశీస్సులతో సింహాద్రి పదవి దక్కించుకుంటాడని, ఈ మేరకు ‘కథ’ నడుస్తోందన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎవరిని వైస్ పదవి వరిస్తోందో చూడాలి. -
ఆశల పందిరి
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో చాలా ఏళ్ల తరువాత టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టనుండటంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటానికి ఈ జిల్లా ప్రధాన భూమిక పోషించింది. ఆ పార్టీకి చెందిన 14మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్న ఆశావహుల జాబితా కూడా పెద్దగా ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయన్నదానిపై ఆసక్తికరమైన చర్చలు జోరందుకున్నాయి. అయితే సీనియర్లకే మంత్రి పదవులు దక్కనున్నాయని ఆ పార్టీ వర్గాల భోగట్టా. దీంతోపాటు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఇద్దరిని తప్పకుండా మంత్రి పదువులు వరిస్తాయనే ఆశాభావంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండో సారి విజయం సాధించిన ఉండి ఎమ్మెల్యే వేటకూరి శివరామరాజు(శివ), నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాతకు అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. సామాజిక వర్గాల పరంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శివకు మంత్రి పదవి ఇవ్వటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఉండి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శివ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేశారని, పా ర్టీ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మంచి మార్కులు కొట్టేశారని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెంది న బూరుగుపల్లి శేషారావుకు కూడా అవకాశం ఉందనే పార్టీ వర్గాలు భావిస్తున్నా యి. మంత్రి వర్గంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్యపై ఇది ఆధారపడి ఉంటుందని వినిపిస్తోంది. ఎస్సీ సా మాజిక వర్గానికి చెందిన పీతల సుజాత గతంలో ఆచంట నుంచి విజయం సాధించారు. తాజాగా చింతలపూడి నుంచి అనూహ్యంగా గెలుపొందారు. ఈ సామాజిక వర్గం కోటా కింద ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్లో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడు తర్వాత మంత్రి పదవుల విషయమై చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల భోగట్టా. -
బ్యాంకులకుబకాయిల బెంగ
నిలిచిపోయిన టర్నోవర్ భారీగా పేరుకుపోయిన రుణాలు రైతాంగంలో రుణమాఫీపై చర్చ కోటి ఆశల్లో అన్నదాత విజయవాడ సిటీ, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ స్తంభించింది. రుణమాఫీ ప్రచారంతో గత నాలుగు మాసాలుగా రుణాల రికవరీ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీపై పట్టణాలు, పల్లెల్లో వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రుణమాఫీ కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా, మరోవైపు ప్రస్తుత పరిస్థితిలో ఆచరణ సాధ్యం కాదని బ్యాంకర్లు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల నాయకులు రుణమాఫీ హామీ తప్పక ఇస్తారనే భావనతో ఈ ఏడాది రైతులు జనవరి నుంచే బ్యాంకు రుణాలను చెల్లించటం మానేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల బ్యాంకుల్లో లావాదేవీలు పెద్ద ఎత్తున స్తంభించాయి. వ్యవసాయ బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఐదారొందల కోట్ల రూపాయల రుణాలు టర్నోవర్ నిలిచిపోయినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేస్తుందని రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఇలా... గతంలో దేవీలాల్ ప్రభుత్వం రైతుకు రూ.10 వేల లోపు రుణాలను మాఫీ చేసింది. ఆ మొత్తం దేశ వ్యాప్తంగా 12 వేల కోట్ల రూపాయలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచన మేరకు రూ.78 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించింది. లక్ష రూపాయలలోపు బకాయి ఉన్న రైతులకు రుణాలను రద్దు చేసింది. దీంతో వరుసగా మూడేళ్ల పాటు బకాయి పడిన రైతుల పంట రుణాలు, బంగారం రుణాలు, ఇతర చిన్నతరహా బకాయిలు మాఫీ అయ్యాయి. పేరుకుపోయిన రూ.500 కోట్ల బకాయిలు... జిల్లాలో 425 సహకార బ్యాంకు శాఖలు ఉన్నాయి. 501 వాణిజ్య బ్యాంకులు, 54 సప్తగిరి గ్రామీణ బ్యాంకులు, 50 కేడీసీసీ బ్యాంకు బ్రాంచిలు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి ఐదారు వందల కోట్ల రూపాయల బకాయిలు జిల్లాలో పేరుకుపోయినట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి రైతులు రుణాలు చెల్లించకపోవటం, పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, బంగారం రుణాలు, భూ అభివృద్ధి పథకం కింద ఇచ్చిన రుణాలు భారీగా పేరుకుపోయాయి. ఈ మార్చి నాటికి జిల్లాలో అన్ని బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దాదాపు సహకార బ్యాంకులన్నింటా రుణాల చెల్లింపు నిలిచిపోయింది. పాత బకాయిలు చెల్లించక పోవటంతో రైతులకు వచ్చే ఖరీప్లో తిరిగి పంట రుణాల పంపిణీ ప్రశ్నార్థకమేనని బ్యాంకర్లు అంటున్నారు. పాత బకాయిలు రద్దు చేస్తారా, లేకుంటే గత మార్చి వరకు తీసుకున్న అన్ని రకాల రుణాలను రద్దు చేస్తారా అనే విషయమై ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. రుణమాఫీ వ్యవహారంతో ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చాయి. నిలిచిన డ్వాక్రా రుణాలు... డ్వాక్రా సంఘాలు కూడా ప్రతినెలా చెల్లించే రుణాలను నిలుపుదల చేశాయి. జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల డ్వాక్రా వాయిదాలు కూడా గత మూడు నెలల నుంచి చెల్లించటం లేదని బ్యాంకర్లు తెలిపారు. డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ పొదుపు డబ్బు మాత్రమే చెల్లించి, తీసుకున్న రుణాలను జమ కట్టడం లేదని వారు పేర్కొన్నారు. అన్ని రకాల రుణాలు జమ పడకపోవటంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి తమకు బకాయిలపై ఒత్తిడి అధికంగా వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీని అమలు చేయటంలో సాధ్యాసాధ్యాలపై కూడా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. -
సమస్యల సవాళ్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు :కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులకు పెండింగ్ ప్రాజెక్టులు స్వాగతం పలుకుతున్నాయి. డెల్టా ఆధునికీకరణ, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజి మరమ్మతులు, మూలనపడిన ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకలుగా మారాయి. జిల్లా కేంద్రమైన గుంటూరులో అస్తవ్యస్తంగా ట్రాఫిక్, విస్తరించని రహదారులతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇప్పటికీ గుంటూరులో తాగునీటి సరఫరా అర్ధరాత్రి జరుగుతోంది. దీంతోపాటు రూ.600 కోట్ల విలువైన తాగునీటి పథకాల పనులు ఇంకా ఊపందుకోలేదు. జిల్లాలో టీడీపీ నుంచి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు, 12 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువ మంది సీనియర్లు. గతంలో వీరంతా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు చేసినవారే. గ్రామస్థాయిలో ఉద్యమాలు, పాదయాత్రలు చేసి వాటి పరిష్కారానికి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ముఖ్యంగా సాగునీటి స్థిరీకరణకు దివంగత మహానేత వైఎస్ చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో పూర్తికాక పోయినా మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దానిని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన క్రస్ట్గేట్లను ఇంకా అమర్చాల్సి ఉంది. దీనికితోడు పునరావాస ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించాల్సి ఉంది. ఈ రెండు పనులు ఈ సీజనులో పూర్తి అయ్యే అవకాశాలు లేవు. వీటిని పూర్తిచేయాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుందని, అందుకు అవసరమైన పూర్తి నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని ఇంజినీర్లు చెబుతున్నారు. కొంతకాలంగా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన నగదు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త పాలకులు రైతుల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ముంపు గ్రామాల ప్రజలకు చెల్లించాల్సిన నష్టపరిహారం కోసం అక్కడి ప్రజలు నాలుగేళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వీరికి మద్దతుగా టీడీపీ నేతలు పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు అవశ్యం.. డెల్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో ప్రకాశం బ్యారేజి పనులను కూడా చేర్చడంతో సాగునీటిశాఖ అధికారులు ఈ ప్రాజెక్టుకు సాంవత్సరిక మరమ్మతులు కూడా చేయడం లేదు. దీంతో దిగువ ఆప్రాన్ శిథిలావస్థకు చేరింది. రానున్న ఖరీఫ్ సీజను దృష్టిలో ఉంచుకుని దిగువ ఆప్రాన్కు మరమ్మతులు చేయాల్సి ఉందని ఇటీవల బ్యారేజి పరిరక్షణ కమిటీ అప్పటి ప్రభుత్వానికి సూచించింది. ప్రకాశం బ్యారేజి పరిరక్షణపై కృష్ణా జిల్లాలోని టీడీపీ శాసనసభ్యులు అనేకసార్లు ఆందోళనలు చేశారు. ముఖ్యంగా ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా సాగునీటి కొరత, సరఫరా సమస్యలపై అనేకసార్లు చేసిన ఆందోళనలు ప్రజలు మరిచిపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యారే జీకి అత్యవసర మరమ్మతులు చేయాల్సి ఉంది. నిధులు సమకూర్చితేనే సాగునీరు.. కృష్ణానదీ పరీవాహానికి ఇరుపక్కల నిర్మితమైన ఎత్తిపోతల పథకాలకు నాలుగేళ్లుగా మరమ్మతులు జరగడం లేదు. ముఖ్యంగా వీటి మరమ్మతులకు అవసరమైన నిధులను వాటిని నిర్వహిస్తున్న సొసైటీలే సమకూర్చాల్సి ఉంది. ఈ సొసైటీలపై అటు ఇరిగేషన్శాఖకు, ఇటు రెవెన్యూశాఖకు పూర్తిస్థాయిలో అధికారాలు లేవు. దీనితో వాటికి సంబంధించిన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 30 ఎత్తిపోతల పథకాలు పూర్తిగా పనిచేయకపోవడంతో 23 వేల ఎకరాలకు సాగునీటి సరఫరా జరగడం లేదు. ఈ పథకాల బాధ్యతలను చేపట్టిని సొసైటీలకు అవసరమైన నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కొత్త పాలకులపైనే ఉంది. విజయవాడ నుంచి కృష్ణానది కుడి, ఎడమ కరకట్టలను ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రారంభిస్తే, ఎడమ కరకట్ట నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలైంది. కుడివైపున కరకట్ట పనులను ఇటీవలనే నిర్మాణ సంస్థ ప్రారంభించింది. రూ.150 కోట్ల విలువైన ఈ కరకట్టను పూర్తి చేస్తే రేపల్లె వరకు పంట భూములకు ముంపు బెడద తొలగుతుంది. రహదారి సౌకర్యం ఏర్పడుతుంది. ఉడాకు సిబ్బంది కొరత.. మంగళగిరి సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని ఐదేళ్లుగా పాలకులు చేస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. భూసేకరణ, నిధుల సమీకరణ కోసం కొంత ప్రయత్నం జరిగినా అది ముందుకు సాగలేదు. వీజీటీఎం ఉడా పరిధిని విస్తరించారే కాని అందుకు అవసరమైన సిబ్బంది నియామకం జరగలేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉడా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం 86 మంది కొత్త ఉద్యోగులను నియమించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉత్తర్వులు రాకపోవడంతో పరిమితంగా ఉన్న సిబ్బంది కారణంగా ఉడాలోని పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నగరవాసుల దాహార్తి తీరేనా? గుంటూరు నగరంలో రూ.600 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులకు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేసినప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. నగరంలోని ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండటంతో ఆర్టీసీ కొత్తగా సిటీ బస్లను మంజూరు చేసినా, వాటిని వినియోగంలోకి తీసుకురాలేని దుస్థితి ఉన్నది. రహదారుల విస్తరణతోపాటు ఆటోల సంఖ్య, నగరంలో కొత్త ఆటోల కొనుగోలు నిలిపివేయడం వంటి అనేక ముఖ్యపనులు కొత్త పాలకుల ముందున్నాయి. నగరంలోని రైల్వే గేట్ల సమస్య కారణంగా ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేస్తారని ప్రజలు ఆశతో ఉన్నారు. -
నంద్యాల ఓటరు లెక్కతప్పింది!
నంద్యాల, న్యూస్లైన్ : మూడు దశాబ్ధాల తర్వాత నంద్యాల ఓటర్ల లెక్కతప్పింది. ప్రతిసారి నంద్యాల నియోజకవర్గంలో అధికార పక్షానికి పట్టం కట్టడం సంప్రదాయంగా వస్తుండేది. అయితే ఈ సారి మాత్రం ఓటర్లు భిన్నంగా తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎన్నికలు రెండు ప్రధాన సెంటిమెంట్లు ఉన్నాయి. ఈసారి అందులో ఒకటి విఫలం కాగా మరొకటి సఫలమైంది. ఫలితం తారుమారైంది నంద్యాల ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందిన వారు గెలుపొందితే అదే పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థులు సంజీవరెడ్డి, ఫరూక్ గెలుపొందగా రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికంగా గెలుపొందగా రాష్ట్రంలో కూడా ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడు ఎన్నికలు తర్వాత మొదటి సారి సెంటిమెంట్ను స్థానిక ఓటర్లు తిరగరాశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా నంద్యాలలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమానాగిరెడ్డి విజయం సాధించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే లేనేలేడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేనే లేడు. నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే మల్లు రామచంద్రారెడ్డి, ఫరూక్, బొజ్జా వెంకటరెడ్డి రెండు సార్లు వరుసగా గెలుపొంది మూడోసారి ఓడిపోయారు. ఈ సారి చరిత్ర తిరగరాయాలని శిల్పామోహన్రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రెండుసార్లు వరుసగా గెలుపొందారు. అయినా మూడోసారి ఓటమి చూడక తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ మిస్ అయినా నాయకుల్లో శిల్పా కూడా చేరారు. -
చిరంజీవి కుప్పిగంతులు
సాక్షి, గుంటూరు :మంగళగిరి ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) గెలుపును ఎన్నికల అధికారులు ప్రకటించేసినా, టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి తనకేదో అన్యాయం జరిగిపోయిందంటూ నానా హంగామా చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్లో చిరంజీవి వర్గీయులు చేయాల్సిందంతా చేశారు. జిల్లా ఎన్నికల అధికారిపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చారు. మూడు సార్లు రీ కౌంటింగ్ చేసినా ఆర్కే గెలుపు ఖరారైంది. గంజి చిరంజీవిపై 12 ఓట్ల ఆధిక్యతతో ఆర్కే గెలుపొందారు. ఆర్కే గెలుపును జిల్లా ఎన్నికల అధికారి జోక్యంతో రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సాక్షాత్తూ ఎన్నికల కమిషన్ ధ్రువీకరించి ఆర్కేకు డిక్లరేషన్ కూడా ఇచ్చింది. ఇదంతా కళ్లెదుట కనిపిస్తున్నా, చిరంజీవి తనకు అన్యాయం జరిగిపోయిందంటూ గంగవైలెత్తుతూ అటు మంగళగిరిలోనూ, ఇటు కౌంటింగ్ జరిగిన నాగార్జున యూనివర్సిటీలోనూ రాస్తారోకోలు, ధర్నాలంటూ హల్చల్ చేస్తున్నారు. వైఎ స్సార్సీపీ శ్రేణులపై విషం కక్కుతున్నారు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ మంగళగిరిలో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ళ వద్ద రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. సానుభూతి కోసమే...ఇదంతా చిరంజీవి, ఆయన వర్గీయులు ఎందుకు చేస్తున్నారు? సానుభూతి ముసుగులో ముందున్న మునిసిపల్ ఛైర్మన్ గిరీ కోసమేనా? కచ్ఛితంగా అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఎందుకంటే మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో పోటీ నానాటికీ ఎక్కువవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం, కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు నడుమ మంగళగిరి వద్ద ఉంటుందని ప్రచారం జోరందుకోవడంతో మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడినా మున్సిపల్ ఛైర్మన్ పదవినైనా దక్కించుకునేందుకు చిరంజీవి కుప్పిగంతులేస్తూ అటు పార్టీ నేతలకు, ఇటు అధికార యంత్రాంగానికి చిక్కులు తెచ్చిపెడుతున్నారనే ప్రచారం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఛైర్మన్ గిరీ కోసం లాబీయింగ్... మంగళగిరి పట్టణంలో 33 వార్డులున్నాయి. టీడీపీ 14 , వైఎస్సార్సీపీ ఎనిమిది, సీపీఎం, సీపీఐ, బీజేపీ మూడేసి వార్డులు, కాంగ్రెస్ ఒక్క వార్డు గెలుపొందాయి. మంగళగిరి పురపాలక సంఘాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో ఆ పార్టీలో ఛైర్మన్ గిరీ కోసం పోటీ తీవ్రమైంది. ఓ వార్డులో చేనేత వర్గం నుంచి గెలుపొందిన మహిళా అభ్యర్థిని ఛైర్మన్గా ఎంపిక చేస్తామని ఆమె వద్ద ఆర్థికంగా ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చేనేత వర్గం నుంచి కౌన్సిలర్లుగా ఆరుగురు ఎన్నికవడంతో వీరిలోనే పోటీ ఎక్కువగా ఉంది. మరో వైపు టీడీపీ నేతలతో సంబంధాలున్న ఓ వ్యాపార వేత్త ఛైర్మన్ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఎలాగైనా సరే ఛైర్మన్ పీఠం దక్కించుకోవడం కోసం టీడీపీలో మొదలైన వర్గ పోరు ఎటు దారితీస్తుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, చిరంజీవి కూడా తనదైన శైలిలో హల్చల్ చేస్తుండడాన్ని కొందరు నేతలు బాహాటంగానే తప్పుబడుతున్నారు. సానుభూతి ద్వారా మున్సిపల్ ఛైర్మన్ గిరీ కోసం ఆయన హైడ్రామా ఆడుతున్నారని సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆమెకు ఎదురులేదు!
కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని విషయాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈ పనులు పురుషులు మాత్రమే చేయగలరనే భావనను చెరిపేస్తూ.. అవకాశమిస్తే తాము దూసుకుపోతామని నిరూపిస్తున్నారు. అవనిలోనే కాదు.. అంతరిక్షంలోనూ ‘ఆమె’ ఎదురులేదని నిరూపిస్తోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో రాజకీయాల్లోనూ వీరి ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇటీవల ముగిసిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వీరి సంఖ్య అమాంతం పెరిగిపోవడమే అందుకు నిదర్శనం. 2006కు ముందు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండటంతో జిల్లాలోని 53 జెడ్పీటీసీ స్థానాల్లో 17 స్థానాలను మహిళలు కైవసం చేసుకున్నారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు.. బీసీలు ఏడుగురు.. అన్ రిజర్వు కింద ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రిజర్వేషన్ 50 శాతానికి చేరుకున్న నేపథ్యంలో 27 మంది మహిళలు జెడ్పీటీసీ స్థానాల్లో పాగా వేశారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలు 1, ఎస్సీలు 5, బీసీలు 11, అన్ రిజర్వు కింద 10 స్థానాలను మహిళలకే కేటాయించారు. గత నెల 6, 11 తేదీల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఈ స్థానాల్లో మహిళలు విజయఢంకా మోగించారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 14 మంది మహిళలు.. టీడీపీ తరఫున 11, కాంగ్రెస్ తరఫున 1, ఆర్పీసీ తరఫున ఒకరు జెడ్పీ పాలనలో భాగస్వాములు కానుండటం విశేషం. టీడీపీ మహిళా జెడ్పీటీసీలు వి.సరస్వతి(కల్లూరు), ఎం.లక్ష్మిదేవి(క్రిష్ణగిరి), పి.జగదీశ్వరమ్మ(గోస్పాడు), నారాయణమ్మ(పాణ్యం), వెంకటలక్ష్మమ్మ(రుద్రవరం), పి.సుశీలమ్మ(ఆస్పరి), సరస్వతి(దేవనకొండ), లక్ష్మి(కౌతాళం), పుష్పావతి(నందవరం), ఈ.సుకన్య (పత్తికొండ), కె.వరలక్ష్మి(తుగ్గలి). కాంగ్రెస్, ఆర్పీఎస్ మహిళా జెడ్పీటీసీలు జి.శారదమ్మ(కోడుమూరు), రాధమ్మ(పగిడ్యాల). వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీలు ఎం.పద్మావతమ్మ(బేతంచెర్ల), బి.కె.నాగజ్యోతి(గూడూరు), ఎం.కె.మాధవి(కర్నూలు), చింతకుంట లక్ష్మి(నందికొట్కూరు), బి.అశ్వర్థమ్మ(బండిఆత్మకూరు), టి.నాగమ్మ(చాగలమర్రి), వై.సరస్వతి(కొలిమిగుండ్ల), ఎం.లక్ష్మిదేవి(నంద్యాల), గోపిరెడ్డి సుభద్రమ్మ(ఉయ్యాలవాడ), రాములమ్మ(గోనెగండ్ల), కె.గంగమ్మ (హొళగుంద), దళవాయి మంగమ్మ(కోసిగి), రేణుకాదేవి(పెద్దకడుబూరు), జయమ్మ(ఎమ్మిగనూరు). -
టీజీ నిర్వేదం
కర్నూలు, న్యూస్లైన్: ఓటమితో టీడీపీ నేతల్లో నిర్వేదం నెలకొంటోంది. ఓటర్లకు పంపిణీ చేయమని అందించిన డబ్బు సక్రమంగా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమంటూ కర్నూలు నియోజకవర్గ ‘దేశం’ అభ్యర్థి టి.జి.వెంకటేష్ సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. నగరంలోని మౌర్యఇన్ హోటల్లో ఎమ్మెల్యే కార్యాలయం పేరిట సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాన్ని ఎత్తేసి అందులోని కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. ఇకపై సేవలకు స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వెలువడే చివరి నిముషం వరకు గెలుపు ఆశతో ఉన్న టీజీ.. ఫలితం ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో నగర ప్రజలు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.వి.మోహన్రెడ్డికి ప్రజలు పట్టంకట్టారు. ఓటమిని జీర్ణించుకోలేని టీజీ తీవ్ర నిర్వేదానికి లోనై తన పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులపైనా ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఈ ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారు. దాదాపు 25 మంది మాజీ కార్పొరేటర్లు టీజీకి అనుచరులుగా ఉన్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు వారికి భారీ మొత్తమే అందజేసినట్లు వినికిడి. అయితే అందులో సగం కూడా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి టీజీ వచ్చినట్లు ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే పాతబస్తీలోని నలుగురు మాజీ కార్పొరేటర్లపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కర్నూలు నియోజకవర్గంలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా 9 రౌండ్లలో ఎస్వీకి ఆధిక్యం లభించగా.. 7 రౌండ్లలో టీజీ ముందున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరులపై విచారణ జరిపించగా.. అక్కడ డబ్బు పంపిణీ జరగలేదనే విషయం బయటపడటంతో ఆయా ప్రాంతాల ద్వితీయ శ్రేణి నాయకులపై టీజీ మండిపడినట్లు సమాచారం. ప్రకాష్నగర్, ఎన్.ఆర్.పేట, బుధవారపేట, జొహరాపురం, గరీబ్నగర్, జమ్మిచెట్టు ప్రాంతం, గాంధీ నగర్, కప్పల్నగర్, డాక్టర్ గఫార్ వీధి ప్రాంతాల్లో ఎస్వీ కంటే టీజీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. 2, 3, 5, 8, 12, 13, 14 రౌండ్లలో మాత్రమే టీజీకి మెజార్టీ లభించింది. 1, 4, 6, 7, 9, 10, 11, 15, 16 రౌండ్లలో ఎస్వీ హవా నడిచింది. ఆయా ప్రాంతాల్లో డబ్బు ఎవరికి పంపిణీ చేశారు.. వారి జాబితాతో ఫోన్ నెంబర్లు ఇవ్వండి.. స్వయంగా నేనే మాట్లాడతానంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ కార్పొరేటర్లను టీజీ నిలదీస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొందరు కేబుల్ ఆపరేటర్లు కూడా డబ్బు సక్రమంగా పంపిణీ చేయలేదని అనుచరుల వద్ద మండిపడినట్లు సమాచారం. -
వీరవరం గరంగరం
కిర్లంపూడి, న్యూస్లైన్ : తనకు ఓట్లు తక్కువ పడ్డాయనే అక్కసుతో స్వగ్రామంలో దాడులకు బరి తెగించిన మాజీ మంత్రి, కాకినాడ ఎంపీ తోట నరసింహంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరశన దీక్షలు చేపట్టారు. తోట స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో టీడీపీ కన్నా వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు రావడంతో విచక్షణ కోల్పోయిన నరసింహం, ఆయన వర్గీయులు శుక్రవారం రాత్రి విజ యోత్సవ ర్యాలీలో, శనివారం వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు దిగి, గాయపరిచారు. అది జరిగి 24 గంటలైనా పోలీసులు నరసింహంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులైన తోట గాంధీ, గొల్లపల్లి సూరిబాబు, గరగా భీమరాజు, గంగారావు ఆదివారం గ్రామకూడలిలో రోడ్డుకు అడ్డంగా టెంట్ వేసి నిరశన దీక్ష చేపట్టారు. పలువురు గ్రామస్తులు వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. జగ్గంపేట సీఐ సుంకర మురళీమోహన్, కిర్లంపూడి ఎస్సై సి.హెచ్.విద్యాసాగర్ ఆందోళన విరమించాలని నచ్చచెప్పబోయారు. అయితే తమ ఇళ్లపైకి వచ్చి దాడి చేసిన ఎంపీ తోటపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు తేల్చిచెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా వీరవరం చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన సీఐ పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలిపారు. చివరికి రెండురోజులు వ్యవధి ఇస్తే ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. దాంతో జ్యోతుల ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. ఈ ఆందోళనలో తోట ఈశ్వరరావు, తోట సర్వారాయుడు, వీర వెంకట సత్యనారాయణమూర్తి, తోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు. హామీ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు : జ్యోతుల ఆందోళన విరమణ అనంతరం జ్యోతుల విలేకరులతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై గౌరవం, నమ్మకం ఉన్న తాము సీఐ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించామన్నారు. రెండు రోజుల్లో నరసింహంపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మెట్ట ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నేతలు సీమ సంస్కృతిని తెస్తున్నారన్న ఎంపీ నరసింహం ఆరోపణను ఖండించారు. ఓట్లు వేయలేదనే కక్షతో ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించినది ఆయనేనని అందరికీ తెలుసన్నారు. భారీగా పోలీసు బలగాల మోహరింపు ఎలాంటి ఉద్రిక్తతలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా వీరవరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు సీఐ మురళీమోహన్ తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామన్నారు. జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
హామీలను నెరవేరుస్తాం : యనమల
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్లైన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ఆశలను, ఆకాంక్షలను సాకారం చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణను పరామర్శించేందుకు ఆదివారం రాజమండ్రి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో సీమాంధ్ర ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని, అయినప్పటికీ ప్రణాళికాబద్ధంగా హామీలను నెరవే రుస్తామని పునరుద్ఘాటించారు. అన్ని అంశాలను పరిశీలించాకే హామీలు ఇచ్చామని, ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదన్నారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, యువతకు ఉపాధి, పింఛను పెంపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తామన్నారు. గన్ని కృష్ణకు పరామర్శ అనారోగ్య సమస్యలతో స్వతంత్ర హాస్పటల్లో చికిత్స పొందుతున్న గన్ని కృష్ణను యనమల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. గన్ని కృష్ణ త్వరగా కోలుకోవాలని యనమల ఆకాంక్షించారు. యనమల వెంట రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, నాయకులు గంగుమళ్ల సత్యనారాయణ, పట్టపగలు వెంకట్రావు, దండుమేను వెంకటసుబ్బారావు, నిమ్మలపూడి గోవింద్, మొల్లి చిన్నియాదవ్ తదితరులు ఉన్నారు. -
గిరిజనుల సంక్షేమానికి పాటుపడతా
అరకు ఎంపీ కొత్తపల్లి గీత విజయోత్సవ సభకు తరలివెళ్లిన ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబు అడుగడుగునా ఘన స్వాగతం రంపచోడవరం/గంగవరం, న్యూస్లైన్ : గిరిజనుల సంక్షేమానికి నిరంత రం పాటుపడతానని వైఎస్సార్ సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత పేర్కొన్నారు. ఆదివారం రంపచోడవరంలోని లెనోరా విద్యా సంస్థల ప్రాంగణంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (బాబు) అధ్యక్షతన విజయోత్సవ సభ నిర్వహించారు. ఇది సమష్టి విజయమని ఎంపీ గీత, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అనంత బాబు పేర్కొన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజేశ్వరి అన్నారు. అన్న య్య అనంత బాబు అందించిన సహకారం జీవితంలో మరువలేన న్నారు. అనంత బాబు మాట్లాడుతూ ఎంపీపీగా పనిచేసి, ఉపాధి కూలీగా కూడా చేసిన రాజేశ్వరికి పేదల కష్టాలు తెలుసని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుందని తెలి పారు. రాబోయే రోజుల్లో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడానికి ిసిద్ధంగా ఉండాలని, జనంతో కలిసి పనిచేయాలని ఎంపీ కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. అనంత బాబు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు ఇబ్బందులు కలగ కుండా చూడాలన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ, ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు పాల్గొన్నారు. సభకు ర్యాలీగా తరలివెళ్లిన నేతలు రంపచోడవరంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకు ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నియోజకవర్గ కన్వీనర్ అనంత బాబు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా తరలివెళ్లారు. ఎల్లవరం మొదలు కొని రంపచోడవరం చేరుకునే వరకు ప్రతి గ్రామం లో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబుకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. మండల కేంద్రమైన గంగవరంలో మండల యువజన అధ్యక్షుడు దిండి నాగమహేష్ , జెడ్పీటీసీ అభ్యర్థిని రామతులసి, సర్పంచ్ అక్కమ్మ తదితరులు స్వాగతం పలికారు. అలాగే రంపచోడవరం మండలంలో బి. వెలమలకోట గ్రామంలో గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామ శివారులో స్వాగతం పలకగా, గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే రాజేశ్వరి ఆవిష్కరించారు. ఇక్కడ కొద్దిసేపు కార్యకర్తలను ఉద్దేశించి అనంత బాబు ప్రసంగించారు. అనంతరం ఐ.పోలవరం గ్రామంలో ఎమ్మెల్యే రాజేశ్వరికి, అనంత బాబుకు అపూర్వ స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నాయకులు, కార్యకర్తలు జేజేలు కొడుతూ రంపచోడవరం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. పందిరి మామిడి నుంచి సభాప్రాంగణం వరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబులు ప్రజలకు అభివాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రంపచోడవరం వారపు సంతలోని ఆలయం లో కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. -
కాంగ్రెస్లో నైరాశ్యం
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీశాయి. ఫలితాలు పరేషాన్ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టిస్తే ..ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. ఓ వైపు టీఆర్ఎస్ గాలి వీచినా ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ సిట్టింగ్ శాసన సభ్యుల్లో ఆరు మంది ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవడం స్వయం కృతాపరాధమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార దర్పంతో అభ్యర్థులు వ్యవహరించిన తీరు, పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పాటు ఇతర ఆంశాలు జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి దోహదపడ్డాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా సిట్టింగ్ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణాలను ఓ సారి విశ్లేషిస్తే... జగ్గారెడ్డి.. జిత్తులు సంగారెడ్డి .. ఈ పేరు వినగానే రాష్ట్రంలో ఎవరికైనా ఠక్కున గుర్తుకొచ్చే పేరు జగ్గారెడ్డి. విలక్షణ వ్యవహార శైలీతో గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలిచిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో ఘోరపరాభవాన్ని ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆ వ్యవహార శైలే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2004లో టీఆర్ఎస్, 2009లో కాంగ్రెస్ తరఫున వరుసగా రెండుసార్లు నెగ్గిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో 29,814 భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయానికి టీ-కాంగ్రెస్ నేతలందరూ తెలంగాణవాదాన్ని అందుపుచ్చుకున్నారు. వీరికి భిన్నంగా జగ్గారెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి వీర వీధేయుడిగా వ్యవహరించారు. కిరణ్పై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహతో సహా ఇతర టీ-కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టుతూ జగ్గారెడ్డి వార్తల్లో ఉండేవారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా .. అందరినీ తోసిరాజని పరిపాలనా వ్యవహారల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఈ అనూహ్య పరిణామంతో జగ్గారెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసిన క్షణం నుంచి జగ్గారెడ్డి పతనం ఆరంభమైంది. టీ-కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒంటరిగా మిగిలారు. రెండేళ్ల కింద సంగారెడ్డిలో జరిగిన అల్లర్ల ఘటన అనంతరం జగ్గారెడ్డి వ్యవహార శైలిలో వచ్చిన వ్యూహాత్మక మార్పు సైతం ఆయన వ్యక్తిగత ఇమేజ్పై ప్రభావం చూపింది. దామెదరను కలవాలంటేనే డర్ మరో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వ్యవహారశైలే ఆయన్ను ఓటమి పాలు చేసిందని పలువురు భావిస్తున్నారు. ఆయన 1989, 2004, 2009 ఎన్నికల్లో అందోల్ స్థానం నుంచి మూడుసార్లు గెలుపొందారు. పార్టీ అధిష్టానం ఆశీర్వాదంతో కిరణ్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయనలో అధికార దర్పం పెరిగిపోయిందని విమర్శలున్నాయి. తనను కలవడానికి వచ్చే అధికార, అనధికారులు, సామాన్య ప్రజలతో ఆయన పద్ధతి సరిగ్గా ఉండేది కాదని ఆరోపణలున్నాయి. ఇక ఆయన తన పదవి కాలంలో సింహభాగం నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్- ఢిల్లీల మధ్య చక్కర్లు కొడుతూ ఎక్కువ సమయం గడిపారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ ఆయన సమీప బంధువుకు ఇప్పించగా ఆ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలున్నాయి. 2009 ఎన్నికల్లో జోగిపేట ప్రజలు తనకు ఓట్లు వేయలేదని కారణంతో పట్టణంలో ఆయన అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో పోలింగ్ రోజు స్థానిక ఓటర్లు మధ్యాహ్నం 3 గంటల వరకు ఓట్లు వేయకుండా నిరసన తెలిపారు. వీరిలో కొందరు తమకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. టీఆర్ఎస్ గాలితో పాటు తాను చేసుకున్న స్వీయ పొరపాట్లే దామోదరను నట్టేట ముంచాయని పలువురు పేర్కొంటున్నారు. విభేదాలతోనే సునీత ఓటమి నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన సునీతా లక్ష్మారెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుమల మదన్ రెడ్డి చేతిలో 14,217 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. తన పదవి కాలంలో ఎక్కువ సమయాన్ని ప్రజల్లో తిరగడానికి కేటాయించినప్పటికీ, ఆమె ఓడిపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ప్రధానంగా ఆమె అన్నీ వర్గాల ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణ ఉంది. అదే విధంగా తన చుట్టూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని పనులను వారికే ఇచ్చేవారని విమర్శలున్నాయి. నియోజకవర్గంలోని కొంత మంది కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో ఆయా నేతల స్వగ్రామాల్లో టీఆర్ఎస్ మెజారిటీ ఓట్లను సాధించింది. నియోజకవర్గంలో బలంగా ఉన్న సీపీఐ ముఖ్య నేతలు కాంగ్రెస్తో పొత్తును విభేదిస్తూ టీఆర్ఎస్లో చేరడం కూడా సునీతా రెడ్డి ఓటమికి దారితీసిందని చెప్పవచ్చు. ‘చెరుకు’....మాటలు కరుకు దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు మత్యంరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేసినా ఓడిపోడానికి ఆయన నోటి దురుసే కారణమైంది. ఈ వ్యవహార శైలి నచ్చకే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయింది. ఎన్నికలకు ముందు మిగిలిన మూడు వర్గాలు ఏకమై ముత్యంరెడ్డిని ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించాయి. దీనికి తోడు టీఆర్ఎస్ గాలివీచడంతో ముత్యం రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సొలిపేట లింగారెడ్డి చేతిలో 37,899 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. పూర్వం దొమ్మాట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 1989-99 మధ్యకాలంలో వరుసగా మూడుసార్లు నెగ్గారు. 2004 ఎన్నికలు, 2008 ఉప ఎన్నికల్లో రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి సొలిపేట చేతిలో ఓడిపోయారు. ఆయన 2009లో దొమ్మాట రద్దయి దుబ్బాక నియోజకవర్గం ఆవిర్భవించాకా కాంగ్రెస్లో చేరి ఆ ఎన్నికల్లో మళ్లీ సొలిపేటపై 2,649 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారని చర్చ జరుగుతోంది. నందీశ్వర్ వర్సెస్ డీసీసీ పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాలను కలుపుకుని 2009లో పటాన్చెరు నియోజకవర్గం కొత్తగా ఆవిర్భవించింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ టీడీపీ అభ్యర్థి సపాన్దేవ్పై నెగ్గారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి సపన్దేవ్పై గెలుపొందగా సిట్టింగ్ కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ మూడో స్థానంలో నిలిచారు. డీసీసీ అధ్యక్షుడు కె భూపాల్ రెడ్డి వర్గంతో విభేదాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే ఆయన్ను మూడోస్థానంలో దిగజార్చిందని విమర్శలు ఎదుర్కొంటున్నారు. నర్సారెడ్డి ..కబ్జాలు? ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 వేల ఓట్లను సాధించి గజ్వేల్ నియోజకవర్గంలో అగ్రస్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి 33,998 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు టీడీపీ అభ్యర్థి ప్రతాప్రెడ్డి ఇచ్చిన పోటీని సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నర్సారెడ్డి ఇవ్వలేకపోయారు. నర్సారెడ్డి దురుస వైఖరితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం ఆయన విస్మరించడంతో వారంతా టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ, వక్ఫ్ భూ కబ్జాలను ప్రోత్సహించారని నర్సారెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఉద్యమించాయి. పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలను సైతం ఎన్నాడు పట్టించుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. -
ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులే!
న్యూఢిల్లీ: 16వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులేనని నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ), అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పరిశీలనలో వెల్లడైంది. మొత్తం 543 ఎంపీలకు 541 మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను న్యూ, ఏడీఆర్ పరిశీలించాయి. వారిలో 186 మందిపై (మొత్తం ఎంపీల్లో 34 శాతం మంది) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. ఈ 186 మంది ఎంపీల్లో 112 మంది (21 శాతం మంది)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు, మతవిద్వేషాలు రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. పార్టీలవారీగా చూస్తే బీజేపీ నుంచి ఎన్నికైన 281 మంది ఎంపీల్లో 98 మంది (35 శాతం మంది) ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. అలాగే శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 15 మంది, 44 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 8 మంది, 34 మంది తృణమూల్ ఎంపీల్లో ఏడుగురు, 37 మంది అన్నాడీఎంకే ఎంపీల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది. 2009 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 30 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 34 శాతానికి పెరిగింది. -
అద్వానీతో నరేంద్ర మోడీ సుదీర్ఘ భేటీ
-
'మేం ఎప్పటికీ వైఎస్సార్ సీపీ లోనే ఉంటాం'
ఖమ్మం: తాము పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజంలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్ లు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన తాము ఎప్పటికీ ఆ పార్టీలోనే ఉంటామని తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆ ఎమ్మెల్యేలు.. పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది కొన్ని రాజకీయ శక్తుల చేస్తున్న కుట్ర మాత్రమేనని వారు మండిపడ్డారు. -
ఆ 8 మందీ అదృష్టవంతులే!
మన రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లోక్సభ సభ్యులుగా గెలిచిన వారిలో 8 మంది అదృష్టవంతులు ఉన్నారు. సాదారణంగా ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో ఏడు శాసనసభ స్థానాలు ఉంటాయి. వాటిలో కనీసం నాలుగు స్థానాలలో ఏ పార్టీ గెలుస్తుందో, ఆ పార్టీకి చెందిన అభ్యర్థే లోక్సభ సభ్యుడుగా ఎన్నికవుతారు. ఒక పార్టీ నాలుగు కంటే తక్కువ స్థానాలలో గెలిచినా, ఆ పార్టీ అభ్యర్థే లోక్సభకు ఎన్నికైతే అదృష్టవంతుడిగా భావించవచ్చు. ఈ సారి ఎన్నికలలో ఆ విధమైన అదృష్టవంతుల జాబితాలో 8 మంది చేరారు. కాకినాడ లోక్సభ స్థానంలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట శాసనసభ స్థానాలలో వైఎస్ఆర్ సిపి గెలిచింది. కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం స్థానాల్లో టీడీపీ గెలిచింది. పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థి వర్మ గెలుపొందారు. టిడిపి మూడు స్థానాలే గెలిచినప్పటికీ అదృష్టం వరించడంతో లోక్సభకు ఆ పార్టీ అభ్యర్థి తోట నరసింహం గెలుపొందారు. బాపట్ల లోక్సభ స్థానంలో కూడా ఇదే పరిస్థితి. వేమూరు, రేపల్లె, పర్చూరులలో టిడిపి గెలిచింది. బాపట్ల, అద్దంకి, సంతనూతలపాడులలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు విజయం సాధించారు. చీరాలలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ గెలిచారు. కానీ ఇక్కడ టిడిపి అభ్యర్థి మాల్యాద్రి శ్రీరామ్ లోక్సభ సభ్యుడుగా గెలిచారు. పిఠాపురంలో టిడిపి తిరుగుబాటు అభ్యర్థి గెలిస్తే, చీరాలలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి గెలిచారు. అయినా ఇక్కడ కూడా అదృష్టం వరించడంతో టిడిపి అభ్యర్థే ఎంపిగా విజయం సాధించారు. స్వంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన రెండు చోట్ల టిడిపి అభ్యర్థులే ఎంపిలుగా గెలిచారు. ఒంగోలు లోక్సభ స్థానంలో ఒంగోలు, దర్శి, కనిగిరి, కొండేపి శాసనసభ స్థానాలు నాలుగు చోట్ల టిడిపి అభ్యర్థులే గెలుపొందారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరులలో మాత్రమే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. అయినా అదృష్టం కలసి రావడంతో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడుగా గెలిచారు. తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ తిరుమల శ్రీవారి కరుణా కటాక్షం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వరప్రసాద రావుకి లభించింది. ఇక్కడ తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచారు. సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. టిడిపి నాలుగు చోట్ల గెలిచినప్పటికీ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. వైఎస్ఆర్ సిపి అభ్యర్థి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి వరప్రసాద్ విజయం సాధించారు. చిత్తూరు ఫలితం మరీ విచిత్రంగా ఉంది. టీడీపీ లోక్సభ అభ్యర్థి శివప్రసాద్ గొప్ప అదృష్టవంతుడు. ఇక్కడ చంద్రగిరి, నగరి, పూతలపట్టు, పలమనేరు, గంగాధర నెల్లూరు అయిదు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. చిత్తూరు, కుప్పం రెండు చోట్ల మాత్రమే టిడిపి అభ్యర్థులు గెలిచారు. అయినా టిడిపి అభ్యర్థి శివప్రసాద్ ఎంపిగా విజయం సాధించారు. దానికి ప్రధాన కారణం ఇక్కడ చంద్రబాబు నాయుడుకి 47 వేల ఓట్లు మెజార్టీ రావడమే. దాంతో శివప్రసాద్ విజయం సాధించారు. ఇక తెలంగాణలోని మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పినపాకలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి, భద్రాచలంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఎం అభ్యర్థి గెలిచారు. డోర్నకల్, ఇల్లందులలో కాంగ్రెస్ అభ్యర్థులు, మహబూబాబాద్, ములుగులలో టీఆర్ఎస్ అభ్యర్థులు, నర్సంపేటలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ కేవలం రెండు శాసనసభ నియోజకవర్గాలలోనే గెలిచిన టీఆర్ఎస్కు చెందిన అభ్యర్థి సీతారాంనాయక్ లోక్సభకు ఎన్నికడం విశేషం! చేవెళ్లలో కూడా ఇదే పరిస్థితి. ఈ లోక్సభ నియోజకవర్గంలో టిఆర్ఎస్ రెండు శాసనసభ స్థానాలనే గెలుచుకున్నా టిఆర్ఎస్ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి ఎంపిగా ఎన్నికయ్యారు. ఇక్కడ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలలో టిడిపి, చేవెళ్ల, పరిగిలలో కాంగ్రెస్, వికారాబాద్, తాండూరులలో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయినా అదృష్టం కలసిరావడంతో లోక్సభకు టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఖమ్మం లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని అదృష్టం వరించింది. ఇక్కడ వైరా, అశ్వరావుపేటలలో మాత్రమే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. ఖమ్మం, పాలేరు, మదిరలలో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సత్తుపల్లిలో టిడిపి, కొత్తగూడెంలో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయినా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి శ్రీనివాస రెడ్డి విజయం సాధించడం విశేషం. ఈ విధంగా ఈ 8 మందిని అదృష్టవంతులుగా భావించవచ్చు. -
అద్వానీతో నరేంద్ర మోడీ సుదీర్ఘ భేటీ
ఢిల్లీ: బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గంటపాటు సుదీర్ఘంగా సమావేశమైయ్యారు. మరికొద్ది రోజుల్లో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర కేబినెట్ కు సంబంధించిన అంశాలపై అద్వానీతో మోడీ చర్చించారు. ఇప్పటికే అద్వానీని లోక్ సభ స్పీకర్ గా నియమించాలని బీజేపీ యోచిస్తోంది. ఒకవేళ అద్వానీకి ఆ పదవి దక్కితే మూడో అత్యుత్తమ పదవి ఆయనదే అవుతుంది. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి పదవుల తర్వాత లోక్ సభ స్పీకర్ దే అత్యంత ప్రాధాన్యమున్న పదవి. మరో బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడుతో పాటు, అరుణ్ జైట్లీ, జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లకు కీలక పదవుల దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, షాన్ వాజ్ హుస్సేన్ తో పాటు ఆమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ దిగి ఓడిపోయిన స్మృతీ ఇరానీకి కూడా కేబినెట్ లో చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. తిరిగి పార్టీ అధ్యక్షుడిగా నితిన్ గడ్కారీని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు అటు మోడీతో పాటు, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఆదివారం రామ్ విలాస్ పాశ్వాన్ కు మోడీని కలిసి కేబినెట్ లో చోటు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
‘దృఢ ప్రభుత్వం కోసమే బీజేపీకి ఓటు’
ముంబై: ఓటర్లు ఈసారి అవినీతి కంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునే దృఢమైన ప్రభుత్వం కావాలన్న ఉద్దేశంతోనే మోడీకి ఓటేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మయాంక్ గాంధీ పేర్కొన్నారు. నగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడిన మయాంక్.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటుచేసి 49 రోజుల్లోనే గద్దె దిగిపోవడంతో కేజ్రీవాల్ బాధ్యతల నుంచి తప్పించుకున్నారనుకున్న ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదనుకున్న ఓటర్లు మోడీవైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈసారి అవినీతి అనే అంశాన్ని ప్రజలు పట్టించుకోలేదని, అయినా కూడా అప్ అన్ని స్థానాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిందని చెప్పారు. మోడీ, ఆయన పార్టీకి కార్పొరేట్ కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చాయని ప్రజలకు తెలిసినా అది పట్టించుకోలేదన్నారు. సమర్థ, నిర్ణయాత్మక ప్రభుత్వం కావాలనుకున్నా ఓటర్లు అది మోడీ వల్లనే సాధ్యమైనా బీజేపీని ఓటేశారని వివరించారు. ‘ఢిల్లీలో ఆప్కు ఇప్పటికీ ఆదరణ ఉంది. కేంద్ర నాయకత్వం గురించే ప్రజలు బీజేపీకి ఓటేశారు. ఎప్పడూ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆప్ స్వీప్ చేస్తుంద’ని గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
స్టాలిన్ యూటర్న్
-
ఎంపీలుగా గెలవడానికీ ఓ లెక్కుంది!
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 63 స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో 11 చోట్ల విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్ సిపి 67 స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో 8 చోట్ల గెలిచింది. అసెంబ్లీ సీట్ల సంఖ్యాపరంగా పరిశీలిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కన్నా ఏపిలో వైఎస్సార్సీపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు అధికంగా కైవసం చేసుకున్నప్పటికీ లోక్ సభ స్థానాలు వచ్చేసరికి మూడు తక్కువగా వచ్చాయి. ఇది ఎలా సాధ్యమని పరిశీలిస్తే, దానికీ ఓ లెక్క ఉందని తేలింది. దానికి తోడు లక్కు కూడా ఉందనిపిస్తోంది. సీమాంధ్రలో చోటుచేసుకున్న అంశాల్లోకి వెళితే.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కడప జిల్లా రాజంపేటలోనూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విశాఖపట్నంలోనూ పరాజయం పాలయ్యారు. ఇలా ప్రముఖ వ్యక్తుల ఓటమి, పెద్దగా పేరు కూడా లేని వ్యక్తులు చక్కటి మెజార్టీలతో గెలవడం ఆశ్యర్యానికి గురిచేస్తోంది. లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయనేది తెలిసిందే. సుమారు పది లక్షల పైగా ఓటర్లు ఉంటారు. ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఓట్లు అందరినీ కలవడం అసాధ్యం. మరి ఈ పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులు విజయసోపానాలు ఎక్కాలంటే.. తప్పని సరిగా తమ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులపై ఆధారపడక తప్పదు. అంటే సమర్థులైన అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉంటే ఎంపీల ఎన్నిక సునాయాసం అవుతుందనడంలో సందేహం లేదు. కనీసం ఏడు అసెంబ్లీస్థానాల్లో నాలుగు సీట్లు ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీ అభ్యర్థి ఎంపిగా ఎన్నికైనట్లే. ఒక్కోసారి తక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపి అభ్యర్థి గెలిచాడంటే అక్కడ లక్కు తోడైనట్లే భావించాలి. సీమాంధ్రలోని 25 ఎంపీ స్థానాల్లో ఫలితాలను ఓసారి పరిశీలిస్తే అరకు ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి ‘గీత’ మారిందంటే అక్కడి ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. శ్రీకాకుళంలో కూడా ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఆరుగురు గెలవడంతో కింజారపు రామ్మోహన్నాయుడు ఎన్నిక లాంఛనమే అయింది. విజయనగరంలో అయిదు స్థానాలలో టీడీపీ, రెండు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలవడంతో ఎంపీ స్థానం సునాయాసంగా టీడీపీ అభ్యర్థి అశోక్గజపతిరాజుకు దక్కింది. విశాఖలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలవకపోవడంతో ఎంపీ స్థానంలో పోటీచేసిన ప్రముఖ వ్యక్తి విజయమ్మ కూడా ఓటమి చవిచూడవలసి వచ్చింది. అనకాపల్లిలోనూ ఆరు టీడీపీ, ఒక స్థానంలో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో ఎంపీ స్థానం అవలీలగా టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. అయితే కాకినాడ ఎంపీ స్థానం ఫలితాన్ని విశ్లేషిస్తే.. ఇక్కడ టీడీపీ అభ్యర్థి తోట నర్సింహంకు లక్కు తోడైందనడంలో సందేహం లేదు. ఈ ఎంపీ స్థానం పరిధిలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో వైఎస్సార్సీపీ, కాకినాడ రూరల్, సిటీ, పెద్దాపురం స్థానాల్లో టీడీపీ, పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అదృష్టం కూడా కలిసిరావడంతో ఇక్కడ ఎంపీ స్థానంలో స్వల్ప మెజారిటీతో టీడీపీ గెలించింది. అమలాపురంలో ఆరు చోట్ల టీడీపీ, రాజమండ్రిలో టీడీపీ, బీజేపీలు ఏడుస్థానాల్లో, నరసాపురంలోనూ ఇదే పరిస్థితి చోటుచేసుకోవడంతో ఈ మూడు స్థానాలు టీడీపీ, బీజేపీ వశమయ్యాయి. ఏలూరులో ఐదు టీడీపీ, ఒకచోట బీజేపీ, మరోచోట వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. ఈ లెక్కన ఈ ఎంపీ స్థానం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అలాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో రెండేసి వంతున మాత్రమే వైఎస్సార్ సీపీ గెలవడంతో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలవగలిగారు. బాపట్లలో అయితే చెరి మూడు చోట్ల టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలవగా, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థికి అదృష్టం తోడవడంతో కొద్దిపాటి మెజారిటీతో గెలవగలిగారు. ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన రెండు చోట్ల టిడిపి అభ్యర్థులే ఎంపిలుగా గెలిచారు. ఈ రకమైన అంచనాలకు భిన్నంగా ఒంగోలులో జరిగింది. ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల టీడీపీ, మూడు చోట్ల మాత్రమే వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఎంపీ స్థానం మాత్రం వైఎస్సార్ సీపీకి దక్కడ విశేషం! ఇక్కడ వైవి సుబ్బారెడ్డికి అదృష్టం కలసి వచ్చినట్లుగా భావించాలి. నంద్యాలలో ఆరు అసెంబ్లీ స్థానాలలో, కర్నూలులో ఐదు సీట్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో ఈ రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు అవలీలగా గెలవగలిగారు. అనంతపురం, హిందూపురంలలో ఆరేసి చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవడంతో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయం సులువైంది. కడపలో అన్ని స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడంతో అక్కడి ఎంపీ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకలా సాగింది. నెల్లూరులోనూ ఐదు చోట్ల వైఎస్సార్సీపీ గెలుపుతో ఎంపీ అభ్యర్థి విజయం సులువైంది. తిరుపతిలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థికి వెంకన్న కరుణ లభించినట్లుంది. ఇక్కడ నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచినా, ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక రాజంపేటను పరిశీలిస్తే.. ఐదు చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఇక్కడ పోటీచేసిన పురందేశ్వరి ఓటమి చవిచూడాల్సివచ్చింది. చిత్తూరు ఫలితం విచిత్రంగా ఉంది. ఇక్కడి ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందినా టీడీపీ ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అతనికి అదృష్టం జిడ్డులా పట్టుకుందనుకోవాలి. తెలంగాణలో ఇక తెలంగాణలో ఎంపీ స్థానాల్లో సరళి కూడా ఇంచుమించు ఇదేరీతిలో ఉంది. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో చిత్రాతిత్రాలు చోటుచేసుకున్నట్లు విశదమవుతోంది. అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి ఎంపీ స్థానంలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు టీడీపీ, ఒక చోట బీజేపీ, రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి విజయం వరించింది. మహబూబాబాద్లోని ఏడు అసెంబ్లీ సీట్లలో డోర్నకల్, ఇల్లందుల్లో కాంగ్రెస్, మహబూబాబాద్, ములుగులలో టీఆర్ఎస్, నర్సంపేటలో స్వతంత్ర అభ్యర్థి, పినపాకలో వైఎస్సార్ సీపీ, భద్రాచలంలో సీపీఎం అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాంనాయక్ గెలుపొందడం విశేషం! చేవెళ్ల ఎంపీ స్థానంలో టీఆర్ ఎస్ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి విశ్వాసం పొందగలిగారు. అయితే, ఈ ఎంపీ స్థానం పరిధిలో మూడు చోట్ల టీడీపీ, రెండు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే మూడు చోట్ల టీఆర్ఎస్ రెండోస్థానంలో ఉండడంతో ఎంపీ స్థానం ఆ పార్టీ దక్కించుకోగలిగింది. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్సీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మూడు చోట్ల కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ రెండు చోట్ల, టీడీపీ, టీఆర్ఎస్ ఒక్కోచోట గెలుపొందాయి. టీడీపీ నాలుగుచోట్ల రెండోస్థానంలో నిలిచినా విజయం వైఎస్సార్సీపీనే వరించడం అదృష్టమే. ఈ ఫలితాల సరళిని బట్టి చూస్తే.. ఎంపీ అభ్యర్థుల విజయావకాశాలు తమ వ్యక్తిగత నేపథ్యం కన్నా, తమ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల గెలుపును బట్టే ఉంటుందనేది స్పష్టమవుతోంది. ఇందుకు భిన్నంగా ఫలితం వస్తే అక్కడ అభ్యర్థిని అదృష్టం వరించినట్లే చెప్పుకోవాలి. - అవ్వారు శ్రీనివాసరావు -
స్టాలిన్ యూటర్న్... రాజీనామా ఓ డ్రామా: ఆళగిరి
చెన్నై: డీఎంకే పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించిన ఆపార్టీ నేత, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ యూటర్న్ తీసుకున్నారు. స్టాలిన్ రాజీనామాతో చెన్నైలో హైడ్రామా నడించింది. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ హైకమాండ్ ఒత్తిడి మేరకు స్టాలిన్ యూటర్న్ తీసుకున్నారు. స్టాలిన్ రాజీనామా ఓ డ్రామా అని డిఎంకే పార్టీ బహిషృత నేత ఎంకే అళగిరి ఆరోపించారు. రాజీనామా ప్రకటించగానే స్టాలిన్ నివాసానికి పార్టీ అధినేత కరుణానిధి, సీనియర్ నేతలు చేరుకుని.. రాజీనామాను ఉపసంహరింప చేశారు. తమ ఒత్తిడి మేరకు రాజీనామాపై స్టాలిన్ మనసు మార్చుకున్నారని సీనియర్ నేత దురై మురుగన్ మీడియాకు తెలిపారు. -
బాలరాజుకు గుణపాఠం
పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2009 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఐదేళ్ల పాటు పనిచేసిన పి.బాలరాజుకు ఈ ఎన్నికల్లో ఓటర్లు గుణపాఠం చెప్పారు. పాడేరు నియోజకవర్గంలో రికార్డుస్థాయిలో అభివృద్ధి చేశానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. మాజీ మంత్రి చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించలేదు. మంచినీటి సమస్యను పరిష్కరించలేదు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని గిరిజనులంతా ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం కూడా కాంగ్రెస్ కార్యకర్తల సూచనల మేరకే ఆయా గ్రా మాల్లో చేపట్టి మారుమూల గ్రామాలను మాత్రం నిర్లక్ష్యం చేశారనే అపవాదు ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా పక్షపాతధోరణి అవలంబించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగానే మార్చేసేలా కాంగ్రెస్ పాలన మారింది. వార్డెన్ పోస్టులను అనర్హులకే కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. ఇందిరమ్మ గృహాల మంజూరులో గిరిజనులకు అన్యా యం చేశారని, అర్హులైన గిరిజనులు పునాదులు తవ్వుకున్నా ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చిన 2 వేల గృహాలు కూడా గత ఏడాది కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న గ్రామాల్లోని గిరిజనులకే కేటాయించారు. దీంతో అనేక మంది గిరిజనులంతా మాజీ మంత్రి బాలరాజు తీరుపై మండిపడుతున్నారు. కొయ్యూరు నుంచి పాడేరు వరకు ఐదు మండలాల్లో బాలరాజు పాలనపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అండతో గెలిచిన బాలరాజు మహానేత మరణానంతరం అన్ని వర్గాల గిరిజనుల సంక్షేమాన్ని మరిచిపోయారు. నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో కూడా బాలరాజు తన ప్రభావం చూపలేకపోయారు. అవినీతి, అక్రమాల్లే వల్లే బాలరాజును ఈ ఎన్నికల్లో ఓడించామని గిరిజనులు చెబుతున్నారు. ఐదేళ్లు మంత్రిగా ఉన్న బాలరాజు ఈ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. అతికష్టం మీద డిపాజిట్ దక్కించుకున్నారు. -
పార్టీ పదవులకు స్టాలిన్ రాజీనామా!
-
చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?
తాను అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను ఒంటి చేత్తో కాపాడతానని బీరాలు పలికిన చంద్రబాబు సొంత పార్టీ నాయకులను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు గడవకముందే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడ్డారు. ఎంపీగా నెగ్గిన టీడీపీ నాయకుడే స్వయంగా దాడులకు దిగినా పచ్చ పార్టీ అధినేత మిన్నకుండిపోయారు. కనీసం దాడులను ఖండించిన పాపాన పోలేదు. సొంతూరులో తనకు ఆధిక్యం దక్కలేదన్న అక్కసుతో కాకినాడ ఎంపీగా ఎన్నికైన టీడీపీ నేత తోట నరసింహం తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి మండలం వీరవరంలో వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ, దాడులు చేశారు. కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై గూండాల్లా దాడులకు తెగపడ్డారు. ‘వైఎస్సార్సీపీకి పనిచేస్తారా.. మీ అంతు చూస్తాం’ అంటూ పెద్దాపురం మండలం దివిలి ఎస్సీ పేటలో ఇళ్లల్లోకి చొరబడి తెలుగు తమ్ముళ్లు వీరంగమాడారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గాజులపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఇళ్లల్లో ఉన్నవారిని బయటకు లాక్కొచ్చి మరీ చితక బాదారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని పొట్టపై విచక్షణారహితంగా తన్నడంతో ఆమె ప్రమాదకర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా భావపురిలో టీడీపీ కార్యకర్తలు కత్తులు చేతబట్టి కారులో స్వైరవిహారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు తమ్ముళ్ల ఘాతుకాలకు అంతే లేదు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నుంచి కనీస స్పందన కరువయింది. సొంత పార్టీవారే దాడులకు తెగబడుతున్నా టీడీపీ అధినేతలో చలనం శూన్యం. శాంతి భద్రతలను కాపాడడమంటే ఇదేనా అని నిలదీస్తున్న బాధితులకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? -
'కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయం'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని వస్తున్న వార్తలను ఆప్ ఖండించింది. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలుండగా, బీజేపీ 31 సీట్లు ఉండేవి. అయితే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల లోకసభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో జనలోక్ పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి 14 తేది నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. -
బీజేడీ శాసనసభాపక్ష నేతగా నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: బిజు జనతాదళ్(బీజేడీ) శాసనసభాపక్ష నేతగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికయ్యారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరుసగా నాలుగోసారి ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు. లోక్సభ ఎన్నికలతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని అధికార బీజేడీ వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకొని విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లకుగానూ మూడింట రెండొంతుల మెజారిటీతో 115 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 18, బీజేపీ 11, సమతా క్రాంతి దళ్ 1 సీటు గెలుచుకోగా రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. -
పార్టీ పదవులకు స్టాలిన్ రాజీనామా!
చెన్నై: లోకసభ ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఫలితాలను సాధించడానికి నైతిక బాధ్యత వహిస్తూ డీఏంకే కోశాధికారి, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. స్టాలిన్ తన పదవులకు రాజీనామా చేశారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత మీడియాకు వెల్లడించారు. తాజా లోకసభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే పార్టీ 37 సీట్లు గెలుచుకోగా, బీజేపీ, పీఎంకే పార్టీలు చెరో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. -
ఎంపీ పదవి వారి గడప దాటలేదు..!
తాడేపల్లిగూడెం: నరసాపురం ఎంపీ పదవి ఆ కుటుంబీకుల గడప దాటలేదు. అయితే బావ, లేకపోతే బామ్మర్ధి అన్న విధంగా రక్త సంబంధాలు, విడదీయరాని బంధుత్వాలు కలిగిన గోకరాజు, కనుమూరి కుటుంబాలకే ఎంపీ పదవి ఉండిపోయింది. ప్రస్తుత నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు (ఆయన పదవీ కాలం ఈ నెల 30 వరకు ఉంది) నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన అవకాశంతో బాపిరాజు తొలిసారిగా 1996లో కొత్తపల్లి సుబ్బారాయుడుపై పోటీ చేసి ఎంపీగా తొలి ఓటమిని చవిచూశారు. తర్వాత 1998లో తిరిగి పోటీచేసి విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తాజా ఎన్నికలలో ఆయన బావమర్ది గోకరాజు గంగరాజు ఎంపీగా తిరుగులే ని ఆధిక్యాన్ని సాధించారు. దీంతో నరసాపురం పదవి వారి గడపదాటనట్టయ్యింది. బాపిరాజుకు మామ ఇంటినుంచి పదవీ వారసత్వం వచ్చినట్టు చెబుతారు. మామ మాదిరిగానే టీటీడీ చైర్మన్ పదవిని బాపిరాజు పొందారు. ఎంపీ పదవిని ఇప్పటి వరకు అనుభవించిన ఆయన ఎన్నికలలో ఓటమి ద్వారా ఆ పదవి బావమర్దికి దక్కడంతో పదవి వారి గడప దాటనట్టయింది. -
రాజ్ నాథ్ ను కలిసిన పీఏ సంగ్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిదోసారి విజయం సాధించిన మాజీ లోకసభ స్పీకర్, నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత, పీఏ సంగ్మా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఆయన నివాసంలో కలిశారు. కేబినెట్ కూర్పు కు సంబంధించిన వ్యవహారాలు దేశరాజధానిలో ఊపందుకున్న తరుణంలో రాజ్ నాథ్ ను సంగ్మా కలువడం ప్రధాన్యత సంతరించుకుంది. కేబినెట్ లో చోటు కల్పించాలని రాజ్ నాథ్ ను సంగ్మా కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. షిల్లాంగ్ లోని తురా లోకసభ నియోజకవర్గం నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి విన్సెంట్ హెచ్ పాలాపై 40 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1972 సంవత్సర నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు లోకసభ అభ్యర్ధిగా గెలిచిన చరిత్ర సంగ్మా పేరిట ఉంది. 1989, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. -
'కృష్ణా' నేతలకు కలిసిరాని విప్ పదవి
మచిలీపట్నం: నేతలకు సెంటిమెంట్లు ఉన్నా.. లేకున్నా.. కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్లు వెంటాడుతూనే ఉంటాయి. అలా జరగడం యాథృచ్చికమే అయినా వరుసగా ఒకేవిధంగా జరిగితే అదే సెంట్మెంట్గా మారుతోంది. ఇదే తరహాలో జిల్లాకు చెందిన కీలక నేతలకు విప్ పదవి అచ్చి వచ్చినట్టు లేదు. ముగ్గురు నాయకులు విప్ పదవి చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈ సెంటిమెంట్ బలపడింది. తాజాగా ప్రభుత్వ విప్ పదవి నిర్వహించిన బందరు తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఓటమితో జిల్లాలో దీనిపై చర్చసాగుతోంది. గతంలో టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి సామినేని ఉదయభాను విప్లుగా పనిచేసి ఓటమిపాలైన వారే. మొదట ‘కాగిత’... మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాగిత వెంకట్రావు చంద్రబాబు హయాంలో విప్గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా కాగిత పనిచేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి కాగిత ఓటమిపాలయ్యారు. అదే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004లో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో మల్లేశ్వరం రద్దయి పెడన నియోజకవర్గం ఏర్పడింది. పెడన నుంచి 2009 ఎన్నికల్లో పోటీచేసిన కాగిత రెండోసారి కూడా ఓటమిని చవిచూశారు. ప్రస్తుత ఎన్నికల్లో కాగిత పెడన ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి విప్ పదవి నిర్వహించిన కాగితకు పదేళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యే పదవి దక్కింది. ఉదయభాను పరిస్థితి అంతే.. జగ్గయ్యపేట నుంచి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సామినేని ఉదయభాను వైఎస్ ప్రభుత్వంలో విప్గా పనిచేశారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయభాను ఓటమిని చవిచూశారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఉదయభాను మంత్రి అవుతారని ఆయన అభిమానులు, జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడినా ఉదయభాను మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేదు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ఉదయభాను బలపరిచారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన జిల్లాలో మంచి పట్టు సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆయన జగ్గయ్యపేట నుంచి కచ్చితంగా గెలుస్తారని రాజకీయ పరిశీలకులు ధీమాగా చెప్పారు. టీడీపీకి దీటైన పోటీ ఇచ్చిన ఆయన అనూహ్యంగా ఓటమిని చవిచూశారు. మూడో నాయకుడు ‘పేర్ని’ మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పేర్ని వెంకట్రామయ్య(నాని) 1999 ఎన్నికల్లో మాజీ మంత్రి నడకుదుటి నర్సింహారావు చేతిలో ఓటమిని చవిచూశారు. అనంతరం 2004 ఎన్నికల్లో నడకుదుటిపై, 2009 ఎన్నికల్లో నడకుదుటి అల్లుడు కొల్లు రవీంద్రపై నాని విజయం సాధించారు. దీంతో నానికి ప్రభుత్వ విప్ పదవి లభించింది. వైఎస్ మరణంతో జగన్మోహన్రెడ్డిపై జరుగుతున్న కుమ్మక్కు కుట్రలు సహించలేక, పాలకులు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని విస్మరించడాన్ని తట్టుకోలేక నాని తన విప్ పదవికి రాజీనామా ప్రకటించి వైఎస్సార్ సీపీలో చేరారు. పదవే పరమావధిగా భావించే నేతలు ఉన్న ఈ రోజుల్లో నాని కీలకమైన విప్ పదవితోపాటు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. పదవుల కంటే విలువలు, విశ్వసనీయత ముఖ్యమని భావించే నాని నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. అటువంటి నాయకుడు ఓటమిని చవిచూడటం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా జిల్లాలో ప్రభుత్వ విప్లుగా పనిచేసి విశేష ప్రజాదరణ పొందిన నేతలు సైతం ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలు కావడం గమనార్హం. -
పాలకొల్లు ఓటర్లను తికమక పెట్టిన ‘ఆటో’
పాలకొల్లు: సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటరీలో స్వతంత్ర అభ్యర్థికి, పాలకొల్లు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించడంతో క్షీరపురి ఓటర్లు తికమకపడ్డారు. దీంతో పాలకొల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ రెబెల్గా పోటీచేసిన డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి)కి పడాల్సిన ఓట్లు నరసాపురం ఎంపీగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గీతా దాస్దాస్కు పడ్డాయనే అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాలకొల్లులో టీడీపీ రెబల్గా పోటీ చేసిన డాక్టర్ బాబ్జికి ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించింది. ఆటో గుర్తుకు ఓటు వేయాలంటూ ఆయన వర్గీయులు, కార్యకర్తలు నియోజకవర్గమంతా విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీలకతీతంగా బాబ్జికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇదే సమయంలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గీతా దాస్ దాస్కు కూడా ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించింది. మే 7న జరిగిన పోలింగ్లో ముందుగా నరసాపురం పార్లమెంట్కు పోటీ చేసిన గీతా దాస్దాస్ ఎన్నికల గుర్తు ఆటో ఉండడంతో బాబ్జి గుర్తు అనుకుని ఎక్కువమంది ఓట్లు వేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో అందరికీ సుపరచితుడైన నరసాపురం సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరి బాపిరాజుకు కేవలం 3,766 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి, ఎవరికీ పరిచయం కూడా లేని గీతా దాస్దాస్కు పాలకొల్లులో ఏకంగా 12,029 ఓట్లు రావడాన్ని బట్టి చూస్తే బాబ్జికి పడాల్సిన ఓట్లని తెలుస్తోంది. గీతా దాస్దాస్కు నరసాపురం ఎంపీ నియోజకవర్గంలో మొత్తం 23,585 ఓట్లు రాగా, పాలకొల్లు పక్క నియోజకవర్గాలైన ఆచంటలో 907 ఓట్లు, నరసాపురంలో 800 ఓట్లు మాత్రమే వచ్చాయి. గీతా దాస్దాస్కు పోలైన ఓట్లు అత్యధికం డాక్టర్ బాబ్జికి పడాల్సినవేనని, ఆయనకు వచ్చిన 38,420 ఓట్లకు, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఆటో గుర్తుకు పోలైన 12,000 కలుపుకుంటే 50 వేలకు పైగా ఓట్లు వచ్చి ఉండేవని, కనీసం రెండో స్థానంలో నిలిచేవారని స్థానికులు చెబుతున్నారు. -
'హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తాం'
-
మోడీ కోసమే ప్రత్యేకంగా..
-
మోడీ కిక్కుతో లక్ష కోట్లకు పైగా...
న్యూఢిలీ: ఏ ముహూర్తాన నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించారో ఏమో.. అప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్ లోకి నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి స్టాక్ మార్కెట్ లోకి లక్ష కోట్లకు పైగా నిధులను విదేశీ సంస్థాగత మదుపుదారులు(ఎఫ్ఐఐ) మళ్లించారు. ఇప్పటి వరకు మార్కెట్ లోకి 1,02,171 కోట్ల నిధులను ఎఫ్ఐఐలు పెట్టుబడిగా పెట్టారని సెబీ వెల్లడించింది. సెప్టెంబర్ 13 తేదిన బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీని ప్రకటించింది. మోడీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని.. సంస్కరణలు పకడ్బందీగా అమలు చేస్తారనే అంశాలతో పెటుబడి దారులు సానుకూలంగా స్పందించారు. -
బీజేపీ నేతలతో మోడీ చర్చలు
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం పలువురు బీజేపీ నాయకులతో మోడీ సమావేశమయ్యారు. మోడీ సన్నిహితుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి జేపీ నద్దా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీహార్ ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్లతో ఆయన చర్చలు సాగించారు. బీహార్లో ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన నేపథ్యంలో తలెత్తిన రాజకీయ పరిస్థితులపై కూడా దృష్టిసారించారు. బీహార్లో పరిస్థితిపై వేచిచూడాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా ఈనెల 20న మోడీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. -
కేబినెట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండదు: వెంకయ్య
న్యూఢిల్లీ: తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులేస్తోంది. కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రధాన పాత్ర ఉంటుందనే వార్తలను బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ఖండించారు. కేంద్ర కేబినెట్ లో ఆర్ఎస్ఎస్ ఎలాంటి పాత్ర పోషించడం లేదంటూ వెంకయ్య విరణ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ నేతలను కలువడంలో ఎలాంటి విశేషం లేదు. ఎప్పుటిలానే ఆర్ఎస్ఎస్ ను కలిశాం. కేబినేట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదు అని వెంకయ్యనాయుడు మీడియాకు వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. -
నోటా కంటే 'ఆప్'కు తక్కువ ఓట్లు
బెంగళూరు: కర్ణాటకలో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఘోర పరాభవం ఎదురైంది. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని కుదేలయింది. కర్ణాటకలో 'ఆప్'కు 2,54,501 ఓట్లు రాగా, నోటా(మాకెవ్వరూ వద్దు)కు 2,57,873 ఓట్లు వచ్చాయి. లక్షకు పైగా సభ్యులున్న బెంగళూరు నగరంలోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బెంగళూరులోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో కలిపి 89,379 ఓట్లు మాత్రమే సాధించింది. కార్మిక నాయకుడు బాబూ మాథ్యూ, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్, బాలల హక్కుల నేత నైనా పి నాయక్... బెంగళూరులోని మూడు స్థానాల నుంచి ఆప్ తరపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. సెంట్రల్ బెంగళూరులో 39,869 ఓట్లతో బాలకృష్ణన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. తాము నిజాయితీగా ఎన్నికల ప్రచారం నిర్వహించామని, ప్రజలు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేశారని బాలకృష్ణన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గారని తెలిపారు. -
రాష్ట్రపతిని కలువనున్న ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఎన్నికల కమిషన్ అధికారులు ఆదివారం సాయంత్రం కలువనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే సమావేశానికి ఎన్నికల కమిషన్ అధికారులకు అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా ఎన్నికైన లోకసభ సభ్యుల జాబితాను రాష్ట్రపతి ప్రణబ్ కు అందించనున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల తీరును రాష్ట్రపతికి అధికారులు వివరించే అవకాశముంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరున్న భారత్ లో ఎన్నికలు నిర్వహించిన తీరుపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా సఫలమైందనే ప్రశంసలు లభిస్తున్నాయి. -
గవర్నర్ ను కలవనున్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులతో పాటు కేసీఆర్... గవర్నర్తో భేటీ కానున్నారు. కేసీఆర్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్కు టీఆర్ఎస్ నాయకులు సమర్పించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సంసిద్ధమని ఆయనకు తెలియజేయనున్నారు. మొదట సీనియర్ నాయకులు మాత్రమే గవర్నర్ వద్దకు వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తాను కూడా గవర్నర్ను కలవాలని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. -
ఉరవకొండలో విశ్వకు నీరా‘జనం’
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే హోదాలో తొలిసారి పట్టణానికి విచ్చేసిన వై.విశ్వేశ్వరరెడ్డికి శనివారం స్థానిక ప్రజలు నీరాజనం పలికారు. ఆయన రాక కోసం పార్టీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం నుంచే భారీ సంఖ్యలో జనం వేచివున్నారు. బైపాస్ రోడ్డు వద్దకు రాగానే ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు సోదరుడు, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మధుసూదన్రెడ్డిలను భుజాలపెకైత్తుకుని ఊరేగించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, మండల, పట్టణ కన్వీనర్లు సుంకన్న, బసవరాజు, జెడ్పీటీసీ సభ్యులు మీనుగ లలిత, సింగాడి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణ వాదం' గెలిచింది
-
సీట్లలో తేడా ఉన్నా.. ఓట్లలో లేదు!
-
నామమాత్రంగా మిగిలిన వామపక్షాలు
బెంగాల్లో కోలుకోలేని రీతిలో కుదేలు దారుణంగా పడిపోయిన ఓట్ల శాతం న్యూఢిల్లీ: వామపక్షాలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రంగా మిగిలాయి. ఇదివరకు ఎన్నడూ లేనంత దారుణంగా చతికిలపడ్డాయి. వామపక్షాలకు 15వ లోక్సభలో 24 స్థానాలు ఉండగా, 16వ లోక్సభ ఎన్నికల్లో పట్టుమని పది స్థానాలకే పరిమితమయ్యాయి. వామపక్ష కూటమిలోని అన్ని పార్టీలకూ గత ఎన్నికలతో పోలిస్తే, ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా క్షీణించింది. గత 2009 ఎన్నికల్లో సీపీఎంకు 5.33 శాతం ఓట్లు లభించగా, ఈసారి 3.2 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. సీపీఐ ఓట్ల శాతం 1.43 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోగా, ఆరెస్పీ 0.3 శాతం ఓట్లకు, ఫార్వర్డ్ బ్లాక్ 0.2 శాతం ఓట్లకు పరిమితయ్యాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం తొమ్మిది స్థానాలను దక్కించుకోగా, సీపీఐకి ఒక్కటే దక్కింది. కేరళ నుంచి ఆరు, త్రిపుర, పశ్చిమ బెంగాల్ల నుంచి రెండేసి స్థానాలు ఈసారి వామపక్షాలకు లభించాయి. వామపక్షాలకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్లో ఈసారి అవి అధికార తృణమూల్ కాంగ్రెస్ తాకిడికి కోలుకోలేని రీతిలో కుదేలయ్యాయి. పశ్చిమ బెంగాల్ను 34 ఏళ్లు పరిపాలించిన వామపక్ష కూటమికి ఇది దారుణ పరాభవం. బెంగాల్లోని ఓట్లనే లెక్కలోకి తీసుకుంటే, సీపీఎంకు 22.7 శాతం, సీపీఐకి 2.3 శాతం, ఆరెస్పీకి 2.4 శాతం, ఫార్వర్డ్ బ్లాక్కు 2.1 శాతం ఓట్లు లభించాయి. మొత్తంగా వామపక్ష కూటమికి రాష్ట్రంలో 29.5 శాతం ఓట్లు లభించాయి. గత లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచే 15 స్థానాలను గెలుచుకున్న వామపక్షాలకు ఈసారి రెండు మాత్రమే దక్కాయి. త్రిపుర మాత్రమే పదిలం మరోవైపు కేరళలో ఎల్డీఎఫ్ నుంచి వెలుపలకు వచ్చిన ఆరెస్పీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్లో చేరి ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఆరెస్పీ అభ్యర్థి చేతిలో సీపీఎం మాజీ ఎంపీ ఎంఏ బేబీ మట్టికరిచారు. త్రిపురలో వచ్చిన ఫలితాలు మాత్రమే సీపీఎంకు కొంత ఊరట. రాష్ట్రంలోని రెండు లోక్సభ స్థానాలనూ సీపీఎం 5 లక్షలు, 4.8 లక్షల పైచిలుకు ఆధిక్యతతో ఆ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.