టీడీపీ దాడి.. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి విషమం | tdp workers attack ysrcp workers in guntur | Sakshi
Sakshi News home page
breaking news

టీడీపీ దాడి.. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి విషమం

May 24 2014 11:54 AM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా మారింది.

అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా మారింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే వినుకొండ సమీపంలో ఓ వ్యక్తిని చంపేశారు. శనివారం నాడు పొన్నూరు మండలంలో బాలరాజు, సత్యానందం అనే ఇద్దరు వ్యక్తులను హతమార్చే ప్రయత్నం చేయగా, వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో వాళ్లను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సన్నిహితులు. టీడీపీకి ఎందుకు ఓటేయలేదు, వైఎస్ఆర్సీపీలో కొనసాగితే ఊరుకునేది లేదని బెదిరించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఎప్పుడు ఎవరొచ్చి దాడులు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

ఇటీవలి కాలంలో టీడీపీ వర్గాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ డాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే దాడులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement