Rajasthan Royals
-
IPL 2025, RR VS RCB: సంజూ శాంసన్ను టార్గెట్ చేస్తున్న అభిమానులు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్లో శాంసన్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా సీజన్ తొలి మ్యాచ్లో. తాజాగా శాంసన్ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో అతడు 19 బంతుల్లో బౌండరీ సాయంతో 15 పరుగులు మాత్రమే చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్లో శాంసన్ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుత సీజన్లో శాంసన్ పేలవ ప్రదర్శన కొనసాగుతుండటంతో రాయల్స్ అభిమానులు విసిగిపోయారు. శాంసన్ను తిట్టిపోస్తున్నారు. మెగా వేలానికి ముందు కీలక ఆటగాళ్లను వదులుకున్న విషయంలోనూ శాంసన్నే టార్గెట్ చేస్తున్నారు. ఈ సీజన్లో రాయల్స్ దుస్థితికి శాంసనే కారకుడని విమర్శిస్తున్నారు.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో శాంసన్ స్కోర్లు..15(19)41(28)38(26)20(16)13(11)66(37)ఈ మ్యాచ్లో స్టంపౌటైన శాంసన్ మరో అనవసరపు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్లో స్టంపౌట్తో కలుపుకుని శాంసన్ ఐపీఎల్లో ఇప్పటివరకు 6 సార్లు డకౌటయ్యాడు. యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో (ఐపీఎల్లో) అత్యధిక సార్లు స్టంపౌటైన రికార్డు ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉంది. డుప్లెసిస్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏడు సార్లు స్టంపౌటయ్యాడు.ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్లు (ప్రస్తుతమున్న వారిలో)..7 - ఫాఫ్ డుప్లెసిస్6 - సంజు శాంసన్5 - మోయిన్ అలీ5 - దీపక్ హుడా5 - విరాట్ కోహ్లీ5 - మన్దీప్ సింగ్5 - అజింక్య రహానే5 - డేవిడ్ వార్నర్మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ 15 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. శాంసన్ (15), రియాన్ పరాగ్ (30) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (64), ధృవ్ జురెల్ (1) క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుతం రాయల్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ ఐదో స్థానంలో ఉంది. రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి, మూడింట ఓడగా.. ఆర్సీబీ 5 మ్యాచ్ల్లో మూడు గెలిచి రెండిటిలో ఓటమిపాలైంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉండగా.. గుజరాత్, లక్నో, కేకేఆర్ వరుసగా స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ ఆరు, సన్రైజర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ వరుసగా 8 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. -
RR VS RCB Live Updates: 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాల్ట్
28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాల్ట్ 174 పరుగుల ఛేదనలో సాల్ట్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సాల్ట్కు (59) జతగా మరో ఎండ్లో కోహ్లి 22 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 82/0గా ఉంది. టార్గెట్ 174.. ధాటిగా ఆడుతున్న కోహ్లి, సాల్ట్174 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులుగా ఉంది. విరాట్ 16, సాల్ట్ 34 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాణించిన జైస్వాల్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన రాయల్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు. మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్.. జైస్వాల్ ఔట్15.6వ ఓవర్- 126 పరుగుల వద్ద రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ (75) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జురెల్కు జతగా హెట్మైర్ క్రీజ్లోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్13.2వ ఓవర్- 105 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (30) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 57, ధృవ్ జురెల్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాయల్స్6.5వ ఓవర్- 49 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో సంజూ శాంసన్ (15) స్టంపౌటయ్యాడు. శాంసన్ అప్పటికే పరుగులు చేసేందుక ఇబ్బంది పడుతున్నాడు. 7 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 50/1గా ఉంది. జైస్వాల్ 32, రియాన్ పరాగ్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 36/0రాయల్స్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 36/0గా ఉంది. యశస్వి జైస్వాల్ 29, సంజూ శాంసన్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 19/0టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్స్ నిదానంగా ఆడుతుంది. 3 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 19/0గా ఉంది. జైస్వాల్ 13, సంజూ శాంసన్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. జైపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గత మ్యాచ్లో ఆడిన జట్టునే బరిలోకి దించుతుండగా.. రాయల్స్ ఓ మార్పు చేసింది. ఫజల్ హక్ ఫారూకీ స్థానంలో వనిందు హసరంగ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. చెట్లు నాటే విషయంలో అవగాహన నిమిత్తం ఆర్సీబీ గత కొన్ని సీజన్లుగా ఓ మ్యాచ్లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగుతుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్లు: శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్ చరక్, ఫజల్హాక్ ఫరూకీ, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్ -
గెలుపు బాట పట్టాలని!
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న రెండు జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జైపూర్ వేదికగా జరగనున్న తొలి పోరులో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. తాజా సీజన్లో బెంగళూరు జట్టు 5 మ్యాచ్లు ఆడి 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... రాజస్తాన్ రాయల్స్ ఐదు మ్యాచ్ల్లో రెండింట గెలిచి మూడు మ్యాచ్ల్లో ఓడి 4 పాయింట్లతో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ను వారి సొంత మైదానాల్లో ఓడించిన బెంగళూరు... ఇప్పుడు రాజస్తాన్ను కూడా చిత్తు చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు తమ రెండో ‘హోం గ్రౌండ్’ గువాహటిలో మ్యాచ్ల అనంతరం రాజస్తాన్ జట్టు తిరిగి జైపూర్లో మ్యాచ్కు సిద్ధమైంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం రాయల్స్ను ఇబ్బంది పెడుతోంది. కెప్టెన్ సంజూ సామ్సన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మైర్, హసరంగతో రాజస్తాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్లో ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ కీలకం కానున్నారు. బెంగళూరు విషయానికి వస్తే... స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాతో బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా ఉంది. హాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. రాజస్తాన్ బౌలింగ్కు, బెంగళూరు బ్యాటింగ్కు మధ్య ఆసక్తికర సమరం ఖాయమే.ఢిల్లీ X ముంబైరాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంఈ సీజన్లో పరాజయం ఎరగకుండా... దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్తో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ఆదివారం రెండో మ్యాచ్లో తలపడుతుంది. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించగా... హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లాడి కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసుకుంది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోయినా... వారంతా సమష్టిగా సత్తాచాటలేకపోతుండటంతో ముంబై పోటీలో వెనుకబడిపోయింది. ఈ మ్యాచ్లో పరాజయం పాలైతే తిరిగి కోలుకొని ప్లే ఆఫ్స్కు చేరడం ముంబైకి కష్టతరంగా మారనుంది. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా పాండ్యా సేన బరిలోకి దిగనుంది. డుప్లెసిస్, మెక్గుర్క్, అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, స్టబ్స్, ఆశుతోష్ శర్మ, అక్షర్ పటేల్తో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్లో బెంగళూరుపై చక్కటి ఇన్నింగ్స్తో విలువ చాటుకున్న రాహుల్ ఫుల్ఫామ్లో ఉన్నాడు. స్టార్క్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, ముకేశ్ కుమార్ బౌలింగ్ భారం మోయనున్నారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మపై తీవ్ర ఒత్తిడి ఉండగా... రికెల్టన్ మెరుపులు మెరిపించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. తిలక్వర్మ, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నారు. బౌల్ట్, సాంట్నర్తో కలిసి బుమ్రా బౌలింగ్ భారం మోయనున్నాడు. -
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. భారత తొలి క్రికెటర్గా ఘనత
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ అదరగొడుతున్నాడు. గతేడాది పన్నెండు ఇన్నింగ్స్లోనే 527 పరుగులు సాధించి సత్తా చాటిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఈసారి అదే జోరును కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో కలిపి 273 పరుగులు సాధించాడు.ధనాధన్ దంచికొడుతూసీజన్ ఆరంభ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 41 బంతుల్లో 74.. అనంతరం ముంబై ఇండియన్స్పై 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీపై 36 బంతుల్లో 49 రన్స్ చేసిన సాయి సుదర్శన్ (Sai Sudharshn).. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మాత్రం కేవలం ఐదు పరుగులే చేసి నిరాశ పరిచాడు. అయితే, తాజాగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా మరోసారి బ్యాట్ ఝులిపించి.. సాయి ఫామ్లోకి వచ్చేశాడు.అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. కేవలం 53 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ మంచి స్కోరు సాధించి జట్టు విజయానికి పునాది వేశాడు.సరికొత్త చరిత్రఇక రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా సాయి సుదర్శన్ ఐపీఎల్లో 1300 పరుగుల మార్కును దాటాడు. అంతేకాదు కేవలం 30 ఇన్నింగ్స్లోనే అతడు ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో తక్కువ ఇన్నింగ్స్లోనే 1300కు పైగా పరుగులు చేసిన భారత తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు.కాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన చెన్నై ఆటగాడు సాయి సుదర్శన్.. ఇప్పటి వరకు 30 మ్యాచ్లు పూర్తి చేసుకుని 1307 పరుగులు సాధించాడు. ఇక ఆది నుంచి టైటాన్స్కే ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి సుదర్శన్ను ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు గుజరాత్ ఫ్రాంఛైజీ రూ. రూ. 8.50 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఐపీఎల్ చరిత్రలో 30 ఇన్నింగ్స్లోనే వెయ్యికి పైగా పరుగులు సాధించిన క్రికెటర్లు👉షాన్ మార్ష్- 1338👉సాయి సుదర్శన్- 1307*👉క్రిస్ గేల్- 1141👉కేన్ విలియమ్సన్- 1096👉మాథ్యూ హెడెన్- 1082.తొలి ప్లేయర్గా మరో ఘనతరాయల్స్తో మ్యాచ్ సందర్భంగా ఈ రికార్డుతో పాటు మరో ఘనతను కూడా సాయి సుదర్శన్ సాధించాడు. ఒకే వేదికపై వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. అహ్మదాబాద్లో ఆర్సీబీపై 84, సీఎస్కేపై 103, పంజాబ్ కింగ్స్పై 74, ముంబై ఇండియన్స్పై 63 పరుగులు సాధించిన సాయి.. తాజాగా అదే వేదికపై రాయల్స్పై 82 పరుగులు స్కోరు చేశాడు.చదవండి: పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!Elegance 👌Power 💪🎥 Display of complete range from Sai Sudharsan and Shahrukh Khan 🔥Updates ▶ https://t.co/raxxjzY9g7#TATAIPL | #GTvRR | @gujarat_titans pic.twitter.com/LXSXbgL5Rp— IndianPremierLeague (@IPL) April 9, 2025 -
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఒకడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తన అద్భుత ఆట తీరుతో టెస్టుల్లో భారత జట్టు ఓపెనర్గా పాతుకుపోయాడు.అరంగేట్రంలోనే శతక్కొట్టిన జైసూ.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా విశేషం. టెస్టుల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 23 మ్యాచ్లు పూర్తి చేసుకుని 723 పరుగులు సాధించాడు. అయితే, దాదాపు ఏడాది కాలంగా మళ్లీ టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు.మరోసారి విఫలంగతేడాది ఐపీఎల్లోనూ యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పదహారు ఇన్నింగ్స్లో కలిపి 435 పరుగులు చేయగలిగాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం ఇంత వరకు తన మార్కు చూపలేకపోయాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.అహ్మదాబాద్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 107 (1, 29, 4, 67, 6 )పరుగులే చేశాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లోనూ జైసూ తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు.తొలి టెస్టులో సెంచరీ (161), ఆఖరి టెస్టులో హాఫ్ సెంచరీలు (82, 84) మినహా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. తర్వాత రంజీ బరిలో దిగి విఫలమయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చి జైస్వాల్.. అరంగేట్రంలోనే తేలిపోయాడు. తన మొదటి వన్డేలో కేవలం పదిహేను పరుగులే చేశాడు.పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ యశస్వి జైస్వాల్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి కడుపు నిండిపోయింది. అంటే.. ఇప్పటి వరకు సాధించిన దానితో సంతృప్తి పడిపోయాడు. జైస్వాల్ ప్రస్తుతం క్రికెట్పై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు.అతడికి ఇదే నా సందేశం.. క్రికెట్ను నిన్ను గొప్ప స్థాయికి చేర్చగలదు. అదే సమయంలో.. అదే రీతిలో ఏడిపించగలదు కూడా! ఒక్కసారి పృథ్వీ షా పరిస్థితి చూడు. ఇప్పటికైనా మునుపటిలా క్రికెట్ను ప్రేమించు. అదే ప్యాషన్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టు’’ అని బసిత్ అలీ జైసూకు సూచించాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జైస్వాల్ స్థానం గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నాడు.విరాట్ కాస్త తొందరపడ్డాడు.. కానీభారత్లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదువలేదని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో కొత్త స్టార్లు పుట్టుకు వస్తున్నారు కాబట్టి జైసూ ఇప్పటికైనా జాగ్రత్తపడాలని బసిత్ అలీ సలహా ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా.. ‘‘అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగి రోహిత్, విరాట్ మంచి పని చేశారు.నాకైతే విరాట్ కాస్త తొందరపడ్డాడు అనిపించింది. అయితే.. సరైన సమయంలో అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. యువ ఆటగాళ్లు దూసుకువస్తున్న తరుణంలో ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించి వారికి మార్గం సుగమం చేశారు’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు. కాగా చిన్న వయసులోనే సత్తా చాటి భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా.. టీమిండియా ఓపెనర్గా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించి ఐపీఎల్ వేలంలో కూడా అమ్ముడుపోని స్థితికి దిగజారిపోయాడు.చదవండి: అతడికి కాస్త మర్యాద నేర్పండి.. చీప్ జోకులు వద్దు: సెహ్వాగ్పై ఫ్యాన్స్ ఫైర్ -
రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
-
సంజూ శాంసన్కు భారీ షాక్!
ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)కు మరో షాక్ తగిలింది. ఐపీఎల్ పాలక మండలి అతడికి రూ. 24 లక్షల మేర జరిమానా విధించింది. అదే విధంగా.. గుజరాత్ టైటాన్స్ (GT vs RR)తో బుధవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకు కూడా ఫైన్ వేసింది.ఎదురుదెబ్బలుకాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయం నుంచి కోలుకున్న సంజూ.. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్లలో కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ జట్టును ముందుండి నడిపించాడు.ఈ క్రమంలో శనివారం (ఏప్రిల్ 5) నాటి మ్యాచ్ నుంచి కెప్టెన్గా సంజూ శాంసన్ అందుబాటులోకి వచ్చాడు. అతడి సారథ్యంలో ఈ సీజన్లో తొలుత పంజాబ్ కింగ్స్తో తలపడ్డ రాజస్తాన్.. 50 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది.159 పరుగులకేఅహ్మదాబాద్లో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో ఆతిథ్య గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్ మాత్రం 159 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్ల దెబ్బకు సంజూ సేన 19.2 ఓవర్లలోనే ఆలౌట్ అయి.. 58 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.సంజూకు రూ. 24 లక్షల జరిమానాఇదిలా ఉంటే.. గుజరాత్తో మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున రాజస్తాన్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పనిష్మెంట్ ఇచ్చింది. గతంలో రియాన్ పరాగ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లోనూ రాజస్తాన్ ఇదే తప్పిదానికి పాల్పడింది. అప్పుడు అతడికి రూ. 12 లక్షల ఫైన్ వేసిన బీసీసీఐ... రాజస్తాన్ మరోసారి ఇదే తప్పు పునరావృతం చేసినందున నిబంధనల ప్రకారం సంజూకు రూ. 24 లక్షల జరిమానా విధించింది.ఇందుకు సంబంధించి.. ‘‘గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు రూ. 24 లక్షల జరిమానా విధిస్తున్నాం.వారికి కూడాఅదే విధంగా.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ప్రతి ఆటగాడు రూ. లక్షల జరిమానా కట్టాలి లేదంటే వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర చెల్లించాలి. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అదే వర్తిస్తుంది’’ అని ఐపీఎల్ మీడియా ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకుని కేవలం రెండే గెలిచింది.ఐపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ రాజస్తాన్👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉గుజరాత్ స్కోరు: 217/6 (20)👉రాజస్తాన్ స్కోరు: 159 (19.2)👉ఫలితం: 58 పరుగుల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82).చదవండి: KKR: చేతులు జోడించి అడుగుతున్నా.. రింకూని కాస్త ముందే పంపండి! 🔝 of their Game. 🔝 of the Table. 💙#GT roar to the top of the points table with another strong display of cricket 💪Scorecard ▶ https://t.co/raxxjzYH5F#TATAIPL | #GTvRR | @gujarat_titans pic.twitter.com/ZDRsDqoMAT— IndianPremierLeague (@IPL) April 9, 2025 -
GT Vs RR: టైటాన్స్ జైత్రయాత్ర
ఐపీఎల్లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. సీజన్ తొలి మ్యాచ్లో ఓటమి తర్వాతి నుంచి చెలరేగుతున్న జట్టు వరుసగా నాలుగో విజయంతో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. రాజస్తాన్ రాయల్స్తో పోరులో సాయి సుదర్శన్ అండ్ టీమ్ మెరుపు బ్యాటింగ్తో ముందుగా భారీ స్కోరు నమోదు చేసి... ఆ తర్వాత సొంత మైదానంలో దానిని విజయవంతంగా నిలబెట్టుకోగలిగింది. పేలవ బౌలింగ్ తర్వాత బ్యాటింగ్లోనూ బలహీనంగా కనిపించిన రాయల్స్ ఓటముల ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఛేదనలో హెట్మైర్, సామ్సన్ పోరాటం సరిపోక జట్టు చేతులెత్తేసింది. అహ్మదాబాద్: శుబ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. బుధవారం జరిగిన ఐపీఎల్ 18వ సీజన్ మ్యాచ్లో అన్ని రంగాల్లో ఆధిక్యం కనబర్చిన టైటాన్స్ 58 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా... జోస్ బట్లర్ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అండగా నిలిచారు. అనంతరం రాజస్తాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. హెట్మైర్ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సంజూ సామ్సన్ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించగా, ప్రసిధ్ కృష్ణకు 3 వికెట్లు దక్కాయి. కీలక భాగస్వామ్యాలు... ఆర్చర్ బౌలింగ్లో శుబ్మన్ గిల్ (2) ఆరంభంలోనే వెనుదిరిగినా... సుదర్శన్, బట్లర్ భాగస్వామ్యంలో జట్టు కోలుకుంది. వీరిద్దరు చక్కటి షాట్లతో స్కోరుబోర్డును నడిపించారు. తుషార్ దేశ్పాండే ఓవర్లో సుదర్శన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. రెండో వికెట్కు 47 బంతుల్లో 80 పరుగులు జోడించిన తర్వాత బట్లర్ వెనుదిరిగాడు. మరోవైపు సుదర్శన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు.తీక్షణ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టి షారుఖ్ కూడా జోరు ప్రదర్శించాడు. అయితే తీక్షణ తర్వాతి ఓవర్లో అతను అవుట్ కావడంతో 62 పరుగుల (34 బంతుల్లో) మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. రూథర్ఫర్డ్ (7) విఫలం కాగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో సుదర్శన్ సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. చివర్లో తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), రషీద్ ఖాన్ (4 బంతుల్లో 12; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. హైదరా బాద్తో జరిగిన గత మ్యాచ్లో బ్యాటింగ్లో రాణించిన సుందర్ను గుజరాత్ ఈసారి ఆడించకపోగా... వ్యక్తిగత కారణాలతో హసరంగ మ్యాచ్కు దూరం కావడం రాజస్తాన్ బౌలింగ్ను బలహీనపర్చింది. టపటపా... ఛేదనలో ఏ దశలోనూ రాజస్తాన్ ఇన్నింగ్స్ గొప్పగా సాగలేదు. ఆరంభం నుంచి చివరి వరకు బ్యాటర్లలో తడబాటు కనిపించింది. గుజరాత్ బౌలర్లంతా సమష్టి ప్రదర్శనతో రాయల్స్ను కట్టడి చేశారు. రెండు పరుగుల వ్యవధిలో జైస్వాల్ (6), నితీశ్ రాణా (1) వెనుదిరగ్గా... సామ్సన్, రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. తాను ఆడిన తొలి 8 బంతుల్లోనే 3 సిక్స్లు కొట్టిన పరాగ్ ఎక్కువసేపు నిలవలేకపోగా, ధ్రువ్ జురేల్ (5) విఫలమయ్యాడు. 47 బంతుల్లో 102 పరుగులు చేయాల్సిన స్థితిలో సామ్సన్ను ప్రసిధ్ అవుట్ చేయడంతో రాయల్స్ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో హెట్మైర్ చేసిన ప్రయత్నం ఏమాత్రం సరిపోలేదు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) సామ్సన్ (బి) దేశ్పాండే 82; గిల్ (బి) ఆర్చర్ 2; బట్లర్ (ఎల్బీ) (బి) తీక్షణ 36; షారుఖ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తీక్షణ 36; రూథర్ఫర్డ్ (సి) సామ్సన్ (బి) సందీప్ 7; తెవాటియా (నాటౌట్) 24; రషీద్ (సి) జైస్వాల్ (బి) దేశ్పాండే 12; అర్షద్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–14, 2–94, 3–156, 4–163, 5–187, 6–201. బౌలింగ్: ఆర్చర్ 4–0–30–1, ఫారుఖీ 4–0–38–0, దేశ్పాండే 4–0–53–2, సందీప్ 4–0–41–1, తీక్షణ 4–0–54–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) రషీద్ (బి) అర్షద్ 6; సామ్సన్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ 41; నితీశ్ రాణా (సి) ఖెజ్రోలియా (బి) సిరాజ్ 1; పరాగ్ (సి) బట్లర్ (బి) ఖెజ్రోలియా 26; జురేల్ (సి) సుదర్శన్ (బి) రషీద్ 5; హెట్మైర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ 52; శుభమ్ దూబే (ఎల్బీ) (బి) రషీద్ 1; ఆర్చర్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 4; తీక్షణ (సి) సుదర్శన్ (బి) సాయికిషోర్ 5; దేశ్పాండే (సి) రషీద్ (బి) సాయికిషోర్ 3; సందీప్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–10, 2–12, 3–60, 4–68, 5–116, 6–119, 7–144, 8–145, 9–150, 10–159. బౌలింగ్: సిరాజ్ 4–0–30–1, అర్షద్ 2–0–19–1, ప్రసిధ్ కృష్ణ 4–0–24–3, ఖెజ్రోలియా 3–0–29–1, రషీద్ 4–0–37–2, సాయికిషోర్ 2.2–0–20–2.ఐపీఎల్లో నేడుబెంగళూరు X ఢిల్లీ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: సాయి సుదర్శన్ విధ్వంసం.. రాజస్థాన్పై గుజరాత్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుక్ ఖాన్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ తెవాతియా (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. రషీద్ ఖాన్ 4 బంతుల్లో ఫోర్, సిక్స్ సాయంతో 12 పరుగులు, రూథర్ఫోర్డ్ 3 బంతుల్లో సిక్స్ సాయంతో 7 పరుగులు, శుభ్మన్ గిల్ 3 బంతుల్లో 2 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ప్రసిద్ద్ కృష్ణ 3, రషీద్ ఖాన్, సాయి కిషోర్ చెరో 2, సిరాజ్, అర్షద్ ఖాన్, కేజ్రోలియా తలో వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ ఇన్నింగ్స్లో షిమ్రోన్ హెట్మైర్ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలువగా.. సంజూ శాంసన్ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.యశస్వి జైస్వాల్ (7 బంతుల్లో 6; ఫోర్), నితీశ్ రాణా (3 బంతుల్లో 1), ధృవ్ జురెల్ (4 బంతుల్లో 5; ఫోర్), శుభమ్ దూబే (3 బంతుల్లో 1), తుషార్ దేశ్పాండే (3 బంతుల్లో 3), జోఫ్రా ఆర్చర్ (4 బంతుల్లో 4), తీక్షణ (13 బంతుల్లో 5) విఫలమయ్యారు. -
GT Vs RR: ఆర్చర్ దెబ్బకు స్పీడ్ గన్కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్ డెలివరీ
ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. మూడో ఓవర్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను (2) క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్చర్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓ బంతిని బుల్లెట్ వేగంతో సంధించాడు. ఈ బంతి స్పీడ్ గన్పై గంటకు 152.3 కిమీ వేగంగా రికార్డైంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇది రెండో వేగవంతమైన బంతి. ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీని పంజాబ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ వేశాడు. ఫెర్గూసన్ నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్లో గంటకు 153.2 కిమీ వేగంతో ఓ బంతిని సంధించాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఆర్చర్ బుల్లెట్ వేగంతో బంతులు వేస్తున్నాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లోనూ 150 కిమీకుపైగా స్పీడ్తో బంతులు వేశాడు. పంజాబ్ మ్యాచ్లో ఆర్చర్ ఓ బంతిని 151.3 కిమీ వేగంతో వేశాడు. ఇది ప్రస్తుత సీజన్లో నాలుగో ఫాస్టెస్ట్ బంతిగా రికార్డైంది. గుజరాత్తో మ్యాచ్లో ఆర్చర్ శుభ్మన్ గిల్ను క్లీన్ బౌల్డ్ చేసిన బంతికి కూడా దాదాపుగా 150 కిమీ వేగంతో (147.7) వచ్చింది.ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైనా ఆర్చర్ సీఎస్కేతో జరిగిన మ్యాచ్ నుంచి గాడిలో పడ్డాడు. ఆ మ్యాచ్లో ఆర్చర్ 3 ఓవర్లలో ఓ మెయిడిన్ సహా 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఆ మ్యాచ్లో రాయల్స్ గెలుపులో ఆర్చర్ కీలకపాత్ర పోషించాడు. పంజాబ్తో జరిగిన గత మ్యాచ్లో ఆర్చర్ శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్లో అతను 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా పొందాడు. ప్రస్తుతం గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఆర్చర్ చెలరేగిపోతున్నాడు. ఈ మ్యాచ్లో ఇప్పటివరకు 3 ఓవర్లు వేసిన అతను కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి గిల్ వికెట్ తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్మన్ గిల్ (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత కుదురుకుంది. సాయి సుదర్శన్, బట్లర్ ఇన్నింగ్స్ను నిర్మించారు. అయితే 10 ఓవర్ చివరి బంతికి తీక్షణ అద్బుతమైన బంతితో బట్లర్ను (36) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని (59) ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షారుక్ ఖాన్ (18) క్రీజ్లో ఉన్నాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 124/2గా ఉంది. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన రాయల్స్ 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ఆరో వికెట్ కోల్పోయిన రాయల్స్13.2వ ఓవర్- 119 పరుగుల వద్ద రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో శుభమ్ దూబే (1) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన రాయల్స్12.2వ ఓవర్- 116 పరుగుల వద్ద రాయల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సాయి కిషోర్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (41) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో రాయల్స్7.4వ ఓవర్- 218 పరుగుల భారీ ఛేదనలో రాయల్స్ 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి దృవ్ జురెల్ (5) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్.. రియాన్ ఔట్6.4వ ఓవర్- 60 పరుగుల వద్ద రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ కేజ్రోలియా బౌలింగ్లో వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (26) ఔటయ్యాడు. 6 ఓవర్లలో 57 పరుగులు.. ధాటిగా ఆడుతున్న శాంసన్, రియాన్11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా రాయల్స్ ఏమాత్రం తగ్గడం లేదు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 57/2గా ఉంది. శాంసన్ (21), రియాన్ (25) ధాటిగా ఆడుతున్నారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోలోయిన రాయల్స్2.2వ ఓవర్- భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్లో తొలుత జైస్వాల్ ఔట్ కాగా.. తాజాగా సిరాజ్ బౌలింగ్లో నితీశ్ రాణా (1) ఔటయ్యాడు. టార్గెట్ 218.. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్218 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగుల వద్దనే తొలి వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (6) ఔటయ్యాడు. సంజూ శాంసన్కు జతగా నితీశ్ రాణా క్రీజ్లోకి వచ్చాడు.చెలరేగిన సాయి సుదర్శన్.. గుజరాత్ భారీ స్కోర్రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్, షారుక్ ఖాన్ తలో 36 పరుగులు చేయగా.. రాహుత్ తెవాతియా 24 (నాటౌట్), రషీద్ ఖాన్ 12, రూథర్ఫోర్డ్ 7, గిల్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.82 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔట్82 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔటయ్యాడు. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 18.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 187/5గా ఉంది. తెవాతియా (10), రషీద్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్16.1వ ఓవర్- 163 పరుగుల వద్ద సందీప్ శర్మ బౌలింగ్లో వికెట్కీపర్ శాంసన్కు క్యాచ్ ఇచ్చి రూథర్ఫోర్డ్ (7) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్15.4వ ఓవర్- 156 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో షారుక్ ఖాన్ (36) స్టంపౌట్ అయ్యాడు. సాయి సుదర్శన్కు (69) జతగా రూథర్ఫోర్డ్ క్రీజ్లోకి వచ్చాడు. రూథర్ఫోర్డ్ వచ్చీ రాగానే సిక్సర్తో విరుచుకుపడ్డాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 163/3గా ఉంది.భారీ స్కోర్ దిశగా గుజరాత్ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 124/2గా ఉంది. సాయి సుదర్శన్ 59, షారుక్ ఖాన్ 18 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. బట్లర్ ఔట్9.6వ బంతి- 94 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో జోస్ బట్లర్ (36) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. సాయి సుదర్శన్ (50) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షారుక్ ఖాన్ క్రీజ్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చిన బట్లర్.. 8 బంతుల్లో 4 బౌండరీలుఆరంభంలో నిదానంగా ఆడిన బట్లర్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో లైన్లోకి వచ్చాడు. ఆ ఓవర్ ఆఖరి రెండు బంతులను బౌండరీలకు తరలించిన బట్లర్, ఆతర్వాతి ఓవర్లో కూడా మరో రెండు బౌండరీలు బాదాడు. సాయి సుదర్శన్తో (26 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పాటు బట్లర్ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు) కూడా టచ్లోకి రావడంతో గుజరాత్ స్కోర్ 8 ఓవర్లలోనే 81 పరుగులకే చేరింది. ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్శుభ్మన్ గిల్ త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ధాటిగా ఆడుతున్నాడు. సాయి 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. సాయికి జతగా బట్లర్ (11) ఉన్నాడు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 56/1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. కెప్టెన్ ఔట్2.1వ ఓవర్- 14 పరుగులకే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (2) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాయి సుదర్శన్కు (11) జతగా జోస్ బట్లర్ క్రీజ్లోకి వచ్చాడు. ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 9) గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రాయల్స్ స్టార్ బౌలర్ వనిందు హసరంగ దూరమయ్యాడు (వ్యక్తిగత కారణాల చేత). అతని స్థానంలో ఫజల్హక్ ఫారూకీ తుది జట్టులోకి వచ్చాడు. గుజరాత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది.ఈ సీజన్లో గుజరాత్ తొలి మ్యాచ్లో ఓడి (పంజాబ్), ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు (ముంబై, ఆర్సీబీ, సన్రైజర్స్) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. రాయల్స్ విషయానికొస్తే.. ఈ జట్టు తొలి రెండు మ్యాచ్ల్లో (సన్రైజర్స్, కేకేఆర్) ఓడి, ఆతర్వాత వరుసగా సీఎస్కే, పంజాబ్లపై గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.తుది జట్లు..గుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే -
GT VS RR: నేటి మ్యాచ్లో గెలుపెవరిది.. ఆ స్టార్ బౌలర్ ఆందుబాటులో ఉంటాడా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 9) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టాటాన్స్ తమ సొంత మైదానంలో (నరేంద్ర మోదీ స్టేడియం) రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. నేటి మ్యాచ్కు గుజరాత్ స్టార్ పేసర్ కగిసో రబాడ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అస్పష్టంగా ఉంది. రబాడ గత మ్యాచ్కు ముందు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిపోయాడు. రబాడ ఎప్పుడు తిరిగొస్తాడనే దానిపై టైటాన్స్ యాజమాన్యం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. దీన్ని బట్టి చూస్తే అతను నేటి మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తుంది. రబాడ ఈ సీజన్లో రెండు మ్యాచ్లు ఆడి 10.38 ఎకానమీతో కేవలం రెండే వికెట్లు తీశాడు. వాస్తవానికి ఇది అతని స్థాయి కాదు. ఈ సీజన్లో రబాడతో పాటు మరో స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. రషీద్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. అయినా గుజరాత్ వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలుపొందడం విశేషం. రబాడ, రషీద్ ఖాన్ విఫలమవుతున్న వేల సిరాజ్, సాయి సుదర్శన్ చెలరేగిపోతున్నారు. రబాడ, రషీద్ వైఫల్యాలను ఈ ఇద్దరూ భర్తీ చేస్తున్నారు. గుజరాత్ గెలిచిన మూడు మ్యాచ్ల్లో ఈ ఇద్దరు కీలకపాత్రలు పోషించారు. సిరాజ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సాయి సుదర్శన్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తున్నాడు. మరో పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ప్రసిద్ద్ కూడా ఓ మ్యాచ్లో తన జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రసిద్ద్, సిరాజ్ చెలరేగడంతో గుజరాత్ వరుసగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, సన్రైజర్స్పై అద్భుత విజయాలు సాధించింది. మరోవైపు బ్యాటింగ్లో సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్, జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ కూడా సత్తా చాటుతున్నారు. సన్రైజర్స్తో జరిగిన గత మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాట్కు పని చెప్పాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో ఓటమి (పంజాబ్) తర్వాత గుజరాత్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ప్రతి మ్యాచ్లో ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడుతున్నారు. బౌలర్లు, బ్యాటర్లు సమాంతరంగా రాణిస్తూ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయారు. రాజస్థాన్తో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో కూడా విన్నింగ్ రన్ను కొనసాగించాలని గుజరాత్ భావిస్తుంది. ఈ జట్టుకు హోం గ్రౌండ్లో ఆడటం కూడా అడ్వాంటేజ్ అవుతుంది. మరోవైపు రాజస్థాన్ ఈ సీజన్లో రెండు వరుస ఓటముల తర్వాత రెండు వరుస విజయాలు సాధించి గెలుపు ట్రాక్ ఎక్కింది. గత మ్యాచ్లో ఈ జట్టు పటిష్టమైన పంజాబ్కు ఊహించని షాకిచ్చింది. రాయల్స్ తొలి రెండు మ్యాచ్ల్లో సన్రైజర్స్, కేకేఆర్ చేతుల్లో ఓడి, ఆతర్వాత సీఎస్కే, పంజాబ్పై విజయాలు సాధించింది. తొలి మూడు మ్యాచ్లో ఫామ్ ప్రదర్శించలేకపోయిన యశస్వి జైస్వాల్ చివరి మ్యాచ్లో టచ్లోకి రావడం రాయల్స్కు శుభపరిమాణం. కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ ఇప్పటికే పలు మంచి ఇన్నింగ్స్లు ఆడారు. నితీశ్ రాణా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హెట్మైర్, ధృవ్ జురెల్ బ్యాట్లకు పని చెప్పాల్సి ఉంది. బౌలింగ్లో హసరంగ, సందీప్ శర్మ, తీక్షణ పర్వాలేదనిపిస్తుండగా.. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన జోఫ్రా ఆర్చర్ చివరి రెండు మ్యాచ్ల్లో అద్బుతంగా రాణించాడు. ఆర్చర్ గత మ్యాచ్లో పంజాబ్ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. నేటి మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.తుది జట్లు (అంచనా)..గుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, R. సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, షెర్ఫే రూథర్ఫోర్డ్.రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే/కుమార్ కార్తికేయ -
IPL 2025: చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 5) రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాయల్స్ అన్ని విభాగాల్లో సత్తా చాటి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. సంజూ శాంసన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించారు. ఆఖర్లో నితీశ్ రాణా (7 బంతుల్లో 12), హైట్మైర్ (12 బంతుల్లో 20), ధృవ్ జురెల్ (5 బంతుల్లో 13 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి రాయల్స్ స్కోర్ను 200 దాటించారు.కాగా, ఈ మ్యాచ్ జరుగుతున్న మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లన్పూర్, చండీగఢ్) ఓ జట్టు (ఐపీఎల్లో) 200కు పైగా స్కోర్ చేయడం ఇదే మొదటిసారి. ఇక్కడ జరిగిన ఐదు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా 200 పరుగుల స్కోర్ నమోదు కాలేదు. తాజా ప్రదర్శన అనంతరం యాదవీంద్ర సింగ్ స్టేడియంలో 200 ప్లస్ స్కోర్ నమోదు చేసిన తొలి ఐపీఎల్ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించింది.గత సీజన్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ చేసిన 192 పరుగులే ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ మైదానంలో అత్యధిక స్కోర్గా ఉండింది. ఓవరాల్గా చూసినా ఈ మైదానంలో ఇది మూడో 200 ప్లస్ స్కోర్ మాత్రమే. ఈ మైదానంలో ఇప్పటివరకు (ఐపీఎల్ కలుపుకుని) 29 టీ20 మ్యాచ్లు జరిగాయి.మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నమోదైన టాప్-5 అత్యధిక స్కోర్లు..205/4 - రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ (2025)192/7 - ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ (2024)183 ఆలౌట్ - పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (2024)182/9 - సన్రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ (2024)180/6 - పంజాబ్ కింగ్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్ (2024)చెలరేగిన ఆర్చర్భారీ ఛేదనలో జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే పంజాబ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి బంతికే ప్రియాన్ష్ ఆర్యను క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్చర్.. ఓవర్ చివరి బంతికి ఇన్ ఫామ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను కూడా ఆర్య తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.ఆర్చర్తో పాటు (4-0-25-3) సందీప్ శర్మ (4-0-21-2), మహీశ్ తీక్షణ (4-0-26-2) కూడా రెచ్చిపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) పంజాబ్ను గట్టెక్కించే ప్రయత్నాలు చేయగా అవి ఫలించలేదు. వీరిద్దరు మినహాయంచి పంజాబ్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.రెండు వరుస విజయాల తర్వాత పంజాబ్కు ఈ సీజన్లో ఇది తొలి ఓటమి కాగా.. రెండు వరుస పరాజయాల తర్వాత రాయల్స్కు ఇది వరుసగా రెండో విజయం. -
IPL 2025: షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టిన సంజూ శాంసన్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 5) రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. రెండు వరుస విజయాల తర్వాత పంజాబ్కు ఈ సీజన్లో ఇది తొలి ఓటమి కాగా.. రెండు వరుస పరాజయాల తర్వాత రాయల్స్కు ఇది వరుసగా రెండో విజయం.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్స్.. యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నితీశ్ రాణా 7 బంతుల్లో 12, హైట్మైర్ 12 బంతుల్లో 20, ధృవ్ జురెల్ 5 బంతుల్లో 13 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, అర్షదీప్ సింగ్, జన్సెన్ తలో వికెట్ తీశారు. ఈ సీజన్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన జైస్వాల్.. ఈ మ్యాచ్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్.. జోఫ్రా ఆర్చర్ (4-0-25-3), సందీప్ శర్మ (4-0-21-2), మహీశ్ తీక్షణ (4-0-26-2) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఓవర్లో ఆర్చర్ ఆకాశమే హద్దుగా చెలరేగి మొదటి బంతికే ప్రియాంశ్ ఆర్య (0), ఓవర్ చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ను (10) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత కూడా రాయల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ప్రభ్సిమ్రన్ సింగ్ను (17) కుమార్ కార్తికేయ.. స్లోయినిస్ను (1) సందీప్ శర్మ పెవిలియన్కు పంపారు. తద్వారా పంజాబ్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) పంజాబ్ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే మ్యాక్సీ, వధేరా వరుస బంతుల్లో (15వ ఓవర్ చివరి బంతికి, 16వ ఓవర్ మొదటి బంతికి) ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైపోయింది. క్రీజ్లో కుదురుకున్న వధేరాను హసరంగ ఔట్ చేయగా.. మ్యాక్స్వెల్ను తీక్షణ బోల్తా కొట్టించాడు. ఆఖర్లో వచ్చిన శశాంక్ సింగ్ (13 బంతుల్లో 10 నాటౌట్), సూర్యాంశ్ షేడ్గే (2), జన్సెన్ (3), అర్షదీప్ (1), ఫెర్గూసన్ (4 నాటౌట్) ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా పంజాబ్ లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది.షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్ఈ మ్యాచ్లో గెలుపుతో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఓ భారీ రికార్డును తన ఖతాలో వేసుకున్నాడు. రాయల్స్ను అత్యధిక మ్యాచ్ల్లో గెలిపించిన కెప్టెన్గా షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టాడు. వార్న్ 31 మ్యాచ్ల్లో (55 మ్యాచ్ల్లో) రాయల్స్ను గెలిపించగా.. తాజా గెలుపుతో శాంసన్ 32 సార్లు (62 మ్యాచ్ల్లో) రాయల్స్ను విజయపథాన నడిపించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా అవతరించాడు.రాయల్స్ కెప్టెన్గా అత్యధిక విజయాలు..32 - సంజూ శాంసన్ (62 మ్యాచులు)*31 - షేన్ వార్న్ (55 మ్యాచులు)18 - రాహుల్ ద్రవిడ్ (34 మ్యాచులు)15 - స్టీవెన్ స్మిత్ (27 మ్యాచులు)9 - అజింక్య రహానే (24 మ్యాచులు) -
పంజాబ్ పై రాజస్థాన్ ఘన విజయం
-
రాయల్స్ ఘనవిజయం
మూల్లన్పూర్: తొలి రెండు మ్యాచ్లలో చక్కటి ఆటతో విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్కు సొంత మైదానంలో ఆడిన మొదటి పోరులో ఓటమి ఎదురైంది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజస్తాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ సంజు సామ్సన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. జైస్వాల్, సామ్సన్ తొలి వికెట్కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశారు. ఫెర్గూసన్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేయగా, గ్లెన్ మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సహా 43 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న పంజాబ్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. వధేరా, మ్యాక్స్వెల్ ఐదో వికెట్కు 52 బంతుల్లో 88 పరుగులు జత చేసి ఆశలు రేపినా... విజయానికి అది సరిపోలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఫెర్గూసన్ 67; సామ్సన్ (సి) అయ్యర్ (బి) ఫెర్గూసన్ 38; పరాగ్ (నాటౌట్) 43; నితీశ్ రాణా (సి) మ్యాక్స్వెల్ (బి) యాన్సెన్ 12; హెట్మైర్ (సి) మ్యాక్స్వెల్ (బి) అర్ష దీప్ 20; జురేల్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–89, 2–123, 3–138, 4–185. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–1, యాన్సెన్ 4–0–45–1, ఫెర్గూసన్ 4–0–37–2, మ్యాక్స్వెల్ 1–0–6–0, చహల్ 3–0–32–0, స్టొయినిస్ 4–0–48–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్షి (బి) ఆర్చర్ 0; ప్రభ్సిమ్రన్ (సి) హసరంగ (బి) కార్తికేయ 17; శ్రేయస్ అయ్యర్ (బి) ఆర్చర్ 10; స్టొయినిస్ (సి) అండ్ (బి) సందీప్ 1; వధేరా (సి) జురేల్ (బి) హసరంగ 62; మ్యాక్స్వెల్ (సి) జైస్వాల్ (బి) తీక్షణ 30; శశాంక్ సింగ్ (నాటౌట్) 10; సూర్యాంశ్ (సి) హెట్మైర్ (బి) సందీప్ 2; యాన్సెన్ (సి) హెట్మైర్ (బి) తీక్షణ 3; అర్ష దీప్ (సి) హసరంగ (బి) ఆర్చర్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–26, 4–43, 5–131, 6–131, 7–136, 8–145, 9–151. బౌలింగ్: ఆర్చర్ 4–0–25–3, యు«ద్వీర్ 2–0–20–0, సందీప్ శర్మ 4–0–21–2, తీక్షణ 4–0–26–2, కార్తికేయ 2–0–21–1, హసరంగ 4–0–36–1. -
పంజాబ్ను చిత్తు చేసిన రాజస్తాన్..
IPL 2025 RR vs PBKS live updates and highlights: ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.పంజాబ్కు తొలి ఓటమి..ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తొలి ఓటమి చవిచూసింది. ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా(62) టాప్ స్కోరర్గా నిలవగా.. మాక్స్వెల్(30) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, థీక్షణ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కార్తికేయ, హసరంగా ఓ వికెట్ చొప్పున పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(67) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజూ శాంసన్(38), రియాన్ పరాగ్(45), హెట్మెయిర్(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు, అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్ తలా వికెట్ సాధించారు.వదేరా ఔట్..పంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. థీక్షణ బౌలింగ్లో మాక్స్వెల్(30) ఔట్ కాగా.. ఆ తర్వాతి ఓవర్లో హసరంగా బౌలింగ్లో వధేరా(62) ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్.. 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.వదేరా హాఫ్ సెంచరీ..ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. 14 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో నేహల్ వధేరా(53), గ్లెన్ మాక్స్వెల్(30) ఉన్నారు. కష్టాల్లో పంజాబ్43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో వికెట్గా స్టోయినిష్, నాలుగు వికెట్గా ఫ్రబ్ సిమ్రాన్ ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో నేహాల్ వధేరా(9), మాక్స్వెల్(1) ఉన్నారు.పంజాబ్కు భారీ షాక్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే భారీ షాక్ తగలింది. తొలి ఓవర్లోనే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ బౌలింగ్లో తొలి బంతికి ఆర్య ఔట్ కాగా.. ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టోయినిష్ ఉన్నారు.చెలరేగిన రాజస్తాన్ బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్ ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(67) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజూ శాంసన్(38), రియాన్ పరాగ్(45), హెట్మెయిర్(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు, అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్ తలా వికెట్ సాధించారు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్..నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రాణా.. జానెసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో పరాగ్(12), హెట్మెయిర్(4) ఉన్నారు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..యశస్వి జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన జైశ్వాల్.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(11), నితీష్ రాణా(11) ఉన్నారు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్..యశస్వి జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన జైశ్వాల్.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(11), నితీష్ రాణా(11) ఉన్నారు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్కెప్టెన్ సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన శాంసన్.. ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(56), రియాన్ పరాగ్(5) ఉన్నారు.4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్:40/04 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(25), సంజూ శాంసన్(15) ఉన్నారు.ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. రాజస్తాన్ మాత్రం తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్గా సంజూనే వ్యవహరించనున్నాడు. మరోవైపు తుషార్ దేశ్ పాండే గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో యుద్ద్వీర్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ -
రూ. 18 కోట్లు! .. వరుస వైఫల్యాలు.. అందరి కళ్లు అతడి మీదే..
యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తన కెరీర్కు పునాది వేసిన ముంబై క్రికెట్ను వీడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తదుపరి దేశవాళీ సీజన్లో గోవాకు ఆడనుండటం చర్చకు దారితీసింది. ముంబై కెప్టెన్ అజింక్య రహానే, యాజమాన్యంతో విభేదాల వల్లే జైసూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు రావడం గమనార్హం.వరుస వైఫల్యాలు.. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా యశస్వి జైస్వాల్ ఫామ్లేమితో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో, ఇంగ్లండ్తో వన్డేలోనూ పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది.రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంటే..మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ తమ ఓపెనర్ జైసూను ఏకంగా రూ. 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్లలోనూ అతడు తేలిపోయాడు. తన స్థాయికి తగ్గట్లుగా ఒక్కసారీ బ్యాట్ ఝులిపించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్లో కలిపి 11.33 సగటుతో 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్కటే గెలిచింది. ఇక శనివారం నాటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడే ముఖ్యం‘‘జైస్వాల్ ఇప్పటికీ పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఓపెనర్గా తను బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. జట్టులో అతడు అత్యంత కీలక సభ్యుడు. తప్పక పరుగులు చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. పంజాబ్తో మ్యాచ్లో అందరి దృష్టి అతడి మీదే కేంద్రీకృతమై ఉంటుందనడంలో సందేహం లేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సంజూ రాకతోఇక పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా సంజూ శాంసన్ కెప్టెన్గా విధుల్లో చేరనుండటం రాజస్తాన్కు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్గా, కీపర్గా రాయల్స్ సంజూను మిస్ అయింది.పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో అతడు దిట్ట. కీపర్గానూ జట్టుకు అతడి సేవలు ముఖ్యం. కాబట్టి అతడి రాకతో జట్టులో సానుకూల వాతావరణం ఏర్పడింది’’ అని పేర్కొన్నాడు.చదవండి: IPL 2025 MI Vs LSG: బెడిసికొట్టిన వ్యూహం.. ఏం చేస్తున్నావ్ హార్దిక్? .. ఆకాశ్ అంబానీ రియాక్షన్ వైరల్ -
పంజాబ్ జోరు కొనసాగేనా!
ముల్లాన్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్... రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్కు సిద్ధమైంది. ‘డబుల్ హెడర్’లో భాగంగా శనివారం జరగనున్న రెండో పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత పదేళ్లుగా ప్లే ఆఫ్స్కు చేరలేకపోయిన పంజాబ్ జట్టు... ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ కెపె్టన్సీలో తాజా సీజన్లో జోరు మీదుంది. మరోవైపు తొలి సీజన్లో చాంపియన్గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ తిరిగి సత్తా చాటేందుకు రెడీ అయింది. ఆటేతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్న రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై ఒత్తిడి అధికంగా ఉంది. గత మూడు మ్యాచ్ల్లో వరుసగా 1, 29, 4 పరుగులు చేసిన జైస్వాల్... ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లో కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగిన సంజూ సామ్సన్... ఈ మ్యాచ్లో సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో వికెట్ కీపింగ్ చేసేందుకు బీసీసీఐ అతడికి అనుమతినిచ్చింది. జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హెట్మైర్, హసరంగతో రాయల్స్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, శుభమ్ శర్మ బౌలింగ్ భారం మోయనున్నారు. ఇక గత రెండు మ్యాచ్ల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్... సొంతగడ్డపై తొలి మ్యాచ్లో అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అటు విదేశీ హిట్టర్లు... ఇటు స్వదేశీ ప్లేయర్లతో పంజాబ్ పటిష్టంగా ఉంది. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, శశాంక్ సింగ్, యాన్సెన్తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అర్ష్ దీప్ సింగ్తో కలిసి ఫెర్గూసన్, యాన్సెన్ పేస్ భారం మోయనుండగా... యుజ్వేంద్ర చహల్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పెద్ద బౌండరీలతో కూడిన ముల్లాన్పూర్ మైదానం స్పిన్కు అనుకూలించనుంది. గత సీజన్లో ఇక్కడ ఓ మాదిరి స్కోర్లే నమోదు కాగా... బౌలింగ్ బలంతోనే జట్లు విజయాలు సాధించాయి. తుది జట్లు (అంచనా) రాజస్తాన్ రాయల్స్: సామ్సన్ (కెప్టెన్ ), జైస్వాల్, రాణా, పరాగ్, జురేల్, హసరంగ, హెట్మైర్, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్, శుభమ్ దూబే. పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, శశాంక్ సింగ్, సుర్యాంశ్, యాన్సెన్, ఫెర్గూసన్, అర్ష్ దీప్, చహల్, వైశాక్. -
ద్రవిడ్ సెంచరీలు చేస్తే.. రూమ్లోకి వెళ్లి ఏడ్చేవాడిని: నితీష్ రాణా
భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ త్రయం తమ పేర్లను సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో చాలా మందికి వీరు ముగ్గురూ ఆదర్శంగా నిలిచారు. అందులో ఒకడు టీమిండియా వెటరన్, రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్ నితీష్ రాణా. నితీష్ తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. సౌరవ్ గంగూలీని ఎక్కువగా ఆరాధిస్తానని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా రాహుల్ ద్రవిడ్ బాగా ఆడితే తన చిన్నతనంలో ఓ గదిలోకి వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉండేవాడినని రానా వెల్లడించాడు."మా నాన్న సచిన్ టెండూల్కర్కు వీరాభిమాని. నాకు సౌరవ్ గంగూలీ అంటే చాలా ఇష్టం. నా తమ్ముడు రాహుల్ ద్రవిడ్ సార్ ఫ్యాన్. భారత్ మ్యాచ్ ఆడినప్పుడల్లా మా ఇంట్లో గొడవలు జరిగేవి. మా ముగ్గురిలో ఎవరో ఒకరు బాధపడాల్సి వచ్చేది. ఎందుకంటే మాకు ఇష్టమైన ముగ్గురు క్రికెటర్లు ఒకే మ్యాచ్లో రాణించడం చాలా అరుదుగా జరిగేవి.గంగూలీ బాగా ఆడితే సచిన్ సర్ ఫెయిల్ అయ్యేవారు. అప్పుడు మా నాన్న బాధపడేవారు. ఒకవేళ సచిన్ సర్ ఆడి గంగూలీ ఫెయిల్ అయితే నేను ఫీల్ అయ్యేవాడిని. రాహుల్ సర్ ఓ దశలో దాదాపుగా ప్రతీ మ్యాచ్లోనూ అద్భుతంగా ఆడేవారు. దీంతో నా తమ్ముడికి చాలా గొడవలు జరిగేవి. మా నాన్నకు ఈ విషయాలు చెప్పేవాళ్లము కాదు. ద్రవిడ్ బాగా ఆడి గంగూలీ విఫలమైతే నేను రూమ్లోకి వెళ్లి ఏడ్చేవాడిని. గంగూలీ ఎందుకు ఇలా ఔటయ్యారని బాధపడేవాడిని. రాహుల్ ద్రవిడ్ మాత్రం సెంచరీల మీద సెంచరీలు చేసే వారు. నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి" అని ఫ్యాన్ కోడ్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా పేర్కొన్నాడు.అయితే ద్రవిడ్ ప్రధాన కోచ్గా ఉన్నప్పుడే రాణా భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. ఇదే విషయంపై రాణా మాట్లాడుతూ.. "టీమిండియా తరపున నా అరంగేట్రం రాహుల్ సర్ హెడ్కోచ్గా ఉన్నప్పుడే జరిగింది. నిజంగా ఆ సమయంలో చాలా సంతోషంగా అన్పించింది. ఎవరు బాగా ఆడితే నేను బాధపడేవాడినో ఆయన నేతృత్వంలోనే భారత క్రికెట్లోకి అడుగుపెట్టాను" అని అన్నాడు. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరపున రాణా ఆడుతున్నాడు. కాగా రాజస్తాన్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పనిచేస్తుండడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బాగంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో రాణా అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాణా కేవలం 36 బంతుల్లో 81 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: IND vs ENG: టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్కు వరుస షాక్లు -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్కు గుడ్ న్యూస్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో తొలి రెండు మ్యాచ్ల్లో (సన్రైజర్స్, కేకేఆర్) ఓడి, ఆతర్వాతి మ్యాచ్లో గెలిచిన (సీఎస్కే) రాజస్థాన్ రాయల్స్ ఏప్రిల్ 5న ఛండీఘడ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు ఆ జట్టుకు శుభవార్త అందింది. పూర్తి ఫిట్నెస్ లేని కారణంగా తొలి మూడు మ్యాచ్ల్లో వికెట్కీపింగ్కు, కెప్టెన్సీకి దూరంగా ఉన్న సంజూ శాంసన్ పంజాబ్ మ్యాచ్తో వికెట్కీపింగ్ మరియు కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి చేపట్టనున్నాడు. ఈ మేరకు శాంసన్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. చేతి వేలు ఫ్రాక్చర్ కారణంగా శాంసన్ తొలి మూడు మ్యాచ్ల్లో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్కు మాత్రమే పరిమితం కావడంతో శాంసన్ కెప్టెన్సీని కూడా వదులుకుని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. శాంసన్ గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు.తొలి మూడు మ్యాచ్ల్లో కెప్టెన్సీ, వికెట్కీపింగ్ బాధ్యతలకు దూరంగా ఉన్న శాంసన్ బ్యాటింగ్లో పర్వాలేదనిపించాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన తొలి మ్యాచ్లో 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఆతర్వాత కేకేఆర్పై 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేశాడు. చివరిగా సీఎస్కేతో ఆడిన మ్యాచ్లో 16 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేశాడు.కాగా, కెప్టెన్గా రియాన్ పరాగ్ అనుభవారాహిత్యం రాయల్స్ ఆడిన తొలి మూడు మ్యాచ్ల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. కీలకమైన సమయాల్లో పరాగ్ మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. సీఎస్కేతో మ్యాచ్లో రాయల్స్ గెలిచింది కానీ, ఆ మ్యాచ్లో ఓడుంటే మాత్రం పరాగ్పై అందరూ దుమ్మెత్తిపోశేవారు. ఆ మ్యాచ్లో పరాగ్ మంచి టచ్లో ఉన్న జోఫ్రా ఆర్చర్ను కాదని చివరి ఓవర్ను సందీప్ శర్మకు ఇచ్చాడు (బౌలింగ్). ఆ ఓవర్లో సీఎస్కే 20 పరుగులు చేయాల్సి ఉండగా.. సందీప్ శర్మ ఎలాగోలా మేనేజ్ చేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒకవేళ పరాగ్ నిర్ణయం (సందీప్కు బౌలింగ్ ఇవ్వడం) మిస్ ఫైర్ అయ్యుంటే రాయల్స్ వరుసగా మూడో పరాజయం ఖాతాలో వేసుకోవాల్సి వచ్చేది. పరాగ్ ఎపిసోడ్ను అటుంచితే.. శాంసన్ రాకతో రాయల్స్ ఫేట్ మారుతుందేమో చూడాలి. ప్రస్తుతం రాయల్స్ పేలవమైన రన్రేట్ కలిగి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సన్రైజర్స్ మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసినా.. కేకేఆర్ మ్యాచ్లో బ్యాటింగ్లో తడబడింది. సీఎస్కేపై గెలిచినప్పటికీ రాయల్స్ రన్రేట్ మెరుగుపడలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ ఒక్కటే రాయల్స్ కంటే కింద ఉంది (చివరి స్థానం).పంజాబ్-రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ రాయల్స్కు అంత ఈజీగా ఉండదు. పంజాబ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో బంపర్ విక్టరీలు సాధించి మాంచి జోష్ మీద ఉంది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. తొలి మ్యాచ్లో శశాంక్ సింగ్.. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ప్రభ్సిమ్రన్ సింగ్, నేహల్ వధేరా మంచి టచ్లో కనిపించారు. ఇంకా ఆ జట్టు విధ్వంసకర వీరులు మ్యాక్స్వెల్, స్టోయినిస్ టచ్లోకి రాలేదు. వారిద్దరూ ఫామ్లోకి వస్తే ఏ జట్టు పంజాబ్ ముందు నిలువలేదు. పంజాబ్ బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా ఉంది. లక్నో మ్యాచ్లో అర్షదీప్, జన్సెన్, చహల్ రాణించారు. ఫెర్గూసన్ కూడా పర్వాలేదనిపించాడు. ఇంత పటిష్టమైన పంజాబ్ను రాయల్స్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. -
యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో ఇకపై ముంబైకి ఆడకూడదని ఈ యువ ఓపెనర్ నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు జైసూ ఈ- మెయిల్ పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ఉత్తరప్రదేశ్లోని సురియాకు చెందిన యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో చాలా ఏళ్లుగా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అండర్-19 కెరీర్ నుంచి ముంబైకి ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. విజయ్ హజారే (వన్డే) టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం ద్వారా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.డబుల్ సెంచరీలతో సత్తా చాటిఅంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే అవకాశం దక్కించుకున్న జైస్వాల్ 2020లో క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ఆరంభం నుంచి రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న 23 ఏళ్ల జైస్వాల్.. అక్కడసత్తా చాటడం ద్వారా 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.టెస్టుల్లో సత్తా చాటుతున్న ఈ యువ ఓపెనర్.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా జట్టులో పాతుకుపోయాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేసిన జైసూ ఖాతాలో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. 23 టీ20లలో కలిపి 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులకే పరిమితమయ్యాడు.ఇక జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. 2024 రంజీ బరిలో దిగాడు జైస్వాల్. ముంబై తరఫున రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసి విఫలమయ్యాడు. గోవాకు ఆడేందుకు సిద్ధంఅయితే, వచ్చే సీజన్ నుంచి జైస్వాల్ గోవాకు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయాన్ని ఎంసీకేకు మెయిల్ ద్వారా తెలిపినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది.అర్జున్ టెండుల్కర్, సిద్దేశ్ లాడ్ మాదిరి జైస్వాల్ కూడా ముంబై జట్టును వీడి.. గోవాకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విషయం గురించి ఎంసీఏ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘అతడు గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయమై నిరభ్యంతర పత్రం (No Objection Certificate) కోసం మెయిల్ పంపాడు.వ్యక్తిగత కారణాల వల్లే గోవాకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలిపాడు’’ అని తెలిపాయి. కాగా గోవా జట్టుకు జైస్వాల్ కెప్టెన్గా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జైసూ గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్లేమితో సతమతంగతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో చతికిల పడ్డ యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై ఇంగ్లండ్తో వన్డేల్లో అరంగేట్రం చేసి.. ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లో పదిహేను పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-202 ప్రాథమిక జట్టులో అతడికి చోటు ఇచ్చిన సెలక్టర్లు.. ఆ తర్వాత ప్రధాన జట్టు నుంచి తప్పించారు. ఇక ఐపీఎల్-2025లోనూ ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి జైస్వాల్ కేవలం 34 పరుగులే చేశాడు. కాగా రూ. 18 కోట్లకు రాజస్తాన్ అతడిని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: శ్రేయస్ అయ్యర్కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం -
పరాగ్పై రూ. 12 లక్షలు జరిమానా
గువాహాటి: రాజస్తాన్ రాయల్స్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్పై రూ. 12 లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆదివారం గువాహాటిలో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు నిరీ్ణత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ సీజన్లో తొలిసారి రాజస్తాన్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో... ఐపీఎల్ నియమావళి ప్రకారం ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్పై రూ. 12 లక్షలు జరిమానా విధించారు. -
ఏంటి పరాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్? వీడియో వైరల్
రాజస్తాన్ రాయల్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి నెటిజన్ల అగ్రహనికి గురయ్యాడు. అతడి ప్రవర్తనపై అభిమానులు మండిపడుతున్నారు. ఎందకంత యాటిట్యూడ్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలేమి జరిగిందంటే.. ఐపీఎల్-2025లో భాగంగా ఆదివారం గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి.ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పరాగ్ పర్వలేదన్పించాడు. తొలుత బ్యాటింగ్లో 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పరాగ్.. అనంతరం ఫీల్డింగ్లోనూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నా.. మ్యాచ్ అనంతరం అతడు గ్రౌండ్ స్టాప్తో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. మ్యాచ్ ముగిశాక బర్సాపర క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది పరాగ్ వద్దకు వచ్చి వచ్చి సెల్ఫీ అడిగారు. గ్రౌండ్ స్టాఫ్ మొత్తం వచ్చి నిల్చొని పరాగ్ చేతికి ఫోన్ ఇచ్చిన తర్వాత.. వారివైపు కాస్త డిఫెరెంట్గా అతడు చూశాడు. సెల్పీ దిగిన అనంతరం వారి మొబైల్ను చేతికి ఇవ్వకుండా విసిరేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకు రియాన్ పరాగ్పై బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది.Attitude 🗿 Performance 🤡 pic.twitter.com/tNBZgSpRMA— Sonu (@heyysonu_) March 31, 2025 చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలు పెట్టిన బుమ్రాRIYAN PARAG - ONE OF THE BEST CATCHES IN IPL EVER 👌 pic.twitter.com/hPm6S4tOgj— Johns. (@CricCrazyJohns) March 30, 2025 -
RR VS CSK: చివరి ఓవర్లో ధోని ఔట్.. సీఎస్కే ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ చూడండి..!
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు పోరాడి 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో సీఎస్కే 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 176 పరుగుల వద్ద ఆగిపోయింది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని చెన్నైని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.Shimron Hetmeyer took a brilliant catch in the final over to dismiss MS Dhoni and potentially save the match for Rajasthan !! 👏👏#RRvCSK #RRvsCSK pic.twitter.com/AGhS9ZM2cU— Cricketism (@MidnightMusinng) March 30, 2025చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని తొలి బంతికే ఔటయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్లో హెట్మైర్ బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ పట్టాడు. ఇది చూసి ధోనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ఫ్యాన్ గర్ల్ తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశావు రా అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. హెట్మైర్ పక్కనే ఉంటే ఆ అభిమాని చేతిలో తన్నులు తినుండే వాడు. ఈ ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. దీనిపై రకరకాల మీమ్స్ వస్తున్నాయి.Reaction of a Dhoni fan when Hetmyer took his catch! Thala for a reason! 🔥 pic.twitter.com/0RmHT4kfcw— Keh Ke Peheno (@coolfunnytshirt) March 31, 2025కాగా, ధోని ఔటైన అనంతరం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. ఈ మ్యాచ్లో ధోని సీఎస్కేను గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. రాయల్స్ సైతం ధోనికి బయపడుతూనే సందీప్ శర్మకు చివరి ఓవర్ ఇచ్చింది. అప్పటికే 10 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసిన ధోని మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. Wake up babe new meme template just dropped #CSKvsRR #Dhoni pic.twitter.com/J5jMnZKp4W— Ganeshan (@ganeshan_iyer) March 30, 2025అయితే హెట్మైర్ డీప్ మిడ్ వికెట్ వద్ద అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి చెన్నై అభిమానుల ఆశలను అడియాసలు చేశాడు. ధోని ఔటైన వెంటనే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. నాలుగో బంతికి ఓవర్టన్ సిక్సర్ కొట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు.ఛేదనలో సీఎస్కే ఆదిలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయినా కెప్టెన్ రుతురాజ్ చక్కటి అర్ద సెంచరీతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. ఆఖర్లో జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పోరాడినా ఫలితం లేదు. ఇన్నింగ్స్ మధ్యలో హసరంగ ప్రతి ఓవర్లో ఓ వికెట్ తీసి సీఎస్కేను దెబ్బకొట్టాడు. శివమ్ దూబే లాంటి భారీ హిట్టర్ కొన్ని ఓవర్ల పాటు క్రీజ్లో ఉండివుంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ దూబేను రియాన్ పరాగ్ అద్బుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపాడు.అంతకుముందు నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో రాయల్స్ 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే నితీశ్ను ఔట్ చేశాక సీఎస్కే బౌలర్లు నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్లో ఓటమితో సీఎస్కే రన్రేట్ కూడా బాగా దెబ్బతినింది. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడు మ్యాచ్ల్లో ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్లో ముంబైపై విజయం సాధించిన ఎల్లో ఆర్మీ.. ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాయల్స్ చేతుల్లో పరాజయంపాలైంది. -
Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!
ఐపీఎల్ 2025లో భాగంగా సీఎస్కేతో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో రెండు పరాజయాల తర్వాత (సన్రైజర్స్, కేకేఆర్) రాయల్స్ సాధించిన తొలి విజయం ఇది. సారధిగా రియాన్ పరాగ్కు కూడా ఇదే తొలి గెలుపు. కెప్టెన్గా తొలి మ్యాచ్ గెలిచిన ఆనందం రియాన్కు ఎంతో సేపు నిలబడలేదు. జట్టు స్లో ఓవర్రేట్కు బాధ్యుడిని చేస్తూ రియాన్కు 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో రాయల్స్కు ఇది తొలి స్లో ఓవర్రేట్ తప్పిదం. Pink Prevail in a sea of Yellow 🙌#RR held their nerve to record their first win of the season by 6 runs 👍Scorecard ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/FeD5txyCUs— IndianPremierLeague (@IPL) March 30, 2025స్లో ఓవర్ రేట్ (నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోవడం) అనేది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ని ఉల్లంఘన కిందికి వస్తుంది. గత సీజన్ వరకు ఓ సీజన్లో ఓ జట్టు మూడు సార్లు స్లో ఓవర్రేట్ తప్పిదం చేస్తే కెప్టెన్పై ఓ మ్యాచ్ నిషేధం (భారీ జరిమానాతో పాటు) విధించేవారు. అయితే ఈ రూల్ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ సీజన్లో రద్దు చేసింది. కెప్టెన్లపై నిషేధాస్త్రాన్ని ఎత్తి వేసి కేవలం జరిమానాతో సరిపెట్టింది. గత సీజన్లో మూడు సార్లు స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో కూడా హార్దిక్ తన తొలి మ్యాచ్లో స్లో ఓవర్రేట్ తప్పిదానికి బాధ్యుడయ్యాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేయడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల జరిమానా విధించారు.కాగా, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్స్ చివరి ఓవర్లో విజయాన్ని ఖరారు చేసుకుంది. 183 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్ బౌలర్లు చివరి వరకు పోరాడారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే నితీశ్ను ఔట్ చేశాక సీఎస్కే బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. అనంతరం సీఎస్కే ఛేదనలో తడబడినా చివరి ఓవర్ వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. ఆఖరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. 13 పరుగులకే పరిమితమై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ బౌలర్లలో హసరంగ (4-0-35-4), జోఫ్రా ఆర్చర్ (3-1-13-1) సీఎస్కేను దెబ్బకొట్టారు. కెప్టెన్గా తొలి విజయం సాధించిన రియాన్ ఈ మ్యాచ్లో వ్యక్తిగతంగానూ రాణించాడు. బ్యాటింగ్లో కీలకమైన ఇన్నింగ్స్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఓ అద్భుతమైన క్యాచ్ (శివమ్ దూబే) అందుకున్నాడు. -
RR VS CSK: 20 పరుగులు తక్కువ చేశామనిపించింది.. ఫీల్డింగ్తో కవర్ చేశాము: రియాన్ పరాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం నమోదు చేసింది. సీఎస్కేపై గెలుపుతో రాయల్స్ ఖాతాను ఓపెన్ చేసింది. సొంత మైదానంలో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్లో రాయల్స్కు లభించిన మెరుపు ఆరంభాన్ని బట్టి చూస్తే ఇంకా భారీ స్కోర్ చేసుండాలి. కానీ సీఎస్కే బౌలర్లు పరిస్థితులను అదుపులోకి తెచ్చుకున్నారు. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రాణా ఔటయ్యాక రాయల్స్ ఇన్నింగ్స్ ఢీలా పడింది. శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. అయినా సీఎస్కేకు గెలుపు అవకాశాలు ఉండేవి. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉండింది. ధోని, జడ్డూ భారీ షాట్లు ఆడిన సీఎస్కే లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో 20 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో ఆర్చర్కు (3-1-13-1) బౌలింగ్ ఇవ్వకుండా సందీప్ శర్మకు బంతినప్పగించి రియాన్ పెద్ద సాహసమే చేశాడు. ఇది వర్కౌటైంది. సందీప్ 13 పరుగులు మాత్రమే ఇవ్వడంతో రాయల్స్ ఊపిరిపీల్చుకుంది.మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సమయం తీసుకున్నా ఈ గెలుపు ఆనందానిచ్చింది. తొలి రెండు మ్యాచ్లు కఠినంగా సాగాయి. 20 పరుగులు తక్కువ చేశామని భావించాము. మిడిల్ ఓవర్లలో బాగానే ఆడినప్పటికీ.. వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాము.మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశారు. తొలి మ్యాచ్లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయాము. రెండో మ్యాచ్లో 151 పరుగల టార్గెట్ను కాపాడుకోలేకపోయాము. అదృష్టవశాత్తు ఈ రోజు ఆటలో మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నితీశ్తో పాటు నేను కూడా బాగానే ఆడానుకుంటున్నాను. చివరి ఓవర్ను ఆర్చర్కు కాకుండా సందీప్ శర్మకు ఇవ్వడంపై స్పందిస్తూ.. కెప్టెన్గా నాకు అనిపించి చేశాను. బ్యాటింగ్లో తక్కువ చేశామని భావిస్తున్న 20 పరుగులను ఫీల్డింగ్లో కవర్ చేశాము. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్తో కలిసి చాలా వర్కౌట్ చేశాము. ఫలితం వచ్చింది. -
RR VS CSK: మేము చరుగ్గా లేము.. అందుకు సంతోషమే: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాయల్స్ కీలకమైన క్షణాలన్నిటినీ అధిగమించి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో రాయల్స్కు ఇది తొలి విజయం.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాయల్స్ ఊహించిన దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో నితీశ్తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నితీశ్ను ఔట్ చేశాక సీఎస్కే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకుంది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసింది. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను ఈ సీజన్లో చెత్త ఫామ్లో ఉన్న జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. సీఎస్కే గెలుపుకు చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండింది. ధోని, జడ్డూ క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు నిలబడితే సీఎస్కే ఎలాగైనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే తీక్షణ మ్యాజిక్ చేశాడు. 18వ ఓవర్లో అతను కేవలం 6 పరుగులే ఇచ్చి సీఎస్కేకు లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్లో తుషార్ దేశ్పాండే బౌలింగ్లో జడ్డూ, ధోని చెలరేగగా (బౌండరీ, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో సీఎస్కే లక్ష్యం 20 పరుగులుగా మారింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్కు (3-1-13-1) చివరి ఓవర్ ఇవ్వకుండా రాయల్స్ కెప్టెన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్కు బదులుగా సందీప్ శర్మను నమ్ముకోగా.. అతను కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే ధోని వికెట్ తీసి ఆతర్వాత రెండు బంతులను సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే గెలుపుకు చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు అవసరమయ్యాయి. అక్కడికీ ఓవర్టన్ నాలుగో బంతికి సిక్సర్ బాది సీఎస్కే గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే ఐదో బంతికి రెండు పరుగులే రావడంతో సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. చివరి ఓవర్ను సందీప్ శర్మకు ఇవ్వడంతో టెన్షన్ పడ్డ రాయల్స్ అభిమానులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు (రెండు మ్యాచ్ల తర్వాత) రియాన్ పరాగ్ కెప్టెన్గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపు సొంత అభిమానుల మధ్య దక్కడం అతనికి మరింత స్పెషల్.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతని ఆటతీరు అమోఘం. నితీశ్ ఎక్కువగా వెనుక భాగంలో షాట్లు ఆడుతున్నాడని తెలిసి కూడా మేము చురుగ్గా లేము. అతన్ని వికెట్కు ముందు ఆడించే ప్రయత్నం చేసుండాల్సింది. మిస్ ఫీల్డ్ల ద్వారా అదనంగా 8-10 పరుగులు సమర్పించుకున్నాము. ఫీల్డింగ్లో చాలా మెరుగుపడాలి. ఈ వికెట్పై 180 పరుగులు ఛేదించదగ్గ టార్గెటే. ఇన్నింగ్స్ బ్రేక్లో సంతోషపడ్డాను. వారు 210 పరుగులకు పైగా స్కోర్ చేస్తారని అనుకున్నాను. మా బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. జరగాల్సిన నష్టం ఆదిలోనే జరిగిపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత కొన్ని సీజన్లలో రహానే 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాయుడు మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకునేవాడు. నేను కూడా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని భావించాము. అయితే అది వర్కౌట్ కాలేదు. మూడు మ్యాచ్ల్లోనూ ఆట ప్రారంభంలోనే బ్యాటింగ్కు దిగాల్సి వచ్చింది. వేలం సమయంలోనే నేను మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాలని నిర్ణయించబడింది. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు ఈ సీజన్లో మాకు మంచి ఆరంభాలు లభించడం లేదు. ఒక్కసారి మా ఓపెనర్లిద్దరూ టచ్లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఎప్పటిలాగే నూర్ బాగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, జడ్డూ కూడా సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో కొంత ఊపు అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా రాణిస్తే మా జట్టుకు తిరుగుండదు. -
రాజస్తాన్ ఖాతా తెరిచింది
గువాహాటి: ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల నుంచి రాజస్తాన్ రాయల్స్ కోలుకుంది. తమ మూడో మ్యాచ్లో విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో రాజస్తాన్ 6 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. చెన్నైకిది వరుసగా రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. రాణా మెరుపులు... తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) వెనుదిరగ్గా... సంజు సామ్సన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), రాణా కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా రాణా ఏ బౌలర్నూ వదలకుండా చెలరేగిపోయాడు. ఒవర్టన్ వరుస రెండు ఓవర్లలో కలిపి 3 ఫోర్లు, సిక్స్ కొట్టాక అశ్విన్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ తర్వాత ఖలీల్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాణా 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సామ్సన్ అవుటయ్యాక కొద్దిసేపు రాణాకు పరాగ్ అండగా నిలిచాడు. అశ్విన్ ఓవర్లో మళ్లీ వరుసగా 6, 4 కొట్టాక తర్వాతి బంతికి స్టంపౌట్ కావడంతో రాణా మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. అయితే అతను అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో రాయల్స్ ఆశించిన స్కోరుకు చాలా దూరంలో ఆగిపోయింది. రాణా వెనుదిరిగాక 51 బంతుల్లో 58 పరుగులు మాత్రమే చేయగలిగిన జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. పవర్ప్లేలో 79 పరుగులు చేసిన రాజస్తాన్ మిగిలిన 14 ఓవర్లలో కలిపి 103 పరుగులు మాత్రమే సాధించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీ... ఛేదనలో చెన్నై మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర (0) వికెట్ కోల్పోగా, ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్ కొట్టి ధాటిని ప్రదర్శంచిన రాహుల్ త్రిపాఠి (19 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. సందీప్ ఓవర్లో అతను 3 ఫోర్లు కొట్టాడు. పరాగ్ అద్భుత క్యాచ్కు శివమ్ దూబే (18) వెనుదిరగ్గా, విజయ్శంకర్ (9) విఫలమయ్యాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రుతురాజ్ను కీలక సమయంలో హసరంగ అవుట్ చేశాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని (11 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజ్లోకి వచ్చాడు. అయితే అతనూ ప్రభావం చూపలేకపోగా, మరో ఎండ్లో జడేజా కూడా జట్టును గెలిపించడంలో సఫలం కాలేకపోయాడు. ఆఖరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరం కాగా, చెన్నై 32 పరుగులు రాబట్టగలిగింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 4; సామ్సన్ (సి) రచిన్ (బి) నూర్ 20; నితీశ్ రాణా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 81; పరాగ్ (బి) పతిరణ 37; జురేల్ (సి) పతిరణ (బి) నూర్ 3; హసరంగ (సి) శంకర్ (బి) జడేజా 4; హెట్మైర్ (సి) అశ్విన్ (బి) పతిరణ 19; ఆర్చర్ (సి) గైక్వాడ్ (బి) అహ్మద్ 0; కార్తికేయ (రనౌట్) 1; తీక్షణ (నాటౌట్) 2; దేశ్పాండే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–124, 4–134, 5–140, 6–166, 7–174, 8–175, 9–176. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–2, ఒవర్టన్ 2–0–30–0, అశ్విన్ 4–0–46–1, నూర్ అహ్మద్ 4–0–28–2, పతిరణ 4–0–28–2, జడేజా 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; త్రిపాఠి (సి) హెట్మైర్ (బి) హసరంగ 23; రుతురాజ్ (సి) జైస్వాల్ (బి) హసరంగ 63; శివమ్ దూబే (సి) పరాగ్ (బి) హసరంగ 18; విజయ్శంకర్ (బి) హసరంగ 9; జడేజా (నాటౌట్) 32; ధోని (సి) హెట్మైర్ (బి) సందీప్ 16; ఒవర్టన్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–0, 2–46, 3–72, 4–92, 5–129, 6–164. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 3–1–13–1, తుషార్ దేశ్పాండే 4–0–45–0, సందీప్ శర్మ 4–0–42–1, మహీశ్ తీక్షణ 4–0–30–0, హసరంగ 4–0–35–4, కార్తికేయ 1–0–10–0. -
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
CSK vs RR live updates and highlights: ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతున్నాయి.బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రవీంద్ర జడేజా(32) పర్వాలేదన్పించాడు.రాజస్తాన్ బౌలర్లలో వనిందు హసరంగా నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆర్చర్, సందీప్ శర్మ ఓ వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్(37), శాంసన్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, పతిరాన, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జడేజా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్రుతురాజ్ గైక్వాడ్(63) రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. హసరంగా బౌలింగ్లో గైక్వాడ్ ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 129/5సీఎస్కే నాలుగో వికెట్ డౌన్.. శంకర్ ఔట్92 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విజయ్ శంకర్.. హసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(8), గైక్వాడ్(55) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది.18 పరుగులు చేసిన దూబే.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు.సీఎస్కే రెండో వికెట్ డౌన్..రాహుల్ త్రిపాఠి రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన త్రిపాఠి.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. క్రీజులో దూబే(8), గైక్వాడ్ ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్..6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(20), రాహుల్ త్రిపాఠి(21) ఉన్నారు.సీఎస్కే తొలి వికెట్ డౌన్.. రవీంద్ర ఔట్183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర.. ఆర్చర్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.నితీష్ రాణా సూపర్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్(37), శాంసన్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, పతిరాన, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జడేజా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.రాజస్తాన్ ఆరో వికెట్ డౌన్..రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పరాగ్.. పతిరాన బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్.. జురెల్ ఔట్ధ్రువ్ జురెల్ రూపంలో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన జురెల్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్..నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81).. అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 129/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. శాంసన్ ఔట్సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన శాంసన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ పరాగ్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్.. రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(61), రియాన్ పరాగ్(1) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాణా..5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(44), సంజూ శాంసన్(15) ఉన్నారు.రాయల్స్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో అశ్విన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. సామ్ కుర్రాన్, దీపక్ హుడా స్ధానాల్లో ఓవర్టన్, విజయ్ శంకర్ వచ్చారు. రాయల్స్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పు చేయలేదు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ -
IPL 2025: అత్యంత దయనీయంగా సీఎస్కే బ్యాటింగ్.. ఆ ఇద్దరికి ప్రత్యామ్నాయాలు కూడా లేరు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓపెనర్ రచిన్ రవీంద్ర ఒక్కడే రాణించాడు. తొలి మ్యాచ్లో రచిన్ సత్తా చాటడంతో సీఎస్కే ముంబైను ఓడించింది. ఆ మ్యాచ్లో రుతురాజ్ కూడా రాణించినా.. ఆర్సీబీతో మ్యాచ్లో డకౌటయ్యాడు. సీఎస్కే తరఫున రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా దిగిన రాహుల్ త్రిపాఠి దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా పరిస్థితి కూడా అలాగే ఉంది. రాజస్థాన్ రాయల్స్తో నేడు జరుగబోయే మ్యాచ్లో త్రిపాఠి, హుడాలకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోకపోతే సీఎస్కే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరిని ఇలాగే కొనసాగిస్తే రాయల్స్ చేతిలో కూడా పరాభవం (ఆర్సీబీ చేతిలో ఓడింది) తప్పకపోవచ్చు.ఆల్రౌండర్ సామ్ కర్రన్ కూడా తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అతనిపై కూడా సీఎస్కే మేనేజ్మెంట్ దృష్టి సారించాలి. సామ్ బౌలర్గా కూడా విఫలమయ్యాడు. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఈ సీజన్లో అంతంతమాత్రంగానే ఉన్నాడు. బౌలర్గా పూర్తిగా విఫలమైన జడ్డూ బ్యాటింగ్లో మమ అనిపించాడు. గత సీజన్లో సీఎస్కే తరఫున మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్లో పూర్తిగా తేలిపోయాడు. దూబే కూడా రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. అశ్విన్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ నుంచి బ్యాటింగ్లో మెరుపులు ఆశించడం అత్యాశే అవుతుంది.తొలి మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని ఖాతా ఓపెన్ చేయని ధోని.. ఆర్సీబీతో మ్యాచ్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి బ్యాట్ ఝులిపించాడు. ధోని ఇదే తరహా హిట్టింగ్ను మున్ముందు కూడా కొనసాగిస్తే సీఎస్కే మేలవుతుంది. ఇక మిగిలింది బౌలర్లు. వారి విభాగం వరకు వారు పర్వాలేదనిపించారు. నూర్ అహ్మద్ అద్భుతంగా రాణిస్తూ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆడే అవకాశం దక్కని పతిరణ.. ఆర్సీబీతో మ్యాచ్లో 2 వికెట్లతో రాణించాడు. సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్, జడ్డూ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. వీరిద్దరు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నారు. సీఎస్కే మేనేజ్మెంట్ వీరిద్దరి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలి.బెంచ్ కూడా బలహీనమేఈ సీజన్లో సీఎస్కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడాలను తప్పిస్తే.. ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ప్రస్తుతం విజయ్ శంకర్ ఒక్కడే వీరికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. విదేశీ బ్యాటర్ డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది. మిగిలిన ఆటగాళ్లలో షేక్ రషీద్, ఆండ్రీ సిద్దార్థ్, వన్ష్ బేడి మాత్రమే స్పెషలిస్ట్ బ్యాటర్లు. ఈ లెక్కన చూస్తే.. వరుసగా విఫలమవుతున్నా త్రిపాఠి, హుడాలలో ఒకరిని ఖచ్చితంగా తుది జట్టులో ఆడించాల్సిన పరిస్థితి ఉంది. సీఎస్కేలా బ్యాటింగ్ వనరుల కొరత ఈ సీజన్లో ఏ ఫ్రాంచైజీకి లేదు. ఈ జట్టుతో సీఎస్కే ఆరోసారి టైటిల్ గెలవాలనుకోవడం అత్యాశే అవుతుంది.సీఎస్కే పూర్తి జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 30) రెండు భారీ మ్యాచ్లు.. ఢిల్లీతో సన్రైజర్స్ 'ఢీ'
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 30) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టనుండగా.. రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్కింగ్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మ్యాచ్కు వైజాగ్ వేదిక కానుండగా.. సీఎస్కే, రాయల్స్ మ్యాచ్ గౌహతిలో జరుగనుంది.ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లలో భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. విశాఖ పిచ్పై పరుగుల వరద పారిన చరిత్ర ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో పోలిస్తే ఢిల్లీ ఈ మ్యాచ్లో మరింత బలపడనుంది. పితృత్వ సెలవుపై ఉండిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు.ఈ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై సంచలన విజయం సాధించి జోష్ మీద ఉంది. సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్లో రాయల్స్పై అద్భుత విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్లో లక్నో చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 13, ఢిల్లీ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.జట్లు (అంచనా)..సన్రైజర్స్: ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపాఢిల్లీ: జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్కీపర్), కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్సీఎస్కే, రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ కూడా హోరీహోరీగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్కు పెద్దగా సహకరించని ఈ పిచ్పై ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తుందో చూడాలి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా బౌలర్లే కీలకపాత్ర పోషించవచ్చు. రాజస్థాన్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో పరాజయంపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సీఎస్కే రెండింట ఒక మ్యాచ్లో విజయం సాధించింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో తలపడగా.. రాయల్స్ 13, సీఎస్కే 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి.తుది జట్లు (అంచనా).. రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ (కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తికేయ/సందీప్ శర్మసీఎస్కే: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), శివమ్ దూబే, దీపక్ హుడా/విజయ్ శంకర్, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ -
IPL 2025: ఏంటి.. రియాన్ పరాగ్కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారా..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ రాయల్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో రాయల్స్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్లో రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్ను గెలిపించాడు. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ కేకేఆర్ ఈ మ్యాచ్లో గెలుపుతో విజయాల ఖాతా తెరిచింది. ఈ సీజన్లో రాయల్స్కు ఇది వరుసగా రెండో ఓటమి.Fan breaches security to meet Riyan Parag! Cricket fever at its peak!🏃[ Video Credits: @JioHotstar, @IPL #RiyanParag #RRvsKKR ] pic.twitter.com/xzlrQW44uq— ◉‿◉ (@nandeeshbh18) March 26, 2025కాగా, చప్పగా సాగుతున్న నిన్నటి మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమాంతం మైదానంలోకి దూసుకొచ్చి బౌలింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ కాళ్లపై పడ్డాడు. ఆ తర్వాత రియాన్ను కౌగిలించుకున్నాడు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ పిచ్ ఇన్వేడర్ను లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.So, Riyan Parag hired a boy and paid him 10,000 Rs to come onto the ground and touch his feet.What an attention seeker this guy is!#RRvsKKR pic.twitter.com/0w7gfW7lAC— Dr Nimo Yadav 2.0 (@niiravmodi) March 26, 2025ఇది చూసి జనాలు రియాన్కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారా అని కామెంట్లు చేస్తున్నారు. రియానే ఆ వ్యక్తికి డబ్బిచ్చి అలా చేయమని ఉంటాడని మరికొందరంటున్నారు. రియాన్ కాళ్లు మొక్కి జైలుకి (మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలోకి వస్తే జరిమానా, జైలు శిక్ష లేదా స్టేడియం నుంచి బహిష్కరణ లాంటి శిక్షలు వేస్తారు) వెళ్లే సాహసం ఎవరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో రియాన్ లోకల్ హీరో కాబట్టి ఫ్యాన్స్ ఉండటంలో తప్పేముందని అంటున్నారు. రియాన్ రాయల్స్కు కెప్టెన్ కూడా అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.సోషల్మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తున్నా.. రియాన్ రాయల్స్కు స్టార్ ఆటగాడు. పైగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రియాన్ పుట్టి పెరిగింది కూడా నిన్న మ్యాచ్ జరిగిన గౌహతిలోనే. జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో ఆ రాష్ట్రానికి (అసోం) ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు అతనే. అలాంటప్పుడు అతనికి ఫ్యాన్స్ ఉంటే తప్పేముంది. సోషల్మీడియా యూజర్స్కు నచ్చినా నచ్చకపోయినా రియాన్ ఓ స్టార్ ఆల్రౌండర్. అతనిలో ఎంత టాలెంట్ లేకుంటే అతన్ని రాయల్స్ గత సీజన్కు ముందు రిటైన్ చేసుకుంటుంది..? అంత మంది సీనియర్లు ఉన్నా అతన్నే ఎందుకు కెప్టెన్ చేస్తుంది..?No way you risk getting fined, jailed or probably banned from the stadium to touch Riyan Parag's feet? 😭 pic.twitter.com/lPKgS9dJEB— Heisenberg ☢ (@internetumpire) March 26, 2025 -
IPL 2025: అశ్విన్, చహల్ను వదులుకొని రాయల్స్ తప్పు చేసిందా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో పరాజయం ఎదుర్కొన్న ఆ జట్టు.. నిన్న (మార్చి 26) ఆడిన రెండో మ్యాచ్లో కేకేఆర్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ సీజన్లో రాయల్స్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం వారి జట్టు. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో వారి జట్టు చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్లో మాత్రం దారుణంగా ఉంది. గత సీజన్ వరకు వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్ను వదులుకుని రాయల్స్ పెద్ద తప్పు చేసింది. వీరి ప్రత్యామ్నాయంగా వచ్చిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. రాయల్స్ యాష్, చహల్కు ప్రత్యామ్నాయంగా లంక స్పిన్ ద్వయం మహీశ్ తీక్షణ, వనిందు హసరంగలను అక్కున చేర్చుకుంది. వీరు మంచి బౌలర్లే అయినా యాష్, చహల్ అంత ప్రభావం చూపలేకపోతున్నారు. తొలి రెండు మ్యాచ్ల్లోనే ఈ విషయం తేలిపోయింది. రాయల్స్ మరో ఇన్ ఫామ్ పేసర్ ఆవేశ్ ఖాన్ను కూడా వదిలేసి మూల్యం చెల్లించుకుంటుంది. బౌల్ట్ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న జోఫ్రా ఆర్చర్ గల్లీ బౌలర్ కంటే దారుణంగా తయారయ్యాడు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్చర్ ఏకంగా 76 పరుగులిచ్చాడు (4 ఓవర్లలో). జట్టులోకి కొత్తగా వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యువ పేసర్ ఫజల్ హక్ ఫారూకీ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. అనుభవజ్ఞుడైన సందీప్ శర్మలో మునుపటి జోరు కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన దేశీయ పేసర్ తుషార్ దేశపాండే ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. మొత్తంగా చూస్తే ఈ సీజన్లో అశ్విన్, చహల్, బౌల్ట్ లేని లోటు రాయల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత బౌలింగ్ యూనిట్తో రాయల్స్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. బ్యాటింగ్నే నమ్ముకొని అద్భుతాలు చేద్దామన్నా, ఈ సీజన్లో రాయల్స్ బ్యాటర్లు ఫామ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. తొలి మ్యాచ్లో జురెల్, శాంసన్ పర్వాలేదనిపించినా రెండో మ్యాచ్లో వారిద్దరూ తేలిపోయారు. స్టార్ ఓపెనర్ జైస్వాల్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఏదో చేస్తాడనుకున్న నితీశ్ రాణా దారుణంగా విఫలమవుతున్నాడు. గత సీజన్లో సంచలన ఇన్నింగ్స్లు ఆడిన రియాన్ పరాగ్లో ఆ మెరుపులు కనిపించడం లేదు. హెట్మైర్ను పరిశీలించాల్సి ఉంది. ఈ బ్యాటింగ్ విభాగంతో రాయల్స్ ప్లే ఆఫ్స్కు చేరాలని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.కాగా, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. సన్రైజర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆకట్టుకున్న రాయల్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్ బౌలర్లు కూడా ఏమాత్రం ప్రతిఘటించలేదు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన రియాన్ పరాగ్ ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్లో సీఎస్కేను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గౌహతి వేదికగా మార్చి 30న జరుగనుంది. -
RR VS KKR: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కేకేఆర్తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘెర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్లో రాయల్స్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్లో చేతులెత్తేసింది. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్స్ అతి కష్టం మీద 151 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై కేకేఆర్ బౌలర్లు చెలరేగిపోయారు. మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్గా నిలువగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో ఆర్చర్ 2 సిక్సర్లు బాదడంతో రాయల్స్ 150 పరుగుల మార్కును తాకగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ను క్వింటన్ డికాక్ ఒంటిచేత్తో గెలిపించాడు. డికాక్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్) చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. డికాక్ మరో ఎండ్ నుంచి రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారం తీసుకుని మ్యాచ్ను ముగించాడు. డికాక్ రెచ్చిపోవడంతో మ్యాచ్పై పట్టు సాధించేందుకు రాయల్స్ ఏ ఒక్క అవకాశం రాలేదు. డికాక్ బాధ్యతాయుతంగా ఆడి రాయల్స్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. రాయల్స్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్కరు కూడా డికాక్ను కంట్రోల్ చేయలేకపోయారు.వాస్తవానికి రాయల్స్ బ్యాటింగ్ చేసే సమయంలోనే మ్యాచ్ను కోల్పోయింది. ఆ జట్టు కనీసం 170-180 పరుగులు చేసుండాల్సింది. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారు. కేకేఆర్ గెలుపుకు వీరు ఆదిలోనే బీజం వేశారు.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 170 పరుగులు స్కోర్ చేసుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. వ్యక్తిగతంగా నాకు ఈ వికెట్ (గౌహతి పిచ్) గురించి తెలుసు కాబట్టి కాస్త తొందరపడ్డాను. వేగంగా పరుగులు సాధించే క్రమంలో నేను చేయాల్సిన దాని కంటే 20 పరుగులు తక్కువ చేశాను. నేను అదనంగా 20 పరుగులు చేసుంటే బౌలర్లకు ఫైటింగ్ చేసే అవకాశం ఉండేది.డికాక్ అద్భుతంగా ఆడాడు. అతన్ని త్వరగా ఔట్ చేయాలన్నదే మా ప్రణాళిక. కానీ అది జరగలేదు. మిడిల్ ఓవర్లలోనైనా మ్యాచ్ను మా నియంత్రణలోకి తెచ్చుకుందామనుకున్నాము. అదీ జరగలేదు. డికాక్ మాకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్నులాగేసుకున్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత సీజన్లో జట్టు నన్ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరింది. అలాగే చేశాను. ఈ సీజన్లో మేనేజ్మెంట్ నన్ను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయమంది. జట్టు అవసరాల కోసం ఎక్కడ బ్యాటింగ్ చేసేందుకైనా నేను సిద్దంగా ఉండాలి.గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో మాకు యువ జట్టు ఉంది. మేము చిన్న దశల్లో బాగా రాణిస్తున్నాము. దీన్నే మ్యాచ్ మొత్తంలో కొనసాగిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. ఈ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాము. మా తప్పులను ఒప్పుకుంటాము. వాటిని మళ్ళీ పునరావృతం చేయకుండా చూసుకుంటాము. కొత్త ఆలోచనలతో చెన్నైతో మ్యాచ్లో బరిలో నిలుస్తాము.కాగా, రియాన్ సారథ్యంలో రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ పూర్తిగా ఫిట్గా లేకపోవడంతో రియాన్ను తాత్కాలిక కెప్టెన్గా నియమించారు. కెప్టెన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రియాన్ను ఇంకో అవకాశం ఉంది. నాలుగో మ్యాచ్ నుంచి శాంసన్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడు. రాయల్స్ మార్చి 30న ఇదే గౌహతిలో సీఎస్కేతో తలపడనుంది. -
KKR Vs RR: డికాక్ ధమాకా
ఐపీఎల్లో పరుగుల వరద పారిన రెండు వరుస మ్యాచ్ల తర్వాత ఆ జోరుకు కాస్త విరామం. పొడిగా, బ్యాటింగ్కు అనుకూలంగా లేని పిచ్పై సాగిన మ్యాచ్లో సీజన్లో తక్కువ స్కోరు నమోదు కాగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) పైచేయి సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ కట్టుదిట్టమైన స్పిన్తో ముందుగా రాజస్తాన్ను నైట్రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత డికాక్ దూకుడైన బ్యాటింగ్తో లక్ష్యఛేదనను సునాయాసం చేసేశాడు. 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్నందుకుంది. అన్ని రంగాల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్ తమ ‘హోం గ్రౌండ్’లో పేలవ ప్రదర్శనతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గువహాటి: డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ ఈ ఐపీఎల్ సీజన్లో గెలుపు బోణీ చేసింది. గత మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన నైట్రైడర్స్ బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, యశస్వి జైస్వాల్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు), తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 25; 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు.స్పిన్కు అనుకూలించిన పిచ్పై వరుణ్, మొయిన్ అలీ 8 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు తీసి రాయల్స్ను దెబ్బ కొట్టారు. వైభవ్ అరోరా, హర్షిత్ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. సునీల్ నరైన్ అనారోగ్యం కారణంగా మ్యాచ్కు దూరం కావడంతో మొయిన్ అలీకి కోల్కతా చోటు కల్పించగా, ఫారుఖీ స్థానంలో రాజస్తాన్ జట్టులోకి హసరంగ వచ్చాడు.సమష్టి వైఫల్యం... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆసాంతం ఒకే తరహాలో సాదాసీదాగా సాగింది. ఆశించిన స్థాయిలో దూకుడైన బ్యాటింగ్ లేకపోగా, ఒక్కటీ సరైన భాగస్వామ్యం రాలేదు. జైస్వాల్ ధాటిగానే మొదలు పెట్టినా... మరోవైపు సంజు సామ్సన్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేదు. ‘లోకల్ బాయ్’ పరాగ్ తన తొలి 7 బంతుల్లో 2 సిక్సర్లు బాది అభిమానులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఓవర్లోనూ డీప్ మిడ్వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన అతను...అదే ఓవర్లో మరో షాట్కు ప్రయత్నించి వెనుదిరగడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత హసరంగ (4)ను ముందుగా పంపిన ప్రయోగం ఫలితం ఇవ్వకపోగా, నితీశ్ రాణా (9 బంతుల్లో 8), శుభమ్ దూబే (12 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా విఫలమయ్యారు. 67/1తో మెరుగైన స్థితిలో కనిపించిన రాజస్తాన్ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 82/5కి చేరింది. దాంతో ‘ఇంపాక్ట్ సబ్’గా అదనపు బ్యాటర్ను శుభమ్ దూబే రూపంలో ఏడో స్థానంలో బరిలోకి దింపింది. అయితే ఒత్తిడిలో అతనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జురేల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రాణా వరుస ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే హర్షిత్ తన తర్వాతి ఓవర్లో జురేల్, ప్రమాదకర బ్యాటర్ హెట్మైర్ (8 బంతుల్లో 7; 1 ఫోర్)లను వెనక్కి పంపించాడు. చివర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16; 2 సిక్స్లు) కొట్టిన రెండు సిక్సర్లతో రాజస్తాన్ స్కోరు 150 పరుగులు దాటింది. డికాక్ మెరుపులు... ఛేదనలో డికాక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పవర్ప్లేలో జట్టు స్కోరు 40 పరుగులు కాగా, డికాక్ ఒక్కడే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34 పరుగులు సాధించాడు. మరోవైపు కేకేఆర్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ (5) రనౌట్ కావడంతో జట్టు మొదటి వికెట్ను కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే (15 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినా, డికాక్ జోరుతో స్కోరు వేగంగా సాగిపోయింది. 35 బంతుల్లోనే డికాక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అతనికి గెలుపు దిశగా అంగ్కృష్ రఘువంశీ (17 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) సహకరించాడు. దూకుడు తగ్గించని డికాక్ శతకం దిశగా దూసుకుపోయాడు. చివరి 3 ఓవర్లలో నైట్రైడర్స్ విజయానికి 17 పరుగులు, డికాక్ సెంచరీకి 19 పరుగులు అవసరం కాగా, ఆర్చర్ ఓవర్లో డికాక్ ఒక ఫోర్, 2 సిక్స్లు బాదినా... చివరకు 97 వద్దే అతను ఆగిపోవాల్సి వచ్చింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) హర్షిత్ రాణా (బి) అలీ 29; సామ్సన్ (బి) అరోరా 13; పరాగ్ (సి) డికాక్ (బి) వరుణ్ 25; నితీశ్ రాణా (బి) అలీ 8; హసరంగ (సి) రహానే (బి) వరుణ్ 4; జురేల్ (బి) హర్షిత్ రాణా 33; శుభమ్ (సి) రసెల్ (బి) అరోరా 9; హెట్మైర్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ రాణా 7; ఆర్చర్ (బి) జాన్సన్ 16; తీక్షణ (నాటౌట్) 1; తుషార్ దేశ్పాండే (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–69, 4–76, 5–82, 6–110, 7–131, 8–138, 9–149. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 4–0–42–1, వైభవ్ అరోరా 4–0–33–2, హర్షిత్ రాణా 4–0–36–2, మొయిన్ అలీ 4–0–23–2, వరుణ్ 4–0–17–2. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: మొయిన్ అలీ (రనౌట్) 5; డికాక్ (నాటౌట్) 97; రహానే (సి) దేశ్పాండే (బి) హసరంగ 18; రఘువంశీ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 11; మొత్తం (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–41, 2–70. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 2.3–0–33–0, మహీశ్ తీక్షణ 4–0–32–0, రియాన్ పరాగ్ 4–0–25–0, సందీప్ శర్మ 2–0–11–0, హసరంగ 3–0–34–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ 1–0–7–0.ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నోవేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
KKR Vs RR: డికాక్ వన్ మ్యాన్ షో.. రాజస్తాన్ను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2025లో కోల్కతా నైట్రైడర్స్ తొలి విజయం సాధించింది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది.చెతులేత్తేసిన బ్యాటర్లు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్తాన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కాగా రాజస్తాన్కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్ను తీసి మరి! వీడియో వైరల్ -
చెలరేగిన డికాక్.. రాజస్తాన్పై కేకేఆర్ ఘన విజయం
KKR vs RR Live Updates And Highlights: రాజస్తాన్పై కేకేఆర్ ఘన విజయంగౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. 61 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 125/216 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(79), రఘువంశీ(20) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 70/010 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(45), రహానే(18) ఉన్నారు.5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 35/05 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(30), మొయిన్ అలీ(4) ఉన్నారు.రాణించిన కేకేఆర్ బౌలర్లు.. గౌహతి వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు.17 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 123/617 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(32), హెట్మైర్(2) పరుగులతో ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తడబడుతోంది. కేవలం 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. కేకేఆర్ స్పిన్నర్లు రాజస్తాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్, శుభమ్ దూబే ఉన్నారు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్యశస్వీ జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జైశ్వాల్.. మెయిన్ అలీ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 71/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన పరాగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ రాణా వచ్చాడు. 8 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 67/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సంజూ శాంసన్.. వైభవ్ అరోరా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 34/12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 14/0టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ రెండో ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(7), సంజూ శాంసన్(7) ఉన్నారు.ఐపీఎల్-2025లో సెకెండ్ రౌండ్ మొదలైంది. రెండో రౌండ్ తొలి మ్యాచ్లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్కు కేకేఆర్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్దానంలో మెయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ తుది జట్టులోకి ఫరూఖీ స్ధానంలో హసరంగా వచ్చాడు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ -
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025లో రాజస్తాన్ రాయల్స్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో ఆదివారం నాటి మ్యాచ్లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్తాన్ బౌలింగ్ను రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడి.. రాయల్స్ బౌలర్లకు పీడకల మిగిల్చారు.ఫలితంగా ఆ జట్టు ఏకంగా 286 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో రాయల్స్ 242 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఇక తమ రెండో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగువాహతి వేదికగా బుధవారం కేకేఆర్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక గత మ్యాచ్లో కోల్కతా (ఆర్సీబీ చేతిలో) కూడా ఓడిపోవడంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్ల వైఫల్యం కొనసాగితే మాత్రం ఆ జట్టుకు మరో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా విదేశీ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఫజల్హక్ ఫారూకీలను తుదిజట్టులో కొనసాగించే అంశంపై యాజమాన్యం తీసుకునే నిర్ణయమే కీలకం కానుందని పేర్కొన్నాడు.4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?‘‘బౌలింగ్ విభాగంలో రాజస్తాన్ రాయల్స్కు ఆందోళన తప్పదు. ముఖ్యంగా జోఫ్రాపైనే ప్రస్తుతం అందరూ దృష్టి పెట్టారు. నిజానికి రాయల్స్ జట్టులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మిగతా జట్లలో ఎనిమిది మంది ఉన్నారు. అయితే, తమకున్న ఆరుగురిలో రాజస్తాన్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉంది.వాళ్లు గత మ్యాచ్లో ఆడారు. ఒకరేమో (జోఫ్రా) నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలోనే నాసిరకమైన స్పెల్తో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మరొకరు ఫజల్హక్ ఫారూకీ.. జోఫ్రాతో పాటు అతడి బౌలింగ్నూ ప్రత్యర్థి బ్యాటర్లు చితక్కొట్టారు.ప్రతి బౌలర్ కెరీర్లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి చేదు అనుభవం ఉండటం సహజమే. అయితే, జట్టులో ఉన్న ఇద్దరు విదేశీ బౌలర్లు ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటే ఏం చేయాలన్న అంశంపై యాజమాన్యానికి స్పష్టత కొరవడుతుంది. వాళ్లిద్దరిలో ఒకరిపై వేటు వేస్తేనే బెటర్.మఫాకాను ఆడించండిసౌతాఫ్రికా యువ బౌలర్ క్వెనా మఫాకాను జోఫ్రా లేదంటే ఫారూకీ స్థానంలో ఆడించండి. అయినా సరే.. రాజస్తాన్ బౌలింగ్ విభాగం కచ్చితంగా రాణిస్తుందని చెప్పలేం’’ అని ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇక రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావిస్తూ.. ఈసారి అతడు ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) సాధిస్తాడని అంచనా వేశాడు.‘‘రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు నా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకరేమో కెప్టెన్ రియాన్ పరాగ్. మరొకరు యశస్వి జైస్వాల్. ఈసారి జైసూ ఆరెంజ్ క్యాప్ గెలుపొందినా ఆశ్చర్యం లేదు. గత సీజన్లో అతడి ఫామ్ బాగాలేదు. అయినంత మాత్రాన ప్రతిసారి అలాగే ఉంటుందని భావించలేము’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా గత మ్యాచ్లో జైస్వాల్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు జోఫ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇవ్వగా.. ఫారూకీ మూడు ఓవర్లు పూర్తి చేసి 49 రన్స్ సమర్పించుకున్నాడు. మహీశ్ తీక్షణ(2/52), సందీప్ శర్మ 2/51) పరుగులు ఇచ్చినా రెండేసి వికెట్లు తీయగలిగారు.చదవండి: ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్ -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 26) మరో బిగ్ ఫైట్.. ఏ జట్టు బోణీ కొడుతుంది..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మార్చి 26) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్.. రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి బోణీ విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ సీజన్లో కేకేఆర్, రాయల్స్ తమతమ తొలి మ్యాచ్ల్లో ఓటమిపాలయ్యాయి. కేకేఆర్.. ఆర్సీబీ చేతిలో, రాయల్స్ సన్రైజర్స్ చేతిలో పరాజయం పాలయ్యాయి.డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ఆర్సీబీతో మ్యాచ్లో తడబడింది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. బ్యాటింగ్లో కొత్త కెప్టెన్ అజింక్య రహానే పర్వాలేదనిపించగా.. సునీల్ నరైన్ ఆల్రౌండర్గా రాణించాడు. డికాక్, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్యలో బరిలోకి దిగిన వరుణ్ చక్రవర్తి తేలిపోయాడు. ఆర్సీబీ బ్యాటర్లు వరుణ్ను ఆటాడుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా, మరో పేసర్ స్పెన్సర్ జాన్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హర్షిత రాణాను ప్రత్యర్ధి బ్యాటర్లు ఉతికి ఆరేశారు. మొత్తంగా తొలి మ్యాచ్లో అన్ని విభాగాల్లో విఫలమైన కేకేఆర్ నేడు రాయల్స్తో జరుగబోయే మ్యాచ్లో సత్తా చాటాలని భావిస్తుంది.రాయల్స్ విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు సన్రైజర్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ కూడా సత్తా చాటారు. గాయం కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్, వికెట్ కీపర్ దృవ్ జురెల్ మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడ్డారు. హెట్మైర్, శుభమ్ దూబే కూడా ధనాధన్ బ్యాటింగ్ చేశారు. భారీ అంచనాలకు కలిగిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీశ్ రాణా మాత్రం నిరాశపరిచారు. బౌలరల్లో జోఫ్రా ఆర్చర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులిచ్చాడు. ఫజల్ హక్ ఫారూకీ, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే కూడా ఊహించిన దానికంటే ఎక్కువ పరుగులు ఇచ్చారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చిచ్చరపిడుగుల ముందు రాయల్స్ బౌలర్లు తేలిపోయారు. కేకేఆర్తో జరుగబోయే నేటి మ్యాచ్లో బౌలింగ్ లోపాలను అధిగమించాలని రాయల్స్ భావిస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఇరు జట్లకు ఇప్పటివరకు 30 మ్యాచ్ల్లో తలపడగా.. తలో 14 మ్యాచ్లు గెలిచాయి. రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన మ్యాచ్ రద్దైంది. ఆ మ్యాచ్ కూడా నేటి మ్యాచ్ జరుగబోయే గౌహతిలో జరగాల్సి ఉండింది. దీనికి ముందు గత సీజన్లోనే జరిగిన మరో మ్యాచ్లో కేకేఆర్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్స్ చివరి బంతికి ఛేదించింది. ఆ మ్యాచ్లో జోస్ బట్లర్ సూపర్ సెంచరీ చేసి రాయల్స్ను గెలిపించాడు. అదే మ్యాచ్లో కేకేఆర్ తరఫున సునీల్ నరైన్ కూడా శతక్కొట్టాడు. పూర్తి జట్లు..కోల్కతా నైట్ రైడర్స్: క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అన్రిచ్ నోర్జే, మనీశ్ పాండే, వైభవ్ అరోరా, అనుకూల్ రాయ్, లవ్నిత్ సిసోడియా, చేతన్ సకారియా, రహ్మానుల్లా గుర్బాజ్, మయాంక్ మార్కండే, రోవ్మన్ పావెల్, మొయిన్ అలీరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), దృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఫజల్హాక్ ఫరూఖీ, సంజూ శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాకా, వనిందు హసరంగ, యుధ్వీర్ సింగ్ చరక్, అశోక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ -
ఇ'షాన్దార్' రైజర్స్
తొలి 42 బంతుల్లో 100 పరుగులు... 87 బంతుల్లో 200 పరుగులు... ఇక మిగిలింది 300 లక్ష్యమే... ఐపీఎల్లో 300 పరుగులు సాధ్యమా అనే ప్రశ్నకు జవాబిచ్చేలా ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దానిని ఈసారి అందుకోలేకపోయినా దాదాపు చేరువగా వచ్చిoది. తమ అత్యధిక టీమ్ స్కోరుకు ఒక పరుగు మాత్రమే తక్కువ చేసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును తమ పేరిటే లిఖించుకుంది. మారింది సీజన్ మాత్రమే తాము కాదు అంటూ సన్రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. గత ఏడాది లాగే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపులకు తోడు ఈసారి కొత్తగా జట్టులో చేరిన ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడడంతో జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఛేదనకు ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన రాజస్తాన్ కొంత పోరాడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో చివరకు ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మొత్తానికి 528 పరుగుల మ్యాచ్తో హైదరాబాద్ అభిమానులు ఆదివారం పండుగ చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–18 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తమదైన రీతిలో మెరుపు బ్యాటింగ్తో చెలరేగింది. ఘన విజయంతో టోర్నీని మొదలు పెట్టింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గత ఏడాది రన్నరప్ సన్రైజర్స్ 44 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 67; 9 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడారు. సన్రైజర్స్ టాప్–5 బ్యాటర్లంతా 200కు పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించడం విశేషం. 3ఇషాన్ కిషన్పరుగులు 106 బంతులు 47 ఫోర్లు 11 సిక్స్లు 6 స్ట్రయిక్రేట్ 225.53 అనంతరం 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓడిపోయింది. ధ్రువ్ జురేల్ (35 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్స్లు), సంజూ సామ్సన్ (37 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సన్రైజర్స్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ రెండు వికెట్ల చొప్పున తీశారు. సన్రైజర్స్ జట్టు తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 27న ఉప్పల్ స్టేడియంలోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడుతుంది. మెరుపు బ్యాటింగ్... అభిషేక్ శర్మ (11 బంతుల్లో 24; 5 ఫోర్లు), హెడ్ ఎప్పటిలాగే రైజర్స్కు శుభారంభం అందించారు. ఫారుఖీ ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లు కొట్టగా, అదే ఓవర్లో హెడ్ సిక్స్ కొట్టాడు. తొలి వికెట్కు 19 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం తర్వాత అభిషేక్ వెనుదిరిగాడు. అభిషేక్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అదే జోరును కొనసాగించాడు. ఆర్చర్ వేసిన ఐదో ఓవర్లో హెడ్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో అతను 4 ఫోర్లు, సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. పవర్ప్లే ముగిసేసరికి సన్రైజర్స్ స్కోరు 94 పరుగులకు చేరగా, 21 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు హెడ్ను తుషార్ అవుట్ చేసినా... కిషన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. హెడ్, కిషన్ రెండో వికెట్కు 39 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. ఆర్చర్ ఓవర్లో రెండు వరుస సిక్స్లతో కిషన్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అదే ఓవర్లో అతను మరో సిక్సర్ బాదాడు. మరోవైపు నితీశ్ రెడ్డి, క్లాసెన్ ఎక్కడా తగ్గలేదు. వీరిద్దరు దూకుడుతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. సందీప్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన క్లాసెన్, ఆర్చర్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. సందీప్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాది 98కి చేరిన కిషన్ తర్వాతి బంతికి రెండు పరుగులు చేసి సెంచరీ (45 బంతుల్లో)తో విజయనాదం చేశాడు. శతక భాగస్వామ్యం... దాదాపు అసాధ్యమైన లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్తాన్ 50 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11) వెనుదిరగడంతో జట్టు ఛేదనావకాశాలు తగ్గిపోయాయి. అయితే సామ్సన్, జురేల్ కొద్దిగా ప్రయత్నం చేశారు. సిమర్జీత్ ఓవర్లో సామ్సన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, కమిన్స్ ఓవర్లో జురేల్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడం హైలైట్గా నిలిచాయి. రాయల్స్ బ్యాటర్లు కూడా అక్కడక్కడా మెరుపులు మెరిపించినా హైదరాబాద్ ఇన్నింగ్స్ ముందు అవన్నీ దిగదుడుపుగా కనిపించాయి. నాలుగో వికెట్కు 60 బంతుల్లో 111 పరుగులు జత చేసిన అనంతరం ఒకే స్కోరు వద్ద సామ్సన్, జురేల్ అవుట్ కావడంతో రాజస్తాన్ ఆశలు అడుగంటాయి. చివర్లో హెట్మైర్ (23 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్లు), శుభమ్ దూబే (11 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలుసన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) యశస్వి జైస్వాల్ (బి) తీక్షణ 24; హెడ్ (సి) హెట్మైర్ (బి) తుషార్ దేశ్పాండే 67; ఇషాన్ కిషన్ (నాటౌట్) 106; నితీశ్ కుమార్ రెడ్డి (సి) యశస్వి జైస్వాల్ (బి) తీక్షణ 30; క్లాసెన్ (సి) పరాగ్ (బి) సందీప్ 34; అనికేత్ (సి) ఆర్చర్ (బి) తుషార్ దేశ్పాండే 7; అభినవ్ మనోహర్ (సి) పరాగ్ (బి) తుషార్ దేశ్పాండే 0; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–45, 2–130, 3–202, 4–258, 5–279, 6–279. బౌలింగ్: ఫారుఖీ 3–0–49–0, తీక్షణ 4–0–52–2, ఆర్చర్ 4–0–76–0, సందీప్ శర్మ 4–0–51–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ దేశ్పాండే 4–0–44–3. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) మనోహర్ (బి) సిమర్జీత్ 1; సంజూ సామ్సన్ (సి) క్లాసెన్ (బి) హర్షల్ పటేల్ 66; పరాగ్ (సి) కమిన్స్ (బి) సిమర్జీత్ 4; నితీశ్ రాణా (సి) కమిన్స్ (బి) షమీ 11; ధ్రువ్ జురేల్ (సి) ఇషాన్ కిషన్ (బి) ఆడమ్ జంపా 70; హెట్మైర్ (సి) మనోహర్ (బి) హర్షల్ పటేల్ 42; శుభమ్ దూబే (నాటౌట్) 34; ఆర్చర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–20, 2–24, 3–50, 4–161, 5–161, 6–241. బౌలింగ్: మొహమ్మద్ షమీ 3–0–33–1, సిమర్జీత్ సింగ్ 3–0–46–2, కమిన్స్ 4–0–60–0, అభిషేక్ 2–0–17–0, ఆడమ్ జంపా 4–0–48–1, హర్షల్ పటేల్ 4–0–34–2.286 ఐపీఎల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ చేసిన 287 పరుగుల స్కోరు అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో టాప్–5 అత్యధిక టీమ్ స్కోర్లలో నాలుగు సన్రైజర్స్ పేరిటే ఉండటం విశేషం.76 జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన పరుగులు. ఐపీఎల్లోని ఒక మ్యాచ్లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ అత్యధికంగా 73 పరుగులు ఇచ్చాడు. మోహిత్ పేరిట ఉన్న రికార్డును ఆర్చర్ తన పేరిట లిఖించుకున్నాడు. 34 టి20 ఫార్మాట్లో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్లో అత్యధిక ఫోర్లు (34) కొట్టిన జట్టుగా సన్రైజర్స్ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మిడిల్సెక్స్ కౌంటీ (33 ఫోర్లు; సర్రే జట్టుపై 2023లో) జట్టు పేరిట ఉంది. ఐపీఎల్ టోర్నీ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు కొట్టిన రికార్డు ఢిల్లీ డేర్డెవిల్స్ (31 ఫోర్లు; 2017లో గుజరాత్ లయన్స్పై) జట్టు పేరిట ఉంది. దానిని కూడా సన్రైజర్స్ బ్రేక్ చేసింది. 3 ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్గా ఇషాన్ కిషన్ (45 బంతుల్లో) గుర్తింపు పొందాడు. తొలి స్థానంలో యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్పై 2010లో) ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్తో మయాంక్ అగర్వాల్ (45 బంతుల్లో; రాజస్తాన్ రాయల్స్పై 2020లో) సరసన ఇషాన్ కిషన్ చేరాడు. -
జోఫ్రా అర్చర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్, జోఫ్రా ఆర్చర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో ఆర్చర్కు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు.తొలి ఓవర్ లోనే 23 పరుగులు ఇచ్చిన ఆర్చర్.. ఆ తర్వాత మూడు ఓవర్లలో వరుసగా 12, 22,23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్చర్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా ఆర్చర్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ పేసర్ మొహిత్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన మోహిత్ శర్మ.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 73 పరుగులు ఇచ్చాడు. తాజా మ్యాచ్తో మొహిత్ రికార్డును ఆర్చర్(78) బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్పై 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ఇషాన్ కిషన్(106 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. కిషన్తో పాటు ట్రావిస్ హెడ్(67), క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.అనంతరం 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(70) టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
ముంబై వదిలేసింది.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే భారీ సెంచరీ
ఐపీఎల్-2025లో తొలి సెంచరీ నమోదైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్(Ishan Kishan) అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన తొలి మ్యాచ్లోనే ఇషాన్ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఈ జార్ఖండ్ డైన్మేట్ ఊచకోత కోశాడు. ట్రావిస్ హెడ్, నితీశ్, క్లాసెన్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం ఇషాన్ కేవలం 45 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా 47 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 11 ఫోర్లు, 6 సిక్స్లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా గత కొన్ని సీజన్లగా ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన కిషన్ను ఎస్ఆర్హెచ్ రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. కిషన్తో పాటు ట్రావిస్ హెడ్(67), క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.𝙏𝙝𝙖𝙩 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 #TATAIPL 𝙘𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🧡A special first for Ishan Kishan as he brought up his 💯 off just 45 balls 🔥Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/8n92H58XbK— IndianPremierLeague (@IPL) March 23, 2025చదవండి: IPL 2025: ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్ -
IPL SRH Vs RR: రాజస్తాన్పై ఎస్ఆర్హెచ్ గ్రాండ్ విక్టరీ..
IPL 2025- SRH VS Rajasthan Royals Match Live Updatesఎస్ఆర్హెచ్ ఘన విజయం..ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్( 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 70) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజూ శాంసన్(66), హెట్మైర్(42) పరుగులతో పోరాడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు. శాంసన్, జురెల్ ఔట్దూకుడుగా ఆడిన సంజూ శాంసన్(66), ధ్రువ్ జురెల్(70) వరుస క్రమంలో ఔటయ్యారు. హర్షల్ పటేల్ బౌలింగ్లో శాంసన్ ఔట్ కాగా.. జంపా బౌలింగ్లో జురెల్ పెవిలియన్కు చేరాడు.శాంసన్, జురెల్ హాఫ్ సెంచరీలు..రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు సంజూ శాంసన్(59), ధ్రువ్ జురెల్(69) దూకుడుగా ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 169/5.9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 108/39 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(48), ధ్రువ్జురెల్(38) ఉన్నారు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాణా.. మహ్మద్ షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 57/3. క్రీజులో సంజూ శాంసన్(32), ధ్రువ్జురెల్(3) ఉన్నారు.రాజస్తాన్కు భారీ షాక్..287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్ తగిలింది. సిమ్రాన్జీత్ సింగ్ వేసిన రెండో ఓవర్లో రాజస్తాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత యశస్వి జైశ్వాల్(1).. తర్వాత రియాన్ పరాగ్(4) పెవిలియన్కు చేరాడు. 3 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 35/2భారీ స్కోర్ చేసిన సన్రైజర్స్..ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(67) హాఫ్ సెంచరీతో మెరవగా.. క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.ఇషాన్ కిషన్ సెంచరీ..రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని కిషన్ అందుకున్నాడు.మూడో వికెట్ డౌన్నితీశ్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన నితీశ్.. థీక్షణ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులో ఇషాన్ కిషన్(75), క్లాసెన్(1) ఉన్నారు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 219/3. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ..ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లో కిషన్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 70 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 196/2. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన హెడ్.. తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 147/2. క్రీజులో నితీష్ కుమార్రెడ్డి(15), ఇషాన్ కిషన్(35) ఉన్నారు.ట్రావిస్ హెడ్ ఫిప్టీ.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 21 బంతుల్లోనే హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. హెడ్ 59 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లలో ఇప్పటివరకు 8 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 124/1.దూకుడుగా ఆడుతున్న హెడ్..ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 15 బంతుల్లో 41 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(20) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 94/1తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. మహేష్ థీక్షణ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. 5 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 55/1ఐపీఎల్ 25 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టన్ రియాన్ పరాగ్.. ముందుగా సన్ రైజర్స్ ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. పిచ్ ను చూస్తుంటే డ్రై వికెట్ గా ఉందని, దాంతోనే ముందుగా బౌలింగ్ తీసుకున్నట్లు తెలిపాడు.ఇరు జట్ల బలాబలాలు..ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్) వేదిక కానుంది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. తొలి మ్యాచ్లో గెలిచి సీజన్ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్ సైతం గెలుపుతో సీజన్ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్పై సన్రైజర్స్ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 11, రాయల్స్ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్ల్లో సన్రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.సన్ రైజర్స్ తుది జట్టుప్యాట్ కమిన్స్( కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, సిమర్ జీత్ సింగ్, హర్షల్ పటేల్; మహ్మద్ షమీరాజస్తాన్ తుది జట్టురియాన్ పరాగ్(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శివం దూబే, నితీష్ రానా, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్ మెయిర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షనా, తుషారా దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ పరూఖి -
SRH Vs RR: సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. ఎవరిది పైచేయి..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్) వేదిక కానుంది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. తొలి మ్యాచ్లో గెలిచి సీజన్ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్ సైతం గెలుపుతో సీజన్ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్పై సన్రైజర్స్ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 11, రాయల్స్ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్ల్లో సన్రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.జట్లను పరిశీలిస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. బౌలింగ్లో మాత్రం సన్రైజర్స్దే పైచేయిగా తెలుస్తుంది. సన్రైజర్స్లో సమర్దవంతమైన పేసర్లతో (కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్) పాటు నాణ్యమైన స్పిన్నర్లు (రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, కమిందు మెండిస్, అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్) ఉన్నారు. రాయల్స్లో అది లోపించింది. పేసర్లలో సందీప్ శర్మ, జోప్రా ఆర్చర్.. స్పిన్నర్లలో హసరంగ, తీక్షణ మాత్రమే ఆ జట్టు తరఫున అనుభవజ్ఞులుగా ఉన్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. సన్రైజర్స్లో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్ కిషన్ ఉండగా.. రాయల్స్లో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మైర్, రియాన్ పరాగ్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. ఇరు జట్ల బ్యాటర్లు సీజన్ ప్రారంభానికి ముందు ఆడిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ల్లో బీభత్సమైన ఫామ్ కనబర్చారు. దీన్ని బట్టి చూస్తే నేటి మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్లో సన్రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (ఆర్సీబీపై 287) నమోదు చేయడంతో పాటు మూడు సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే.సన్రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మైర్, రియాన్ పరాగ్, యుద్ద్వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
రైజర్స్ బొణీ కొట్టేనా!
బాదుడే పరామావధిగా చెలరేగి గత సీజన్లో రన్నరప్గా నిలిచిన సన్రజర్స్ హైదరాబాద్... ఈ ఏడాది అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్తో... నేడు కమిన్స్ సేన కప్ వేట ప్రారంభించనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్తో సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా ఉండగా... యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రియాన్ పరాగ్, హెట్మైర్, ధ్రువ్ జురెల్తో సవాలు విసిరేందుకు రాజస్తాన్ రాయల్స్ రెడీ అయింది. మరి రైజర్స్ దూకుడుకు రాయల్స్ అడ్డుకట్ట వేస్తుందా చూడాలి! సాక్షి, హైదరాబాద్: గత ఏడాది అందినట్లే అంది దూరమైన ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా ఒడిసి పట్టాలనే లక్ష్యంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్కు రెడీ అయింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా జరగనున్న తొలి ‘డబుల్ హెడర్’లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ఒకప్పుడు కట్టుదిట్టమైన బౌలింగ్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సన్రైజర్స్... గత సీజన్లో విధ్వంసక బ్యాటింగ్తో రికార్డులు తిరగరాసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి మొదలు పెట్టుకొని కెప్టెన్ కమిన్స్ వరకు ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేవాళ్లు ఉండటం రైజర్స్కు కలిసి రానుండగా... సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. గత ఏడాది మ్యాచ్ మ్యాచ్కు మరింత రాటుదేలుతూ అరాచకం సృష్టించిన రైజర్స్ బ్యాటర్లు... ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే జోరు కనబర్చాలని తహతహలాడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో హెడ్, క్లాసెన్, అభిషేక్, నితీశ్ వంతులు వేసుకొని మరి భారీ షాట్లు సాధన చేశారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. వేలంలో కొత్తగా తీసుకున్న ఇషాన్ కిషన్ రాకతో రైజర్స్ బ్యాటింగ్ మరింత పదునెక్కింది. గతేడాది ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన రైజర్స్... ఈ సారి 300 మార్క్ అందుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. మరోవైపు వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామన్స్ ఈ మ్యాచ్లో కేవలం ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. సీజన్ తొలి మూడు మ్యాచ్లకు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్గా... స్వదేశీ ఆటగాళ్ల నైపుణ్యంపైనే ప్రధానంగా ఆధారపడుతున్న రాజస్తాన్ రాయల్స్కు... రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ గాయం ఇబ్బంది పెడుతోంది. అతడు కేవలం బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించనుండగా... ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. యశస్వి జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, పరాగ్, ధ్రువ్ జురేల్ ఇలా టాప్–5లో స్వదేశీ ఆటగాళ్లే బ్యాటింగ్ చేయనున్నారు. మిడిలార్డర్లో విండీస్ హిట్టర్ హెట్మైర్ కీలకం కానుండగా... ఆర్చర్, తీక్షణ, వనిందు హసరంగ బౌలింగ్ భారం మోయనున్నారు. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న రైజర్స్ బ్యాటింగ్ లైనప్ను రాయల్స్ బౌలింగ్ దళం ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే ఈమ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ బలంగా... ఇంటా బయటా అనే తేడా లేకుండా గతేడాది బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారించిన సన్రైజర్స్... ముఖ్యంగా ఉప్పల్లో ఊచకోత సాగించింది. లక్నో సూపర్ జెయింట్స్తో పోరులో ఆ జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండానే ఛేదించి సంచలనం సృష్టించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ బంతిపై పగబట్టినట్లు విజృంభిస్తుండటం రైజర్స్కు ప్రధాన బలం కాగా... ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్తో కూడిన మిడిలార్డర్ జట్టుకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఫ్రాంఛైజీ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్న అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. గాయం కారణంగా శ్రీలంకతో పర్యటనతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్... గాయం నుంచి కోలుకొని జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. పేస్ బౌలింగ్లో మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ కీలకం కానుండగా, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. తుది జట్లు (అంచనా) సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, షమీ, జాంపా. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, హసరంగ, శుభమ్ దూబే, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే. పిచ్, వాతావరణం గతేడాది ఉప్పల్లో జరిగిన మ్యాచ్ల్లో పరుగుల వరద పారింది. మొత్తం 13 మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగగా... అందులో రెండో అత్యధికం (ఓవర్కు 10.54 పరుగులు) హైదరాబాద్లో నమోదైంది. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. మ్యాచ్కు వర్ష సూచన లేదు. చెన్నై X ముంబైసాయంత్రం గం. 7:30 నుంచిచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లుగా చెరో ఐదు సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెపాక్ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నిషేధం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోగా... సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, నమన్ ధిర్తో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్ అనుభవం ముంబైకి ప్రధానాయుధం కాగా... దీపక్ చాహర్, కరణ్ శర్మ, సాంట్నర్, ముజీబ్ ఉర్ రహమాన్ మిగిలిన బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై జట్టులో తిరిగి చేరాడు. చెపాక్ లాంటి స్లో పిచ్పై అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ఎప్పట్లాగే మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి చెన్నై జట్టుకు దిశానిర్దేశం చేయనుండగా... బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత సీజన్లో ఎక్కువ శాతం బ్యాటింగ్కు రాని ధోని ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తాడా చూడాలి. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట చెన్నై విజయం సాధించింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పట్టిక అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ను తాజాగా ప్రారంభించాలని చూస్తోంది. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా రియాన్ పరాగ్.. అఫీషియల్ అప్డేట్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు రాజస్థాన్ రాయల్స్కు సంబంధింది కీలక అప్డేట్ వెలువడింది. ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లో రాయల్స్ కెప్టెన్గా రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ స్వయంగా ప్రకటించాడు. సంజూ పూర్తి స్థాయి ఆటగాడిగా ఫిట్నెస్ సాధించకపోవడమే కెప్టెన్సీ తాత్కాలిక మార్పుకు కారణమని తెలిస్తుంది. SANJU SAMSON ANNOUCING RIYAN PARAG AS ROYALS CAPTAIN IN FIRST 3 GAMES..!!! - Riyan will lead vs SRH, KKR & CSK. pic.twitter.com/G6F4WYgGD3— Johns. (@CricCrazyJohns) March 20, 2025ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా సంజూ గాయపడిన (కుడి చేతి చూపుడు వేలు) విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి పాక్షికంగా కోలుకున్న సంజూ బ్యాటర్గా ఫిట్నెస్ సాధించినప్పటికీ.. వికెట్కీపింగ్కు సంబంధించి పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఈ కారణంగా అతను రాయల్స్ ఆడబోయే తొలి మూడు మ్యాచ్ల్లో కేవలం బ్యాటర్గానే కొనసాగనున్నాడు. ఈ మూడు మ్యాచ్ల్లో సంజూ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగవచ్చు. కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగే అవకాశం ఉండటంతో సంజూ కెప్టెన్సీని రియాన్ను అప్పజెప్పాల్సి వస్తుంది. రియాన్ తాత్కాలిక కెప్టెన్గా ఉంటాడన్న విషయాన్ని వెల్లడించే సందర్భంగా సంజూ ఇలా అన్నాడు."జట్టులో చాలా మంది నాయకులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో పలువురు జట్టును అద్భుతంగా ముందుండి నడిపించారు. తదుపరి మూడు మ్యాచ్ల్లో రియాన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అందరూ అతనికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను"కాగా, సంజూ ఇవాళ (మార్చి 20) ముంబైలో జరిగే కెప్టెన్ల సమావేశంలో రాయల్స్కు ప్రతినిధిగా ఉంటాడు. సంజూ వారం తర్వాత మరోసారి ఫిట్నెస్ టెస్ట్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష కేవలం వికెట్కీపింగ్కు సంబంధించి మాత్రమే ఉంటుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో (హైదరాబాద్) జరుగనుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్తో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభం కానుంది.రియాన్ పరాగ్ విధ్వంసకర శతకంఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు రియాన్ పరాగ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే మ్యాచ్లో దృవ్ జురెల్ కూడా సెంచరీ చేశాడు. జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రియాన్, జురెల్ మెరుపు సెంచరీల మధ్య ఇదే మ్చాయ్లో యశస్వి జైస్వాల్ కూడా బీభత్సం సృష్టించాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మైర్, రియాన్ పరాగ్, యుద్ద్వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
IPL 2025: రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం.. 16 ఫోర్లు, 10 సిక్సర్లతో..!
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగుల బ్యాటింగ్ ఊచకోత మొదలైంది. నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ముగ్గురు రాయల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. స్టార్ బాయ్ రియాన్ పరాగ్, వికెట్కీపర్ బ్యాటర్ దృవ్ జురెల్ విధ్వంసకర సెంచరీలతో విరుచుకుపడగా.. యువ సంచలనం యశస్వి జైస్వాల్ మెరుపు అర్ద శతకంతో బీభత్సం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ రెండు గ్రూప్లుగా విడిపోయి ఆడిన మ్యాచ్లో తొలుత రియాన్ పరాగ్ శతకొట్టాడు. రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆతర్వాత జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ముగ్గురిలో రియాన్ పరాగ్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. 144* (64) - What a Riyan yaar 🔥💗 pic.twitter.com/K6Ht3wRFQE— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2025రియాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రియాన్ తన వీర బాదుడును ముగించుకుని పెవిలియన్కు వెళ్తుండగా సహచరులు సంజూ, జైస్వాల్, జురెల్ ప్రశంసలతో ముంచెత్తారు. సంజూ 'వెల్ డన్ మచ్చా..నైస్ హిట్టింగ్' అనగా.. జైస్వాల్, జురెల్ 'వాట్ ఎ రియాన్' అంటూ అభినందించారు. సహచరులు రియాన్ను అభినందిస్తున్న వీడియో రాయల్స్ తమ సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా అన్ని జట్లు ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తమ ప్రయాణాన్ని మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో ప్రారంభిస్తుంది. ఈ సీజన్లో రాయల్స్, సన్రైజర్స్ జట్లు బ్యాటింగ్ విస్పోటాలు కలిగి ఉన్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. బౌలర్లను ఊచకోత కోయడంలో ఈ ఇరు జట్ల మధ్య పోటీ పెడితే ఎవరు గెలుస్తారో చెప్పలేం.సన్రైజర్స్లో ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ లాంటి విధ్వంసకర యోధులు ఉండగా.. రాయల్స్లో రియాన్ పరాగ్, దృవ్ జురెల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, హెట్మైర్ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.సన్రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మైర్, రియాన్ పరాగ్, యుద్ద్వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
IPL 2025: రాయల్స్ మునుపటి వైభవం సాధిస్తుందా?
మొట్ట మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ గెలుచుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియా స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ (Shane Warne) నాయకత్వంలో 2008లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2022లో రన్నర్ అప్ గా నిలవడంతో పాటు.. మొత్తంగా ఆరుసార్లు ప్లేఆఫ్లకు చేరుకుంది. రాయల్స్ కెప్టెన్గా టీమిండియా వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (Sanju Samson) కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని రూ.18 కోట్ల భారీ ధరకు రెటైన్ చేసుకుంది.భారత్ క్రికెట్ లో అపార నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల లో ఒకడిగా 30 ఏళ్ళ ఈ కేరళ వికెట్ కీపర్ ఖ్యాతి వహించాడు. సామ్సన్ నాయకత్వం, సామర్థ్యాలపై ఉన్న అపార విశ్వాసాన్ని రాయల్స్ పునరుద్ఘాటించింది. సీజన్లోని మొదటి మ్యాచ్ నుంచే అతను పూర్తిగా ఫిట్గా, అందుబాటులో ఉండాలని ఫ్రాంచైజీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీల్ రెండో రోజున (మార్చి 23న) హైదరాబాద్ వేదిక గా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ తో రాయల్స్ ఈ సీజన్ లో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.గాయం నుంచి కోలుకున్న సామ్సన్ ఇంగ్లండ్తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ సందర్భంగా సామ్సన్ కుడి చూపుడు వేలు కి గాయమైంది. కొన్ని రోజుల తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది, రెండు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న సామ్సన్ మళ్ళీ కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఇంకా జట్టు శిక్షణ శిబిరంలో చేరలేదు. సంజు సామ్సన్ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సామ్సన్ బ్యాటింగ్ ఫిట్నెస్ పరీక్షలో విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వికెట్ కీపింగ్ విధులను తిరిగి ప్రారంభించడానికి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. అయితే రాయల్స్ జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నందున వికెట్ కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగించే అవకాశముంది. బౌలింగ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం తో రాయల్స్ కొత్త ఉత్సాహం తో ఉంది. గత సంవత్సరం చివరి దశలో తడబడిన తర్వాత, మెగా వేలంలో రాయల్స్ తమ జట్టును స్మార్ట్ కొనుగోళ్ల ద్వారా పునర్నిర్మించింది.ప్రధాన కోచ్ గా చేరిన రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంతో రాయల్స్ విధానంలో మార్పు కనిపిస్తోంది. మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ఖచ్చితత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. సామ్సన్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్, మరియు ధ్రువ్ జురెల్ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నందున బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ బలోపేతం చేయడానికి రాయల్స్ జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణాతో సహా వేలంలో కీలకమైన చేర్పులను చేసింది.రాయల్స్ జట్టులో వ్యూహాత్మక మార్పులు రాయల్స్ 2025 సీజన్ కోసం జట్టులో వ్యూహాత్మక మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్లను వదులుకోవడం వారి జట్టు యొక్క ప్రధాన వ్యూహంలో మార్పును సూచిస్తుంది. జోఫ్రా ఆర్చర్ను కొనుగోలు చేయడంతో బౌలింగ్ కి గణనీయమైన పదును లభించింది. ఇంకా ఫజల్హాక్ ఫరూఖీ , తుషార్ దేశ్పాండే లతో పాటు స్పిన్ విభాగంలో వానిందు హసరంగా, మహేష్ తీక్షణ ఉన్నందున మిడిల్ ఓవర్ల లలో వైవిధ్యం, పొదుపుగా బౌలింగ్ చేసే అవకాశముంది. నితీష్ రాణా చేరికతో బ్యాటింగ్ యూనిట్ బలోపేతమయ్యింది. కోల్కతా నైట్ రైడర్స్ తరపున నిలకడగా రాణించిన రాణా బ్యాటింగ్ ని బలోపేతం చేస్తాడనడంలో సందేహం లేదు. ఇంకా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కొనుగోలు ఫ్రాంఛైజీ దీర్ఘకాలిక దృక్పథాన్ని నొక్కి చెబుతుంది.రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు:సంజు సామ్సన్కెప్టెన్గా, అత్యంత నమ్మకమైన బ్యాటర్గా, సామ్సన్ ముందు నుండి నాయకత్వం వహించే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ సీజన్లో జోస్ బట్లర్ లేనందున సామ్సన్ పై బాధ్యత మరింత పెరిగే అవకాశముంది. జట్టుకి స్థిరత్వాన్నివ్వడం, క్లిష్టమైన సమయాల్లో ఆదుకోవడం ఇప్పుడు సామ్సన్ పైనే ఉంటుంది.యశస్వి జైస్వాల్అపార నైపుణ్యం ఉన్న యువ బ్యాటర్ జైస్వాల్ ఇటీవలి ఫామ్ అంత నిలకడగా లేనందున, భారత పరిమిత ఓవర్ల జట్టులోకి మళ్ళీ రావడానికి ఐపీఎల్ అతనికి మరో అవకాశం కల్పిస్తోంది.నితీష్ రాణాకోల్కతా నైట్ రైడర్స్ నుండి రాయల్స్ కి మారడం రాణా ఐపీఎల్ కెరీర్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ అతని బహుముఖ ప్రజ్ఞ రాజస్థాన్కు గట్టి బలాన్నిస్తోంది.జోఫ్రా ఆర్చర్గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ తిరిగి రావడంతో రాజస్థాన్ బౌలింగ్ కు మళ్ళీ పదును చేకూరింది. వ్యక్తిగతంగా సంవత్సరాల గాయాల వైఫల్యాల తర్వాత, ఐపీఎల్ 2025 ఇంగ్లాండ్ పేసర్కు తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు అవకాశాన్ని కల్పిస్తుండంలో సందేహం లేదు.రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టుసంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్పాండే, శుభమ్ దూబే, ఎఫ్ యుధ్వీర్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.చదవండి: టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి -
రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. సంజూ ఇంకా బెంగళూరులోనే?
ఐపీఎల్-2025 (IPL 2025)కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం పది జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. తమ హోం గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి కొన్ని జట్లను గాయాల బెడద వెంటాడుతోంది. అందులో ఒకటి రాజస్తాన్ రాయల్స్. అరంగేట్ర సీజన్లో ఛాంపియన్స్గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్.. అప్పటి నుంచి మరోసారి టైటిల్ను సొంతం చేసుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా విజేతగా నిలిచి తమ పదిహేడు ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని రాజస్తాన్ భావిస్తోంది. అయితే కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడం ఆర్ఆర్కు ప్రధాన సమస్యగా మారింది.తొలి మ్యాచ్కు దూరం..ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 23న ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.ఈ మ్యాచ్కు సంజూ శాంసన్ దూరమయ్యే అవకాశముంది. ఐపీఎల్లో పాల్గోనేందుకు శాంసన్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (నేషనల్ క్రికెట్ అకాడమీ) నుండి ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు.ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో బ్యాటింగ్ చేస్తుండగా అతడి కుడి చూపుడు వేలుకు గాయమైంది. చూపుడు వేలు విరిగిపోవడంతో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతడు ఆరు వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ ఫైనల్కు సైతం సంజూ దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న శాంసన్.. మార్చి 16 లేదా మార్చి 17న రాజస్తాన్ రాయల్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరుతాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు రాజస్తాన్ జట్టులో చేరడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోని వైద్య సిబ్బంది ఇంకా క్లియరన్స్ ఇవ్వలేదు.తాజాగా సంజూకు వైద్య సిబ్బంది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్య ఎదుర్కోలేదని, వికెట్ కీపింగ్ సమయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అయితే భారత టీ20 జట్టులో సంజూ కీలక సభ్యునిగా ఉండడంతో పూర్తి ఫిట్నెస్ సాధించకుండా అతడి ఆడించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సంజూ ఫిట్నెస్పై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ సంజూ తొలి మ్యాచ్లో ఆడినా స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఉండనున్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ ఉంది.ఐపీఎల్-2025కు రాజస్తాన్ టీమ్..బ్యాటర్లు: సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, నితీష్ రాణా, శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోడ్ఆల్ రౌండర్లు: రియాన్ పరాగ్, వనిందు హసరంగాబౌలర్లు: సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, ఫజల్హక్ ఫరూకీ, క్వేనా మఫాకా, ఆకాష్ మధ్వల్, యుధ్వీర్ సింగ్, కుమార్ కార్తికేయ, అశోక్ శర్మచదవండి: IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్ -
దటీజ్.. ద్రవిడ్
జైపూర్: నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్... మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్... చేతి కర్రల సాయంతో జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇటీవల ఓ స్థానిక లీగ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ద్రవిడ్ గాయపడ్డాడు. దీంతో కాలికి పట్టి, చేతి కర్రల సాయంతోనే మైదానానికి వచ్చిన ద్రవిడ్... ఆటగాళ్ల శిక్షణను పర్యవేక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేయగా... అది కాస్తా వైరల్గా మారింది. గోల్ఫ్ కార్ట్లో మైదానంలోకి వచ్చిన ద్రవిడ్... ప్లేయర్ల ఆటతీరును పరిశీలించాడు. ఒక్కో ఆటగాడి దగ్గరికి వెళ్లేందుకు చేతి కర్రల సాయం తీసుకున్న ద్రవిడ్... చాలాసేపు వారి ఆటతీరును పరిశీలించాడు. కాలికి మెడికల్ వాకింగ్ బూట్ ధరించిన ద్రవిడ్... యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు. 2022 నుంచి 2024 వరకు భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్... గతేడాది టీమిండియా టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తిరిగి రాజస్తాన్ జట్టుకు హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్గా కొనసాగుతుండగా... సంజూ సామ్సన్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 💗➡️🏡 pic.twitter.com/kdmckJn4bz— Rajasthan Royals (@rajasthanroyals) March 13, 2025 -
హెడ్ కోచ్కు గాయం.. రాజస్తాన్ రాయల్స్ పోస్ట్ వైరల్
తమ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) గాయంపై రాజస్తాన్ రాయల్స్ అప్డేట్ అందించింది. ‘ది వాల్’ కోలుకుంటున్నాడని.. త్వరలోనే పూర్తిస్థాయిలో టీమ్తో చేరతాడని తెలిపింది. కాగా ఇటీవల ద్రవిడ్ క్లబ్ క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే.తన చిన్న కుమారుడు అన్వయ్తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో ద్రవిడ్ పాల్గొన్నాడు. యంగ్ లయన్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ఆడిన ద్రవిడ్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే రాహుల్ ద్రవిడ్ గాయపడినట్లు సమాచారం. దీంతో రాజస్తాన్ రాయల్స్ ముందస్తు శిక్షణా శిబిరంలో పాల్గొనలేకపోయాడు.కాలికి కట్టు అలాగే ఉండటంతోఅయితే, తాజాగా అతడు జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బుధవారం వెల్లడించింది. ‘‘బెంగళూరులో క్రికెట్ ఆడుతున్న సమయంలో గాయపడిన మా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోలుకుంటున్నారు. ఈరోజే జైపూర్లో ఆయన మాతో చేరతారు’’ అని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాయల్స్ జెర్సీలో థమ్సస్ సింబల్ చూపిస్తున్న ద్రవిడ్ ఫొటోను పంచుకుంది. అయితే, అతడి ఎడమకాలికి ఇంకా కట్టు ఉండటం గమనార్హం.ఇక ఈ ఫొటో వైరల్గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు చదివాం గానీ.. ఇలా హెడ్ కోచ్కు ఇంజూరీ కావడం ఇదే తొలిసారి కావొచ్చు అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘వాల్’ కాస్త పెద్దవాడైపోయాడని.. క్రికెట్ ఆడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హితవుపలుకుతున్నారు.కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాత భారత జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో జట్టుకట్టాడు. ఈ ఏడాది నుంచి రాజస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. గతంలోనూ ద్రవిడ్ ఈ ఫ్రాంఛైజీతో పనిచేశాడు.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ జట్టుసంజూ శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, శుభం దూబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోడ్, షిమ్రన్ హెట్మెయిర్, నితీశ్ రాణా, యుధ్వీర్ సింగ్, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ సింగ్, తుషార్ దేశ్పాండే, ఫజల్హక్ ఫారూకీ, క్వెనా మఫాకా, అశోక్ శర్మ, సందీప్ శర్మ.రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ సిబ్బందిహెడ్కోచ్- రాహుల్ ద్రవిడ్డైరెక్టర్ ఆఫ్ క్రికెట్- కుమార్ సంగక్కరఫాస్ట్ బౌలింగ్ కోచ్- షేన్ బాండ్బ్యాటింగ్ కోచ్- విక్రమ్ రాథోడ్ఫీల్డింగ్ కోచ్- దిశాంత్ యాగ్నిక్.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా..Head Coach Rahul Dravid, who picked up an injury while playing Cricket in Bangalore, is recovering well and will join us today in Jaipur 💗 pic.twitter.com/TW37tV5Isj— Rajasthan Royals (@rajasthanroyals) March 12, 2025 -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్ 2025 (IPL) సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్సీఏలో (National Cricket Academy) ఉన్న టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించుకున్నట్లు సమాచారం. బహుతులే ఎన్సీఏలో జాయిన్ కాకముందు 2018-21 మధ్యలో రాజస్థాన్ రాయల్స్కు స్పిన్ బౌలింగ్ కోచ్గా పని చేశాడు. బహుతులేతో ఆర్ఆర్ యాజమాన్యం తుది సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తుంది. అన్నీ కుదిరితే బహుతులే ఆర్ఆర్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఆ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. 52 ఏళ్ల బహుతులే.. గతంలో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్గా ఉండగా అతని అండర్లో పని చేశాడు. రాయల్స్తో చర్చలు జరుగుతున్న విషయాన్ని బహుతులే స్వయంగా క్రిక్బజ్కు తెలిపాడు. రాయల్స్తో మళ్లీ కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాడు. 2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్పిన్-బౌలింగ్ కోచ్గా పనిచేసినప్పుడు ద్రవిడే తనను భారత జట్టుకు పరిచయం చేడని గుర్తు చేసుకున్నాడు. గతంలో శ్రీలంకలో జరిగిన సిరీస్లో ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్లో తాను పని చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. పాత పరిచయాల నేపథ్యంలో ద్రవిడ్తో పునఃకలయిక కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. బహుతులే 1997-2003 మధ్యలో టీమిండియా తరఫున 2 టెస్ట్లు, 8 వన్డేలు ఆడాడు.ట్రెంట్ రాకెట్స్పై ఆసక్తి చూపుతున్న రాయల్స్ యాజమానిరాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే హండ్రెడ్ లీగ్లో (ఇంగ్లండ్లో జరిగే హండ్రెడ్ బాల్ టోర్నీ) ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నాటింగ్హమ్ కౌంటీకి చెందిన రాకెట్స్ ఈ సోమవారం వేలానికి రానుంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి ఐపీఎల్తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (బార్బడోస్ రాయల్స్), సౌతాఫ్రికా టీ20 లీగ్ల్లో (పార్ల్ రాయల్స్) ఫ్రాంచైజీలు ఉన్నాయి. హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే.. ఈ లీగ్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇదివరకే పెట్టుబడులు పెట్టాయి. సదరు ఫ్రాంచైజీల యాజమాన్యాలు హండ్రెడ్ లీగ్లోని నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు..సంజూ శాంసన్ (కెప్టెన్), ద్రువ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మైర్, శుభమ్ దూబే, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, ఆశోక్ శర్మ, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, యుద్ద్వీర్సింగ్ -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్కు బిగ్ షాక్.. సంజూ శాంసన్కు గాయం..?
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్కు (Rajasthan Royals) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ (Sanju Samson) శాంసన్ గాయపడినట్లు సమాచారం. ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా సంజూ చూపుడు వేలికి గాయమైనట్లు తెలుస్తుంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ సంధించిన బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది. ఈ సందర్భంగా సంజూ చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఆతర్వాత సంజూ బ్యాటింగ్ను కొనసాగించినప్పటికీ.. కొద్ది సేపటికే ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో సంజూ బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ద్రువ్ జురెల్ వికెట్కీపింగ్ చేశాడు. పలు నివేదికల ప్రకారం.. సంజూ రానున్న ఆరు వారాలు క్రికెట్కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. దీంతో సంజూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా సంజూ రంజీ బరిలో ఉండడని సమాచారం. రంజీలో సంజూ ప్రాతినిథ్యం వహించే కేరళ, క్వార్టర్ ఫైనల్లో జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడాల్సి ఉంది.డగౌట్లో సంజూఇంగ్లండ్తో చివరి టీ20లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన సంజూ.. ఆతర్వాత స్కానింగ్కు వెళ్లలేదు. డగౌట్లో ఎక్స్ట్రా ప్లేయర్ జెర్సీ వేసుకుని కనిపించాడు. దీన్ని చూసి అభిమానులు సంజూకు ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మ్యాచ్ అనంతరం సంజూ చూపుడు వేలుకు బాగా వాపు వచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడు స్కానింగ్కు వెళ్లగా డాక్టర్లు ఫ్రాక్చర్ను గుర్తించినట్లు సమాచారం.ఘోర వైఫల్యంఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్లో అతను కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. ఈ సిరీస్లో సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రతి మ్యాచ్లో ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో సంజూ వీక్నెస్ను గుర్తించిన ఇంగ్లండ్ పేసర్లు పదేపదే ఒకే తరహా బంతులు వేసి అతన్ని ఔట్ చేశారు.4-1 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజూ విఫలమైనప్పటికీ భారత్ 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో సంజూ సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి టీ20లో విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్రేట్తో 276 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు.మార్చి 21 నుంచి ప్రారంభంఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్లో రాజస్థాన్ ఆరంభ ఎడిషన్లో మాత్రమే టైటిల్ సాధించింది. గత సీజన్లో సంజూ శాంసన్ నేతృత్వంలోని ఈ జట్టు రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. -
IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై..
భారత స్టార్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో తాను కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చాడు. వికెట్ కీపర్ బాధ్యతలను ఓ యువ ఆటగాడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా 2021లో రాజస్తాన్ రాయల్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు సంజూ శాంసన్.కెప్టెన్గా హిట్ఆ మరుసటి ఏడాదే అంటే.. 2022లో రాజస్తాన్ను ఫైనల్ చేర్చి సత్తా చాటాడు. 2008 తర్వాత ఆ జట్టు మళ్లీ తుదిపోరుకు అర్హత సాధించడం అదే తొలిసారి. అయితే, 2023లో మాత్రం ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినప్పటికీ ఐదో స్థానంలో నిలపగలిగాడు. ఇక తాజా ఎడిషన్లో మాత్రం రాజస్తాన్ను మరోమారు ఆఫ్స్లో నిలబెట్టాడు సంజూ.అతడి కోసం త్యాగం చేసేందుకు సిద్దంఇలా గత మూడేళ్లుగా రాజస్తాన్ను మెరుగైన స్థితిలో నిలపడంలో కెప్టెన్గా, బ్యాటర్గా, వికెట్ కీపర్గా సంజూ శాంసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, వచ్చే ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్ కోసం వికెట్ కీపర్గా తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంజూ తాజాగా వెల్లడించాడు.నాకు ఇదొక పెద్ద సవాలే.. అయినా‘‘ధ్రువ్ జురెల్ ప్రస్తుతం టెస్టుల్లో సెకండ్ వికెట్ కీపర్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లోనూ అతడు కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తే అతడి అంతర్జాతీయ కెరీర్కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం గురించి మేము చర్చలు జరుపుతున్నాం.జురెల్తో కలిసి కీపింగ్ బాధ్యతలు పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. నిజానికి.. నేను కేవలం ఓ ఫీల్డర్గా ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేదు. కాబట్టి నాకు ఇదొక పెద్ద సవాలే. అయితే.. ధ్రువ్ విధుల పట్ల మాత్రం స్పష్టతతో ఉన్నాను.నాయకుడిగా నా బాధ్యత.. అందుకే ఈ నిర్ణయంనేను అతడితో ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడాను. ‘‘చూడు ధ్రువ్.. నాయకుడిగా నేను నీ గురించి తప్పక ఆలోచిస్తాను. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లలో కీపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు’’ అని చెప్పాను. ఏదేమైనా మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం.అయితే, ఆటగాళ్ల వ్యక్తిగత ఎదుగుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంచుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాం’’ అని సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు తన ఆలోచినలు, నిర్ణయం గురించి వెల్లడించాడు.రూ. 18 కోట్లకుకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్.. సంజూ శాంసన్ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతడితో పాటు యశస్వి జైస్వాల్(రూ. 18 కోట్లు ), రియాన్ పరాగ్(రూ. 14 కోట్లు)ధ్రువ్ జురెల్(రూ. 14 కోట్లు), హెట్మైర్(రూ. 11 కోట్లు), సందీప్ శర్మ(రూ. 4 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.ఐపీఎల్ వేలం-2025 తర్వాత రాజస్తాన్ జట్టుయశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మైర్, సందీప్శర్మ, జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు), తుషార్ దేశ్పాండే (రూ.6.50 కోట్లు), వనిందు హసరంగ (రూ.5.25 కోట్లు),మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు), నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు), ఫజల్హక్ ఫారూకీ(రూ. 2 కోట్లు), క్వెనా మఫాక (రూ. 1.50 కోట్లు), ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు), వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు), శుభమ్ దూబే (రూ. 80 లక్షలు), యుద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు), కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు), అశోక్ శర్మ (రూ. 30 లక్షలు), కునాల్సింగ్ (రూ. 30 లక్షలు).చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ
టీనేజీ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 13 ఏళ్ల వైభవ్.. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ (బీహార్) ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ పేరిట ఉండేది. అలీ 14 ఏళ్ల 51 రోజుల వయసులో లిస్ట్-ఏ క్రికెట్లోని అరంగేట్రం చేశాడు. తాజాగా వైభవ్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్తో పాటు రంజీల్లో మరియు అండర్-19 స్థాయిలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు.కాగా, వైభవ్ లిస్ట్-ఏ అరంగేట్రం ఊహించినంత సజావుగా సాగలేదు. మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్ ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో వైభవ్ ప్రాతినిథ్యం వహించిన బీహార్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ 46.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బిపిన్ సౌరభ్ (50), గనీ (48), ప్రబల్ ప్రతాప్ సింగ్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, ఆర్యన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో 2, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు.197 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 25.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ హర్ష్ గావ్లి (83), కెప్టెన్ రజత్ పాటిదార్ (55) అర్ద సెంచరీలతో రాణించి మధ్యప్రదేశ్ను గెలిపించారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
సచిన్, కోహ్లి కాదు! 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఆదర్శం ఇతడే!
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడీ పేరు హాట్టాపిక్. పన్నెండేళ్ల వయసులోనే రంజీ మ్యాచ్ ఆడిన ఈ బిహారీ చిచ్చరపిడుగు... ఇటీవలే మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పదమూడేళ్ల ఈ కుర్రాడి కోసం రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లు ఖర్చు చేసింది. కాగా ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టోర్నీ అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడిన వైభవ్ తన ఐడల్ ఎవరో చెప్పేశాడు. సచిన్, కోహ్లి కాదు! అతడే ఆదర్శంమెజారిటీ మంది టీమిండియా అభిమానులు ఊహించినట్లుగా వైభవ్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్, రోహిత్ శర్మల పేరు చెప్పలేదు. అతడికి వెస్టిండీస్ దిగ్గజం లారా ఆదర్శమట. ‘‘బ్రియన్ లారా నాకు ఆదర్శం. నేను ఆయనలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. అయితే, నాదైన సహజ శైలిని మాత్రం విడిచిపెట్టను. నాకున్న నైపుణ్యాలను మరింత పెంపొందించుకునేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ టోర్నీ మీదే ఉంది. నా చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంతో సంబంధం లేదు’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.పట్టించుకోనుఐపీఎల్లో తన డిమాండ్, తన వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ వస్తున్న ఆరోపణలను పట్టించుకోనని వైభవ్ కుండబద్దలుకొట్టాడు. కాగా దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్లోనే భారత్కు చేదు అనుభవం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 44 పరుగుల తేడాతో అమాన్ సేన ఓటమిని మూటగట్టుకుంది. ఇక శనివారం జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. యువ టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో జపాన్తో ఆడనుంది. చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! Vaibhav Sooryavanshi gears up for the big stage 🌟 🗣️ Hear from India’s rising star as the action unfolds against Pakistan 🎤 #SonySportsNetwork #NextGenBlue #AsiaCup #NewHomeOfAsiaCup #INDvPAK pic.twitter.com/PLG8UlvB6i— Sony Sports Network (@SonySportsNetwk) November 30, 2024 -
పదమూడు కాదు.. పదిహేను!.. రూ. 1.10 కోట్లు.. మాకేం భయం లేదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అమ్ముడుపోయిన క్రికెటర్గా రికార్డుకెక్కాడు వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు అతడి పేరే హాట్ టాపిక్. అయితే, కొంతమంది వైభవ్ నైపుణ్యాలను ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం వయసు విషయంలో అతడు అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డవైభవ్ సూర్యవంశీ పదమూడేళ్ల పిల్లాడు కాదని.. అతడి వయసు పదిహేనేళ్లు అంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందించారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడు చిన్ననాటి నుంచే ఎంతో కఠిన శ్రమకోరుస్తున్నాడు. ఇప్పుడు అతడు సాధించిన విజయం వల్ల బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డ అయిపోయాడు.ఎనిమిదేళ్ల వయసులోనే అతడు అండర్-16 డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో పాల్గొన్నాడు. క్రికెట్ కోచింగ్ కోసం నేను తనని రోజూ సమస్తిపూర్ వరకు తీసుకువెళ్లి.. తిరిగి తీసుకువచ్చేవాడిని. వైభవ్ను క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు మేమెంతగా కష్టపడ్డామో ఎవరికీ తెలియదు.మాకు ఏ భయమూ లేదుఆర్థిక ఇబ్బందుల వల్ల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. నా కుమారుడు ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే మొట్టమొదటిసారి బీసీసీఐ బోన్ టెస్టు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే అతడు ఇండియా అండర్-19 జట్టుకు ఆడుతున్నాడు. మాకు ఏ భయమూ లేదు. కావాలంటే మరోసారి వైభవ్ ఏజ్ టెస్టుకు వెళ్తాడు’’ అని ఆరోపణలు చేస్తున్న వారికి సంజీవ్ సూర్యవంశీ గట్టి కౌంటర్ ఇచ్చారు.కాగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ వయసు 13 ఏళ్ల 243 రోజులు. ఇక రూ. 30 లక్షల కనీస ధరతో అతడు తన పేరును ఐపీఎల్-2025 మెగా వేలంలో నమోదు చేసుకున్నాడు. ఆక్షన్లో వైభవ్ కోసం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా.. రాజస్తాన్ ఏకంగా రూ. కోటీ పది లక్షల భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది.ఒకే ఓవర్లో 17 పరుగులు ఈ విషయం గురించి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. ‘‘నాగపూర్లో ట్రయల్స్ సమయంలో వైభవ్ను రమ్మని రాజస్తాన్ రాయల్స్ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ సర్ నా కుమారుడిని టెస్టు చేశారు. ఒకే ఓవర్లో అతడు 17 పరుగులు చేశాడు. ట్రయల్స్లో మొత్తంగా ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు’’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: Gautam Gambhir: ఆసీస్తో రెండో టెస్ట్కు ముందు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్ కోచ్ Vaibhav Suryavanshi, all of 13 years old, entering the IPL! 💗😂 pic.twitter.com/ffkH73LUeG— Rajasthan Royals (@rajasthanroyals) November 25, 2024 View this post on Instagram A post shared by Vaibhav Suryavanshi (@vaibhav.suryavanshi_25) -
వేలం ముగిసింది.. ఇంకా ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్కు సంబంధించి మెగా వేలం కార్యక్రమం పూర్తయింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలంపాటలో.. తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం పది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఎట్టకేలకు తమకు కావాల్సిన వారిని దక్కించుకున్నాయి. ఇక వేలం ప్రక్రియ ముగిసింది కాబట్టి... ఇక వచ్చే ఏడాది మార్చిలో జరిగే టోర్నీకి ఎలా సమాయత్తం కావాలో ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచించుకుంటాయి.కాగా ఐపీఎల్లో ఇంతవరకూ టైటిల్ నెగ్గలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మరి వచ్చే సీజన్లోనైనా ఈ జట్లలో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇక ఆదివారం నాటి తొలిరోజు వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికారు. వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ ఆప్షన్ అయిన పంత్ కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించింది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ తాము రిలీజ్ చేసిన వెంకటేశ్ అయ్యర్ను ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసి మరోసారి జట్టులో చేర్చుకుంది.ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు వేలంలోని విశేషాలను గమనిస్తే.. భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో మధ్య తీవ్ర పోటీ సాగింది. ఈ రెండు కలిసి అతడి విలువను రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ స్థితిలో అనూహ్యంగా ముందుకు వచ్చిన బెంగళూరు రూ.10 కోట్ల 75 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. మరోవైపు.. తమ పాత ఆటగాడు దీపక్ చహర్ను తీసుకునేందుకు చెన్నై సూపర్కింగ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ముంబై, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలతో పోటీ పడి రూ. 8 కోట్ల వరకు బరిలో నిలిచింది. అయితే వెనక్కి తగ్గని ముంబై రూ.9 కోట్ల 75 లక్షలకు అతడిని దక్కించుకుంది.వీరికి మంచి ధర👉సోమవారం వేలంలో అందరికంటే ముందుగా న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ పేరు రాగా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. 👉గత ఏడాది వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన డుప్లెసిస్ను ఈసారి అతని కనీస విలువ రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. 👉భారత పేస్ బౌలర్లలో ఆకాశ్దీప్ (రూ.8 కోట్లు; లక్నో), ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు; ఢిల్లీ), తుషార్ దేశ్పాండే (రూ. 6 కోట్ల 50 లక్షలు; రాజస్తాన్ రాయల్స్) మంచి ధర పలికారు. 👉అఫ్గానిస్తాన్ మిస్టరీ ఆఫ్స్పిన్నర్ అల్లా గజన్ఫర్(రూ. 4.80 కోట్లు) కోసం కోల్కతా, బెంగళూరులతో పోటీ పడి ముంబై సొంతం చేసుకుంది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పోలిన బౌలింగ్ శైలిగల గజన్ఫర్ గత ఏడాది కోల్కతా టీమ్లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 👉ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిలో పడిన ప్రియాన్ష్ ఆర్య కోసం నాలుగు జట్లు బరిలో నిలవగా, చివరగా పంజాబ్ దక్కించుకుంది. 👉పదేళ్ల క్రితం చివరి టీ20 మ్యాచ్ ఆడి టెస్టుల రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో రిజిస్టర్ చేసుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ను ఎవరూ పట్టించుకోలేదు.👉రిటెయిన్ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (23), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (22), డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (21), రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్రుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 65 కోట్లు; వేలానికి రూ. 54.95 కోట్లు; మిగిలింది: 5 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్ (రూ. 16.50 కోట్లు) కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు) స్టబ్స్ (రూ. 10 కోట్లు) అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) డుప్లెసిస్ (రూ. 2 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) దుష్మంత చమిర (రూ. 75 లక్షలు) డోనొవన్ ఫెరీరా (రూ. 75 లక్షలు) విప్రాజ్ నిగమ్ (రూ.50 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) మాధవ్ తివారి (రూ. 40 లక్షలు) అజయ్ జాదవ్ (రూ.30 లక్షలు) దర్శన్ నల్కండే (రూ. 30 లక్షలు) త్రిపురాణ విజయ్ (రూ. 30 లక్షలు) మన్వంత్ కుమార్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 47 కోట్లు; వేలానికి రూ 72.80 కోట్లు; మిగిలింది: రూ. 20 లక్షలు గుజరాత్ టైటాన్స్రషీద్ ఖాన్ (రూ. 18 కోట్లు) శుబ్మన్ గిల్ (రూ. 16.50 కోట్లు) సాయి సుదర్శన్ (రూ. 8.5 కోట్లు) రాహుల్ తెవాటియా (రూ. 4 కోట్లు) షారుక్ ఖాన్ (రూ. 4 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) సుందర్ (రూ. 3.20 కోట్లు) రూథర్ఫర్డ్ (రూ. 2.60 కోట్లు) కొయెట్జీ (రూ. 2.40 కోట్లు) ఫిలిప్స్ (రూ. 2 కోట్లు) సాయి కిషోర్ (రూ. 2 కోట్లు) మహిపాల్ లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) గుర్నూర్ సింగ్ (రూ. 1.30 కోట్లు) అర్షద్ ఖాన్ (రూ.1.30 కోట్లు), జయంత్ (రూ. 75 లక్షలు) ఇషాంత్ (రూ. 75 లక్షలు) కరీమ్ జనత్ (రూ. 75 లక్షలు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కుల్వంత్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 51 కోట్లు; వేలానికి రూ. 68.85 కోట్లు; మిగిలింది: 15 లక్షలు పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు) ప్రభ్సిమ్రన్ సంగ్ (రూ.4 కోట్లు) శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్దీప్ సింగ్ (రూ.18 కోట్లు) యుజువేంద్ర చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) మార్కొ జాన్సెన్ (రూ. 7 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్వెల్ (రూ.4.20 కోట్లు) ప్రియాన్‡్ష ఆర్య (రూ. 3.80 కోట్లు) జోష్ ఇంగ్లిస్ (రూ. 2.60 కోట్లు) అజ్మతుల్లా (రూ. 2.40 కోట్లు) ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు) వైశాక్ విజయ్కుమార్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) ఆరోన్ హార్డి (రూ. 1.25 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) జేవియర్ బార్ట్లెట్ (రూ. 80 లక్షలు) కుల్దీప్ సేన్ (రూ. 80 లక్షలు) అవినాశ్ (రూ. 30 లక్షలు) సూర్యాంశ్ షెడ్గే (రూ. 30 లక్షలు) ముషీర్ఖాన్ (రూ.30 లక్షలు) హర్నూర్ (రూ.30 లక్షలు) ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.9.50 కోట్లు; వేలానికి రూ. 110.15 కోట్లు; మిగిలింది: రూ. 35 లక్షలు రాజస్తాన్ రాయల్స్యశస్వి జైస్వాల్ (రూ. 18 కోట్లు) సంజూ సామ్సన్ (రూ. 18 కోట్లు) ధ్రువ్ జురేల్ (రూ. 14 కోట్లు) రియాన్ పరాగ్ (రూ. 14 కోట్లు) హెట్మైర్ (రూ. 11 కోట్లు) సందీప్శర్మ (రూ. 4 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) తుషార్ దేశ్పాండే (రూ.6.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు) ఫజల్హక్ (రూ. 2 కోట్లు) క్వెన మఫాక (రూ. 1.50 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు) శుభమ్ దూబే (రూ. 80 లక్షలు) యు«ద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు) కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు) అశోక్ శర్మ (రూ. 30 లక్షలు) కునాల్సింగ్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 79 కోట్లు; వేలానికి రూ. 40.70 కోట్లు; మిగిలింది: రూ. 30 లక్షలు సన్రైజర్స్ హైదరాబాద్క్లాసెన్ (రూ. 23 కోట్లు) కమిన్స్ (రూ. 18 కోట్లు) హెడ్ (రూ. 14 కోట్లు) అభిõÙక్ శర్మ (రూ. 14 కోట్లు) నితీశ్ రెడ్డి (రూ. 6 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు) రాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు) ఇషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు) బ్రైడన్ కార్స్ (రూ. 1 కోటి) ఉనాద్కట్ (రూ. 1 కోటి) కమిండు మెండిస్ (రూ. 75 లక్షలు) జీషాన్ అన్సారి (రూ. 40 లక్షలు) అనికేత్ వర్మ (రూ. 30 లక్షలు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ.44.80 కోట్లు; మిగిలింది: రూ.20 లక్షలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకోహ్లి (రూ. 21 కోట్లు) రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) హాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 37 కోట్లు; వేలానికి రూ. 82.25 కోట్లు; మిగిలింది: రూ. 75 లక్షలు ముంబై ఇండియన్స్బుమ్రా (రూ. 18 కోట్లు) హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు) సూర్యకుమార్ (రూ. 16.35 కోట్లు) రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు) తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు) ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు) సాంట్నర్ (రూ. 2 కోట్లు) రికెల్టన్ (రూ. 1 కోటి) రీస్ టోప్లే (రూ. 75 లక్షలు) లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు) విఘ్నేశ్ (రూ.30 లక్షలు) సత్యనారాయణ (రూ. 30 లక్షలు) రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు) శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు) అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు) బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ. 44.80 లక్షలు; మిగిలింది: రూ. 20 లక్షలులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు) రవి బిష్ణోయ్ (రూ.21 కోట్లు) మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు) మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు) ఆయుశ్ బదోని (రూ.4 కోట్లు) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) ఆకాశ్దీప్ (రూ.8 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) షహబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు) షమర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు) సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు) యువరాజ్ (రూ. 30 లక్షలు) ప్రిన్స్ యాదవ (రూ. 30 లక్షలు) ఆకాశ్ సింగ్ (రూ. 30 లక్షలు) దిగ్వేశ్ సింగ్ (రూ. 30 లక్షలు) హిమ్మత్ సింగ్ (రూ.30 లక్షలు) ఆర్యన్ జుయల్ (రూ.30 లక్షలు) అర్శిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు) హంగార్గేకర్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.51 కోట్లు; వేలానికి రూ. 68.90 కోట్లు; మిగిలింది: రూ. 10 లక్షలు కోల్కతా నైట్ రైడర్స్రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) నరైన్ (రూ. 12 కోట్లు) రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్దీప్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) జాన్సన్ (రూ. 2.80 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.69 కోట్లు; వేలానికి రూ. 50.95 కోట్లు; మిగిలింది: రూ.5 లక్షలు. -
13 ఏళ్ల కుర్రాడికి జాక్ పాట్.. ఏకంగా రూ.1.10 కోట్లు! ఎవరీ సూర్యవంశీ?
ఐపీఎల్-2025 మెగా వేలంలో బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జాక్పాట్ తగిలింది. ఈ 13 ఏళ్ల యువ క్రికెటర్ను రూ.1.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతడి ప్రస్తుత వయస్సు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. రూ.30లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సూర్య వంశీ కోసం తొలుత రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి వైదొలగడంతో ఈ యువ క్రికెటర్ను రాజస్తాన్ తమ సొంతం చేసుకుంది.ఎవరీ వైభవ్ సూర్యవంశీ?13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2011లో బిహార్లోని తాజ్పుర్ గ్రామంలో జన్మించాడు. అతడికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. ఆ దిశగానే వైభవ్ అడుగులు వేశాడు. అతడు అద్బుతమైన క్రికెటర్గా ఎదగడంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీది కీలక పాత్ర. 8 ఏళ్లకే వైభవ్ను క్రికెట్ అకాడమీలో చేర్పించి రెండేళ్లపాటు శిక్షణ సంజీవ్ ఇప్పించాడు. ఈ క్రమంలోనే కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి వైభవ్ చరిత్ర సృష్టించాడు.2023-24 రంజీ ట్రోఫీ సీజన్లో బిహార్ తరపున ఫస్ట్క్లాస్ డెబ్యూ చేశాడు. తద్వారా రంజీ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు రంజీ మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ..87 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని రాజస్తాన్ రాయల్స్ పోటీపడి మరి సొంతం చేసుకుంది. -
IPL 2025: వేలంలో చహల్కు కళ్లు చెదిరే ధర.. జాక్పాట్ కొట్టేశాడు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్ మెగా వేలం-2025లో జాక్పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 18 కోట్లు కొల్లగొట్టాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చహల్ కొనసాగుతున్నాడు.ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఏకంగా 205 వికెట్లు కూల్చాడు. తద్వారా ఇప్పటికీ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.ఇక ఐపీఎల్-2024లో రాజస్తాన్కు ఆడిన చహల్ 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, వేలానికి ముందు రాజస్తాన్ అతడిని వదిలేయగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం జరిగిన మొదటి సెట్వేలంలో చహల్ కోసం.. గుజరాత్ తొలుత బిడ్ వేసింది. ఈ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలో దిగింది. అయితే, ధర రూ. 15 కోట్లు దాటిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఊహించినవిధంగా.. పంజాబ్ కింగ్స్ రేసులోకి వచ్చి ధరను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో సన్ రైజర్స్తప్పుకోగా.. పంజాబ్ చహల్ను దక్కించుకుంది.చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం -
రాజస్తాన్ రాయల్స్ కీలక నిర్ణయం.. బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ ఓపెనర్
ఐపీఎల్-2025 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్ను రాయల్స్ యాజమాన్యం నియమించింది. వచ్చే ఏడాది సీజన్లో రాహుల్ ద్రవిడ్తో కలిసి విక్రమ్ పనిచేయనున్నాడు. ఇటీవలే రాజస్తాన్ తమ హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాథోర్ను కూడా తమ ఫ్రాంచైజీలో భాగం చేసింది. కాగా ద్రవిడ్-రాథోర్కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ టీ20 వరల్డ్కప్-2024 గెలిచిన భారత జట్టు కోచింగ్ స్టాప్లో భాగంగా ఉన్నారు. టీమిండియా హెడ్కోచ్గా ద్రవిడ్ సేవలు అందించగా.. అతడి ఆధ్వర్యంలో బ్యాటింగ్ కోచ్గా రాథోర్ పనిచేశాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ ఐపీఎల్లో అదే కాంబినేషన్ను రిపీట్ చేయనున్నారు. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ యాజమాన్యంకు చెందిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్ను జట్టు బ్యాటింగ్ కోచ్గా నియమించిందని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటలో పేర్కొంది.ద్రవిడ్ కూడా రాథోర్ నియామకాన్ని స్వాగతించాడు. విక్రమ్కు అద్బుతమైన బ్యాటింగ్ టెక్నిక్ స్కిల్స్ ఉన్నాయని, అతడి అనుభవం రాయల్స్ను విజయం పథంలో నడిపించగలడు అని ద్రవిడ్ పేర్కొన్నాడు.చదవండి: మహిళా క్రికెటర్తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్కు భారీ షాక్! -
ద్రవిడ్ రీ ఎంట్రీ.. ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పునరాగమనం చేయనున్నాడు. వచ్చే సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనునున్నాడు. రాయల్స్ యాజమాన్యం ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘టీమిండియా లెజండరీ, ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్తాన్ రాయల్స్లోకి సంచలన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అంటూ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్రమ్తో ద్రవిడ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.సరికొత్త సవాళ్లకు సిద్ధంఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత.. సరికొత్త సవాళ్లకు సిద్ధం కావాలని భావించాను. అందుకు రాయల్స్తో జతకట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా.. ‘‘ద్రవిడ్తో సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. త్వరలోనే అతను కోచ్ బాధ్యతలు చేపట్టడం ఖాయం’’ అని ఇటీవల రాయల్స్ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ్తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో సారథిగాకాగా ద్రవిడ్ ఐపీఎల్లో రాజస్తాన్కు సేవలందించడం ఇదే తొలిసారి కాదు. 2012, 2013 ఎడిషన్లలో రాయల్స్ కెప్టెన్గా వ్యహరించిన ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు మెంటార్గా రెండేళ్లు పని చేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాత.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్’గా నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్కు దూరమయ్యాడు. అనంతరం టీమిండియా ప్రధాన కోచ్గా ఎంపికైన ఈ కర్ణాటక ప్లేయర్ రెండున్నరేళ్లపాటు ఆ విధులు నిర్వర్తించాడు. అతడి హయాంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరింది.వరల్డ్ కప్ విన్నర్అయితే, టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న అతడి కల నెరవేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ల కాంబినేషన్లో టీమిండియా కరీబియన్ గడ్డపై ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ కప్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. నిజానికి ద్రవిడ్ పదవీ కాలం కూడా గత ఏడాది వన్డే ప్రపంచకప్తోనే ముగిసింది. అయినా.. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు కోచ్గా సేవలు అందించి.. ఐసీసీ టైటిల్తో తన ప్రయాణం ముగించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్తాన్కు సంబంధించిన బార్బడోస్ రాయల్స్... కరీబియన్ ప్రీమియర్ లీగ్లో, పార్ల్ రాయల్స్... సౌతాఫ్రికా20 టోర్నీల్లో పాల్గొంటున్నాయి. ఆయా లీగ్లలో విజయాలే లక్ష్యంగా సహాయ సిబ్బందిలో దిగ్గజాలను నియమించుకుంటోంది రాయల్స్.చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు.. -
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నూతన హెడ్ కోచ్ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ శనివారం ఆర్ఆర్ మేనేజ్మెంట్ తమ నూతన హెడ్ కోచ్గా టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాయల్స్ 2024 ఎడిషన్లో డెడికేటెడ్ హెడ్ కోచ్ లేకుండానే బరిలో నిలిచింది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా.. ట్రెవర్ పెన్నీ, షేన్ బాండ్లు అసిస్టెంట్ కోచ్లుగా వ్యవహరించారు. రాయల్స్ గత సీజన్ ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడింది.కాగా, ద్రవిడ్ 2011-2013 మధ్యలో రాయల్స్ హెడ్ కోచ్గా పని చేశాడు. 2014 ఎడిషన్లో మెంటార్గా వ్యవహరించాడు. అనంతరం అతను భారత అండర్-19, ఇండియా-ఏ, ఎన్సీఏలో హెడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా హెడ్ కోచ్ వంటి హోదాల్లో పని చేశాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలోనే టీమిండియా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్ను చేజిక్కించుకుంది. అలాగే ద్రవిడ్ హయాంలో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు.. వన్డే వరల్డ్కప్ ఫైనల్స్కు కూడా చేరింది. తాజా సమాచారం మేరకు ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్గా నియమితుడైతే అసిస్టెంట్ కోచ్గా విక్రమ్ రాథోడ్ ఎంపికవుతాడని తెలుస్తుంది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కొనసాగే అవకాశం ఉంది. -
రాజస్థాన్ రాయల్స్ కోచ్గా రాహుల్ ద్రవిడ్.. ఇంగ్లండ్కు సంగక్కర..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్తో బేరసారాలన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుత హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు హెడ్ కోచ్గా వెళ్లనున్న నేపథ్యంలో ద్రవిడ్ ఎంపికకు వేగంగా పావులు కదులుతున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాట్ పాట్స్ గత నెలలో తన పదవికి రాజీనామా చేయగా.. ఆ స్థానాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంగక్కరతో భర్తీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఈసీబీ నుంచి కానీ సంగక్కర నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ తెర వెనుక పావులు వేగంగా కదులుతున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ సంగక్కరతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్లకు తాత్కాలిక హెడ్ కోచ్గా మార్కస్ ట్రెస్కోధిక్ను నియమించింది. సెప్టెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ జట్టు కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్లు ముగిసిన అనంతరం పర్మెనెంట్ కోచ్గా సంగక్కర నియమితుడయ్యే అవకాశం ఉంది. ఈసీబీతో లైన్ క్లియెర్ కాగానే సంగక్కర రాయల్స్తో తెగదెంపులు చేసుకోవచ్చు. సంగక్కర రాయల్స్తో నాలుగేళ్ల పాటు కొనసాగాడు. మరోవైపు ద్రవిడ్కు సైతం రాయల్స్ పాత బంధం ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో అతను రాయల్స్ కెప్టెన్గా, కోచ్గా వ్యవహరించాడు. ఈ అనుబంధం కారణంగా రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..!?
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. హెడ్కోచ్గా భారత్కు టీ20 వరల్డ్కప్ అందించిన రాహుల్ ద్రవిడ్పై రాజస్తాన్ రాయల్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్కు ముందు అతడిని తమ జట్టు హెడ్కోచ్గా నియమించాలని రాయల్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే రాజస్తాన్ యాజమాన్యం ద్రవిడ్తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ కూడా రాజస్తాన్ ఆఫర్పై సముఖంగా ఉన్నట్లు వినికిడి. కాగా ఈ మిస్టర్ డిఫెండ్బుల్కు రాజస్తాన్తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజస్తాన్కు కెప్టెన్గా, మెంటార్గా ద్రవిడ్ పనిచేశాడు. 2012, 2013 సీజన్లలో రాజస్తాన్ సారథిగా ద్రవిడ్ వ్యవహరించాడు.అనంతరం 2014. 2015 సీజన్లలో రాజస్తాన్ మెంటార్గా తన సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి మరోసారి రాయల్స్తో జత కట్టేందుకు మిస్టర్ వాల్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. .కాగా ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సంగ్కర నుంచి కోచింగ్ బాధ్యతలు ద్రవిడ్ తీసుకునే అవకాశముంది. కాగా కోచ్గా కూడా ద్రవిడ్కు అపారమైన అనుభవం ఉంది. 2016, 2017 సీజన్లలో ఢిల్లీ డేర్డెవిల్స్( ఢిల్లీ క్యాపిటల్స్)కు హెడ్కోచ్గా ద్రవిడ్ పనిచేశాడు. ఆ తర్వాత 2019 వరకు భారత అండర్-19 జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్ కొనసాగాడు. ఆ తర్వాత 2021-2024 వరకు టీమిండియా హెడ్ కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తించాడు. -
ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్ రానేరాదు!
సూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నాడు రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం లేదని.. కాబట్టి మ్యాచ్లు చూసి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు.కాగా అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు. క్యాష్రిచ్ లీగ్ కెరీర్ ఆరంభంలో సరిగ్గా ఆడకపోయినా మేనేజ్మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.ఈ క్రమంలో ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అదే జోరును ఐపీఎల్-2024లోనూ కొనసాగించి.. విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు.తాజా ఐపీఎల్ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. ఏకంగా 573 పరుగులతో దుమ్ములేపాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రియాన్ పరాగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ను సెలక్టర్లు పరగణనలోకి తీసుకోలేదు. అనుభవం లేని రియాన్ పరాగ్ను కనీసం స్టాండ్బై ప్లేయర్గా కూడా ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ స్పందిస్తూ.. ఏదో ఒక రోజు సెలక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయక తప్పదని.. ఇది తాను అహంభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి వరల్డ్కప్ టోర్నీని చూడాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.టీమిండియాకు మద్దతుగా నిలిచే ‘భారత్ ఆర్మీ’తో రియాన్ మాట్లాడుతున్న క్రమంలో.. ఈసారి వరల్డ్కప్ సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంటే పక్షపాత ధోరణితో మాట్లాడినట్లే అవుతుంది.నిజానికి నేను ఈసారి అసలు వరల్డ్కప్ మ్యాచ్ చూడాలనే అనుకోవడం లేదు. ఫైనల్లో ఎవరు గెలిచారు? ట్రోఫీ ఎవరు అందుకున్నారని మాత్రమే చూస్తాను. ఒకవేళ నేను ప్రపంచకప్ టోర్నీలో గనుక ఆడుతూ ఉన్నట్లయితే.. కచ్చితంగా ఈ టాప్-4 వగైరాల గురించి పట్టించుకునేవాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘రియాన్ పరాగ్ మరో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ అవడం ఖాయం. ఇలాంటి ఆటిట్యూడ్ ఉంటే నీకు ఛాన్సులెలా వస్తాయి? ఓవరాక్షన్ స్టార్ అనే బిరుదు సార్థకం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నావా ఏంటి?’’ అని విమర్శిస్తున్నారు.కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించారనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
తాను త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నాడు రియాన్ పరాగ్. సెలక్టర్లు ఏదో ఒకరోజు తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పదని.. ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.అసోంకు చెందిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్. కుడిచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన ఈ యంగ్స్టర్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే, ఆరంభంలో నామమాత్రపు స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్ ఈ ఏడాది మాత్రం అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్లో సూపర్ ఫామ్ అందుకున్న అతడు .. ఐపీఎల్-2024లోనూ దానిని కొనసాగించాడు.రాజస్తాన్ తరఫున 14 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 573 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.సీజన్ ఆసాంతం మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకుని రాజస్తాన్ను ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు రియాన్ పరాగ్. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లోనూ పరుగుల వరద పారిస్తున్న ఈ అసోం ఆటగాడు త్వరలోనే టీమిండియాకు ఎంపిక కానున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏదో ఒకరోజు వాళ్లు నన్ను సెలక్ట్ చేయక తప్పదు కదా! నేను టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది.ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నేను లెక్కచేయను.నేను పరుగులు సాధించని సమయంలోనూ ఇదే తరహా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నాపై నాకున్న నమ్మకం అది.ఇదేమీ నేను అహంభావంతో చెబుతున్న మాట కాదు. పదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి మా నాన్న, నేను ఇదే అనుకున్నాం. ఏదేమైనా ఏదో ఒకరోజు కచ్చితంగా జాతీయ జట్టుకు ఆడటమే మా ధ్యేయం అని ఫిక్సైపోయాం’’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.వచ్చే ఆరునెలల కాలంలో కచ్చితంగా టీమిండియా తరఫున తాను అరంగేట్రం చేసే అవకాశం ఉందని రియాన్ నమ్మకంగా చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సందర్భంగా ఐపీఎల్-2024లో దుమ్ములేపిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా తదితరులు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. -
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2024 ఫైనల్ పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం(మే 26) చెపాక్ స్టేడియం వేదికగా ఈ టైటిల్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి క్వాలిఫయర్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో క్వాలిఫయర్లో రాజస్తాన్ రాయల్స్ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్.. ఫైనల్కు పోరు అర్హత సాధించింది.ఈ క్రమంలో కేకేఆర్ మూడో టైటిల్పై కన్నుయేగా.. ఎస్ఆర్హెచ్ రెండో సారి టైటిల్ను ముద్దాడాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో పలు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆఖరి 8 లీగ్ మ్యాచ్ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది.ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.ఫైనల్కు రిజర్వ్ డే..ఇక బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం(మే 26) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడనైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్గా ఉన్న కేకేఆర్ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది. -
SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
‘‘కీలకమైన మ్యాచ్. తొలి ఇన్నింగ్స్లో మా వాళ్లు బౌలింగ్ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వారి స్పిన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం.అక్కడే మ్యాచ్ మా చేజారింది. ఈ పిచ్పై తేమ ఉంటుందా? లేదా అన్నది ముందే ఊహించడం కష్టం. రెండో ఇన్నింగ్స్కు వచ్చే సరికి వికెట్ పూర్తి భిన్నంగా మారిపోయింది.బంతి కాస్త టర్న్ కావడం మొదలైంది. ఆ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో మా కుడిచేతి వాటం బ్యాటర్ల కోసం లెఫ్టార్మ్ స్పిన్నర్లను దింపి ఫలితం రాబట్టారు.అక్కడే వాళ్లు మాపై పైచేయి సాధించారు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్లకు ఎక్కువగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.ఐపీఎల్-2024 క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల మాత్రం తనతో పాటు ఫ్రాంఛైజీ కూడా సంతృప్తిగానే ఉందని సంజూ ఈ సందర్భంగా తెలిపాడు.బుమ్రా తర్వాత అతడేఈ మేరకు.. ‘‘మేము ఈ ఒక్క సీజన్లోనే కాదు.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాం. మా ఫ్రాంఛైజీ మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా భారత్లోని యంగ్ టాలెంట్ను మేము వెలికితీయగలుగుతున్నాం.రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అందుకు ఉదాహరణ. వీళ్లిద్దరు కేవలం రాజస్తాన్కే కాదు టీమిండియా తరఫున కూడా రాణిస్తే చూడాలని కోరుకుంటున్నా.ఇక సందీప్ శర్మ.. అతడి బౌలింగ్ తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వేలంలో తను మా జట్టులోకి రాకపోయినా వేరొకరి స్థానంలో మాతో చేరాడు. అద్భుత ఆట తీరుతో అందరినీ మెప్పించాడు.గత రెండేళ్లుగా అతడి ప్రదర్శన బాగుంది. బుమ్రా తర్వాత అతడే బెస్ట్!’’ అంటూ రాజస్తాన్ యువ ఆటగాళ్లపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై వేదికగా శుక్రవారం నాటి కీలక మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.విఫలమైన సంజూ శాంసన్ఈ క్రమంలో సన్రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రాజస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 42), ధ్రువ్ జురెల్(56 నాటౌట్) మాత్రమే రాణించారు.తిప్పేసిన స్పిన్నర్లుఅంతకు ముందు సన్రైజర్స్ ఇన్నింగ్స్లో రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్లో సన్రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.క్వాలిఫయర్-2: సన్రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్పై 36 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్కు దూసుకెళ్లిన సన్రైజర్స్చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు! Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ సంజూ శాంసన్ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.ఎలిమినేటర్ మ్యాచ్లో విశ్వరూపంఅలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్లో బుధవారం నాటి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.విలువైన ఇన్నింగ్స్ ఆడిన రియాన్ఈ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.మరో కీలక మ్యాచ్లో మాత్రం విఫలంసన్రైజర్స్ హైదరాబాద్లో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తడబడుతున్న వేళ నాలుగో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్లో 12వ ఓవర్ వేసిన రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అనవసరపు షాట్కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు.Shahbaz Ahmed has put Sunrisers Hyderabad on 🔝🧡#RR in deep trouble and in search of something special in Chennai! Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/8sGV8fzxcZ— IndianPremierLeague (@IPL) May 24, 2024 దీంతో రియాన్ పరాగ్ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్ కోచ్ సంగక్కర షాక్లో ఉండిపోగా.. కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్ లైవ్ కామెంట్రీలోనే రియాన్ పరాగ్పై ఫైర్ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్లలో కలిపి 573 పరుగులు సాధించాడు.చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసిపోయింది. క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన సంజూ శాంసన్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఈసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది.ఇదిలా ఉంటే.. ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ ఆటగాడు షిమ్రన్ హెట్మెయిర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి జరిమానా విధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?!..వాళ్లిద్దరు మినహా అంతా విఫలంచెన్నైలోని చెపాక్ వేదికగా సన్రైజర్స్తో తలపడ్డ రాజస్తాన్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(42), ఐదో నంబర్ బ్యాటర్(56- నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 ఆశలన్నీ వమ్ముచేసి.. వికెట్ పారేసుకునిసన్రైజర్స్ బౌలర్ల ట్రాప్లో చిక్కుకుని పెవిలియన్కు క్యూ కట్టారు. ఇక పవర్ఫుల్ హిట్టర్గా పేరొందిన షిమ్రన్ హెట్మెయిర్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.పద్నాలుగవ ఓవర్లో రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మ బౌలింగ్లో ఊహించని రీతిలో బౌల్డ్ అయి వికెట్ పారేసుకున్నాడు. జట్టు తనపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేశాడు. ఈ క్రమంలో.. అప్పటికే పరాజయం దిశగా జట్టు పయనించడం.. పార్ట్టైమ్ బౌలర్ చేతిలో తనకు భంగపాటు ఎదురుకావడంతో హెట్మెయిర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.పనిష్మెంట్ ఇచ్చిన బీసీసీఐక్రీజును వీడే సమయంలో బ్యాట్తో వికెట్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి జరిమానా విధించడం గమనార్హం. ‘‘షిమ్రన్ హెట్మెయిర్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ తేల్చారు. అతడు కూడా తన తప్పును అంగీకరించాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. హెట్మెయిర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్Kavya Maran: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్ డానియల్ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్పై విజయానంతరం ఎస్ఆర్హెచ్ సారథి కమిన్స్ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్ అహ్మద్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్ వెటోరీదే. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్ప్రైజ్ఇక అభిషేక్ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్(2/24) చేయడం నిజంగా ఓ సర్ప్రైజ్ లాంటిదే. మిడిల్ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్ మీద 170 పరుగుల టార్గెట్ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చాడు.ఇంపాక్ట్ చూపిన షాబాజ్కాగా రాజస్తాన్తో మ్యాచ్లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్.. యశస్వి జైస్వాల్(42), రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సంజూ శాంసన్(10), షిమ్రన్ హెట్మెయిర్(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్-2: సన్రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్పై 36 పరుగుల తేడాతో సన్రైజర్స్ విజయం.. ఫైనల్కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాబాజ్ అహ్మద్(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
RR Vs SRH Pics: ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్కు సన్రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
-
RR Vs SRH: రాజస్తాన్ చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన సన్రైజర్స్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో సన్రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. తిప్పేసిన షాబాజ్..అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(56) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా..యశస్వీ జైశ్వాల్(42) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే లక్ష్య చేధనలో రాజస్తాన్ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశాడు. 3 వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అభిషేక్ రెండు.. నటరాజన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్కతా నైట్రైడర్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. -
RR Vs SRH: చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్లు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును చాహల్ నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో క్వాలిఫయర్-2లో రెండు సిక్స్లు ఇచ్చిన చాహల్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటివరకు 224 సిక్స్లు ఇచ్చాడు. ఇంతుకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా(222) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చావ్లాను చాహల్ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్లో చాహల్ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. -
రాజస్తాన్పై ఘన విజయం.. ఫైనల్కు చేరిన ఎస్ఆర్హెచ్
Rajasthan Royals and Sunrisers Hyderabad Qualifier 2 Live Updatesరాజస్తాన్పై ఘన విజయం.. ఫైనల్కు చేరిన ఎస్ఆర్హెచ్ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో సన్రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(56) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా..యశస్వీ జైశ్వాల్(42) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే లక్ష్య చేధనలో రాజస్తాన్ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశాడు. 3 వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అభిషేక్ రెండు.. నటరాజన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్కతా నైట్రైడర్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది.కష్టాల్లో రాజస్తాన్.. విజయం దిశగా ఎస్ఆర్హెచ్రాజస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హెట్మైర్.. అభిషేక్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 102/6. క్రీజులో జురెల్(24), పావెల్(2) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 30 బంతుల్లో 74 పరుగులు కావాలి.శెభాష్ షాబాజ్.. రాజస్తాన్ విలవిల రాజస్తాన్ రాయల్స్ను షాబాజ్ అహ్మద్ దెబ్బ తీశాడు. అతడి స్పిన్ దాటికి రాజస్తాన్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్ వేసిన షాబాజ్ బౌలింగ్లో తొలి బంతికి పరాగ్ ఔట్ కాగా.. ఐదో బంతికి అశ్విన్ పెవిలియన్కు చేరాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 90/5మూడో వికెట్ డౌన్..సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శాంసన్.. అభిషేక్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్..65 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 66/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కాడ్మోర్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కాడ్మోర్(6), యశస్వీ జైశ్వాల్(13) పరుగులతో ఉన్నారు.రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు.19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 169/7హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన క్లాసెన్ సందీప్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 169/716 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 136/616 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(37), షాబాజ్ అహ్మద్(5) పరుగులతో ఉన్నారు.ఆరో వికెట్ డౌన్..ఎస్ఆర్హెచ్ మరోసారి వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 14 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో ఐదో బంతికి నితీష్ రెడ్డి(5) ఔట్ కాగా.. ఆరో బంతికి అబ్దుల్ సమద్ క్లీన్ బౌల్డయ్యాడు.నాలుగో వికెట్ డౌన్.. హెడ్ ఔట్99 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. సందీప్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ ఎంతంటే?9 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(12), ట్రావిస్ హెడ్(33) పరుగులతో ఉన్నారు.వారెవ్వా బౌల్ట్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుసన్రైజర్స్ హైదరాబాద్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 5వ ఓవర్ వేసిన బౌల్ట్ బౌలింగ్లో తొలుత రాహుల్ త్రిపాఠి(37), అనంతరం మార్క్రమ్(1) పెవిలియన్కు చేరాడు. 6 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 12 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), ట్రావిస్ హెడ్(3) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు ముగిసే సరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది.ఐపీఎల్-2024లో క్వాలిఫయర్-2కు రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. రాజస్తాన్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఎస్ఆర్హెచ్ జట్టులోకి మార్క్రమ్, జయదేవ్ ఉనద్కత్ వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తోంది.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/ కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
SRH vs RR: అతడి మీదే భారం.. సన్రైజర్స్ గెలవాలంటే..
ఐపీఎల్-2024 ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కించుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో తాడోపేడో తేల్చుకోనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తే తప్ప ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ముందంజ వేయలేదని అభిప్రాయపడ్డాడు.సన్రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లేఈ మేరకు.. ‘‘సన్రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లే. వీరిద్దరూ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఆపటం ఎవరితరం కాదు. క్రీజులో ఒక్కసారి పాతుకుపోతే తొలి 8- 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు.ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దంచికొడితే తిరుగే ఉండదు. అయితే, గత రెండు మ్యాచ్లలో వరుసగా అతడు డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ తిరిగి పుంజుకోగలడనే ఆశిద్దాం.ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకుఈ సీజన్లో ట్రావిస్ హెడ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. గత మ్యాచ్లో అవుట్ చేసినప్పటికీ ట్రెంట్ బౌల్ట్ అతడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన హెడ్ బాగా ఆడాడు.అర్ధ శతకం కూడా సాధించాడు. అయితే, ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకు మరింత గట్టిగానే ప్రయత్నం చేయడం ఖాయం. ట్రావిస్ హెడ్ గనుక ఈసారి పరుగులు రాబట్టకపోతే సన్రైజర్స్ ముందుకు సాగలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ట్రావిస్ హెడ్తో పాటు అభిషేక్ శర్మ కూడా రాణిస్తే మాత్రం రాజస్తాన్ బౌలర్లు వాళ్లను ఆపలేరని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో దుమ్ములేపుతున్న అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియాకు ఆడటం ఖాయమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా జోస్యం చెప్పాడు.వరుసగా రెండుసార్లు డకౌట్కాగా సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు మ్యాచ్లలో హెడ్ లెఫ్టార్మ్ సీమర్ల చేతికి చిక్కి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో క్వాలిఫయర్-2లో రాజస్తాన్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి అతడికి గండం పొంచి ఉంది. కాగా ఈ సీజన్లో హెడ్ ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్ ఆడి 199.62 స్ట్రైక్రేటుతో 533 పరుగులు సాధించాడు.చదవండి: T20: బంగ్లాదేశ్కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం -
IPL 2024: ‘ఫైనల్’ వేటలో...
ఓవరాల్గా ఆరుసార్లు 200కుపైగా స్కోర్లు... వీటిలో గత ఏడాది వరకు ఉన్న అత్యుత్తమ స్కోరును అధిగమిస్తూ మూడుసార్లు 250కు పైగా పరుగులు... పవర్ప్లేలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా రెండుసార్లు 100కు పైగా స్కోర్లు... ముగ్గురు ప్రధాన బ్యాటర్లు కలిపి ఏకంగా 106 సిక్సర్లు... ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన ఇది. ఈ జోరులో ప్లే ఆఫ్స్కు దూసుకొచి్చన జట్టు తొలి క్వాలిఫయర్లో కాస్త తడబడింది. అయితే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించగా, రాజస్తాన్ రాయల్స్ రూపంలో ఎదురుగా ప్రత్యర్థి ఉంది. నాణ్యమైన బౌలింగ్తో రాజస్తాన్ ఎలాంటి ప్రత్యర్థినైనా నిలువరించగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.చెన్నై: ఐపీఎల్–17 సీజన్ తుది పోరులో కోల్కతా నైట్రైడర్స్ ప్రత్యరి్థని నిర్ణయించే క్వాలిఫయర్–2 సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, రాజస్తాన్ జట్ల మధ్య చెపాక్ మైదానంలో ఈ పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్ల తలపడిన ఏకైక మ్యాచ్లో సన్రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. టోర్నీలో దూకుడైన బ్యాటింగ్తో హైదరాబాద్ శాసించగా... రాజస్తాన్ విజయాల్లో బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఇరు జట్లు తాజా సీజన్లో చెన్నై వేదికగా ఒక్కో మ్యాచ్ ఆడాయి. హైదరాబాద్ 134, రాజస్తాన్ 141 పరుగులు మాత్రమే చేసి చెన్నై చేతిలో ఓటమి పాలవడం విశేషం. మార్క్రమ్ను ఆడిస్తారా! కోల్కతాతో తొలి క్వాలిఫయర్లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. హెడ్ వరుసగా రెండోసారి డకౌట్ కాగా, అభిõÙక్ శర్మ కూడా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపింది. క్లాసెన్ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. ఓపెనర్లు లీగ్ మ్యాచ్ తరహాలో తమ జోరును అందిపుచ్చుకుంటే జట్టు మరోసారి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఇతర బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా సహకరించాల్సి ఉంది. అయితే బ్యాటింగ్ను పటిష్టం చేసేందుకు నాలుగో విదేశీ ఆటగాడిగా మార్క్రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్లలో ఒకరిని రైజర్స్ ఆడించవచ్చు. పెద్దగా ప్రభావం చూపలేని విజయకాంత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తీసుకొని ‘ఇంపాక్ట్’ ద్వారా మరో బ్యాటర్ను ఆడించే అవకాశం ఉంది. చెపాక్ పిచ్పై షహబాజ్తో పాటు మరో స్పిన్నర్ జట్టుకు అవసరం. పేస్ బౌలింగ్లో భువనేశ్వర్, కమిన్స్లతో పాటు సొంత మైదానంలో ఆడుతున్న నటరాజన్ కీలకం అవుతారు. మార్పుల్లేకుండా... రాజస్తాన్ మాత్రం బుధవారం ఆర్సీబీని ఓడించిన టీమ్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. స్పిన్కు అనుకూలిస్తే ఒక పేసర్ను తప్పించి కేశవ్ను ఆడించాలని భావించినా... జట్టు విదేశీ కూర్పుపై ప్రభావం పడవచ్చు. బౌల్ట్ కీలక బౌలర్ కాగా ఓపెనర్గా టామ్ కోలర్ ఖాయం. లోయర్ మిడిలార్డర్లో హెట్మైర్, పావెల్ల మెరుపు బ్యాటింగ్ను కోల్పోయి పరిస్థితి రాజస్తాన్ తెచ్చుకోదు. కాబట్టి ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్నర్లు అశి్వన్, చహల్ జట్టు భారం మోస్తారు. ముఖ్యంగా ఓనమాలు నేర్చుకున్న మైదానంలో అశి్వన్ చెలరేగితే హైదరాబాద్కు కష్టాలు తప్పవు. రాయల్స్ బ్యాటింగ్లో కాస్త దూకుడు లోపించింది. ఎలిమినేటర్లో కూడా అది కనిపించింది కానీ లక్ష్యం చిన్నది కావడంతో దాని ప్రభావం కనపడలేదు. ముఖ్యంగా సామ్సన్ వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ మాత్రమే నిలకడగా ఆడుతుండగా, జురేల్ కూడా రాణించడం లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, త్రిపాఠి, నితీశ్ రెడ్డి, క్లాసెన్, సమద్, షహబాజ్, భువనేశ్వర్, నటరాజన్, మార్కండే, మార్క్రమ్. రాజస్తాన్: సామ్సన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, టామ్ కోలర్, పరాగ్, జురేల్, హెట్మైర్, పావెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చహల్.పిచ్, వాతావరణం చెన్నైలో వేడి చాలా ఎక్కువగా ఉంది. అయితే సాయంత్రం మంచు ప్రభావం కూడా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్లో జరిగిన 7 మ్యాచ్లలో 5 సార్లు తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది. 19: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్రైజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్ల్లో హైదరాబాద్... 9 మ్యాచ్ల్లో రాజస్తాన్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా సన్రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. రాజస్తాన్పై సన్రైజర్స్ అత్యధిక స్కోరు 217, అత్యల్ప స్కోరు 127 కాగా... సన్రైజర్స్పై రాజస్తాన్ అత్యధిక స్కోరు 220, అత్యల్ప స్కోరు 102. -
Eliminator: ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్తాన్
-
SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్లోనూ రాజస్తాన్ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్ను విమర్శించారు.ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్-2లోఇక సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్ వార్ వన్సైడ్ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్లో బుధవారం నాటి మ్యాచ్లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్సన్రైజర్స్- రాజస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.చెన్నై పిచ్ పరిస్థితులు కూడా రాజస్తాన్ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.అది హైదరాబాద్ వికెట్ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్మన్షిప్ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫైర్అయితే, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్రైజర్స్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్ మాదిరే సన్రైజర్స్ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.హైదరాబాద్ జట్టులోనూ షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, విజయకాంత్ వియస్కాంత్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అనుభవం లేకపోయినా మొమెంటమ్ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్ జట్టులో చెన్నై దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్తో పాటు యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
RR Vs RCB Highlights Photos: ఆర్సీబీ కల చెదిరే.. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ విక్టరీ (ఫొటోలు)
-
రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్లో ముగిసింది. ‘కప్ నమ్దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్ నాకౌట్ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు! అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్లో రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు), విరాట్ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దూకుడు లేకుండా... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్వెల్ (0)లను వరుస బంతులకు అవుట్ చేసి అశ్విన్ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్ ఇన్నింగ్స్ ఆర్సీబీని ముందుకు నడిపించింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్ ఓవర్లో అతను 2 సిక్స్లు, ఫోర్ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్ ఇన్నింగ్స్లో దినేశ్ కార్తీక్ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్ ధాటిగా ఆడాడు. రాణించిన జైస్వాల్... ఛేదనను జైస్వాల్, టామ్ కోలర్ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్ దయాళ్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్ ఇన్నింగ్స్ను నడిపించారు.అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్ (8) రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్లో పరాగ్ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. పరాగ్, హెట్మైర్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్మన్ పావెల్ (8 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) (సబ్) ఫెరీరా (బి) చహల్ 33; డుప్లెసిస్ (సి) పావెల్ (బి) బౌల్ట్ 17; గ్రీన్ (సి) పావెల్ (బి) అశ్విన్ 27; పటిదార్ (సి) పరాగ్ (బి) అవేశ్ 34; మ్యాక్స్వెల్ (సి) జురేల్ (బి) అశ్విన్ 0; లోమ్రోర్ (సి) పావెల్ (బి) అశ్విన్ 32; కార్తీక్ (సి) జైస్వాల్ (బి) అవేశ్ 11; స్వప్నిల్ (నాటౌట్) 9; కరణ్ (సి) పావెల్ (బి) సందీప్ 5; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్: బౌల్ట్ 4–0–16–1, సందీప్ శర్మ 4–0–48–1, అవేశ్ ఖాన్ 4–0–44–3, అశ్విన్ 4–0–19–2, చహల్ 4–0–43–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కార్తీక్ (బి) గ్రీన్ 45; టామ్ కోలర్ (బి) ఫెర్గూసన్ 20; సామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కరణ్ 17; పరాగ్ (సి) సిరాజ్ 36; జురేల్ (రనౌట్) 8; హెట్మైర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 26; పావెల్ (నాటౌట్) 16; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్: స్వప్నిల్ 2–0–19–0, సిరాజ్ 4–0–33–2, దయాళ్ 3–0–37–0, ఫెర్గూసన్ 4–0–37–1, కరణ్ శర్మ 2–0–19–1, గ్రీన్ 4–0–28–1. -
అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఎలిమేనిటర్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్ రౌండ్ను దాటలేకపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు.అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బ్యాటింగ్లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్ తెలిపాడు."మేము తొలుత బ్యాటింగ్లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్ను డిఫెండ్ చేసుకోవచ్చు.ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్ను దాటలేకపోయామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. A comeback to winning ways when it mattered the most & how 👌👌Upwards & Onwards for Rajasthan Royals in #TATAIPL 2024 😄⏫Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/NsxjVGmjZ9— IndianPremierLeague (@IPL) May 22, 2024 -
ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్లో రాజస్తాన్ ఘన విజయం
ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్లో రాజస్తాన్ ఘన విజయంఐపీఎల్-2024లో ఫైనల్ చేరేందుకు అడుగుదూరంలో రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమేనిటర్లో 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2కు రాజస్తాన్ అర్హత సాధించగా.. ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్లో 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు.. ఫెర్గూసన్, కరణ్ శర్మ, గ్రీన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు. మాక్స్వెల్, దినేష్ కార్తీక్ వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు, ట్రెంట్ బౌల్ట్,సందీప్ శర్మ, చాహల్ తలా వికెట్ సాధించారు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 111/313 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(18), జురెల్(8) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్..సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన సంజూ.. కరణ్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జురెల్ వచ్చాడు. 11 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 98/3రెండో వికెట్ డౌన్..81 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. గ్రీన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి పరాగ్ వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(42), శాంసన్(11) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్..173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన కాడ్మోర్..ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(25), శాంసన్(1) పరుగులతో ఉన్నారు.రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?రాజస్తాన్తో ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదన్పించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు. మాక్స్వెల్, దినేష్ కార్తీక్ వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు, ట్రెంట్ బౌల్ట్,సందీప్ శర్మ, చాహల్ తలా వికెట్ సాధించారు.ఐదో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్122 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన రజిత్ పాటిదార్.. అవేష్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి దినేష్ కార్తీక్ వచ్చాడు.కష్టాల్లో ఆర్సీబీ.. మాక్స్వెల్ డకౌట్బెంగళూరు మరో వికెట్ కోల్పోయింది. 97 పరుగుల వద్ద వరుస బంతుల్లో కెమెరూన్ గ్రీన్(27), మాక్స్వెల్(0) డకౌటయ్యాడు. దీంతో ఆర్సీబీ 12.4 ఓవర్లలో 97/4 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అవుట్బెంగళూరుకు షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ (33) పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. యుజ్వేందర్ చాహల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లకు 58/2 పరుగులతో ఉంది.పవర్ ప్లేలో తగ్గిన దూకుడుపవర్ ప్లే ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజ్లో విరాట్ కోహ్లీ(30), కెమెరూన్ గ్రీన్ (1) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(18), గ్రీన్(0) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఆర్సీబీ..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిలకడగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(18), విరాట్ కోహ్లి(16) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2024లో ఎలిమినేటర్ పోరుకు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. రాజస్తాన్ ఓ మార్పు చేసింది. హెట్మైర్ తుది జట్టులోకి వచ్చాడు.రాజస్తాన్ అతడిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించనుంది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
Virat Kohli: కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్?!
ఐపీఎల్-2024 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఊహించని విజయాలతో ప్లే ఆఫ్స్నకు దూసుకువచ్చింది. లీగ్ దశలో వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడిన తర్వాత కూడా ఏమాత్రం డీలాపడకుండా.. పట్టుదలగా పోరాడి టాప్-4లో స్థానం సంపాదించింది.ఆరు మ్యాచ్లలో వరుసగా గెలుపొంది రాజస్తాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఉగ్ర ముప్పు పొంచి ఉందనే సందేహాల నడుమ విరాట్ కోహ్లి భద్రతా కారణాల దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్ బజార్ పత్రిక, హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. అహ్మదాబాద్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.అతడు జాతీయ నిధిఈ మేరకు.. ‘‘అహ్మదాబాద్ చేరుకోగానే ఈ విషయం గురించి విరాట్ కోహ్లికి తెలిసింది. అతడు జాతీయ నిధి. అతడి భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ఆర్సీబీ ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.వాళ్లకు ఈ విషయం చెప్పిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. రాజస్తాన్ రాయల్స్కు కూడా ఈ విషయం గురించి తెలిసింది. అయితే, వాళ్లు యథాతథంగా ప్రాక్టీస్ చేశారు’’ అని పోలీస్ అధికారి విజయ్ సంఘా పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.ఈ క్రమంలోనే గుజరాత్ కాలేజీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్తో పాటు ప్రీ- ప్రెస్మీట్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం... ఇందుకు ఉగ్ర ముప్పు కారణం కాదని తెలుస్తోంది.భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు.. కారణం అదే‘‘భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. అంతగా సమస్య ఉందనుకుంటే ఇండోర్లో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవచ్చని వాళ్లకు చెప్పాము. అయితే, వేడిమి తట్టుకోలేకమంటూ వాళ్లు సెషన్ రద్దు చేసుకున్నారు’’ అని అహ్మదాబాద్ స్టేడియం వద్ద పనిచేసే సిబ్బంది తెలిపినట్లు ఇండియా టుడే వెల్లడించింది. కారణాలు ఏమైనా మొత్తానికి కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ చేయలేదన్నది స్పష్టమైంది. ఒక రకంగా ఇది ఎదురుదెబ్బ లాంటిదే!చదవండి: RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం -
ఎలిమినేటర్ మ్యాచ్
-
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
-
Virat Kohli: రాజస్తాన్తో కీలక మ్యాచ్.. కోహ్లి ప్లాన్ ఇదే
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతాలు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత... అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి టాప్-4కు అర్హత సాధించి.. టైటిల్ రేసులో నిలవగలిగింది.రాజస్తాన్ రాయల్స్తో అమీ తుమీఈ క్రమంలో ఎలిమినేటర్ రూపంలో తొలి గండం దాటేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. రాజస్తాన్ రాయల్స్తో బుధవారం నాటి మ్యాచ్లో అమీ తుమీ తేల్చుకోనుంది.ఇక ఆర్సీబీ వరుస విజయాల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. కోహ్లి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 14 ఇన్నింగ్స్లో కలిపి 708 పరుగులు సాధించాడు.తద్వారా టాప్ స్కోరర్గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక రాజస్తాన్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.బౌలర్ల విషయంలో నా ప్లాన్ ఇదే‘‘అతిగా ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. గణాంకాలను నేను పెద్దగా పట్టించుకోను. ప్రత్యర్థి జట్టు బౌలర్ .. రిస్ట్ పొజిషన్ ఏంటి? బాల్ ఎక్కడ వేస్తాడు? అన్న విశ్లేషణలకు సంబంధించిన వీడియోలు చూడను.ఎందుకంటే.. మ్యాచ్ నాటికి ఆ బౌలర్ సరికొత్త, విభిన్న ప్రణాళికతో మన ముందుకు రావచ్చు కదా! అందుకే నేను పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకే మొగ్గు చూపుతా.బౌలర్ బంతిని సంధించే సమయంలో కేవలం నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా. బాల్కు రియాక్ట్ అయ్యే విషయంలో నా మెదడు ఏది చెబితే అదే చేస్తా. మనకు మనంగా నిర్ణయాలు తీసుకోగలిగితే సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొనే వీలుంటుందని నేను బలంగా నమ్ముతాను. బేసిక్స్ మర్చిపోనుకంప్యూటర్ అనాలసిస్తో పరిస్థితులను అంచనా వేయలేం. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే ఫలితాలనిస్తాయి. బేసిక్స్ను నేనెప్పుడూ మర్చిపోను. వాటి ఆధారంగానే మూడు ఫార్మాట్లలోనూ నేను ఒకే విధంగా ఆడటానికి ఒక రకంగా ఇదే కారణం అని చెప్పవచ్చు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం Incredible Icon @imVkohli talks about his mentality when he walks out to bat! 👀Will he unsettle #RajasthanRoyals' bowlers today and take #RoyalChallengersBengaluru a step closer to the #IPLfinal?📺 | #RRvRCB #Eliminator | TODAY, 6:30 PM | #IPLOnStar | #PlayOffsOnStar pic.twitter.com/Kkc1L0QqEo— Star Sports (@StarSportsIndia) May 22, 2024 -
RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో రైజర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్రైజర్స్తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్రైజర్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్లో గనుక గెలిస్తే ఫైనల్కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
RCB Vs RR: నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’
ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో... నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్లో రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’ మిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత జట్టు క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్లో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతుంది. తాజా సీజన్లో బెంగళూరు లీగ్ దశలోనే నిష్క్రమించే దశ నుంచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి అబ్బురపరిచింది. డు ప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు తమ చివరి 6 లీగ్ మ్యాచ్ల్లో నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మరోవైపు సంజూ సామ్సన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ చివరి నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోగా, ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
IPL 2024 Playoffs: ప్లే ఆఫ్స్కు వర్షం అంతరాయం కలిగిస్తే.. పరిస్థితి ఏంటి?
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ సమరానికి రంగం సిద్దమైంది. మంగళవారం(మే 21)తో ప్లే ఆఫ్స్కు తెరలేవనుంది. పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్-1లో టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. అనంతరం మే 22న క్వాలిఫియర్-2లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే గత 8 లీగ్ మ్యాచ్ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే ఏంటి పరిస్థితి అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.ప్లే ఆఫ్స్కు రిజర్వ్ డే..ఐపీఎల్-2024 సీజన్లో క్వాలిఫియర్-1, ఎలిమినేటర్, క్వాలిఫియర్-2 మ్యాచ్లతో పాటు ఫైనల్కు రిజర్వ్ డే కేటాయించారు. మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్ట్రా టైమ్ కూడా ఉంటుంది. ఫలితం తేలాలంటేఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫలితం తేలాలంటే 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఉదహరణకు క్వాలిఫియర్-1లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో ఉన్న కేకేఆర్ నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తోంది. -
KKR Vs RR: వర్షంతో కోల్కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు
గువాహటి: ఈ ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలోని చివరి మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు వాన అడ్డుగా నిలిచింది. రాత్రి పదిన్నరకు వర్షం తెరిపినిచ్చినట్లే కనిపించడంతో మైదానం పరిస్థితుల్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు అనిల్ చౌదరి, సాయిదర్శన్ ఎట్టకేలకు 7 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే టాస్ కూడా వేయగా... కోల్కతా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆటగాళ్లు బరిలోకి దిగడమే తరువాయి అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూడగా ... మళ్లీ వానొచ్చి మ్యాచ్ రాతను మార్చింది. కటాఫ్ సమయం రాత్రి 10.56 గంటలకు చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజస్తాన్, కోల్కతా చెరో పాయింట్తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో రద్దయిన నాలుగో మ్యాచ్ ఇది. దీంతో ఇప్పటికే అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్న నైట్రైడర్స్కు ఏ నష్టం లేదు. కానీ వారం క్రితం దాకా ‘టాప్’లో కొనసాగిన రాజస్తాన్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్, రాజస్తాన్ జట్లు 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన రన్రేట్ కారణంగా హైదరాబాద్కు రెండో స్థానం ఖరారైంది. ఆఖరి పోరులో నెగ్గి కనీసం రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్–1, ఓడితే క్వాలిఫయర్–2 ఆడాల్సిన రాజస్తాన్ చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఎలిమినేటర్లో పోరాడాల్సిన పరిస్థితి వచి్చంది. -
IPL 2024 Playoffs: ముగిసిన లీగ్ మ్యాచ్లు.. ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
ఐపీఎల్-2024లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గౌహతి వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ పడినప్పటకి మరోసారి వర్షం మొదలు కావడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఇక లీగ్ స్టేజీ ముగియడంతో ప్లే ఆఫ్స్కు చేరిన జట్లపై ఓ లూక్కేద్దం. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. పాయింట్ల టేబుల్లో కేకేఆర్(19) పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ 17(నెట్ రన్రేట్ +0.414), రాజస్తాన్ 17(నెట్ రన్రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్లతో వరసగా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి. ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్లకు తెరలేవనుంది. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అనంతరం మే 24 క్వాలిఫియర్-2లో ఎలిమినేటర్లో గెలిచిన జట్టు, క్వాలిఫియర్-1లో ఓడిన జట్టు తలపడనున్నాయి. మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
KKR Vs RR: రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
ఐపీఎల్-2024లో భాగంగా గౌహతి వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. గౌహతిలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. అయితే మధ్యలో వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 7 ఓవర్లకు కుదించారు. టాస్ కూడా పడింది. కానీ మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో సన్రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానాన్ని సుస్ధిరం చేసుకుంది. అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉన్నప్పటకి.. ఆ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే రాజస్తాన్ జట్టు ఎస్ఆర్హెచ్ను పాయింట్ల పట్టికలో అధిగమించలేకపోయింది.మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్కు కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ చేరాయి. మే 21న జరగనున్న తొలి క్వాలిఫియర్లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. -
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఐపీఎల్-2024లో గౌహతి వేదికగా చివరి లీగ్ మ్యాచ్లో తలపడేందుకు రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బర్సపరా క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. రాజస్తాన్ 16 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్పై తమ చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్తాన్- కేకేఆర్ మ్యాచ్ రద్దవ్వాలని సన్రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దు అయితే రాజస్తాన్, కేకేఆర్కు తలో పాయింట్ లభిస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ 17 పాయింట్లతో తమ రెండో స్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దు అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్తాన్ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్రేట్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ సెకెండ్ ప్లేస్కు ఎటువంటి ఢోకా లేదు. -
ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోయిన రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. పంజాబ్ కింగ్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఓటమితో వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనేలీగ్ దశలో రాజస్తాన్కు ఇంకొక్క మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్తో సంజూ సేన మే 19న తలపడనుంది. అయితే, కేకేఆర్తో పాటు రాజస్తాన్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరినా.. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే రాజస్తాన్ రెండో స్థానంలో నిలవగలుగుతుంది.అప్పుడు నేరుగా కేకేఆర్తో క్వాలిఫయర్-1 ఆడుకోవచ్చు. లేదంటే ఎలిమినేటర్ గండం దాటాల్సి ఉంటుంది. ఇక రాజస్తాన్ ఇలా చిక్కుల్లో పడటం సన్రైజర్స్ హైదరాబాద్ పాలిట వరంలా మారింది.సన్రైజర్స్ పాలిట వరం.. ఎందుకంటే?లీగ్ దశలో హైదరాబాద్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్(మే 16), పంజాబ్ కింగ్స్(మే 19)న ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ రెండింటికి రెండూ గెలిస్తే రైజర్స్ ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి.సొంతమైదానం ఉప్పల్లో ఈ మ్యాచ్లు జరుగనుండటం, ఇప్పటికే సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీకి ఉన్న విధ్వంసకర రికార్డు చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది.ఒక్కటి ఓడినా కూడాఅలా కాకుండా.. రాజస్తాన్ తమ ఆఖరి మ్యాచ్లో ఓడి.. సన్రైజర్స్ కూడా ఈ రెండింటిలో ఒకటి ఓడితే.. అప్పుడు కూడా హైదరాబాద్ జట్టు టాప్-2తో ముగించే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు(16) వచ్చినా రన్రేటు పరంగా సన్రైజర్స్ ముందుంటే రాజస్తాన్ను వెనక్కినెట్టడం ఖాయం. అప్పుడు పట్టికలో సన్రైజర్స్ రెండో స్థానానికి చేరితే క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది.అలా అయితే మొదటికే మోసం మరి!అలా కాకుండా ఆఖరి రెండు మ్యాచ్లూ ఓడిపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. కేకేఆర్- రాజస్తాన్, చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదీ సంగతి!ఐపీఎల్-2024 పాయింట్ల పట్టిక(మే 15 నాటికి)లో టాప్-5 ఇలా:1. కేకేఆర్- ఆడినవి 13.. గెలిచినవి 9.. పాయింట్లు 19.. నెట్ రన్రేటు 1.428(ప్లే ఆఫ్స్నకు అర్హత)2. రాజస్తాన్- ఆడినవి 13.. గెలిచినవి 8.. పాయింట్లు 16.. నెట్ రన్రేటు 0.273(ప్లే ఆఫ్స్నకు అర్హత)3. చెన్నై సూపర్ కింగ్స్- ఆడినవి 13.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్రేటు 0.5284. సన్రైజర్స్- ఆడినవి 12.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్రేటు.. 0.406.5. ఆర్సీబీ- ఆడినవి 13.. గెలిచినవి 6.. పాయింట్లు 12.. నెట్ రన్రేటు.. 0.387.విజేతకు దారిలా👉 క్వాలిఫయర్-1(మే 21): టాప్-2 జట్ల మధ్య.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి..👉ఎలిమినేటర్(మే 22): టాప్-3, 4 లో ఉన్న జట్ల మధ్య.. ఓడిన జట్టు ఇంటికి.. 👉గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడుతుంది.👉క్వాలిఫయర్-2(మే 24): గెలిచిన జట్టు ఫైనల్లో అడుగుపెడుతుంది.👉ఫైనల్(మే 26): క్వాలిఫయర్-1- క్వాలిఫయర్-2 మధ్య పోరు. గెలిచిన జట్టు చాంపియన్.చదవండి: Virat Kohli: కోహ్లి నోట రిటైర్మెంట్ మాట.. ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే! -
PBKS Vs RR: మళ్లీ ఓడిన రాజస్తాన్
గువాహటి: పంజాబ్ కింగ్స్ ఆల్రౌండ్ ‘షో’ ధాటికి రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ఐపీఎల్ టోర్నీలో వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. కెప్టెన్ స్యామ్ కరన్ (2 వికెట్లు; 41 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. స్యామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. జితేశ్ శర్మ (20 బంతుల్లో 22; 2 సిక్స్లు), అశుతోష్ శర్మ (11 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లతో స్యామ్ కరన్ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పరాగ్ నిలబడటంతో... ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన రాజస్తాన్ జట్టు బ్యాటింగ్లో తీవ్రంగా నిరాశపరిచింది. ఓపెనర్లు యశస్వి (3), కొహ్లెర్ (18), టాపార్డర్ బ్యాటర్ సామ్సన్ (18) వికెట్లు పారేసుకోవడంతో మెరుపులు కాదుకదా... పరుగుల్లో వేగమే కనిపించలేదు. పరాగ్, అశ్విన్ (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంత సేపు ఇన్నింగ్స్ మెరుగవుతుందనిపించింది. కానీ అశ్విన్ అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన ఐదుగురు బ్యాటర్లలో బౌల్ట్ (12) మినహా ఇంకెవరూ పది పరుగులైనా చేయలేదు. కెప్టెన్ ఇన్నింగ్స్ సులువైన లక్ష్యమే అయినా పంజాబ్ తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ (6)... అవేశ్ వేసిన ఐదో ఓవర్లో రోసో (13 బంతుల్లో 22; ఫోర్లు), శశాంక్ (0) అవుట్ కావడంతో 36 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. కాసేపటికే బెయిర్స్టో (14)ను చహల్ అవుట్ చేయడంతో రాజస్తాన్ సంబరాల్లో మునిగింది. 48/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్ను కెప్టెన్ స్యామ్ కరన్... జితేశ్ శర్మతో కలిసి ఆదుకున్నాడు. ఇద్దరు వికెట్ను కాపాడుకొని తర్వాత భారీషాట్లపై దృష్టి పెట్టారు. జట్టు స్కోరు 100 దాటాకా ఐదో వికెట్కు 63 పరుగులు జోడించాక జితేశ్ ఆటను చహల్ ముగించాడు. ఈ దశలో స్యామ్ కరన్ పంజాబ్ను లక్ష్యంవైపు తీసుకెళ్లాడు. అశుతోష్తో కలిసి మరో వికెట్ పడకుండా 19వ ఓవర్లోనే మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) స్యామ్ కరన్ 4; టామ్ కోహ్లెర్ (సి) జితేశ్ (బి) చహర్ 18; సామ్సన్ (సి) చహర్ (బి) ఎలిస్ 18; పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 48; అశ్విన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 28; జురెల్ (సి) హర్ప్రీత్ (బి) స్యామ్ కరన్ 0; పావెల్ (సి అండ్ బి) చహర్ 4; ఫెరీరా (సి) రోసో (బి) హర్షల్ 7; బౌల్ట్ (రనౌట్) 12; అవేశ్ ఖాన్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–42, 4–92, 5–97, 6–102, 7–125, 8–138, 9–144. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–24–2, అర్ష్ దీప్ 4–0–31–1, ఎలిస్ 4–0– 24–1, హర్షల్ 4–0–28–2, రాహుల్ చహర్ 4–0– 26–2, హర్ప్రీత్ 1–0–10–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (సి) చహల్ (బి) బౌల్ట్ 6; బెయిర్స్టో (సి) పరాగ్ (బి) చహల్ 14; రోసో (సి) యశస్వి (బి) అవేశ్ 22; శశాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 63; జితేశ్ (సి) పరాగ్ (బి) చహల్ 22; అశుతోష్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–6, 2–36, 3–36, 4–48, 5–111. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–1, సందీప్ 4–0–28–0, అవేశ్ ఖాన్ 3.5–0–28–2, అశ్విన్ 4–0–31–0, చహల్ 4–0–31–2. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X గుజరాత్ వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్– రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం చెపాక్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీని చూడడానికి ఢిల్లీ నుండి చెన్నైకి వచ్చిన గౌరవ్ (19) అనే యువకుడు.. చెన్నై సూపర్స్టార్ మహేంద్ర సింగ్ ధోనీని వ్యక్తిగతంగా చూసిన తరువాతనే ఢిల్లీకి వెళ్తానంటూ అభిమానాన్ని చాటుకున్నాడు.ధోనీకి వీరాభిమాని అయిన గౌరవ్ తలాను కలిసేందుకు సైకిల్పై 23 రోజుల పాటు ప్రయాణించి ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చాడు. దాదాపు 2100 కిలో మీటర్ల ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయక చెన్నై చేరుకున్నాడు. స్నేహితులు ఇచ్చిన టికెట్తో రాజస్తాన్ రాయల్స్, చెన్నై మధ్య మ్యాచ్ను చూశాడు. ఈ క్రమంలో ధోనిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఢిల్లీకి తిరిగి వెళుతానంటూ చేపాక్కం మైదానం 9వ గేట్ ప్రవేశ ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. తానూ క్రీడాకారుడిగా ఎదగాలనుకుంటున్నానని.. ధోని అంటే అభిమానం ఉన్నందు వల్లే ఈ సాహసం చేశానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. From Delhi to Den! Yellove has no boundaries 🫶A tale of sheer passion and unconditional love that transcends distance and time!🥹💛#WhistlePodu #Yellove pic.twitter.com/YtrG96yHXp— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2024ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో చెన్నై రాజస్తాన్పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్ సేనను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రుతురాజ్ గైక్వాడ్ బృందం ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియమంతా తిరుగుతూ ఉత్సాహపరిచిన విషయం తెలిసిందే. కాగా.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా చెన్నై జట్టు ఆర్సీబీతో తలపడనుంది. బెంగళూరు వేదికగా మే 18న ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్పై సంచలన వ్యాఖ్యలు -
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్కు ముందు రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. మరి కొన్ని రోజుల్లో టీ20 వరల్డ్కప్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో బట్లర్ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ పొట్టి వరల్డ్కప్ సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ స్వదేశంలో పాకిస్తాన్తో 4 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ మే 22న ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లు పాకిస్తాన్ సిరీస్ కంటే ముందే స్వదేశానికి రావాల్సి ఉంటుందని ఐపీఎల్ ప్రారంభంలోనే తమ ఆటగాళ్లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ ఇంగ్లండ్కు బయలు దేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది. తమ క్యాంప్ను బట్లర్ వీడి వెళ్తున్న వీడియోను రాజస్తాన్ ఎక్స్లో షేర్ చేసింది. బట్లర్తో పాటు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ జాక్స్, రీస్ టాప్లీ సైతం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యారు. విల్ జాక్స్, రీస్ టాప్లీ బట్లర్తో పాటు ఇంగ్లండ్కు వెళ్లిపోయారు. We’ll miss you, Jos bhai! 🥺💗 pic.twitter.com/gnnbFgA0o8— Rajasthan Royals (@rajasthanroyals) May 13, 2024 -
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా అవుటైన మూడో బ్యాటర్గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్-2024 నేపథ్యంలో చెపాక్ వేదికగా చెన్నై- రాజస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 141 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 18.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఐదు వికెట్ల తేడాతో రాజస్తాన్ను ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ఇదిలా ఉంటే.. సీఎస్కే ఇన్నింగ్స్లో ఆరోస్థానంలో బ్యాటింగ్కు దిగిన జడ్డూ పరుగుల తీసే క్రమంలో.. ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నట్లుగా తేలడంతో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిబంధన కింద అవుటయ్యాడు.అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జడేజా లేని రెండో పరుగుకు పరుగెత్తాడు. మరో ఎండ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్తో సమన్వయలోపం కారణంగా పరుగుకు ఆస్కారం లేకపోయినా క్రీజును వీడాడు. అయితే, వెంటనే ప్రమాదం పసిగట్టి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా.. రాజస్తాన్ వికెట్ కీపర్, కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్లకు మీదకు వేసిన త్రోకు అడ్డుగా పరుగెత్తగా బంతి జడేజాకు తగిలింది.మైక్ హస్సీ స్పందనఈ నేపథ్యంలో రాయల్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ జడ్డూను ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూల్ కింద అవుట్గా ప్రకటించాడు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు.‘‘నేను మరీ అంత దగ్గరగా గమనించలేకపోయాను. అయితే, అతడు స్ట్రెయిట్గా పరిగెత్తేక్రమంలో యాంగిల్ను మార్చుకోకుండానే ముందుకు సాగాడు.ఇరువైపులా వాదనలు ఉంటాయి. అయితే, అంపైర్దే తుదినిర్ణయం. నా అభిప్రాయం ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా ఇది సరైన నిర్ణయమే’’ అని మైక్ హస్సీ స్పష్టం చేశాడు.చదవండి: ఆర్సీబీ విజయం: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్ Jaldi wahan se hatna tha 🫨#TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV— JioCinema (@JioCinema) May 12, 2024 -
IPL 2024 CSK Vs RR: గెలిచి నిలిచిన చెన్నై
చెన్నై: రాజస్తాన్ రాయల్స్... చెన్నై సూపర్కింగ్స్! మొదటి జట్టు గెలిస్తే నేరుగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుంది. రెండో జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ వేటలో ముందడుగు వేస్తుంది. అలా కీలకమైన ఈ పోరులో సొంతగడ్డపై చెన్నై... పేస్ బౌలింగ్తో కట్టడి చేసి... అనంతరం బ్యాటింగ్లోనూ రాణించి రాయల్స్కు చెక్ పెట్టి... ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులే చేయగలిగింది. రియాన్ పరాగ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా... మరెవరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. చెన్నై పేస్ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిమర్జీత్ సింగ్ (3/26), తుషార్ దేశ్పాండే (2/30) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనలో చెన్నై 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్) కుదురుగా ఆడాడు. రాజస్తాన్ స్పిన్నర్ అశి్వన్కు 2 వికెట్లు దక్కాయి. జోరు తగ్గిన రాజస్తాన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో వరుస విజయాలతో హోరెత్తించింది. కానీ ఈ మ్యాచ్లో బోర్ కొట్టించింది. యశస్వి (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు), కెప్టెన్ సంజూ సామ్సన్ (19 బంతుల్లో 15) ఇలా టాపార్డర్ వన్డేను తలపించే ఆటే ఆడటంతో పరుగుల్లో వెనుకబడింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (18 బంతుల్లో 28; 1 ఫోర్లు, 2 సిక్స్)లు కొట్టిన ఆ కాస్తా సిక్సర్లతో ఓ మోస్తరు స్కోరే చేసింది. కనీసం 150 పరుగుల మార్క్ అయిన దాటలేకపోవడంతో చెన్నైకి వారి సొంతగడ్డపై సులువైన లక్ష్యం అయ్యింది. నడిపించిన నాయకుడు రచిన్ రవీంద్ర (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్లు)లో ఇన్నింగ్స్ ఆరంభించిన కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ అసాంతం ఒపిగ్గా ఆడాడు. వేగంగా ఆడే క్రమంలో మిచెల్ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు), శివమ్ దూబే (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... లక్ష్యం చిన్నదైనా... రుతురాజ్ మాత్రం గెలిచేదాకా జాగ్రత్త పడ్డాడు. రిజ్వీ (8 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో 10 బంతులు మిగిలుండగానే చెన్నై లక్ష్యాన్ని చేరింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) రుతురాజ్ (బి) సిమర్జీత్ 24; బట్లర్ (సి) తుషార్ (బి) సిమర్జీత్ 21; సామ్సన్ (సి) రుతురాజ్ (బి) సిమర్జీత్ 15; పరాగ్ (నాటౌట్) 47; జురెల్ (సి) శార్దుల్ (బి) తుషార్ 28; శుభమ్ (సి) దూబే (బి) తుషార్ 0; అశి్వన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–43, 2–49, 3–91, 4–131, 5–131. బౌలింగ్: తుషార్ 4–0–30–2, తీక్షణ 4–0–28–0, శార్దుల్ 4–0–32–0, సిమర్జీత్ 4–0–26–3, జడేజా 4–0–24–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి అండ్ బి) అశి్వన్ 27; రుతురాజ్ (నాటౌట్) 42; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 22; మొయిన్ అలీ (సి) అవేశ్ ఖాన్ (బి) బర్గర్ 10; దూబే (సి) పరాగ్ (బి) అశి్వన్ 18; జడేజా (అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్) 5; సమీర్ రిజ్వీ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.2 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–32, 2–67, 3–86, 4–107, 5–121. బౌలింగ్: బౌల్ట్ 2.2–0–24–0, సందీప్ శర్మ 3–0–30–0, అశ్విన్ 4–0–35–2, బర్గర్ 3–0–21–1, చహల్ 4–0–22–1, అవేశ్ ఖాన్ 2–0–12–0. -
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.చెపాక్ వేదికగా రాజస్తాన్తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్ను విజయతీరాలకు చేర్చాడు.సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. -
CSK Vs RR: రాజస్తాన్, సీఎస్కే రసవత్తర పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. సీఎస్కే జట్టులోకి థీక్షణ రాగా.. రాజస్తాన్ జట్టులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు.ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని రాజస్తాన్ భావిస్తుంటే.. సీఎస్కే సైతం ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్, మహేశ్ తీక్షణరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్ -
అలా అయితేనే ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్.. ఆ రెండు జట్లు కన్ఫామ్!?
చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాప్-4 రేసు నుంచి నిష్క్రమించగా.. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సీఎస్కేపై తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆశలను సజీవం చేసుకున్నాయి.మరోవైపు ఈ రెండు జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్పై కన్నేశాయి. ఇక ఇప్పటికే రన్రేటు పరంగా అన్ని జట్ల కంటే పటిష్ట స్థితిలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్(16 పాయింట్లు) రెండో స్థానం ఆక్రమించింది.మూడో స్థానం కోసం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్(12 పాయింట్లు)ను వెనక్కి నెట్టి.. సన్రైజర్స్ హైదరాబాద్(14 పాయింట్లు) ముందుకు దూసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్నకు సంబంధించిన కొన్ని సమీకరణలు ఇలా ఉన్నాయి.కేకేఆర్.. టాప్ఇప్పటికే టాప్-1లో ఉన్న కేకేఆర్ శనివారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది. సొంతమైదానంలో జరిగే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సేన ముంబైని ఓడించిందంటే మరో రెండు పాయింట్లు ఖాతాలో పడతాయి.ఫలితంగా 18 పాయింట్లతో కేకేఆర్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలా కాక ముంబైతో కాకుండా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్తో మిగిలిన మ్యాచ్లలో ఏ ఒక్కటి గెలిచినా బెర్తు ఖాయమే!అయితే, ఇక్కడో మెలిక ఉంది. రాజస్తాన్, సీఎస్కే, సన్రైజర్స్ లేదా లక్నో ఈ జట్లలో మూడు 18 పాయింట్లు సాధిస్తేనే కేకేఆర్ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ముంబైతో మ్యాచ్లో ఓడినా రాజస్తాన్పై మాత్రం కచ్చితంగా గెలవాలి.రాజస్తాన్.. రైట్ రైట్చెన్నై, పంజాబ్, కేకేఆర్ రూపంలో రాజస్తాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా, కేకేఆర్, సీఎస్కే, లక్నో/సన్రైజర్స్లలో ఏ జట్టు 18 పాయింట్లు సాధించినా రాజస్తాన్ బెర్త్ ఖరారవుతుంది.టాప్-2లో నిలవాలంటే కేకేఆర్ను మాత్రం ఓడించడం తప్పనిసరి.సన్రైజర్స్ రైజ్ అవ్వాలంటే!సన్రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ల రూపంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్లలో సన్రైజర్స్ గెలిస్తే సన్రైజర్స్ టాప్-4కు అర్హత సాధిస్తుంది. ఏ ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పని దుస్థితి ఎదురవుతుంది.చెన్నై చమక్ అనాలంటే!డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత పడుతూ లేస్తూ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఓటమి తర్వాత సీఎస్కే కాస్త డీలా పడింది. ప్రస్తుతం సీఎస్కేకు రాజస్తాన్, ఆర్సీబీలతో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.ఈ రెండింటిలోనూ గెలిస్తేనే సీఎస్కే ప్రయాణా సాఫీగా సాగుతుంది. లేదంటే.. లేదంటే ఢిల్లీ, లక్నోతో సీఎస్కే పోటీపడాల్సి ఉంటుంది. అయితే, రన్రేటు పరంగా సీఎస్కే ప్రస్తుతం ఆ రెండు జట్ల కంటే మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.ఢిల్లీ దబాంగ్ అనిపించుకోవాలంటే..ఆరంభంలో అపజయాలు ఎదురైనా తిరిగి పుంజుకుని ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్తో మిగిలిన మ్యాచ్లలో గెలవడం సహా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో మ్యాచ్లలో తప్పక గెలవాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో చెన్నై, ఢిల్లీతో సమానంగా ఉన్నా రన్రేటు పరంగా వెనుకబడి ఉంది రాహుల్ సేన.కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్లలో గెలవడంతో పాటు ప్రస్తుతం టాప్-4లో ఉన్న కేకేఆర్, రాజస్తాన్, సన్రైజర్స్, చెన్నై వీలైనన్ని మ్యాచ్లు ఓడిపోతేనే లక్నో ఆశలు సజీవంగా ఉంటాయి.ఆర్సీబీ, గుజరాత్ పరిస్థితి ఇదీ!ఆర్సీబీకి ఢిల్లీ, సీఎస్కేలతో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ రెండూ కచ్చితంగా గెలిచి.. నెట్ రన్రేటు పరంగా మిగతా జట్ల కంటే మెరుగపడటం సహా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే!గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. కేకేఆర్, సన్రైజర్స్తో మ్యాచ్లలో ఏ ఒక్కటి ఓడినా ప్రయాణం ముగిసినట్లే. రెండూ గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేటు తదితర అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
IPL 2024- WI: అలా అయితే.. సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది.మే 23, 25, 26 తేదీల్లో ప్రొటిస్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నట్లు వెల్లడించింది. జమైకాలోని సబీనా పార్కు వేదికగా ఈ మూడు మ్యాచ్లు జరుగనున్నట్లు వెల్లడించింది. కాగా విండీస్- సౌతాఫ్రికా సిరీస్ సమయంలోనే ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ నాకౌట్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి.సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో భాగమైన ఆటగాళ్లను గనుక విండీస్- ప్రొటిస్ బోర్డులు వెనక్కి పిలిపిస్తే ఆయా ఫ్రాంఛైజీలకు తలనొప్పి తప్పదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లోనే ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్న ఈ రెండు జట్లు గనుక కీలక సమయంలో ఆటగాళ్లను కోల్పోతే కష్టాలు తప్పవు. కాగా మే 21న ఐపీఎల్-2024 తొలి క్వాలిఫయర్, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న రెండో క్వాలిఫయర్, మే 26న ఫైనల్ జరుగనున్నాయి.మెగా ఈవెంట్కు ముందుకాగా గత టీ20 ప్రపంచకప్నకు అర్హత సాధించలేక చతికిలపడ్డ వెస్టిండీస్.. ఆ తర్వాత స్వదేశంలో టీమిండియా, ఇంగ్లండ్లపై సిరీస్లు గెలిచి ఫామ్లోకి వచ్చింది. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.ఇక జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు ముందు సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్తో విండీస్కు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ నుంచి తమ ఆటగాళ్లను వెనక్కి పిలిపించేందుకు సమాయత్తమైన విషయం తెలిసిందే.ఐపీఎల్-2024లో భాగమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు వీరేవిండీస్ ప్లేయర్లురోవ్మన్ పావెల్ (రాజస్తాన్ రాయల్స్), షిమ్రాన్ హెట్మెయిర్ (రాజస్తాన్ రాయల్స్), అల్జారీ జోసెఫ్ (ఆర్సీబీ), షాయ్ హోప్ (ఢిల్లీ క్యాపిటల్స్), షమర్ జోసెఫ్ (లక్నో సూపర్ జెయింట్స్), నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్), ఆండ్రీ రస్సెల్ (కోల్కతా నైట్ రైడర్స్), రొమారియో షెఫర్డ్ (ముంబై ఇండియన్స్).సౌతాఫ్రికా ఆటగాళ్లుఐడెన్ మార్క్రమ్ (సన్రైజర్స్ హైదరాబాద్), హెన్రిచ్ క్లాసెన్ (సన్రైజర్స్ హైదరాబాద్), మార్కో జాన్సన్ (సన్రైజర్స్ హైదరాబాద్), గెరాల్డ్ కోట్జీ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్), కేశవ్ మహరాజ్ (రాజస్తాన్ రాయల్స్), డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్స్), అన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా), కగిసో రబడ (పంజాబ్ కింగ్స్), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్).చదవండి: గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్కు ఏకంగా! -
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సామ్సన్పై జరిమానా
ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ సామ్సన్పై మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సామ్సన్ తాను అవుటయ్యాక అంపైర్తో వాగ్వాదం చేశాడు. సామ్సన్ కొట్టిన షాట్ను బౌండరీ లైన్ వద్ద ఢిల్లీ ఫీల్డర్ షై హోప్ క్యాచ్ తీసుకున్నాడు. క్యాచ్ పట్టిన క్రమంలో షై హోప్ పాదం బౌండరీ లైన్ను తాకినట్లు భావించిన సామ్సన్ కొద్దిసేపు మైదానంలో ఉండి అంపైర్తో వాదించి వెళ్లిపోయాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్నటి (మే 7) మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అనుమానాస్పద క్యాచ్ ఔట్ నిర్ణయం పెండింగ్లో ఉన్నప్పుడు పార్థ్ అతిగా ప్రవర్తించాడు. థర్డ్ అంపైర్ రీప్లే చూస్తున్నప్పుడు గ్యాలరీలో నుంచి ఔట్ ఔట్ అంటూ అరుస్తూ కేకలు పెట్టాడు. ఫ్రాంచైజీకి సహ యాజమాని అయిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను నెటిజన్లు అస్సలు తీసుకోలేకపోయారు. ఈ విషయంపై పార్థ్ ట్రోలింగ్ను ఎదుర్కొంటుండగానే ఇతని మరో వీడియో ఒకటి బాగా వైరలైంది. No #DC fan scroll without liking this।No of likes=No of slap to this mf Parth Jindal#DCvsRR pic.twitter.com/irD7dFSZoz— विक्की पाल ✍️ (@vicky_pal0515) May 7, 2024ఆ వీడియోలో పార్థ్ తన స్థాయిని మరిచి అతిగా విజయోత్సవ సంబురాలు చేసుకుంటూ కనిపించాడు. రాయల్స్పై విజయం అనంతరం పార్థ్ సంతోషం పట్టలేక ఇలా ఓవరాక్షన్ చేశాడని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలిసింది. ఈ వీడియోలో ఉన్నది పార్థే అయినప్పటికీ.. అతను చేసుకున్న సంబురాలు మాత్రం ఇప్పటివి కాదని తేలింది. 2023 మహిళల ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ సమరంలో గెలుపు అనంతరం పార్థ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నాటి సంబురాలకు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి వైరలవుతుంది. Reaction of Delhi Capitals co- owner Parth Jindal when DC defeated Rajasthan royals last night 🔥He is living the moment 💥#DCvRR #SRHvLSG #delhicapital pic.twitter.com/4NXL8ftFNB— AVANISH (@avanish_du187) May 8, 2024ఈ వీడియోను చూసి పార్థ్ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. వేల కోట్లకు అధిపతి, ఓ ఫ్రాంచైజీకి సహ యజమాని అయిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ చురకలంటిస్తున్నారు. పార్థ్కు పారిశ్రామికవేత్తగా రాని పబ్లిసిటీ ఈ ఒక్క ఘటనతో వచ్చింది. Our Chairman and Co-owner, Parth Jindal, caught up with Rajasthan Royals' captain Sanju Samson & owner Manoj Badale, at the Arun Jaitley Stadium last night, after what was an exceptional contest of cricket. Parth also extended his congratulations to the RR skipper on being… pic.twitter.com/k47zwB7nzR— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2024మ్యాచ్ అనంతరం పార్థ్.. సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ యజమానితో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీకి సహ యజమాని అయిన పార్థ్.. జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. జిందాల్ కుటుంబం భారత దేశంలో అత్యంత ప్రముఖమైన వ్యాపార కుటుంబం.సంజూ వివాదాస్పద క్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సంజూ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ రోప్కు అతి సమీపాన షాయ్ హోప్ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్పై ఫీల్డ్ అంపైర్కు క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. రీ ప్లేలో హోప్ చేతిలో బంతి ఉన్నప్పుడు అతను బౌండరీ రోప్ను తాకినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఢిల్లీకి అనుకూలంగా ఇచ్చి శాంసన్ను ఔట్గా ప్రకటించాడు. దీనిపై శాంసన్ ఫీల్డ్ అంపైర్తో గొడవపడి అనంతరం మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్లో సంజూ ఔటైన కావడంతో రాయల్స్ గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. -
రాయల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
-
రెండుసార్లు బౌండరీని తాకినా ఎందుకిలా? ఇది అన్యాయం..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తప్పుబట్టాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా సాంకేతికత పేరిట సంజూకు అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. అతడు గనుక క్రీజులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. ఇక సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.బాధ్యత తీసుకున్న సంజూ శాంసన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(4), జోస్ బట్లర్(19) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.46 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 86 పరుగుల వద్ద ఉన్న సమయంలో అనూహ్య రీతిలో అవుటయ్యాడు. పదహారో ఓవర్లో ముకేశ్ కుమార్ బౌలింగ్లో షాయీ హోప్నకు క్యాచ్ ఇచ్చాడు.అయితే, క్యాచ్ అందుకునే సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ను తాకినట్లుగా అనిపించినా ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు.. సంజూకు మద్దతుగా నిలిచాడు.సైడ్ యాంగిల్లో చూసినపుడు ‘‘అంపైర్లు తీసుకున్న ఆ నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. సంజూ శాంసన్ అవుట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక.. కానీ సైడ్ యాంగిల్లో చూసినపుడు ఫీల్డర్ బౌండరీ లైన్ను రెండుసార్లు తాకినట్లు స్పష్టంగా కనిపించింది.సాంకేతికత వాడినా, వాడకపోయినా కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈసారి టెక్నాలజీ వల్ల కచ్చితంగా తప్పిదం జరిగిందనే చెప్తాను. రెండుసార్లు అతడు బౌండరీ లైన్ తాకినా అవుట్ ఇవ్వడం సరికాదు.అన్యాయం.. సంజూ బలైపోయాడునేను తటస్థంగా ఉండే వ్యక్తిని. సంజూ నాటౌట్ అని కచ్చితంగా చెప్పగలను. అలా అని అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని నేను అనుకోవడం లేదు.ఇక్కడ ఎవరి తప్పు లేకపోయినా సంజూ బలైపోయాడు. ఆటలో ఇవన్నీ సహజమే అయినా.. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్లో రాజస్తాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.చదవండి: Playoff Race: సన్రైజర్స్ గుండెల్లో వర్షం గుబులు.. మ్యాచ్ రద్దైతే గనుక! Game of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్కు వచ్చాడు. అతడి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్ను చేరుకున్న తొలి భారత క్రికెటర్గా శాంసన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 6 సిక్స్లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసకున్నాడు. శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును సాధించాడు. ఇప్పటివవరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఎంఎస్ ధోని 165 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో ధోని రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024ఓవరాల్గా పదో ప్లేయర్ఇక ఐపీఎల్లో ఓవరాల్గా 200 సిక్స్లు మైలు రాయిని అందుకున్న 10వ ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సురేష్ రైనా ఉన్నారు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఢిల్లీ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65) దంచికొట్టారు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024 వీరికి తోడు ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 201 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలం కాగా సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. The home side emerge victorious in tonight's run-fest here in Delhi 💥And with that win, Delhi Capitals move to number 5⃣ on the Points Table 🔥🔥Scorecard ▶️ https://t.co/nQ6EWQGoYN#TATAIPL | #DCvRR pic.twitter.com/vQvWMSk5lt— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
DC Vs RR: ఢిల్లీ రేసులోకొచ్చింది!
న్యూఢిల్లీ: జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్పై కీలకమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో పడింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ పోరులో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (20 బంతుల్లో 50; 7 ఫోర్లు; 3 సిక్స్లు), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓడింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (46 బంతుల్లో 86; 8 ఫోర్లు, 6 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఖలీల్, ముకేశ్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ తలా 2 వికెట్లు తీశారు. 4,4,4,6,4,6... ఓపెనర్లు ఫ్రేజర్, పోరెల్ ఒకరి తర్వాత ఒకరు రాయల్స్ బౌలర్లను చితగ్గొట్టారు. ముందుగా ఫ్రేజర్... బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక సిక్స్, 2 బౌండరీలతో 15 పరుగులు రాబట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 4, 4, 4, 6, 4, 6లతో 28 పరుగులు పిండుకోవడంతో ఫ్రేజర్ ఫిఫ్టీ 19 బంతుల్లోనే పూర్తయ్యింది. అతని దూకుడును అశ్విన్ తన తొలి ఓవర్లోనే అడ్డుకున్నాడు. అనంతరం అక్షర్ పటేల్ అండతో పోరెల్ బాదడం మొదలుపెట్టాడు. 9వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మరుసటి ఓవర్లోనే అక్షర్ (15)ను అశ్విన్ బోల్తా కొట్టించగా, పోరెల్ సిక్సర్తో 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వరుస ఓవర్లలో పోరెల్ను అశ్విన్... రిషభ్ పంత్ (15)ను చహల్ పెవిలియన్ పంపారు. మిడిలార్డర్లో స్టబ్స్ (20 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. కెప్టెన్ పోరాడినా... క్లిష్టమైన లక్ష్యం ముందరుంటే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), బట్లర్ (19) గట్టి పునాది వేయలేకపోయారు. ఈ దశలో కెపె్టన్ సామ్సన్, రియాన్ పరాగ్ (22 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) అండతో రాయల్స్ను నడిపించాడు. 11వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు దాటాక అదే ఓవర్ ఆఖరి బంతికి పరాగ్ను రసిఖ్ బౌల్డ్ చేశాడు. అయితే శుభమ్ దూబే వచ్చాక సామ్సన్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సామ్సన్ను ముకేశ్ అవుట్ చేయడం రాజస్తాన్ను కుదిపేసింది. శుభమ్తో నాలుగో వికెట్కు 59 పరుగులు జోడించాక భారీ షాట్కు ప్రయత్నించి సామ్సన్ నిష్క్రమించగా... తర్వాత ఓవర్కు ఒకటి, రెండు చొప్పున వికెట్లను కోల్పోయిన రాయల్స్ ఓటమి పాలైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: ఫ్రేజర్ (సి) ఫెరీరా (బి) అశ్విన్ 50; పోరెల్ (సి) సందీప్ (బి) అశ్విన్ 65; షై హోప్ (రనౌట్) 1; అక్షర్ (సి) పరాగ్ (బి) అశ్విన్ 15; పంత్ (సి) బౌల్ట్ (బి) చహల్ 15; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 41; గుల్బదిన్ (సి) అశ్విన్ (బి) బౌల్ట్ 19; రసిఖ్ (రనౌట్) 9; కుల్దీప్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–60, 2–68, 3–110, 4–144, 5–150, 6–195, 7–215, 8–221. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–1, సందీప్ శర్మ 4–0–42–1, అవేశ్ 2–0–42–0, అశి్వన్ 4–0–24–3, పరాగ్ 2–0–17–0, చహల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అక్షర్ (బి) ఖలీల్ 4; బట్లర్ (బి) అక్షర్ 19; సామ్సన్ (సి) హోప్ (బి) ముకేశ్ 86; పరాగ్ (బి) రసిఖ్ 27; శుభమ్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 25; పావెల్ (బి) ముకేశ్ 13; ఫెరీరా (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; అశి్వన్ (సి) హోప్ (బి) కుల్దీప్ 2; బౌల్ట్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–4, 2–67, 3–103, 4–162, 5–180, 6–181, 7–185, 8–194. బౌలింగ్: ఖలీల్ 4–0–47–2, ఇషాంత్ 3–0–34–0, ముకేశ్ 3–0–30–2, అక్షర్ 3–0–25 –1, కుల్దీప్ 4–0–25–2, రసిఖ్ 3–0–36–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నో వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPl 2024 DC Vs RR: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ 86 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిగితా బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్లు రాకపోవడంతో రాజస్తాన్ ఓడిపోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, లీగ్లు)లో 350 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత బౌలర్గా చాహల్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రిషబ్ పంత్ను ఔట్ చేసిన చాహల్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. చాహల్ ఇప్పటివరకు 350 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తర్వాత స్ధానంలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు.ఇక ఐపీఎల్లో సైతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా చాహల్(201) కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
DC Vs RR: ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మెక్గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ బౌలర్లను జేక్ ఫ్రేజర్ చుక్కలు చూపించాడు.ముఖ్యంగా రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్ను అయితే మెక్గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో మెక్గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే మెక్గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు.ఓవరాల్గా 20 బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ 7 ఫోర్లు, 3 సిక్స్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన మెక్గుర్క్.. 44.14 సగటుతో 309 పరుగులు చేశాడు. Most IPL fifties reached in less than 20 balls3 - Jake Fraser-McGurk2 - KL Rahul2 - Yashasvi Jaiswal2 - Kieron Pollard2 - Sunil Narine2 - Nicholas Pooran- This comes only in his 7th match!#DCvRRpic.twitter.com/lSzFmynl66— Kausthub Gudipati (@kaustats) May 7, 2024 -
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. రాజస్తాన్ రాయల్స్ తరపున దక్షిణాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెరీరా, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున నైబ్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నారు. అదే విధంగా ఈమ్యాచ్కు రాజస్తాన్ స్టార్ క్రికెటర్లు ధ్రువ్ జురెల్, హెట్మైర్ దూరమయ్యారు. హెట్మైర్ స్ధానంలో ఫెరీరా, జురెల్ ప్లేస్లో శుబమ్ దూబే వచ్చాడు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ రీ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
ఐపీఎల్లో ఇవాళ (మే 7) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకున్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాయల్స్కు అంత ముఖ్యం కాకపోయినా, ఢిల్లీకి మాత్రం అత్యంత కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.ఢిల్లీ ఈ మ్యాచ్తో పాటు తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే చెన్నై, సన్రైజర్స్, లక్నో తలో 12 పాయింట్లతో సమంగా ఉంటూ ప్లే ఆఫ్స్ రేసును రసరంజకంగా మార్చాయి. ఇక ఢిల్లీ కూడా ఈ జట్లతో చేరితే రెండు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ తీవ్రతరమవుతుంది. మొదటి రెండు ప్లే ఆఫ్స్ బెర్తులను కేకేఆర్, రాజస్థాన్ దాదాపుగా ఖరారు చేసుకున్నాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఇలా ఉంది..కేకేఆర్ (11 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు, 1.453 రన్రేట్),రాజస్థాన్ (10 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్రేట్), సీఎస్కే (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్రేట్), సన్రైజర్స్ (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.065 రన్రేట్), లక్నో (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్రేట్), ఢిల్లీ (11 మ్యాచ్ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్రేట్), ఆర్సీబీ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్రేట్), పంజాబ్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్రేట్), ముంబై (12 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.212 రన్రేట్),గుజరాత్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్రేట్)హెడ్ టు హెడ్ రికార్డ్స్: రాజస్థాన్, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్ల్లో తలపడగా.. రాజస్థాన్ 15, ఢిల్లీ 13 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్ల మధ్య ఇదే సీజన్లో జరిగిన చివరి మ్యాచ్లో రాయల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (84 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో తడబడిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (173/5) నిలిచిపోయి ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.తుది జట్లు (అంచనా)..ఢిల్లీ: డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ యాదవ్ [ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలామ్]రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ [ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చహల్] -
Saina Nehwal: రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
-
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్లో లేను. ఒకవేళ ఫామ్లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్మన్ పావెల్ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్గా అయినా పరాగ్కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్రౌండర్కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ -
SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరు అసలైన టీ20 మజాను అందించింది.ఈ హోరాహోరీ పోరులో రాయల్స్పై సన్రైజర్స్ పైచేయి సాధించి సొంతగడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.ఇక గత రెండు మ్యాచ్లలో పరాజయాలు చవిచూసి ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదేటేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్పై సన్రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై కమిన్స్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరి బంతిని సంధించేపుడు భువీ తన ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు.మిడిల్ ఓవర్లలో వీలైనన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ ఆఖరి వరకు పోరాడగలిగాం. ఇక నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. యార్కర్లు సంధించడంలో అతడు దిట్ట.ఉప్పల్లో మేము ఇప్పటికే చాలా మ్యాచ్లు ఆడాం. కాబట్టి 200 లక్ష్యమనేది ఛేదించగలిగే టార్గెట్ అని తెలుసు. అయితే, విజయం మమ్మల్ని వరించింది.అతడొక అద్భుతం అంతేఈరోజు నితీశ్ రెడ్డి పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ఆడాడు. అతడొక అద్భుతం అంతే! ఫీల్డింగ్లోనూ రాణిస్తున్నాడు. బౌలర్గానూ తన వంతు సేవలు అందిస్తున్నాడు’’ అంటూ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్ల ఆట తీరును ప్యాట్ కమిన్స్ కొనియాడాడు.కాగా ఉప్పల్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 58) శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి దుమ్ములేపాడు.42 బంతులు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్ల పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ కేవలం 3 వికెట్ల నష్టపోయి 201 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ను భువీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జోస్ బట్లర్(0), వన్డౌన్లో వచ్చిన సంజూ శాంసన్(3)ను డకౌట్ చేశాడు.ఇక 40 బంతుల్లో 67 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న యశస్వి జైస్వాల్ వికెట్ను నటరాజన్ తన ఖాతాలో వేసుకోగా.. టాప్ స్కోరర్ రియాన్ పరాగ్(77)ను కమిన్స్ పెవిలియన్కు పంపాడు.నరాలు తెగే ఉత్కంఠఈ క్రమంలో చివరి 3 ఓవర్లలో రాయల్స్ విజయ సమీకరణం 27 పరుగులుగా మారగా.. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్స్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.అయితే, రైజర్స్ పేసర్లు అంతా తలకిందులు చేశారు. 18వ ఓవర్లో నటరాజన్, 19వ ఓవర్లో కమిన్స్ తలా కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. చివరి ఓవర్లో సమీకరణం 13 పరుగులు మారింది.అప్పుడు బంతిని అందుకున్న భువీ బౌలింగ్లో తొలి ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ రోవ్మన్ పావెల్ను భువీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 -
నితీశ్ రెడ్డి మెరుపులు..సన్రైజర్స్ అనూహ్య గెలుపు (ఫొటోలు)
-
SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
సన్రైజర్స్పై 202 పరుగుల లక్ష్యఛేదనలో చివరి 3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్కు 27 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది సులువుగా అందుకోగలిగేదే. కానీ ఇక్కడే హైదరాబాద్ బౌలింగ్ అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. 18వ ఓవర్లో నటరాజన్ 7 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీయగా, 19వ ఓవర్లో కమిన్స్ 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, 5 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా, భువనేశ్వర్ వేసిన చివరి బంతిని ఆడలేక పావెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఉప్పల్ మైదానం హోరెత్తింది. గెలిచే మ్యాచ్ను చేజేతులా రాయల్స్ కోల్పోగా, ఓటమి అంచుల నుంచి హైదరాబాద్ ఒక పరుగుతో గట్టెక్కింది. సాక్షి, హైదరాబాద్: ఉత్కంఠభరిత పోరులో చివరకు హైదరాబాద్ పైచేయి సాధించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఒక పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలు చేశారు. భువనేశ్వర్కు (3/41) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నితీశ్ ధమాకా... పవర్ప్లే ముగిసేసరికి 2 వికెట్లకు 37 పరుగులు... ఈ సీజన్లో సన్రైజర్స్ చేసిన అత్యల్ప పరుగులివి. దీనిని చూస్తే రైజర్స్ 200 పరుగులకు చేరగలదని ఎవరూ ఊహించలేదు. అభిషేక్ శర్మ (12), అన్మోల్ప్రీత్ (5) విఫలం కాగా... హెడ్ అప్పటికి 17 బంతుల్లో 18 పరుగులే చేసి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. చహల్ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాది హెడ్ జోరు ప్రదర్శించగా... నితీశ్ తన బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. 10 ఓవర్ల తర్వాత స్కోరు 75 పరుగులకు చేరింది. 37 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. చహల్ వేసిన 13వ ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లతో నితీశ్ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు హెడ్ను బౌల్డ్ చేసి అవేశ్ ఈ జోడీని విడదీయగా, కొద్ది సేపటికి 30 బంతుల్లో నితీశ్ అర్ధసెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో రైజర్స్ బ్యాటర్లు నితీశ్, క్లాసెన్ మరింత చెలరేగడంతో 70 పరుగులు వచ్చాయి. అశ్విన్ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు కొట్టిన నితీశ్... అవేశ్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. మరోవైపు చహల్ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదిన క్లాసెన్... చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టి స్కోరును 200 పరుగులు దాటించాడు. కీలక భాగస్వామ్యం... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే రెండో బంతికి బట్లర్ (0), ఐదో బంతికి సామ్సన్ (0) అవుట్... రైజర్స్ పైచేయి! కానీ 7 పరుగుల వద్ద యశస్వి ఇచ్చిన క్యాచ్ను వదిలేసిన కమిన్స్... 24 పరుగుల వద్ద పరాగ్ ఇచ్చిన క్యాచ్ను వదిలేసిన అభిషేక్... అంతే... ఆట రాజస్తాన్ వైపు మొగ్గింది. 1 పరుగు వద్దే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత యశస్వి, పరాగ్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వికెట్లు పడినా వీరిద్దరు ధాటిగా ఆడి పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఇద్దరూ బ్యాటర్లు రైజర్స్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. ఒకే ఓవర్లో యశస్వి 30 బంతుల్లో, ఆ తర్వాత 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే విజయం వైపు దూసుకుపోతున్న దశలో వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. ఆ తర్వాత కీలక సమయాల్లో మరో మూడు వికెట్లు చేజార్చుకున్న రాయల్స్ ఓటమిని ఆహా్వనించింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) అవేశ్ 58; అభిషేక్ (సి) జురేల్ (బి) అవేశ్ 12; అన్మోల్ప్రీత్ (సి) యశస్వి (బి) సందీప్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 76; క్లాసెన్ (నాటౌట్) 42; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–25, 2–35, 3–131. బౌలింగ్: బౌల్ట్ 4–0–33–0, అశి్వన్ 4–0–36–0, అవేశ్ 4–0–39–2, సందీప్ శర్మ 4–0–31–1, చహల్ 4–0–62–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) నటరాజన్ 67; బట్లర్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సామ్సన్ (బి) భువనేశ్వర్ 0; పరాగ్ (సి) జాన్సెన్ (బి) కమిన్స్ 77; హెట్మైర్ (సి) జాన్సెన్ (బి) నటరాజన్ 13; పావెల్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 27; జురేల్ (సి) అభిõÙక్ (బి) కమిన్స్ 1; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–135, 4–159, 5–181, 6–182, 7–200. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–41–3, జాన్సెన్ 4–0–44–0, కమిన్స్ 4–0–34–2, నటరాజన్ 4–0–35–2, ఉనాద్కట్ 2–0–23–0, నితీశ్ కుమార్ రెడ్డి 1–0–12–0, షహబాజ్ 1–0–11–0. ఐపీఎల్లో నేడుముంబై X కోల్కతావేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పరాగ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు పరాగ్ చుక్కలు చూపించాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన రాజస్తాన్ను పరాగ్ తన ఇన్నింగ్స్తో మ్యాచ్లో నిలిపాడు. పరాగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్తో కలిసి రెండో వికెట్కు 135 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 49 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదన్న కసి మొత్తం ఈ మ్యాచ్లో చూపించాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పరాగ్ అద్బుత ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత వరల్డ్కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన పరాగ్ 409 పరుగులు చేశాడు.ఎస్ఆర్హెచ్ చేతిలో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. If you are one of those who trolled Riyan Parag during his tough time then you need to say sorry to him.He is slapping all of us with his exceptional performance.He is the finisher along with Rinku Singh who will bring the ICC trophy in future for Indiapic.twitter.com/Mk0IRvtfhJ— Sujeet Suman (@sujeetsuman1991) May 2, 2024 -
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్-2024లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. రాజస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రావ్మెన్ పావెల్, అశ్విన్ ఉండగా.. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కమ్మిన్స్ భువీ అప్పగించాడు. చివరి ఓవర్ తొలి బంతికి అశ్విన్ సింగిల్ తీసి పావెల్కు స్ట్రైక్ ఇచ్చాడు. పావెల్ రెండో బంతికి డబుల్, మూడో బంతిని బౌండరీగా మలిచాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రాజస్తాన్ విజయసమీకరణం 6 పరుగులుగా మారింది. ఆ తర్వాత వరుస రెండు బంతుల్లో పావెల్ రెండేసి పరుగులు తీయడంతో ఆఖరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 2 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో భువనేశ్వర్ ఆఖరి డెలివరీని అద్బుతంగా బౌలింగ్ చేసి పావెల్ను ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ సంచలన విజయం నమోదు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు. -
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
-
నితీష్ ఊచకోత.. 8 సిక్స్లతో వీర విహారం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో నితీష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో సెటిల్ అయ్యాక బౌండరీల వర్షం కురిపించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్తో కలిసి ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వరల్డ్క్లాస్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్కు అయితే నితీష్ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే నితీష్ కుమార్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డితో పాటు ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(28) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు.pic.twitter.com/mTZPleUfH5— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 2, 2024 -
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగారు. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు. -
రాజస్తాన్తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఒకే మార్పుతో బరిలోకి దిగింది. స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ స్ధానంలో ఆల్రౌండర్ మార్కో జానెసన్ తుది జట్టులో వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. కాగా ఈ మ్యాచ్ రాజస్తాన్ కంటే ఎస్ఆర్హెచ్కు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ బెర్త్ను దాదాపు ఖారారు చేసుకోగా.. సన్రైజర్స్ మాత్రం పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో నిలిచింది.తుది జట్లురాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మసన్రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ -
ఐపీఎల్లో ఇవాళ (మే 2) కొదమ సింహాల సమరం
ఐపీఎల్లో ఇవాళ (మే 2) బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. సన్రైజర్స్ 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 18 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. చెరి 9 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఈ సీజన్లో రాజస్థాన్ ఒక్క గుజరాత్ చేతుల్లో మాత్రమే ఓడి మాంచి జోష్లో ఉండగా.. సన్రైజర్స్ కొన్ని మ్యాచ్ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ మరికొన్ని మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లకే చేతులెత్తేస్తూ అటుఇటు కాకుండా ఉంది.తుది జట్లు (అంచనా)..సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్. [ఇంపాక్ట్ ప్లేయర్: అన్మోల్ప్రీత్ సింగ్/మయాంక్ మార్కండే]రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. [ఇంపాక్ట్ ప్లేయర్: రోవ్మన్ పావెల్] -
ఉప్పల్లో ఉల్లాసంగా SRH,RR ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
IPL 2024: టాప్లో రాజస్థాన్.. గెలిచినా ఆఖర్లోనే ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్ ఆఖరి దశకు చేరింది. ప్లే ఆఫ్స్కు ముందు మరో 24 మ్యాచ్లు మాత్రమే మిగిలాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. ఏప్రిల్ 28 నాటికి 46 మ్యాచ్లు పూర్తయాయ్యి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా..కేకేఆర్, సీఎస్కే, సన్రైజర్స్, లక్నో, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.9 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు సాధించిన రాజస్థాన్ అనధికారికంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. మిగతా మూడు బెర్తుల కోసం ఐదు జట్ల (కేకేఆర్, సీఎస్కే, సన్రైజర్స్, లక్నో, ఢిలీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గుజరాత్, పంజాబ్, ముంబై, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ప్లే ఆఫ్స్కు చేరలేవు. ఏప్రిల్ 29 నాటికి ఐపీఎల్ 2024 సీజన్ పాయింట్ల పట్టిక..జట్టుమ్యాచ్లుగెలుపుపాయింట్లురన్రేట్ఆడాల్సిన మ్యాచ్లు రాజస్థాన్98160.6945కేకేఆర్85100.9726సీఎస్కే95100.8105సన్రైజర్స్95100.0755లక్నో95100.0595ఢిల్లీ10510-0.2764గుజరాత్1048-1.1134పంజాబ్936-0.1875ముంబై936-0.2615ఆర్సీబీ1036-0.4154 -
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో టీమిండియా వెటరన్, రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన అశ్విన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. వికెట్లు విషయం పక్కన పెడితే తన బౌలింగ్లో భారీగా పరుగులు కూడా సమర్పించుకుంటున్నాడు.8 మ్యాచ్ల్లో 9.00 ఏకానమీతో 278 పరుగులిచ్చాడు. ఈ క్రమంలో అశ్విన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. తనే రాజస్తాన్ కోచ్గా గానీ మెంటార్ ఉండి ఉంటే అశ్విన్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇచ్చేవాడిని కాదని సెహ్వాగ్ మండిపడ్డాడు."అశ్విన్ వైట్బాల్ క్రికెట్కు సెట్ కాడు. అశ్విన్కు మిడిల్ ఓవర్లలలో వికెట్లు తీసే సత్తా లేదు. గతంలో ఓసారి కేఎల్ రాహుల్ తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్న పట్టించుకోని వ్యాఖ్యనించాడు. ఇప్పుడు అదే తరహాలో అశ్విన్ కూడా వికెట్లు తీయకపోతేనేం బాగానే బౌలింగ్ చేస్తున్నా కాదా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అశ్విన్ ఈ ఏడాది సీజన్లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. వచ్చే ఏడాది మెగా వేలంలో కచ్చితంగా అమ్ముడుపోడు. ఏ జట్టు అయినా బౌలర్ను సొంతం చేసుకున్నప్పుడు అతడి నుంచి వికెట్లు ఆశిస్తోంది. అంతేతప్ప 4 ఓవర్లలో 25 నుంచి 30 పరుగులు ఇస్తే చాలు అని ఏ జట్టు అనుకోదు . రెండు లేదా మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవాలని ఏ ప్రాంఛైజీనా భావిస్తోంది. అతడి సహచరలు చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లు టార్గెట్ చేస్తారని, క్యారమ్ బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతడికి వికెట్లు పడడం లేదు. అతడు తన ఆఫ్ స్పిన్ను నమ్ముకుంటే వికెట్లు పడే ఛాన్స్ ఉంది. కానీ నేను రాజస్తాన్ ఫ్రాంచైజీకి మెంటార్ లేదా కోచ్గా ఉండి ఉంటే అతడి తుది జట్టులో చోటు దక్కేది కాదని క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
అక్కడ బ్యాటింగ్ చేయడం కష్టం.. అతడు అద్భుతం!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్ జురెల్పై ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమితోగతేడాది ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు.. ఐపీఎల్-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.అయితే, శనివారం నాటి మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్ సుడిగాలి ఇన్నింగ్స్(33 బంతుల్లో 71 నాటౌట్)తో విరుచుకుపడగా మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించాడు.మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్తో కలిసి నాలుగో వికెట్కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు పిచ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్ జురెల్ ఆట తీరును కొనియాడాడు.రాజస్తాన్ వర్సెస్ లక్నో స్కోర్లు:వేదిక: లక్నోటాస్: రాజస్తాన్.. బౌలింగ్లక్నో స్కోరు: 196/5 (20)రాజస్తాన్ స్కోరు: 199/3 (19)ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్.చదవండి: డీకే అవసరమా?: యువీ Winning streak continues 🩷A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo— IndianPremierLeague (@IPL) April 27, 2024 -
రాజస్తాన్ దర్జాగా...
లక్నో: ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (8), హిట్టర్ స్టొయినిస్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్జెయింట్స్ను కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ హుడా (31 బంతుల్లో 51; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు.మిగతావారిలో పూరన్ (11), బదోని (18 నాటౌట్), కృనాల్ పాండ్యా (15 నాటౌట్) పెద్ద స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.కెప్టెన్ సంజు సామ్సన్ (33 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అబేధ్యమైన నాలుగో వికెట్కు 121 పరుగులు జోడించి మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) బౌల్ట్ 8; రాహుల్ (సి) బౌల్ట్ (బి) అవేశ్ ఖాన్ 76; స్టొయినిస్ (బి) సందీప్ 0; దీపక్ హుడా (సి) పావెల్ (బి) అశి్వన్ 50; పూరన్ (సి) బౌల్ట్ (బి) సందీప్ 11; బదోని నాటౌట్ 18; కృనాల్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–126, 4–150, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–1, సందీప్ 4–0–31–2, అవేశ్ ఖాన్ 4–0–42–1, అశ్విన్ 4–0–39–1, చహల్ 4–0–41–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) బిష్ణోయ్ (బి) స్టొయినిస్ 24; బట్లర్ (బి) యశ్ ఠాకూర్ 34; సామ్సన్ నాటౌట్ 71; పరాగ్ (సి) బదోని (బి) అమిత్ 14; జురేల్ నాటౌట్ 52; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–78. బౌలింగ్: హెన్రీ 3–0–32–0, మొహసిన్ 4–0–52–0, యశ్ ఠాకూర్ 4–0–50–1, స్టొయినిస్ 1–0–3–1, కృనాల్ 4–0–24–0, అమిత్ మిశ్రా 2–0–20–1, రవి బిష్ణోయ్ 1–0–16–0. -
ఐపీఎల్లో ఇవాళ (Apr 27) రెండు మ్యాచ్లు.. రెండూ రసవత్తర సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 27) రెండు రసవత్తర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్లో ఢిల్లీ-ముంబై.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో లక్నో-రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఢిల్లీ ఆరో స్థానంలో.. ముంబై తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. ముంబై ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది.ఢిల్లీ విషయానికొస్తే.. లీగ్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు ఇటీవల వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రధాన పోటీదారుగా మారుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి 8 పాయింట్లు కలిగి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 34 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 19, ఢిల్లీ 15 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. తుది జట్లు (అంచనా)..ఢిల్లీ: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్/విరుట్కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జై రిచర్డ్సన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. [ఇంపాక్ట్ సబ్: రసిఖ్ సలామ్]ముంబై: ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా. [ఇంపాక్ట్ సబ్: నువాన్ తుషార]రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ అగ్రస్థానంలో.. లక్నో నాలుగో స్థానంలో ఉన్నాయి. 8 మ్యాచ్ల్లో ఏడింట గెలిచిన రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్త్ను అనధికారికంగా దక్కించుకోగా.. 8 మ్యాచ్ల్లో ఐదింట గెలిచిన లక్నో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీపడుతుంది.ప్లే ఆఫ్స్ రేసులో మిగతా జట్ల కంటే ముందుండాలంటే లక్నో ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు రాజస్థాన్ను ఈ మ్యాచ్ ఫలితం పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. గెలిస్తే మాత్రం రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు అధికారికంగా అర్హత సాధిస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. రాజస్థాన్ 3, లక్నో ఓ మ్యాచ్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ [ఇంపాక్ట్ సబ్: జోస్ బట్లర్]లక్నో: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మాట్ హెన్రీ, యష్ ఠాకూర్ [ఇంపాక్ట్ సబ్: మయాంక్ యాదవ్] -
T20: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్గా సంజూ శాంసన్!
‘రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్కప్-2024లోనూ జట్టును అతడే ముందుకు నడిపిస్తాడు’’.. చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అయితే, వన్డే వరల్డ్కప్-2023 తర్వాత సీన్ కాస్తా మారింది. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన ఈ పేస్ ఆల్రౌండర్.. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ ముంబై పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ మాత్రం ఈసారి పొట్టి ప్రపంచకప్లో రోహిత్ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట కేవలం మూడు మాత్రమే గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో సోమవారం నాటి మ్యాచ్తో ఐదో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం తన జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు. సంజూ శాంసన్ (PC: IPL) ఇప్పటి దాకా రాయల్స్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఏడు విజయాలతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సంజూ అదరగొడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి అతడు 314 పరుగులు సాధించాడు. ముంబైతో మ్యాచ్లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104)తో కలిసి సంజూ(28 బంతుల్లో 38) ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాష్ శాశ్వతం అని యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్గా సంజూ శాంసన్ ఎదుగుతాడనడంలో మీకేమైనా అనుమానాలున్నాయా?’’ అంటూ కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ కావాలని ఆకాంక్షించాడు. అసలు జట్టులో చోటు దక్కుతుంతా అన్న సందేహాల నడుమ ఊహించని విధంగా కెప్టెన్ కావాంటూ అంటూ కామెంట్ చేశడు. కాగా వరల్డ్కప్-2024 నేపథ్యంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో భజ్జీ ఇలా సంజూకు ఓటు వేశాడు. మరి మీ ఓటు ఎవరికి?! Yashasvi Jaiswal’s knock is a proof of class is permanent . Form is temporary @ybj_19 and there shouldn’t be any debate about Keepar batsman . @IamSanjuSamson should walks in to the Indian team for T20 worldcup and also groomed as a next T20 captain for india after rohit . koi… — Harbhajan Turbanator (@harbhajan_singh) April 22, 2024 THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
IPL 2024 MI Vs RR: బుమ్రా ఉండగా నువ్వు తొలి ఓవర్ వేయడమేంటి హార్దిక్..!
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మరోసారి సొంత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజస్థాన్తో మ్యాచ్లో హార్దిక్ చెత్త నిర్ణయాలే ముంబై కొంపముంచాయని వాపోతున్నారు. నామమాత్రపు స్కోర్ను కాపాడుకునే క్రమంలో ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రాను కాదని తాను బౌలింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుమ్రా కాకపోతే కొయెట్జీ, తుషార కనిపించలేదా అని నిలదీస్తున్నారు. ఏదో వరల్డ్ నంబర్ వన్ బౌలర్లా తొలి ఓవర్ వేయడమేంటని ధ్వజమెత్తుతున్నారు. బౌలర్లను మార్చే విషయంలో గల్లీ కెప్టెన్ల కంటే అధ్వానంగా ఉన్నావని ఫైరవుతున్నారు. హార్దిక్ బ్యాటింగ్ చెప్పనశక్యమైన ఛండాలంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోతూ ఆల్రౌండర్నని ఎలా చెప్పుకుంటావని దుర్భాషలాడుతున్నారు. ఈ సీజన్లో ముంబై యాజమాన్యం స్వయంకృతాపరాధమే (హార్దిక్ను కెప్టెన్గా నియమించడం) ఐదు సార్లు ఛాంపియన్ అయిన తమ ఫేవరెట్ జట్టు కొంపముంచుతుందని వాపోతున్నారు. హార్దిక్ను వెంటనే కెప్టెన్సీ నుంచి తీసిపారేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రాయల్స్తో నిన్నటి మ్యాచ్లో హార్దిక్ బ్యాటింగ్లో 10 పరుగులు (10 బంతుల్లో ఓ ఫోర్) చేసి, బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. 183 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో హార్దిక్ తొలి ఓవర్ వేసి బట్లర్చే బాదించుకున్నాడు. ఆతర్వాత 13వ ఓవర్లో శాంసన్, యశస్వి ధాటికి 10 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్లో హార్దిక్ చెత్త నిర్ణయాలు, చెత్త వ్యక్తిగత ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్ ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతానికి ఆ జట్టు 8 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సందీప్ శర్మ (4-0-18-5), ట్రెంట్ బౌల్ట్ (4-0-32-2) ముంబైని దెబ్బకొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
IPL 2024: ముంబై ఇండియన్స్ అంటే చాలు యశస్వికి పూనకం వస్తుంది..!
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు ముంబై ఇండియన్స్ అంటే చాలు పూనకం వస్తుంది. యశస్వి ఏ జట్టుపై అయినా ఆడతాడో లేదో తెలీదు కానీ ముంబై ప్రత్యర్దిగా ఉంటే మాత్రం రెచ్చిపోతాడు. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో యశస్వి మరోసారి చెలరేగిపోయాడు. విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. రెండేళ్లలో యశస్వికి ముంబైపై ఇది రెండో సెంచరీ. యశస్వి తన కెరీర్లో చేసిన రెండు సెంచరీలు ముంబైపై చేసినవే కావడం విశేషం. గత సీజన్లో ముంబైపై వారి సొంత మైదానమైన వాంఖడేలో శతక్కొట్టిన (124) యశస్వి.. తాజాగా తమ హోం గ్రౌండ్ జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో అజేయ సెంచరీతో ఇరగదీశాడు. యశస్వితో పాటు సందీప్ శర్మ (4-0-18-5) చెలరేగడంతో నిన్నటి మ్యాచ్లో రాయల్స్ ముంబైపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా శతకంతో యశస్వి ఐపీఎల్లో 23 ఏళ్లలోపు రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
IPL 2024 RR vs MI: ఐదేసి అదరగొట్టిన అమ్ముడుపోని ఆటగాడు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మ ఈ మ్యాచ్లో రాజస్థాన్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వేరే ఆటగాడికి రీ ప్లేస్మెంట్గా రాయల్స్లోకి వచ్చిన సందీప్ శర్మ ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, తన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో సందీప్ వేసిన స్పెల్ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ తీసిన సందీప్.. నాలుగో ఓవర్లో అతి భయంకరుడైన సూర్యకుమార్ వికెట్ను పడగొట్టాడు. ఆ తర్వాత 15వ ఓవర్లో బంతినందుకున్న సందీప్.. ఆ ఓవర్లో వికెట్ లేకుండా 11 పరుగులు సమర్పించుకున్నాడు. - Unsold in the auction. - Came as a replacement in 2023. - Became the end over specialist.- Injured in the start of IPL 2024. - Came back into the team & got his first five wicket haul. Sandeep Sharma is a hero. 🫡pic.twitter.com/JeMHj5vLH9— Johns. (@CricCrazyJohns) April 22, 2024 ఆఖరి ఓవర్లో మరోసారి బంతినందుకు సందీప్ ఈసారి తన అద్భుతమైన స్లో బాల్స్ టెక్నిక్ను ఉపయోగించి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన సందీప్ 18 పరుగులు సమర్పించుకుని 5 వికెట్లు పడగొట్టాడు. సందీప్కు ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్లో సందీప్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో రాయల్స్కు భారీ విజయాన్ని అందించాడు. సందీప్ దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 179 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు సెంచరీతో రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
ముంబై మరో విజయం సాధించేనా?
-
IPL 2024: రెండు సెంచరీలకు విలువ లేకుండా చేసిన బట్లర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో అతను 6 మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 250 పరుగులు చేసి సీజన్ లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. నిన్న (ఏప్రిల్ 16) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిన బట్లర్.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 36 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో బట్లర్ వీర ఉతుకుడు ఉతికి రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ శతకంతో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న బట్లర్.. ఎవరూ గమనించని ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బట్లర్ సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి జట్టులోని బ్యాటర్లు కూడా శతకాలు చేశారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి అజేయ శతకంతో (113) చెలరేగగా.. నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సునీల్ నరైన్ (109) సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లో బట్లర్ మెరుపు శతకాలతో సునామీలా విరుచుకుపడి ప్రత్యర్ధి ఆటగాళ్లు చేసిన సెంచరీలకు విలువ లేకుండా చేశాడు. పోతే.. కేకేఆర్తో మ్యాచ్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో సెంచరీ చేసిన బట్లర్.. ఐపీఎల్ హిస్టరీలో మూడు సార్లు ఛేజింగ్లో సెంచరీలు చేసి ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో (7) బట్లర్ ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ను (6) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ (8) టాప్లో ఉన్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో బట్లర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం సాధించింది. బట్లర్ సెంచరీతో కేకేఆర్ ఆటగాడు నరైన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. -
శ్రేయస్ అయ్యర్కు దెబ్బ మీద దెబ్బ! మరో షాక్..
ఓటమి బాధలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మరో షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడినా రాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. రెండు వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది. నిజానికి.. కేకేఆర్ రాజస్తాన్ను నిలువరిస్తుందనే అంతా అనుకున్నారు. కొంప ముంచి స్లో ఓవర్ రేటు కానీ స్లో ఓవర్ రేటు కేకేఆర్ కొంపముంచింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లనే ఉంచాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్న బట్లర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. ఓటమితో పాటు మరో షాక్ కూడా అనంతరం మూడు బంతుల్లో విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా.. చివరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ విజయలాంఛనం పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా కేకేఆర్ మ్యాచ్ ఓడిపోగా.. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందున కోల్కతా సారథి శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఇది మొదటి తప్పు కాబట్టి ఈ మేర ఫైన్తో సరిపెట్టినట్లు తెలిపింది. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: బతిమిలాడుతున్నా వినడం లేదు.. ఇక వాళ్లదే భారం!
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ నమోదు చేసిన గణాంకాలివి. రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఓపెనర్గా ఇరగదీస్తున్నాడు విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. 𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉 He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp — JioCinema (@JioCinema) April 16, 2024 కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఇక ఈ వెటరన్ ఆల్రౌండర్ ప్రతిభకు వెస్టిండీస్ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్మన్ పావెల్ కూడా ఫిదా అయ్యాడు. నరైన్ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్కప్లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు. కేకేఆర్పై రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను. కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్లతో చర్చించాను.ప్రపంచకప్ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. విండీస్లో ఈసారి వరల్డ్కప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024లో సునిల్ నరైన్ ఆడించడమే తన లక్ష్యమని రోవ్మన్ పావెల్ ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్తో మ్యాచ్లో పావెల్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 2023లో రిటైర్ అయిన నరైన్ 2012, 2014 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన సునిల్ నరైన్.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?.. స్టార్క్పై ఆగ్రహం
#Starc: కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. కోట్లు పెట్టి కొన్నందుకు అతడి వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కేకేఆర్ మిచెల్ స్టార్క్ కోసం మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా ఈ ఆసీస్ స్టార్ రికార్డులకెక్కాడు. కానీ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. పదిహేడో ఎడిషన్లో తొలి రెండు మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయిన స్టార్క్.. ఆ తర్వాత గాడిలో పడ్డట్లే కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై రెండు.. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా? అయితే.. రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో మరోసారి విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన స్టార్క్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 50 పరుగులు లీక్ చేశాడు. ముఖ్యంగా కీలకమైన పద్దెనిమిదవ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కేకేఆర్ మిగిలిన బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ (2/30), వరుణ్ చక్రవర్తి (2/36) మెరుగ్గా ఆడగా.. స్టార్క్తో పాటు పేస్ విభాగంలో వైభవ్ అరోరా(1/45), హర్షిత్ రాణా (2/45) భారీగా పరుగులు ఇచ్చారు. అయితే, వీరిద్దరు వికెట్లు కూడా తీశారు. కానీ ఎంతో అనుభవం ఉన్న స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. ఇక ఈ మ్యాచ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన సెంచరీ వీరుడు జోస్ బట్లర్ రాజస్తాన్ను గెలిపించిన విషయం తెలిసిందే. పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు ఫలితంగా వరుస విజయాలతో జోరు మీదున్న కేకేఆర్కు ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో స్టార్క్ విమర్శకుల టార్గెట్గా మారాడు. స్టార్క్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే కేకేఆర్కు భంగపాటు తప్పేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నెట్టింట అయితే.. అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి కొంటే పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు’’ అంటూ స్టార్క్పై సెటైర్లు వేస్తున్నారు. అయితే, అతడి ఫ్యాన్స్ మాత్రం అండగా నిలుస్తూ.. కీలక సమయంలో రాణించి తన విలువేంటో చాటుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ విజయం Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్ చేతికి బంతి!
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతంగా రాణించిన సునిల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్ అయ్యర్.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. On Display: 𝗘𝗳𝗳𝗼𝗿𝘁𝗹𝗲𝘀𝘀 𝗛𝗶𝘁𝘁𝗶𝗻𝗴 😍 Sunil Narine smacking it with perfection👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @KKRiders pic.twitter.com/yXC3F5r1SY — IndianPremierLeague (@IPL) April 16, 2024 అందుకే వరుణ్ చేతికి బంతి జోస్ బట్లర్ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో రాజస్తాన్ రాయల్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో కోల్కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్లో కేకేఆర్కు ఇది రెండో ఓటమి. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. అయితే, రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ అజేయ శతకం కారణంగా నరైన్సుడిగాలి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. వాళ్లిద్దరి వల్లే ఓటమి 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర, రోవ్మన్ పావెల్తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ పైవిధంగా స్పందించాడు. బట్లర్, రోవ్మన్ పావెల్ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్ ఇచ్చాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంచలన విజయం.. ఐపీఎల్లో రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు
#KKRvRR: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్పై రెండు వికెట్ల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(107) కారణంగా ఐపీఎల్-2024లో ఆరో విజయాన్ని అందుకుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్(56 బంతుల్లో 109) కారణంగా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది కేకేఆర్. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ చివరి బంతి వరకు పట్టుదలగా పోరాడింది. నిజానికి 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోరు 128/6. గెలవాలంటే చివరి ఆరు ఓవర్లలో 96 పరుగులు కావాలి.. రోవ్మన్ పావెల్తో కలిసి బట్లర్ ఈ క్లిష్టతర పరిస్థితి నుంచి రాజస్తాన్ను గట్టెక్కించాడు. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 గెలుపు సమీకరణం 1 బాల్.. 1 రన్ ఉన్న తరుణంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బట్లర్ ఏమాత్రం తడబడకుండా ఆవేశ్ ఖాన్ కలిసి సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించిన ఈ మ్యాచ్లో ఆఖరికి ఇలా రాజస్తాన్ విజయ దరహాసం చేయగా.. కేకేఆర్ నైరాశ్యంలో మునిగిపోయింది. ఇక ఈ అద్భుతమైన గెలుపుతో రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. పదిహేడేళ్లుగా ఏ జట్టుకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించింది. రన్ ఛేజింగ్లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన తొలి జట్టుగా ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. అదే విధంగా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ అవతరించింది. ఛేజింగ్లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన జట్లు 1. రాజస్తాన్ రాయల్స్- కేకేఆర్ మీద- 103 రన్స్- 2024, కోల్కతా. 2. ఆర్సీబీ- గుజరాత్ లయన్స్ మీద- 91 రన్స్- 2016, బెంగళూరు 3. చెన్నై- ముంబై మీద- 85 రన్స్- 2018, వాంఖడే, ముంబై 4. చెన్నై- సన్రైజర్స్ మీద- 78 రన్స్- 2018, వాంఖడే 5. ఢిల్లీ- గుజరాత్ లయన్స్ మీద- 76- 2017, కాన్పూర్. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ గెలుపు. ఇవి కూడా చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వీరోచిత శతకంతో రాజస్తాన్ను గెలిపించిన బట్లర్ (ఫొటోలు)
-
KKR Vs RR Highlights: రాయల్స్కు బట్లర్ జోష్
కోల్కతా: కోల్కతాతో మ్యాచ్లో రాజస్తాన్ విజయలక్ష్యం 224...14 ఓవర్ల తర్వాత 128/6తో అసాధ్యంగా కనిపించింది. చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి! ఈ దశలో బట్లర్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. కానీ బట్లర్తో పాటు పావెల్ బ్యాటింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరుసగా 6 ఓవర్లలో 17, 17, 16, 18, 19, 9 పరుగుల చొప్పున రాబట్టిన రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఇందులో బట్లర్ 6 ఫోర్లు, 5 సిక్స్లు బాదగా...పావెల్ 1 ఫోర్, 3 సిక్స్లు బాదాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతినే సిక్స్గా కొట్టి 55 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్న బట్లర్... సింగిల్ తీయకుండా ఆఖరి బంతి దాకా నిలబడి గెలిపించాడు. 15వ ఓవర్లో 36 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బట్లర్ తర్వాత సంచలన ఇన్నింగ్స్ ఆడిన మరో 21 బంతుల్లోనే వందకు చేరుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై అనూహ్య విజయం సాధించింది. తొలుత నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109; 13 ఫోర్లు, 6 సిక్స్లు) తొలి సెంచరీ సాధించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి గెలిచింది. జోస్ బట్లర్ (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పావెల్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరిపించాడు. నరైన్ ధనాధన్ ఫిల్ సాల్ట్ (10) లైఫ్ను సద్వినియోగం చేసుకోకపోగా, రఘువంశీ (18 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్ నరైన్ 4, 6తో జట్టు పవర్ప్లేలో 56/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు (10) ముగిసేసరికి నైట్రైడర్స్ సరిగ్గా 100/1 స్కోరు చేసింది. నరైన్ సిక్సర్తో 29 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ మరుసటి ఓవర్లో కుల్దీప్ సేన్... రఘువంశీ ఆట ముగించడంతో రెండో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (7), రసెల్ (13) జతయినా... పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయారు. కానీ నరైన్ ఫోర్లు, సిక్స్లతో తన ఆటతీరును కొనసాగించాడు. చహల్ 16వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు బాదేయడంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. దీంతోనే అతని సెంచరీ 49 బంతుల్లో పూర్తయ్యింది. 18వ ఓవర్లో బౌల్ట్ యార్కర్తో నరైన్ పోరాటానికి ముగింపు పలికాడు. రింకూ సింగ్ (9 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుపులతో నైట్రైడర్స్ 200 పైచిలుకు స్కోరు చేసేసింది. బట్లర్ మెరుపులతో... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడిన అది కాసేపే కావడం, టాపార్డర్లో కెప్టెన్ సంజూ సామ్సన్ (12) చెప్పుకోదగ్గ స్కోరే చేయలేకపోవడం రాజస్థాన్ లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఓపెనింగ్ చేసిన బట్లర్ క్రీజును అట్టిపెట్టుకున్నాడు. కానీ ధాటిగా ఆడలేకపోయాడు. రియాన్ పరాగ్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా... ధ్రువ్ జురెల్ (2), అశ్విన్ (8), హెట్మైర్ (0) చేతులెత్తేయడంతో 121 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అండ్ (బి) అవేశ్ 10; నరైన్ (బి) బౌల్ట్; రఘువంశీ (సి) అశ్విన్ (బి) కుల్దీప్ సేన్ 30; శ్రేయస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 11; రసెల్ (సి) జురెల్ (బి) అవేశ్ 13; రింకూసింగ్ నాటౌట్ 20; వెంకటేశ్ (సి) జురెల్ (బి) కుల్దీప్ సేన్ 8; రమణ్దీప్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 21; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–21, 2–106, 3–133, 4–184, 5–195, 6–215. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0–35–2, కుల్దీప్ సేన్ 4–0–46–2, చహల్ 4–0–54–1, అశ్విన్ 4–0–49–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 19; బట్లర్ నాటౌట్ 107; సామ్సన్ (సి) నరైన్ (బి) హర్షిత్ 12; పరాగ్ (సి) రసెల్ (బి) హర్షిత్ 34; జురెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 2; అశ్విన్ (సి) రఘువంశీ (బి) వరున్ 8; హెట్మైర్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 0; పావెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 26; బౌల్ట్ రనౌట్ 0; అవేశ్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–22, 2–47, 3–97, 4–100, 5–121, 6–121, 7–178, 8–186. బౌలింగ్: స్టార్క్ 4–0–50–0, వైభవ్ 3–0–45–1, హర్షిత్ రాణా 4–0–45–2, నరైన్ 4–0–30–2, వరుణ్ 3–0–36–2, రసెల్ 1–0–17–0. ఐపీఎల్లో నేడు గుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం