
అత్తగారి ఊర్లో అన్నీ బంద్!
క్రికెట్ కోసం ఆఫీసులు ఎగ్గొట్టడం, రోడ్లు అన్నీ ఖాళీ కావడం తరచుగా చూస్తూనే ఉంటాం. సెమీఫైనల్ కోసం ఒక ఊరు ఊరంతా సెలవు తీసుకున్నారు.
బగ్పథ్: క్రికెట్ కోసం ఆఫీసులు ఎగ్గొట్టడం, రోడ్లు అన్నీ ఖాళీ కావడం తరచుగా చూస్తూనే ఉంటాం. సెమీఫైనల్ కోసం ఒక ఊరు ఊరంతా సెలవు తీసుకున్నారు. దీనికి కారణం ఉందండోయ్... ఆ ఊరికి కాబోయే అల్లుడు రైనా భారత్ తరఫున సెమీస్ ఆడుతున్నాడు. ఉత్తరప్రదేశ్లోని బామ్నాలి అనే గ్రామవాసులంతా గురువారం సెలవు దినంగా ప్రకటించుకున్నారు. ఈ గ్రామానికి చెందిన ప్రియాంకను రైనా త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. షాప్లన్నీ మూసేసి... గ్రామంలో బిగ్స్క్రీన్ ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి మ్యాచ్ చూడబోతున్నారు.