
సీటీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ
ముంబై: కొత్తగా ప్రారంభమవుతున్న చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)... జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లందర్నీ ఒకే తాటిపైకి తెచ్చిందని భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ అన్నాడు. ఈ లీగ్లో ఆడేందుకు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పేస్... సీటీఎల్ ట్రోఫీని ఆవిష్కరించాడు. సోమవారం నుంచి పోటీలు జరుగుతాయి.