మాంచెస్టర్ : సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు ఆస్ట్రేలియా ఘన విజయంతో వీడ్కోలు పలికింది. చివరిదైన ఐదో వన్డేలో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి సిరీస్ను 3-2తో గెలుచుకుంది. ముందుగా ఇంగ్లండ్ 33 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. స్టోక్స్ (42), రషీద్ (35 నాటౌట్) కొంత వరకు పోరాడారు. మిషెల్ మార్ష్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఫించ్ (70 నాటౌట్) రాణించాడు. మిషెల్ మార్ష్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.