అజింక్యా రహానెకు షాక్‌.. భారీ జరిమానా‌! | Ajinkya Rahane fined for slow over-rate | Sakshi
Sakshi News home page

Published Mon, May 14 2018 1:28 PM | Last Updated on Mon, May 14 2018 1:31 PM

Ajinkya Rahane fined for slow over-rate - Sakshi

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్‌ అజింక్యా రహానేపై భారీ జరిమానా విధించారు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్‌రేటు నమోదవ్వడంతో రహానేపై ఐపీఎల్‌ రూ. 12 లక్షల జరిమానా విధించింది. టాస్‌ గెలిచి.. బౌలింగ్‌ తీసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు మినిమమ్‌ ఓవర్‌ రేటు నమోదుచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ జట్టు కెప్టెన్‌ రహానేపై రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నామని, ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం స్లో ఓవర్‌ రేటుకు సంబంధించి ఇది మొదటి నేరం కావడంతో జరిమానాతో సరిపెట్టామని ఐపీఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబైపై ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట జోఫ్రా అర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై జట్టు 168 పరుగులకు పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు జోస్‌ బట్లర్‌ చెలరేగి పరుగులు చేయడంతో అలవోకగా విజయాన్ని అందుకుంది. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్‌రేటు నమోదుచేయడంతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement