Leander Paes
-
భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్గా ఎదుగుతుంది: లియాండర్ పేస్
ముంబై: భారత్ నుంచి మరో గ్రాండ్స్లామ్ చాంపియన్ తయారు అయ్యేందుకు పదేళ్లు పడుతుందని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతోందని... 2036 ఒలింపిక్స్కు మనదేశం ఆతిథ్యమివ్వడంతో పాటు పతకాల పట్టిక టాప్–10లో నిలిచే దిశగా అడుగులు ముందుకు వేస్తోందని పేర్కొన్నాడు. ముంబైలో బుధవారం జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా పేస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో పేస్తో పాటు మహేశ్ భూపతి, సానియా మీర్జా, సోనాలీ బెంద్రే, రకుల్ప్రీత్ పాల్గొన్నారు. ‘దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. వారిని గుర్తించి సానపెట్టాల్సిన అవసరముంది. రాబోయే రోజుల్లో భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్గా ఎదుగుతుంది’ అని పేస్ ఆశాభావం వ్యక్తంచేశాడు.చదవండి: ENG vs PAK: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పేస్, విజయ్ అమృత్రాజ్
న్యూపోర్ట్ (అమెరికా): భారత దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్లకు గొప్ప గౌరవం లభించింది. ఈ ఇద్దరికీ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించారు. ఆసియా నుంచి ఈ గౌరవం పొందిన టెన్నిస్ క్రీడాకారులు వీరిద్దరే కావడం విశేషం. 51 ఏళ్ల పేస్ వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో (1992 బార్సిలోనా నుంచి 2016 రియో వరకు) పోటీపడ్డ ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.1996 అట్లాంటా ఒలింపిక్స్లో వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్ డేవిస్కప్లో భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తన సుదీర్ఘ కెరీర్లో పురుషుల డబుల్స్లో 8 గ్రాండ్స్లామ్ టైటిల్స్, మిక్స్డ్ డబుల్స్లో 10 గ్రాండ్స్లామ్ టైటిల్స్ను గెల్చుకున్న పేస్కు ‘ప్లేయర్ కేటగిరీ’లో హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎంపిక చేశారు.ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా పేస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు 70 ఏళ్ల విజయ్ అమృత్రాజ్ 1974, 1987లలో భారత జట్టు డేవిస్కప్ ఫైనల్కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటి వరకు 28 దేశాల నుంచి 267 మంది టెన్నిస్ ప్లేయర్లకు ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో స్థానాన్ని కల్పించారు. -
హాల్ ఆఫ్ ఫేమ్లోకి భారత టెన్నిస్ దిగ్గజాలు
టెన్నిస్కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఇద్దరు భారత దిగ్గజాలు ప్రవేశించారు. వేర్వేరు జమానాల్లో భారత టెన్నిస్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆసియా నుంచి హాల్ ఆఫ్ ఫేమ్కు ఎంపికైన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారులుగా లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ కూడా టెన్నిస్లో అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. పేస్, అమృత్రాజ్లకు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడంతో ఈ జాబితాలో ప్రాతినిథ్యం లభించిన 28వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. 50 ఏళ్ల లియాండర్ పేస్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాజీ నంబర్ వన్గా చలామణి అయ్యాడు. 90వ దశకంలో పేస్ కెరీర్ పీక్స్లో ఉండింది. పేస్ తన కెరీర్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 18 గ్రాండ్స్లామ్ టైటిళ్లు సాధించాడు. పేస్ 1996 ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించాడు. ఓవరాల్గా పేస్ 1990-2020 మధ్యలో 54 డబుల్స్ టైటిళ్లు సాధించాడు. విజయ్ అమృత్రాజ్ విషయానికొస్తే.. ఈ 70 ఏళ్ల భారత టెన్నిస్ లెజెండ్ 70, 80 దశకాల్లో భారత్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాడు. కెరీర్లో ఓవరాల్గా 15 టైటిళ్లు సాధించిన అమృత్రాజ్ ఆతర్వాత టెన్నిస్ ప్రమోటర్గా, వ్యాఖ్యాతగా మంచి గురింపు తెచ్చుకున్నాడు. -
కలిసిరాని ప్రేమ, నాలుగోసారి బ్రేకప్ చెప్పిన ఖడ్గం బ్యూటీ!
ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ, టెన్నిస్ ఛాంపియన్ లియాండర్ పేస్ల బంధానికి బీటలు వారింది. వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో కిమ్ తన ఇన్స్టాగ్రామ్లో లియాండర్ పేస్తో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కుతారనుకుంటే ఇలా సడన్గా బ్రేకప్ చెప్పుకున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. కిమ్కు బ్రేకప్ కొత్త కాదు! ఖడ్గం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగధీరలో 'ఏం పిల్లడో ఎల్దం వస్తవా' స్పెషల్ పాటతో మరింత పాపులర్ అయింది. హిందీలోనూ పలు చిత్రాలు చేసిన ఆమె సినిమాల కంటే కూడా లవ్ ఎఫైర్స్తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో ప్రేమాయణం నడిపిన ఆమె పలు కారణాలతో అతడికి బ్రేకప్ చెప్పింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను పెళ్లాడగా కొంతకాలానికే అతడికి విడాకులిచ్చేసింది. తర్వాత నటుడు హర్షవర్ధన్ రాణేతో ప్రేమాయణం సాగించినప్పటికీ అదీ ఎంతోకాలం నిలవలేదు. రెండేళ్లుగా టెన్నిస్ స్టార్ లియాండర్పేస్తో రిలేషన్లో ఉన్న ఆమె చివరకు అతడికి కూడా బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. లియాండర్కు కూతురు కూడా ఉంది.. అటు లియాండర్ పేస్ కూడా ఎంతోమందితో ఎఫైర్స్ నడిపాడు. ప్రముఖ మోడల్ రియా పిళ్లైతో సహజీవనం చేయగా వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. తర్వాత కిమ్తో లవ్లో పడ్డాడు. 2020 చివరిలో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ టెన్నిస్ స్టార్.. 1992 నుంచి 2016 వరకూ మొత్తం 7 ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. అతని సుదీర్ఘ కెరీర్లో 1996లో జరిగిన అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించడమే కాకుండా 18 గ్రాండ్స్లామ్(డబుల్స్, మిక్స్డ్ డబుల్స్)ల్లో విజేతగా నిలిచాడు. -
Leander Paes: ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి.. బతకడం కష్టమన్నారు.. అయినా
Leander Paes Inspirational Journey: 1996 ఆగస్టు 3.. భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయమైన రోజు.. ఒలింపిక్స్లో పతకం గురించి ఎదురు చూసి చూసి ఇక మనకు రాదులే అనుకొని నిట్టూర్చిన ఒక తరం క్రీడాభిమానులకు సుదినం.. ఒలింపిక్స్ వేదికపై జాతీయ జెండా ఎగురవేసేందుకు నేనున్నానంటూ ఒక్కడు దూసుకొచ్చాడు.. 16 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ను చేర్చాడు. వ్యక్తిగత విభాగంలోనైతే 44 ఏళ్ల తర్వాత భారత ఆటగాడి పేరు వినిపించింది. మెగా వేదికపై విజయంతో తానేంటో చూపించిన అతని పేరు లియాండర్ పేస్! ఈ విజయంతో ఆగిపోకుండా ఆ తర్వాతా.. ఏళ్ల పాటు భారత టెన్నిస్కు పర్యాయపదంలా నిలిచిన స్టార్... వరుసగా మూడు ఒలింపిక్స్లలో కనీసం ఒక్క పతకం కూడా సాధించలేని మన దేశం.. అసలు ఒలింపిక్స్ అంటే మనవి కావు, మనకు ఎలాగూ పతకాలు గెలిచే అవకాశమే లేదు.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అనుకుంటున్న సమయం.. ఎప్పుడో 1980లో హాకీలో పతకం వచ్చింది. ఆ తర్వాత 1984, 1988, 1992.. క్యాలెండర్ మారింది కానీ కనీసం కంచు మోత కూడా వినిపించలేదు. భారత్కు మిగిలింది రిక్త హస్తమే.. సరిగ్గా చెప్పాలంటే ఒక తరం మొత్తం ఒలింపిక్స్ పతకం గురించి ఆలోచించడమే మానేసింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఒలింపిక్స్ పతకం భారత క్రీడలకు కొత్త ఊపిరి పోసింది. అప్పటినుంచి ప్రతి ఒలింపిక్స్లో భారత్ వరుసగా ఏదో ఒక పతకం గెలుస్తూనే వచ్చింది. టీనేజర్ నుంచి వెటరన్ వరకు.. 1990లో టీనేజర్గా పేస్.. డేవిస్ కప్ డబుల్స్ మ్యాచ్లో సీనియర్ సహచరుడు జీషాన్ అలీతో కలసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్పై భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 47 ఏళ్ల వయసు వచ్చే వరకు అదే ఉత్సాహం, అదే జోరు.. పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్.. దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్నాడు. అలుపు లేని ఆటసారి 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్.. ఒలింపిక్స్లో కాంస్య పతకం... 55 కెరీర్ టైటిల్స్.. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకున్న రికార్డులు మరో ఎత్తు. ఫిట్నెస్ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజుల్లేవు.. ఇదెలా సాధ్యం ఈ మనిషికి? మూడు పదులు దాటగానే కెరీర్ చరమాంకంలోకి వచ్చిందని చాలా మంది భావించే ఆటలో 47 ఏళ్ల వయసు వచ్చినా గ్రాండ్గా ఆడి చూపించిన అద్భుతం పేరే లియాండర్ పేస్. అతను తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన రోజు నుంచి ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే వరకు చూస్తే టెన్నిస్లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి ఎడ్బర్గ్, బెకర్, లెండిల్ లాంటి వాళ్లు ఆటకు గుడ్బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్ కెరీర్ సాగింది. ఆపై ఫెడరర్, నాడల్, జొకోవిచ్ల కాలంలోనూ పేస్ రాకెట్ మాట్లాడింది. కెరీర్లో ఎక్కువ భాగం డబుల్స్లోనే అయినా మ్యాచ్ ఫిట్నెస్ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్ గేమ్ అయిన క్రికెట్లో 24 ఏళ్లు ఆడిన సచిన్ను (ఆ)హాశ్చర్యంతో చూశారు భారత క్రీడాభిమానులు. కానీ టెన్నిస్లాంటి వ్యక్తిగత క్రీడలో 30 ఏళ్లు సత్తా చాటడం పేస్లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. అట్లాంటాతో అంబరాన... 1990లో పేస్.. జూనియర్ వింబుల్డన్, 1991లో యూఎస్ ఓపెన్ గెలిచి వరల్డ్ నంబర్వన్గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత కాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 ఒలింపిక్స్లో అతని వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్కు వ్యక్తిగత ఒలింపిక్స్ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్.. ఆ తర్వాత తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్స్ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్లో పీట్ సంప్రాస్ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్ కూడా ఉంది. డేవిస్ కప్ సూపర్ స్టార్ పేస్కు సంబంధించి ప్రతి భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్ కప్ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే ‘వాలి’ బలం రెట్టింపు అయిపోయినట్లు.. భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్ ఆటతీరు కూడా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోర్నీల సంగతి ఎలా ఉన్నా.. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్ పతకం తర్వాత లియాండర్ ఆడిన అన్ని డేవిస్కప్ మ్యాచ్లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంతటి ఆటగాడైనా సరే.. తన వీరోచిత ప్రదర్శనతో పేస్.. డేవిస్ కప్లో భారత్కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్సెవిక్, టిమ్ హెన్మన్, వేన్ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్ ర్యాంక్ల్లో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచ్చిన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్కప్ వరల్డ్ గ్రూప్లో భారత్ సెమీస్కు చేరడంలో పేస్దే కీలక పాత్ర. మృత్యువుతో పోరాడి.. 2003లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న సమయంలో కోర్టు అటు వైపు నుంచి బంతి పేస్ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి. శరీరంపై నియంత్రణ కోల్పోయి.. నిలబడేందుకు భాగస్వామి మార్టినా నవ్రతిలోవాను ఆసరాగా చేసుకున్నాడు. అది బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్కు మద్దతుగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకునేందుకు కూడా మార్టినా సిద్ధమైంది. దాన్నుంచి కోలుకున్న తర్వాత పేస్ మళ్లీ ప్రాక్టీస్కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. ప్రస్థానం సాగిస్తూ... పేస్ ఆటతీరు భీకరమైన సర్వీస్లు, బెంబేలెత్తించే ఏస్లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్లో కూడా అతను వాలీలు, డ్రాప్ షాట్లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్ వద్ద పేస్ ఆట తన పార్ట్నర్ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్.. కుర్రాళ్ల ఆటగా మారిపోయిన కొత్త తరంలో కూడా పేస్ నెట్ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ మాజీ సహచరుడు మహేశ్ భూపతి ప్రశంసించడం అతని ఆటలో పదునును చూపించింది. రాడ్లేవర్ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్.. వేర్వేరు భాగస్వాములతో కలసి 100కు పైగా మ్యాచుల్లో డబుల్స్ బరిలోకి దిగాడు. ఆటను పిచ్చిగా ప్రేమించిన పేస్ ఏ స్థాయిలోనైనా చివరి వరకు ఆడుతూనే వచ్చాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్లో తొలిసారి అతను చాలెంజర్ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. (క్లిక్ చేయండి: మేరీ కోమ్.. బాక్సింగ్ రింగ్ను శాశించిన ఉక్కు మహిళ) - మొహమ్మద్ అబ్దుల్ హాది -
లియాండర్ పేస్ గురువు కన్నుమూత
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. తన గురువులా భావించే మాజీ టెన్నిస్ ప్లేయర్, డేవిడ్ కప్ మాజీ కెప్టెన్ నరేశ్ కుమార్ బుధవారం రాత్రి కన్నుమూశారు.16 ఏళ్ల టీనేజర్ లియాండర్ పేస్కు మెంటార్గా వ్యవహరించిన నరేశ్ కుమార్.. పేస్ తన కెరీర్లో ఎదగడంలో పరోక్షంగా కీలకపాత్ర పోషించాడు. ఇక 1990 డేవిస్ కప్లో పేస్కు మెంటార్గా వ్యహరించిన నరేశ్ కుమార్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా, ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 93 ఏళ్ల నరేశ్ కుమార్ గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నిద్రలోనే మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యలు తెలిపారు. ఇక నరేశ్ కుమార్ 1928 డిసెంబర్ 22న లాహోర్లో జన్మించారు. ఆయనకు భార్య సునీత. కొడుకు అర్జున్, ఇద్దరు కూతుర్లు గీతా, ప్రియాలు సంతానం. 1949లో ఆసియా చాంపియన్షిప్స్ ద్వారా టెన్నిస్లో అరంగేట్రం చేసిన నరేశ్ కుమార్.. ఆ తర్వాత మరో టెన్నిస్ ప్లేయర్ రమానాథన్ కృష్ణన్తో కలిసి దాదాపు దశాబ్దానికి పైగా భారత్ నుంచి టెన్నిస్లో కీలకపాత్ర పోషించాడు. ఇక 1952లో డేవిస్ కప్ జర్నీ ఆరంభించిన నరేశ్ కుమార్ ఆ తర్వాత భారత్ తరపున డేవిడ్ కప్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక 1955లో నరేశ్ కుమార్ తన టెన్నిస్ కెరీర్లో ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో సింగిల్స్ విభాగంలో భారత్ తరపున తొలిసారి నాలుగో రౌండ్కు చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే నాలుగో రౌండ్లో అప్పటి టెన్నిస్ ప్రపంచ నెంబర్వన్ టోనీ ట్రేబర్ట్ చేతిలో ఓడినప్పటికి అతన్ని ముప్పతిప్పలు పెట్టి ఔరా అనిపించాడు. ఇక నరేశ్ కుమార్ ఖాతాలో ఐదు సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. 1952, 1953లో ఐరిస్ చాంపియన్షిప్స్.. 1952లో వెల్ష్ చాంపియన్స్, 1957లో ఎసెక్స్ చాంపియన్షిప్స్లు సొంతం చేసుకున్నాడు. ఇక 1969లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో నరేశ్ కుమార్ తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. అర్జున అవార్డు అందుకున్న నరేశ్ కుమార్.. 2000వ సంవత్సరంలో ద్రోణాచార్య లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న తొలి భారత టెన్నిస్ కోచ్గా నిలిచారు. -
టెన్నిస్ స్టార్తో త్వరలోనే ఖడ్గం బ్యూటీ వివాహం!
బాలీవుడ్ నటి, ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్బర్డ్స్ తమ ప్రేమను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కిమ్ శర్మ, పేస్ల తల్లిదండ్రులు కూడా ఇటీవలె ముంబైకి చేరుకున్నారని, పెళ్లికి సంబంధించి ఇరు కుటుంసభ్యులు చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి పేరెంట్స్ కిమ్, పేస్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో అతి త్వరలోనే అతి త్వరలోనే వీరిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. కిమ్-పేస్ల తల్లిదండ్రులు ఇలా కలుసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను వీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా కిమ్ కిమ్.. ఖడ్గం,మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆమె సినిమాల కంటే లవ్ ఎఫైర్స్తోనే బాగా పాపులర్ అయ్యింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కిమ్ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం నటుడు హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం లియాండర్ పేస్తో రిలేషన్షిప్లో ఉంది. -
మహిమాతో బ్రేకప్.. రియాతో సహజీవనం.. లియాండర్ పేస్ బ్రేకప్ స్టోరీ
ఆట లౌక్యాన్ని ప్రదర్శిస్తుంది.. నటన భావోద్వేగాన్ని అనుసరిస్తుంది! ఈ రెండిటి మధ్య ప్రేమ కుదిరితే లౌక్యం గెలుస్తుంది.. భావోద్వేగం వీలైతే సర్దుకుపోతుంది.. వీల్లేకపోతే ఓటమిని అంగీకరిస్తుంది.. బాలీవుడ్తో టెన్నిస్ కూడా ప్రేమలో పడింది. ఆ జంటే మహిమా చౌధరి, లియాండర్ పేస్!! లియాండర్, మహిమా.. ఒకరికొకరు పరిచయం అయ్యేనాటికి ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. ఒక పార్టీలో కలుసుకున్నారు ఇద్దరికీ కామన్గా ఉన్న స్నేహితుల ద్వారా. తొలి చూపులోనే మహిమాతో ప్రేమలో పడ్డాడు లియాండర్. అతని ప్రేమను చూసి మురిసిపోయింది మహిమా. కెరీర్ కన్నా అతనితో కలసి ఆస్వాదించే కాలానికే ప్రాధాన్యమిచ్చింది. ఇంకా చెప్పాలంటే లియాండర్ కెరీరే ముఖ్యమనుకుంది. అందుకే టెన్నిస్ ఆడడానికి అతను ఎక్కడికి వెళ్లితే అక్కడికి వెంటే వెళ్లింది. అతని బాగోగులను పట్టించుకుంది. అలా మూడేళ్లు సంతోషంగా గడిచిపోయాయి ఆ ఇద్దరి జీవితంలో! 2003... నెమ్మదిగా లియాండర్ పేస్ మది చలించసాగింది. కళ్లు ఇంకొకరి కోసం వెదకసాగాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్ రియా పిళ్లై. ఎక్కడో ఈవెంట్లో ఆమెను చూశాడు. ఇట్టే మనసు పారేసుకున్నాడు. ఆ విషయం రియాతో చెప్పాడు కూడా. అప్పటికే సంజయ్ దత్తో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న రియా.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. ఫోన్ కబుర్లు, డిన్నర్ డేట్లు షెడ్యూల్లో భాగమయ్యాయి. రియాకు తన టైమ్ ఇవ్వడం వల్ల సహజంగానే మహిమాకు దూరమవసాగాడు లియాండర్. గ్రహించింది ఆమె. కారణం అడిగింది. ‘చూస్తున్నావ్ కదా మ్యాచ్లు, ఎండార్స్మెంట్స్తో బిజీగా ఉంటున్నాను’ అని చెప్పాడు పొడిపొడిగా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో లియాండర్ ఎంగేజ్ అవడం మహిమా ఆలోచనల్లో అనుమానానికి తావిచ్చింది. ఒకసారి రియాతో అతను మాట్లాడుతుండగా విన్నది కూడా. నిలదీసింది. అప్పుడూ అదేం లేదంటూ ఆ సందర్భాన్ని తప్పించాడు. అయినా మహిమా మనసు లియాండర్ ప్రవర్తనను తప్పుపడుతూనే ఉంది. అందుకే లియాండర్ చెప్పే మాటలను నమ్మలేదు. ఒకసారి.. లియాండర్.. రియాతో చనువుగా ఉండడాన్ని చూసింది మహిమా. ‘ఇప్పుడు ఏం మాయ చేసి.. ఏ అబద్ధం చెప్పి దాటవేస్తావ్?’ అని ప్రశ్నించింది కళ్ల నిండా నీళ్లతో. తలవంచుకున్నాడు లియాండర్. చెదిరిన మనసుతో అతని జీవితం నుంచి తప్పుకుంది మహిమా. సహజీవనం మహిమాతో బ్రేకప్ తర్వాత వెంటనే రియాతో సహజీవనం స్టార్ట్ చేశాడు లియాండర్. 2005 –08 మధ్యలో ఆ ఇద్దరూ ముంబైలోని కొలాబాలో పెళ్లీ చేసుకున్నారని వదంతి. ఆ ఇద్దరికీ కూతురు పుట్టింది. పేరు అయానా. సంతోషంగా సాగిపోతోంది వాళ్ల కాపురం అనే అనుకున్నారు లియాండర్ అభిమానులు.. 2014లో లియాండర్, అతని తండ్రి మీద రియా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ పెట్టేదాకా. ఆ వార్త విని అంతా హతాశులయ్యారు. కూతురి కస్టడీ కోసమూ కేస్ ఫైల్ చేసింది రియా. వాళ్ల ప్రేమ.. అలా వివాదంగా ఎందుకు మారిందనే ఆరా మొదలైంది రియా అభిమానుల్లో. ‘రియా కోసం నన్ను మోసం చేసినట్టే ఇంకెవరికోసమో రియానూ మోసం చేసి ఉంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మహిమా. ఆమె అన్నట్టుగానే కొన్నాళ్లకే.. టెన్నిస్ క్రీడాకారిణి తన్వీ షాతో లియాండర్ ప్రేమలో పడ్డాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లోని సత్యాన్ని ఇటు లియాండర్ కానీ అటు తన్వీ కాని నిర్ధారించలేదు. కానీ ప్రస్తుతమైతే లియాండర్.. బాలీవుడ్ నటి కిమ్ శర్మతో రిలేషన్షిప్లో ఉన్నాడని వినికిడి. వాళ్లిద్దరూ కలసి గోవాలో హాలిడేస్ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వినికిడిని ఈ దృశ్యాలు నిజం చేసినట్టుగా భావిస్తున్నారు క్రీడా, సినీ అభిమానులు. మహిమా ఏం చేస్తోంది? లియాండర్ కోసం తన కెరీర్ను నిర్లక్ష్యం చేసిన మహిమా .. ప్రేమలో అతను చేసిన మోసం నుంచి బయటపడ్డాక బాబీ ముఖర్జీ అనే ఆర్కిటెక్ట్, బిజినెస్మన్ను పెళ్లిచేసుకుంది. వాళ్లకో కూతురు అరియానా. కానీ పరస్పర విరుద్ధమైన స్వభావాలు.. దాని వల్ల తలెత్తిన స్పర్థల వల్ల మహిమా, బాబీ సఖ్యంగా ఉండలేకపోయారు. కూతురుని పెట్టుకుని విడిగా ఉంటోంది మహిమా. మళ్లీ సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నిస్తోంది. లియాండర్ పేస్ గొప్ప టెన్నిస్ ప్లేయర్ కావచ్చు. కానీ నాతో మాత్రం ఫెయిర్గా లేడు. అతను ఇంకో స్త్రీ చుట్టూ తిరుగుతున్నాడనే నిజం తెలిసినప్పుడు నేనేమంత షాక్ అవలేదు. ఎందుకంటే అప్పటికే అతనెలాంటివాడో తెలిసిపోయింది. అందుకే ఆ బ్రేకప్ కూడా నా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకరకంగా నాకు హెల్పే చేసింది. నాలో పరిణతిని పెంచింది! – ఒక ఇంటర్వ్యూలో లియాండర్ పేస్ గురించి మహిమా చౌధరి. -ఎస్సార్ -
టీఎంసీ గూటికి దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు
Leander Paes Join TMC కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన టీఎంసీ.. గోవాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. గోవాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం టీఎంసీలోకి వలసలు భారీగా పెరిగాయి. రాజకీయ నాయకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా టీఎంసీలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ టీఎంసీలో చేరారు. ఆయనతో పాటు నటి నసిఫా అలీ, సామాజిక కార్యకర్త మృణాళిని దేశప్రభు శనివారం టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. వీరంతా మమతా బెనర్జీ సమక్షంలో వీరు పార్టీలో చేరినట్లు ప్రకటించారు. We are extremely delighted to share that Shri @Leander joined us today in the presence of our Hon'ble Chairperson @MamataOfficial! Together, we shall ensure that every single person in this nation sees the Dawn of Democracy that we have been waiting for since 2014! — All India Trinamool Congress (@AITCofficial) October 29, 2021 (చదవండి: ‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?) టీఎంసీలో చేరిన అనంతరం లియాండ్ పేస్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాను. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. దేశంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. దీదీ నిజమైన చాంపియన్’’ అన్నారు. చదవండి: జేమ్స్ బాండ్ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు -
Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు!
Leander Paes- Mahesh Bhupathi Web Series Break Point: వ్యక్తిగతంగా ఒకరితో మరొకరికి పడకపోయినా కోర్టులో దిగితే మాత్రం కలిసి కట్టుగా అద్భుత విజయాలు సాధించడం తమకే చెల్లిందని భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నిరూపించారు. దశాబ్దానికిపైగా భారత టెన్నిస్ ముఖ చిత్రంగా ఉన్న వీరిద్దరు 1994–2006, 2008–2011 మధ్య డబుల్స్ జోడీగా చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. 1999లో జరిగిన నాలుగు గ్రాండ్స్లామ్ టోరీ్నల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)నూ పురుషుల డబుల్స్లో ఫైనల్కు చేరిన ఈ జంట... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ల్లో విజేతలుగా నిలిచింది. అనంతరం 2001 ఫ్రెంచ్ ఓపెన్లో ఈ జోడి మరోసారి చాంపియన్గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వీరిని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ అంటూ భారతీయులు కీర్తించారు. అయితే ఈ గొప్ప ఘనతలు సాధించే సమయంలో తమ మధ్య సఖ్యత లేదని వీరు వ్యాఖ్యానించారు. అయినా ఏదో తెలియని సోదరభావం తమని కలిసి ఆడేలా చేసిందని వీరు పేర్కొన్నారు. పేస్, భూపతిల ఆట, అనుబంధం, స్పర్ధలు, గెలుపోటములు... ఇలా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని పలు ఆసక్తికర అంశాలతో ‘బ్రేక్ పాయింట్’ అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ట్రయిలర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేస్, భూపతి అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అశ్విని అయ్యర్ తివారి, నితీశ్ తివారిల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రేక్ పాయింట్’ ‘జీ5’ ఓటీటీలో అక్టోబర్ 1న విడుదల కానుంది. -
Kim Sharma: ‘ఖడ్గం’ ఫేమ్ కిమ్ శర్మ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తోంది?
Kadgam Actress Kim Sharma Life Story: ‘ముసుగు వేయొద్దు మనస్సు మీద.. వలలు వేయొద్దు వయస్సు మీద’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలో అలరించిన కిమ్ శర్మ గుర్తుంది కదా.. తన గ్లామర్ తో కుర్రాల మనసుల మీది ముసుగు లాగేసిందీ ఈ బోల్డ్ బ్యూటీ. తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’మగధీర (స్పెషల్ సాంగ్) వంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామ.. ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్ మూవీ డర్(1993)లో అతిథి పాత్రతో వెండితెరకు పరిచయం అయింది కిమ్ శర్మ. ఆ తర్వాత మొహబతీన్ సినిమాలో హీరోయిన్ గా అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ .. 2002లో ఖడ్గం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కిమ్ శర్మ. ఆ తర్వాత మగధీర సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించి మెప్పించింది. (చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా) యువరాజ్ ప్రేమాయణం.. బిజినెస్ మ్యాన్తో వివాహం ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది ఈ భామ. పబ్లిక్గా చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అప్పట్లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరికీ 2007లో బ్రేకప్ అయిపోయింది. 2010లో బిజినెస్ టైకూన్ అలీ పంజనీని పెళ్లి చేసుకున్న కిమ్ శర్మ భర్తతోపాటు కెన్యాకు వెళ్లిపోయింది. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో అతనితో విడాకులు తీసుకొని తిరిగి ముంబై వచ్చేసింది. విడాకులు తీసుకునే సమయంలో ఆమె మాజీ ప్రియుడు యువరాజ్ సింగ్ కిమ్ కెన్యాకు వెళ్లడం గమనార్హం. అలీతో విడాకులు తీసుకున్న తర్వాత కిమ్ శర్మ, హర్షవర్థన్ రాణేల డేటింగ్ నడిపిందని వార్తలు వచ్చాయి. లియాండర్ పేస్తో డేటింగ్! ప్రస్తుతం ఈ బ్యూటీ టెన్నిస్ మాజీ ప్లేయర్ లియాండర్ పేస్తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి గోవాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లిన ఫోటోలు కూడా మీడియాకు చిక్కాయి. అయితే వీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కానీ.. వారి డేటింగ్ విషయమై ఇంతవరకు నోరు విప్పలేదు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కిమ్.. త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
టెన్నిస్ దిగ్గజంతో ఖడ్గం బ్యూటీ డేటింగ్..?
ముంబై: 1996 అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 18 గ్రాండ్స్లామ్ల విజేత(డబుల్స్, మిక్స్డ్ డబుల్స్), భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్(48).. ఖడ్గం సినిమా బ్యూటీ కిమ్ శర్మతో డేటింగ్లో ఉన్నాడని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ.. వీరి జోడీ గోవా బీచ్లో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అయితే వీరిద్దరూ ఇలా కెమెరా కంటికి చిక్కడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో వీరు దగ్గరగా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా గోవా పర్యటనకు సంబంధించిన ఫోటోలను వారు బస చేసిన హోటల్ యాజమాన్యమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa) కాగా, 2007లో కిమ్ శర్మ.. టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువ్రాజ్సింగ్తో ప్రేమాయణం సాగించింది. అయితే, వీరిద్దరికి పొసగకపోవడంతో కొద్దికాలంలోనే విడిపోయారు. ఆతర్వాత యువీ.. హేజిల్ కీచ్ను పెళ్లి చేసుకోగా, కిమ్ 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను మనువాడింది. అయితే, 2016లో అతని నుంచి కూడా విడాకులు తీసుకున్న ఈ 40 ఏళ్ల ఢిల్లీ భామ.. ఆతర్వాత నటుడు హర్షవర్ధన్ రాణేతో ప్రేమాయణం సాగించింది. View this post on Instagram A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa) ఆతర్వాత ఏమైందో తెలీదు కానీ ప్రస్తుతం ఆమె పేస్తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పేస్ సైతం చాలా మందితో ఎఫైర్లు నడిపాడు. ఇటీవలి కాలంలో అతను ప్రముఖ మోడల్ రియా పిళ్ళైతో సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతానికైతే పేస్, కిమ్ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. కాగా, కిమ్.. కృష్ణవంశీ పాపులర్ సినిమా ఖడ్గంలో 'ముసుగు వేయొద్దు మనసు మీద'.. అలాగే మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ భారీ ప్రేక్షకాధరణ పొందింది. View this post on Instagram A post shared by The Project Café Ahmedabad (@theprojectcafeahd) -
‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?
కోల్కతా: వరుసగా ఎనిమిది ఒలింపిక్స్లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ శుక్రవారం స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు. ‘మహమ్మారి బారిన పడతామని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత కూడా నేను నా లక్ష్యంపై స్పష్టతతో ఉన్నా. శారీరకంగా, మానసికంగా ఒలింపిక్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చరిత్ర పుటల్లో భారత్ పేరు లిఖించేందుకే నేను 30 ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పుడు నాకు 48 ఏళ్లు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. నేను కొట్టే టెన్నిస్ బంతికి నా వయస్సు గురించి తెలియదు. కేవలం ఎంత బలంగా, వేగంగా బాదుతున్నాననే అంశంపై అది కదులుతుంది. నాలో మరో ఒలింపిక్స్ ఆడేందుకు కావాల్సినంత ప్రేరణ ఉంది. విశ్వ క్రీడల్లో అత్యధికంగా వరుసగా ఎనిమిదిసార్లు టెన్నిస్ ఆడిన వ్యక్తిగా భారత్ పేరిట రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. టోక్యో ద్వారా ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నా’ అని పేస్ వివరించాడు. నిజానికి గతేడాది క్రిస్మస్ రోజున... 2020 టెన్నిస్ సీజన్తో తన ప్రొఫెషనల్ కెరీర్ను ముగిస్తానని పేస్ ప్రకటించాడు. ఈ మేరకు ‘వన్ లాస్ట్ రోర్’ స్లోగన్తో ఇతర టోర్నీల్లో పాల్గొన్నాడు. కరోనా కారణంగా ఏడాదిపాటు ఒలింపిక్స్ వాయిదా పడటంతో పేస్ మళ్లీ రాకెట్పట్టడం అనుమానంగా మారింది. తాజాగా పేస్ తన మనసులో మాటను బయటపెట్టడంతో ఒలింపిక్స్లో అతని ప్రాతినిధ్యం ఖాయంగానే అనిపిస్తోంది. ఈ సైకిల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పేస్.. సైకిల్ను నడిపించే ప్రయత్నంలో ఇలా జారి కిందిపడ్డాడు. -
స్పాన్సర్లు వస్తారా?
కోల్కతా: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో జపాన్ దేశం ఒలింపిక్స్ను ఎలా నిర్వహిస్తుందో తనకు అర్థం కావడం లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. ఒక అగ్రశ్రేణి ఆటగాడికి కరోనా సోకితే పరిస్థితి ఏమిటని అతను ప్రశ్నించాడు. ‘ఒలింపిక్స్కు అండగా నిలిచే కార్పొరేట్ స్పాన్సర్లు ఎప్పటిలాగే ముందుకొస్తారా అనేది సందేహమే. ఒకవేళ ప్రేక్షకులు లేకుండా నిర్వహించాల్సి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు. మైదానాలు ఖాళీగా ఉంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. క్రీడలు కూడా ఒక పెద్ద వ్యాపారమే. నా చేతులకు కూడా పెద్ద మొత్తంలో బీమా ఉంటుంది. అనుమతి లేకుండా నేను టమాటాలు కూడా కోయలేను. ఫుట్బాల్ లీగ్లు ప్రారంభించారు సరే దురదృష్టవశాత్తూ ఏ రొనాల్డోకో, మెస్సీకో కోవిడ్–19 సోకితే ఏం చేస్తారు. ఆ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడటాన్ని మనం ఊహించగలమా. ఫుట్బాల్ అయినా సరే మ్యాచ్లో ఏదో ఒక సమయంలో ఆటగాళ్లు దగ్గరకు వస్తూనే ఉంటారు కదా. ఇలాంటి స్థితిలో క్రీడలు ఎలా సాధ్యం’ అని 1996 అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అభిప్రాయం వ్యక్తం చేశాడు. నాలో కొత్త వెర్షన్ను చూస్తారు... సుమారు మూడు దశాబ్దాలుగా సాగుతున్న ప్రొఫెషనల్ కెరీర్కు గుడ్బై చెప్పే క్రమంలో ‘వన్ లాస్ట్ రోర్’ అంటూ ఈ ఏడాది ముగిసేవరకు ఆడే విధంగా 2020 ఆరంభంలో పేస్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా టోక్యో ఒలింపిక్స్లో పాల్గొని ఎనిమిదోసారి ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని కూడా అతను కలగన్నాడు. అయితే ఇప్పుడు కోవిడ్–19 కారణంగా అంతా తలకిందులైంది. ఒలింపిక్స్ సంవత్సరంపాటు వాయిదా పడగా... ప్రస్తుత సీజన్లో ఎన్ని టెన్నిస్ టోర్నీలు జరుగుతాయనేది కూడా సందేహమే. ఈ నేపథ్యంలో అరుదైన ఘనత సాధించే అవకాశం తనకు దూరం కావచ్చని అతను అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్స్ గురించి నేను నిజంగానే ఆందోళన చెందుతున్నాను. ఒక చరిత్ర సృష్టించేందుకు, భవిష్యత్తుపై నా ముద్ర నిలిచిపోయేందుకు నాకు అది మంచి అవకాశంగా కనిపించింది. ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా సీజన్ను ముగించాలని అనుకున్నా. కానీ ఏడాది ఆలస్యమైన పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అనేది సందేహమే. దాదాపు 30 ఏళ్ల ఆట తర్వాత ఇక చాలంటూ రిటైర్ కావాలని గత సెప్టెంబరులో అనుకున్నాను. అయితే విరామం తీసుకొని కుటుంబంతో గడిపాక ఆలోచన మారింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా నాన్నతో ఎంతో సమయం వెచ్చించగలగడం సంతోషం. లాక్డౌన్ ముగిశాక మళ్లీ కోర్టులోకి అడుగు పెడతాను. ఒక కొత్త వెర్షన్ పేస్ను మీరు చూస్తారు. 30 ఏళ్ల వయసు లో ఎలా ఉండేవాడినో అలా వస్తాను’ అని పేస్ వెల్లడించాడు. -
100 గ్రాండ్ స్లామ్లు ఆడటం నా కల
న్యూఢిల్లీ: 100 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆడాలనుకున్న తన కల కరోనా కారణంగా అనిశ్చితిలో పడిందని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. రికార్డుస్థాయిలో వరుసగా ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాలన్న తన ఆశయాన్ని కూడా కరోనా చిదిమేసిందని పేర్కొన్నాడు. తన కెరీర్కు ఈ ఏడాదే చివరిదని పేస్ గతంలోనే ప్రకటించాడు. ఇప్పటివరకు 97 గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడిన పేస్ మరో మూడింటిలో పాల్గొంటే 100 గ్రాండ్స్లామ్ల మైలురాయిని చేరుకుంటాడు. అయితే కరోనాతో గ్రాండ్స్లామ్ టోర్నీల నిర్వహణపై అనిశ్చితితోపాటు ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తన ఆశలు నెరవేరేలా లేవన్నాడు. ‘100 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ప్రాతినిధ్యం, ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో ఆడిన టెన్నిస్ ప్లేయర్గా రికార్డు సృష్టించడం నా ముందున్న లక్ష్యాలు. వాటిని సాధించాలని పట్టుదలతో ఉన్నా. ఒకవేళ అందుకోలేకపోయినా... ఇప్పటివరకు సాధించిన వాటిపట్ల సంతృప్తిగానే ఉంటా. లాక్డౌన్ ఎత్తేశాక 2021లో కూడా ఆడాలా? వద్దా? అనేది నా టీమ్తో కలిసి నిర్ణయం తీసుకుంటా’ అని పేస్ వివరించాడు. -
టైటిల్ పోరుకు పేస్ జోడీ
బెంగళూరు: ఈ ఏడాదిలో రిటైర్ కానున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పేస్ (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్)–ఆండ్రీ వాసిలెవ్స్కీ (బెలారస్) జోడీపై గెలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జోడీలు తమ సరీ్వస్లను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే సూపర్ టైబ్రేక్లో మాత్రం పేస్ జంట పైచేయి సాధించి ఫైనల్కు చేరింది. -
మూడు దశాబ్దాల ఆటకు వీడ్కోలు
29 ఏళ్ల క్రితం... 16 ఏళ్ల ఒక టీనేజీ కుర్రాడు తొలిసారి భారత జట్టు తరఫున డేవిస్ కప్ మ్యాచ్ ఆడాడు. డబుల్స్ మ్యాచ్లో సీనియర్ సహచరుడు జీషాన్ అలీతో కలిసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్పై భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు 46 ఏళ్ల ప్రాయంలోనూ కూడా అదే ఉత్సాహం, అదే జోరు... పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్... దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్న ఆ శరీరానికి అలసట వచ్చేసింది. వయసును గెలిచిన ‘ఆ కుర్రాడు’ వచ్చే ఏడాది తన మూడు దశాబ్దాల టెన్నిస్ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం 18 గ్రాండ్స్లామ్ టైటిల్స్... ఒలింపిక్స్లో కాంస్య పతకం... 55 కెరీర్ టైటిల్స్... ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకుంటూ వస్తున్న రికార్డులకైతే అంతే కనిపించడం లేదు. అలసిపోవడం లేదు, ఫిట్నెస్ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజులే లేవు... ఈ మనిషికి ఎలా సాధ్యం. మూడు పదులు దాటగానే కెరీర్ చరమాంకంలోకి వచి్చందని చాలా మంది భావించే ఆటలో 46 ఏళ్ల వయసు వచి్చనా గ్రాండ్గా ఆడి చూపిస్తున్న అద్భుతం పేరే లియాండర్ పేస్. అతను తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన రోజు నుంచి డేవిస్ కప్లో కొత్త రికార్డు సృష్టించే వరకు టెన్నిస్లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి స్టీఫెన్ ఎడ్బర్గ్, బోరిస్ బెకర్, ఇవాన్ లెండిల్లాంటి వాళ్లు ఆటకు గుడ్బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్ కెరీర్ సాగింది. ఇప్పుడు ఫెడరర్, నాడల్, జొకోవిచ్ల కాలంలోనూ పేస్ రాకెట్ మాట్లాడుతూనే ఉంది. పేస్ ఆడేది డబుల్స్లోనే అయినా మ్యాచ్ ఫిట్నెస్ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్ గేమ్ అయిన క్రికెట్లో 24 ఏళ్లు ఆడిన సచిన్ను ఆశ్చర్యంతో భారత క్రీడాభిమానులు చూశారు. కానీ టెన్నిస్లాంటి క్రీడలో 29 ఏళ్లుగా సత్తా చాటడం పేస్లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. అట్లాంటాతో అంబరాన... పేస్ 1990లో జూనియర్ వింబుల్డన్... 1991లో జూనియర్ యూఎస్ ఓపెన్ గెలిచి వరల్డ్ నంబర్వన్గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత సుదీర్ఘకాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్కు వ్యక్తిగత ఒలింపిక్ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్... ఇప్పటికీ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్లో పీట్ సంప్రాస్ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్ కూడా ఉంది. డేవిస్ కప్ సూపర్ స్టార్... పేస్కు సంబంధించి ప్రతీ భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్ కప్ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే వాలి బలం రెట్టింపు అయిపోయినట్లు... భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్ ఆటతీరు కూడా ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోరీ్నల సంగతి ఎలా ఉన్నా... దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్ పతకం తర్వాత లియాండర్ ఆడిన అన్ని డేవిస్కప్ మ్యాచ్లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంత బలమైన ఆటగాడు అయినా వీరోచిత ప్రదర్శనతో పేస్ డేవిస్ కప్లో భారత్కు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్సెవిచ్, టిమ్ హెన్మన్, వేన్ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్ ర్యాంక్లలో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచి్చన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్కప్ వరల్డ్ గ్రూప్లో భారత్ సెమీస్ చేరడంలో పేస్దే కీలక పాత్ర. మృత్యువుతో పోరాడి... 2003లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న సమయంలో అటు వైపు కోర్టు నుంచి బంతి పేస్ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లు కమ్మాయి. శరీరంపై నియంత్రణ లేక నిలబడేందుకు భాగస్వామి మారి్టనా నవ్రతిలోవాను పట్టుకున్నాడు. అది బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. చివరకు అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్కు మద్దతుగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకునేందుకు కూడా మారి్టనా నవ్రతిలోవా సిద్ధమైంది. దాని నుంచి కోలుకున్న తర్వాత పేస్ మళ్లీ ప్రాక్టీస్కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. వచ్చే ఏడాదే ఆఖరు... పేస్ ఆటతీరు భీకరమైన సరీ్వస్లు, బెంబేలెత్తించే ఏస్లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్లో కూడా అతను వాలీలు, డ్రాప్ షాట్లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్ వద్ద పేస్ ఆట తన పార్ట్నర్ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్ కుర్రాళ్ల ఆటగా మారిపోయిన ఈతరంలో కూడా పేస్ నెట్ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ ఇటీవల మాజీ సహచరుడు మహేశ్ భూపతి ప్రశంసించడం అతని ఆటలో ఇంకా పదును మిగిలి ఉందనే చూపిస్తోంది. రాడ్ లేవర్ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్, 100కు పైగా వేర్వేరు భాగస్వాములతో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు. ఇటీవల పదే పదే అతని రిటైర్మెంట్పై వార్తలు రావడం, దానిని అతను ఖండించడం చాలా సార్లు జరిగాయి. వయసు పెరిగిన కొద్దీ ఇలాంటివి వినిపించడం సహజం. అయితే ఆటను పిచి్చగా ప్రేమించే పేస్, ఏ స్థాయిలోనైనా దానిని కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్లో తొలిసారి అతను చాలెంజర్ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. డబుల్స్లో ప్రస్తుతం ప్రపంచ 105వ ర్యాంకర్గా ఉన్న పేస్ వచ్చే ఏడాది కెరీర్కు వీడ్కోలు పలుకనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించాడు. కొన్ని విశేషాలు.... ►అంతర్జాతీయ టెన్నిస్లో 700కు పైగా విజయాలు సాధించిన కేవలం ఎనిమిది మంది ఆటగాళ్ళలో ఒకడు. 18 గ్రాండ్స్లామ్లు (8 పురుషుల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్) గెలిచాడు. ►వరుసగా 7 ఒలింపిక్స్లలో (1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016) పాల్గొన్న ఏకైక టెన్నిస్ ఆటగాడు. 1999లో డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. వరుసగా 19 సీజన్ల పాటు (1997–2015) ఏడాదికి కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచాడు. ►తన ప్రొఫెషనల్ కెరీర్లో పేస్ ఇప్పటివరకు 55 టైటిల్స్ సాధించాడు. ఇందులో సింగిల్స్లో ఒక టైటిల్ ఉండగా... మిగతా 54 టైటిల్స్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. ►సింగిల్స్ విభాగంలో పేస్ 101 మ్యాచ్ల్లో గెలిచి... 99 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. డబుల్స్లో పేస్ 767 మ్యాచ్ల్లో విజయం సాధించి... 455 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో పేస్ 85,71,006 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 61 కోట్ల 11 లక్షలు) సంపాదించాడు. ►1990లో జపాన్పై డేవిస్ కప్లో అరంగేట్రం చేసిన పేస్ 57 సార్లు డేవిస్ కప్ బరిలోకి దిగాడు. 92 మ్యాచ్ల్లో గెలిచి (సింగిల్స్లో 48; డబుల్స్లో 44)... 35 మ్యాచ్ల్లో (సింగిల్స్లో 22; డబుల్స్లో 12) ఓడిపోయాడు. డేవిస్కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (44) సాధించిన ప్లేయర్గా పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ►ముందుగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేరి్పన క్రమశిక్షణ, చేసిన మార్గదర్శనం, కల్పించిన వాతావరణం ఇవన్నీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. వారు నా పట్ల కనబరిచిన అనిర్వచనీయమైన ప్రేమ ఎప్పటికీ మరువలేను. అమ్మా–నాన్న... మీరు లేకుంటే నేనూ లేను. ఐ లవ్ యూ. మా అక్కలకు థ్యాంక్స్ చెప్పాలి. జాక్వి, మరియాలిద్దరు నాకంటే పెద్దవాళ్లు. వాళ్లే నన్నింతలా మార్చేశారు. జీవన ప్రయాణంలో ఎత్తుపల్లాలు అర్థమయ్యేలా చేశారు. నేనో పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు బాగా సహకరించారు. తల్లిదండ్రులు చెప్పిన నైతిక విలువల్ని నేనూ పాటించేలా చేశారు. ఐ లవ్ యూ సిస్టర్స్. ఇక నా గారాలపట్టి... కుమార్తె అయానా! పాప లవ్స్ యూ. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అంశం కూతుర్ని కలిగి ఉండటం అనేది నీ వల్లే నాకు అర్థమైంది. అయానా నీవే నాకు స్ఫూర్తి. నా కెరీర్లో మిగిలున్నది 2020 టెన్నిస్ క్యాలెండరే! కేవలం ఎంపిక చేసుకున్న టోర్నీలే ఆడతాను. నా జట్టుతో చేసే ఆఖరి క్రీడా పయనాన్ని గొప్పగా మలచుకుంటా. సహచరులు, మిత్రులు, అభిమానులతో ఆనందంగా గడుపుతా. నా సుదీర్ఘ ప్రయాణానికి అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. అభిమానులకు విన్నపం. నాతో ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఉంటే ‘లియాండర్ మెమోరిస్’కు షేర్ చేయండి. నేను నా మధుర స్మృతుల్ని మీతో పంచుకుంటాను. ‘గుడ్బై ఇయర్గా 2020 నాకు ఉద్వేగంగా గడువనుంది. భారంగా నేను రాకెట్ను విడువనున్నాను. – ట్విట్టర్లో లియాండర్ పేస్ పేస్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ పురుషుల డబుల్స్ ► ఆస్ట్రేలియన్ ఓపెన్: 2012 ►ఫ్రెంచ్ ఓపెన్: 1999, 2001, 2009 ►వింబుల్డన్: 1999 ►యూఎస్ ఓపెన్: 2006, 2009, 2013 మిక్స్డ్ డబుల్స్ ►ఆస్ట్రేలియన్ ఓపెన్: 2003, 2010, 2015 ►ఫ్రెంచ్ ఓపెన్: 2016 ►వింబుల్డన్: 1999, 2003, 2010, 2015 ►యూఎస్ ఓపెన్: 2008, 2015 ►పేస్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో అర్జున అవార్డు...1996–1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’... 2001లో ‘పద్మశ్రీ’... 2014లో ‘పద్మభూషణ్’ అవార్డులు అందజేసింది. -
భారత్ 3.. పాకిస్తాన్ 0
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్లో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పాకిస్తాన్తో జరిగిన మూడో మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించి తన స్కోరు 3-0కు పెంచుకుంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్-–జీవన్ నెడుంజెళియన్ జోడీ 6-1, 6-3 తేడాతో అబ్దుల్ హుజైఫా రెహ్మాన్–షోయబ్ మొహమ్మద్ తేడాతో గెలిచింది. తొలి సెట్ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 3-3తో ఉన్నప్పుడు నువ్వు-నేనా అన్నట్లు సాగింది. కాగా, లియాండర్ పేస్ జంట అద్భుతమైన స్మాష్లను సంధించడంతో పైచేయి సాధించింది. ఇదే ఊపును కొనసాగించడంతో ఆ సెట్ను 6-3 తేడాతో గెలుచుకోవడంతో పాటు మ్యాచ్ను కూడా సొంతం చేసుకుంది. కేవలం 53 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక్కడ పాకిస్తాన్ టెన్నిస్ ఆటగాళ్ల అనుభవలేమి స్పష్టంగా కనబడింది. పేస్ రికార్డు 44కు చేరింది.. గతేడాది డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డబుల్స్ ఆటగాడిగా రికార్డు సాధించిన లియాండర్ పేస్ తన రికార్డును మరింత పెంచుకున్నాడు. తాజా విజయంతో డబుల్స్ విభాగంలో 44వ గెలుపును అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఇటాలియన్ ఆటగాడు నికోలా పీట్రెంజెలీ(42) ఉన్నాడు. 57 డేవిస్ కప్ మ్యాచ్లకు గాను 44 విజయాలను పేస్ సాధించగా, నికోలా 66 మ్యాచ్ల్లో 42 విజయాలు నమోదు చేశాడు. పేస్ 44 డబుల్స్ డేవిస్ కప్ రికార్డు సుదీర్ఘ కాలం చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం టెన్నిస్ ఆడుతున్న డబుల్స్ ప్లేయర్లు ఎవరూ టాప్-10లో లేరు. పాకిస్తాన్తో తటస్థ వేదికపై శనివారం మొదలైన ఈ పోరులో భారత్ 2–0తో ఆధిక్యంతో దూసుకుపోయింది. తొలి మ్యాచ్లో ప్రపంచ 176వ ర్యాంకర్, 25 ఏళ్ల రామ్కుమార్ రామనాథన్ 6–0, 6–0తో 17 ఏళ్ల షోయబ్ మొహమ్మద్పై గెలిచాడు. రెండో మ్యాచ్లో ప్రపంచ 131వ ర్యాంకర్, 22 ఏళ్ల సుమీత్ నాగల్ 6–0, 6–2తో 17 ఏళ్ల అబ్దుల్ హుజైఫా రెహ్మాన్పై గెలిచాడు. తాజా గెలుపుతో భారత్ ఆధిక్యం 3-0కు పెరిగింది. దాంతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్తో క్రొయేషియా జట్టుతో పోరుకు మార్గం సుగుమం అయ్యింది. -
పేస్ పునరాగమనం!
న్యూఢిల్లీ: భద్రతా కారణాలదృష్ట్యా పాకిస్తాన్లో డేవిస్ కప్ మ్యాచ్ ఆడేందుకు పలువురు భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారులు విముఖత చూపిన నేపథ్యంలో... వెటరన్ స్టార్, 46 ఏళ్ల లియాండర్ పేస్ ముందుకొచ్చాడు. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా నవంబర్ 29, 30వ తేదీల్లో ఇస్లామాబాద్లో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కోసం తాను అందుబాటులో ఉంటానని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వర్గాలకు తెలిపాడు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) కోరిక మేరకు... ఈ పోటీలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేసేందుకు అవసరమైన పత్రాలను పాకిస్తాన్ అధికారులకు పంపించామని ఏఐటీఏ జనరల్ సెక్రటరీ హిరణ్మయ్ చటర్జీ తెలిపారు. పాకిస్తాన్తో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేనితోపాటు అర్జున్ ఖడే, విజయ్ సుందర్ ప్రశాంత్, శ్రీరామ్ బాలాజీ, సిద్ధార్థ్ రావత్, మనీశ్ సురేశ్ కుమార్, శశికుమార్ ముకుంద్ ఉన్నారు. -
మొన్న అర్జున్.. నిన్న పేస్తో ఆటాడిన ధోని
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ అనంతరం టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రికెట్కు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్కు విరామం తీసుకున్న ధోని.. ప్రస్తుతం కూడా సెలక్షన్స్కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధోని సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన ఛారిటి ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొని అభిమానులను అలరించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఛారిటి ఫుట్బాల్ మ్యాచ్లను రితి స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం జరిగిన ఓ మ్యాచ్లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్తో, సోమవారం జరిగిన మరో మ్యాచ్లో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్తో ధోని తలపడ్డాడు. ఈ మ్యాచ్కు సంబంధించిన ఫోటోలను రితి స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారాయి. ఇక ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్పై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ధోని ప్రత్యామ్నయంగా వచ్చిన యువ క్రికెటర్ రిషభ్ పంత్ వరుసగా విపలమవుతుండటం అందరినీ నిరాశకు గురిచేస్తోంది. -
పేస్-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, అతనితో సహజీవనం చేసిన మాజీ స్నేహితురాలు రియా పిళ్లై మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ‘కుటుంబ సంరక్షణ కేసు’లో దిగువ కోర్టుకు సుప్రీం కోర్టు మరో ఏడాది గడువు ఇచ్చింది. పేస్, రియా మధ్య ఉన్న వివాద పరిష్కారానికి సంవత్సరం వ్యవధి ఇచ్చి ఆపై తీర్పునివ్వాలని ఫ్యామిలీ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2014లో పేస్పై రియా గృహ హింస కేసు పెట్టడంతో తొలిసారి వివాదం కోర్టుకు చేరింది. తమ కూతురు సంరక్షణ, భరణం అంశాల్లో వీరిద్దరి మధ్య వివాదం ముదిరింది. వీరిద్దరు కూర్చొని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినా అది సాధ్యం కాలేదు. భరణం కింద ఇల్లు గానీ డబ్బు గానీ ఇవ్వాలని రియా కోరగా... తాను అసలు ఆమెను పెళ్లే చేసుకోలేదు కాబట్టి కుదరదని పేస్ కోర్టులో మరో కేసు దాఖలు చేశాడు. -
సెమీస్లో పేస్ జంట
న్యూపోర్ట్ (అమెరికా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఏటీపీ–250 టోర్నమెంట్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ లియాండర్ పేస్–మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–రాబర్ట్ లిండ్స్టెట్ (స్వీడన్) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్ 1995లో హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్ జాన్ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్జోస్ టోర్నీ) తర్వాత ఏటీపీ టోర్నీలో సెమీఫైనల్కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. -
ఇంకా ఆడుతున్నాడు... గెలుస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్. వయసులో ఫిఫ్టీకి చేరువవుతున్నా... వన్నె తగ్గని ఈ వెటరన్ స్టార్ టోక్యో ఒలింపిక్స్పై కూడా దృష్టి పెట్టాడు. 46 ఏళ్ల పేస్ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నాడు. పురుషుల డబుల్స్లో స్థానిక భాగస్వామి బెనోయిట్ పెయిర్తో కలిసి శుభారంభం చేశాడు. టెన్నిస్లో ఓపెన్ శకం మొదలయ్యాక మ్యాచ్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా పేస్ నిలిచాడు. తన కీర్తి కిరీటంలో చేరిన ఈ ఘనతపై అతను మాట్లాడుతూ ‘30 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా. నా సుదీర్ఘ ప్రస్థానంలో 12 తరాల ఆటగాళ్లను చూశా. ఆల్టైమ్ గ్రేట్ పీట్ సంప్రాస్, ప్యాట్ రాఫ్టర్లు సింగిల్స్ ఆడితే... నేను డబుల్స్ ఆడాను. టెన్నిస్లో నాకంటూ గౌరవాన్ని సంపాదించుకున్నాను’ అని అన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా...రాఫెల్ నాదల్, అతని మాజీ కోచ్ టోనీ ఎదురుపడినపుడు ఆసక్తికర సంభాషణ జరిగిందన్నాడు. ‘నేను నా డబుల్స్ మ్యాచ్ ముగించుకొని వస్తుంటే వాళ్లిద్ద రూ ఎదురయ్యారు. నన్ను గుర్తించిన కోచ్ టోనీ... లియో (పేస్) నీకు 46 ఏళ్ల వయసు కదా! అంటే ఔనన్నా. రొలాండ్ గారోస్లో 1989 (జూనియర్స్), తర్వాత సీనియర్స్ ఆడావుగా అంటే ఔననే చెప్పా. ఇన్నేళ్లయినా మళ్లీ ఇక్కడ తొలి గేమ్ గెలిచావంటా... అంటే ఔననే తల ఊపాను. వెంటనే నాదల్తో చూశావా నాదల్... 46 వయసులో పేస్ ఆడటమే కాదు గెలవడం కూడా చేస్తున్నాడు’ అని చెప్పారు. ఓ మేటి కోచ్ మరో దిగ్గజ ఆటగాడు (నాదల్)తో తన గురించి చెబుతుంటే ఎంతో సంతోషం కలిగిందన్నాడు. టెన్నిస్లో అప్పటి దిగ్గజాల నుంచి ఇప్పటి గ్రేటెస్ట్ స్టార్ల వరకు అందరూ తనను గుర్తిస్తారని, గౌరవంతో చూస్తారని పేస్ చెప్పుకొచ్చాడు. నాదల్, రోజర్ ఫెడరర్లిద్దరూ తనకు టీనేజ్ వయసు నుంచే తెలుసని చెప్పాడు. ‘నా జీవితంలో టెన్నిస్తో నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. సుదీర్ఘ కెరీర్ను కొనసాగిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడైతే (ఫ్రెంచ్ ఓపెన్లో) నాలుగు సార్లు డబుల్స్ టైటిల్ సాధించాను. అలసట ఎరుగని నా పయనంలో ఆటను ఇప్పుడప్పుడే ఆపలేను. 2020 ఒలింపిక్స్ కూడా ఆడేస్తానేమో. ఇప్పటికే అత్యధిక ఒలింపిక్స్ (6) ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాను. మరోటి ఆడితే ఆ రికార్డును మెరుగుపరుచుకుంటా’ అని పేస్ వివరించాడు. -
క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది: శ్రీశాంత్
న్యూఢిల్లీ : ‘42 ఏళ్ల వయసులో లియాండ్ పేస్ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. 36 ఏళ్ల వయసులో కనీసం కొంతవరకైనా మంచి క్రికెట్ ఆడలేనా’అంటూ క్రికెటర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు. అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ)ను సుప్రీం కోర్టు ఆదేశించడంతో శ్రీశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందన్నాడు. వయసు అసలు సమస్యే కాదన్న శ్రీశాంత్.. ఫిట్గా ఉన్నంత కాలం క్రికెట్ ఆడొచ్చన్నాడు. ఈ ఆరు సంవత్సరాలు తన జీవితంలో చీకటి రోజులుగా మిగిలిపోతాయన్నాడు. తాను నిర్దోషినని తెలిసి కూడా బీసీసీఐ నిషేధం విధించిందన్నాడు. ఇప్పటికైనా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. (శ్రీశాంత్కు భారీ ఊరట) వాళ్లు టచ్లో ఉన్నారు.. తనపై నిషేధం విధించడంతో కనీసం క్లబ్ క్రికెట్ కూడా ఆడలేకపోయానని శ్రీశాంత్ వాపోయాడు. కౌంటీ క్రికెట్ ఆడటానికి కూడా బీసీసీఐ అనుమతి నిరాకరించిందని గుర్తుచేశాడు. క్రికెట్ ఆడకున్నా తన సహచర క్రికెటర్లతో సంబంధాలు తెగిపోలేదని వివరించాడు. హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, రైనాలతో టచ్లో ఉన్నట్లు తెలిపాడు. ఈ గడ్డుకాలంలో తనకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, లాయర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక టీమిండియా గెలిచిన 2007, 2011 ప్రపంచకప్లలో శ్రీశాంత్ సభ్యుడన్న విషయం తెలిసిందే. టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహించాడు. (పోలీస్ టార్చర్ భరించలేకే ఒప్పుకున్నా: శ్రీశాంత్) అసలేం జరిగిందంటే.. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్పై నిషేధాన్ని కేరళ సింగిల్ బెంచ్ హైకోర్టు ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్పై 2017 అక్టోబర్లో శ్రీశాంత్పై నిషేధాన్ని కొనసాగించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
‘ఆ ముగ్గురు’ కలిసి పని చేయాలి!
మొనాకో: ఈతరం భారత టెన్నిస్ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలంటే ముగ్గురు దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి పని చేయాలని మాజీ వరల్డ్ నంబర్వన్, జర్మన్ స్టార్ బోరిస్ బెకర్ అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ అభివృద్ధి కోసం కాకుండా ఈ ముగ్గురు తమలో తాము కలహించుకోవడం తాను చూస్తున్నానని అతను అన్నాడు. గత కొంత కాలంగా డబుల్స్ భాగస్వాముల విషయంలో పేస్, భూపతి, సానియా వివాదంలో భాగమయ్యారు. వీరి మధ్య విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కాయి. ఇదే విషయాన్ని బెకర్ గుర్తు చేశాడు. ‘టెన్నిస్లో భారత్ గతంలో మంచి ఫలితాలు సాధించింది. అయితే ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్ల అవసరం ఉంది. వారిలో కొందరన్నా మరింత ముందుకు వెళ్లి ఫలితాలు సాధిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కానీ మున్ముందు విజయాలు దక్కవచ్చు. దేశంలో ఆటకు మంచి ఆదరణ కూడా ఉంది. పేస్, భూపతి, సానియాలాంటి వారి అవసరం ఇప్పుడు దేశానికి ఉంది. వారు ఆట కోసం ఏదైనా చేయాలి. వారి మధ్య గొడవలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. కానీ ముగ్గురు కలిసి పని చేయడమొక్కటే పరిష్కార మార్గం’ అని బెకర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఫెడరర్ 20 గ్రాండ్స్లామ్ల ఘనతను తాజా ఫామ్ ప్రకారం చూస్తే వచ్చే రెండేళ్లలో నొవాక్ జొకోవిచ్ అధిగమిస్తాడని బెకర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓటమిని ఒప్పుకోని తత్వం ఉన్న జొకోవిచ్ అద్భుత రీతిలో పునరాగమనం చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని కూడా అతను అన్నాడు. జొకోవిచ్కు 2014–16 మధ్య బెకర్ కోచ్గా వ్యవహరించగా... ఆ సమయంలో సెర్బియా స్టార్ ఆరు గ్రాండ్స్లామ్లు గెలిచాడు. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్లో ఆదివారం ముగిసిన ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్–వరేలా (మెక్సికో) ద్వయం రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో పేస్–వరేలా జోడీ 6–3, 4–6, 2–10తో శాండర్–వీజెన్ (బెల్జియం) జంట చేతిలో ఓడింది. రన్నరప్గా నిలిచిన పేస్ జోడీకి 3,820 యూరోలు (రూ. 3 లక్షల 18 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. యూపీ యోధ గెలుపు పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో రైడర్లు శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్ చెలరేగడంతో యూపీ యోధ జట్టు మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ యో«ధ 38–36తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. విజేత జట్టు తరఫున శ్రీకాంత్ 12, ప్రశాంత్ 11 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్లో నితీశ్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 43–32తో పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యచ్ల్లో పుణేరీ పల్టన్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
ఫైనల్లో పేస్ జోడీ
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ సీజన్లో ఆరోసారి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్– వరేలా (మెక్సికో) ద్వయం టైటిల్కు విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్–వరేలా జోడీ 7–5, 7–6 (7/5)తో సిమోన్ బొలెలీ–బ్రాకియాలి (ఇటలీ) ద్వయంపై గెలిచింది. -
పేస్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సాంటో డొమింగో ఓపెన్లో పేస్–వరేలా (మెక్సికో) జోడీ విజేతగా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ పేస్–వరేలా జంట 4–6, 6–3, 10–5తో బెహర్ (ఉరుగ్వే)–రొబెర్టో (ఈక్వెడార్) ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. ఈ టైటిల్తో 110 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రూ. 5.70 లక్షల ప్రైజ్మనీ పేస్ ఖాతాలో చేరింది. 45 ఏళ్ల పేస్ వరేలాతో కలిసి గతవారం మాంట్రీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. -
లియాండర్ పేస్పై వేటు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ను సెర్బియాతో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేయలేదు. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు సెర్బియాలో ఈ పోటీ జరుగుతుంది. గత ఏప్రిల్లో చైనాతో జరిగిన మ్యాచ్లో నెగ్గి డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (43) సాధించిన ప్లేయర్గా లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సెర్బియాతో మ్యాచ్ కోసం రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్లతో కూడిన ఐదుగురు సభ్యుల భారత జట్టును ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన జంట బోపన్న–దివిజ్ డబుల్స్ మ్యాచ్ ఆడుతుంది. యూకీ బాంబ్రీ, రామ్కుమార్, ప్రజ్నేశ్ సింగిల్స్లో పోటీపడతారు. మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా, జీషాన్ అలీ కోచ్గా వ్యవహరిస్తారు. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: కెరీర్లో 55వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు నిరాశ ఎదురైంది. అమెరికాలో జరిగిన విన్స్టాన్ సాలెమ్ ఓపెన్ టోర్నీలో పేస్–సెరెటాని (అమెరికా) జంట రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో పేస్ ద్వయం 4–6, 2–6తో రోజర్ (నెదర్లాండ్స్)–టెకావ్ (రొమేనియా) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్గా నిలిచిన పేస్ జోడీ ఖాతాలో 20,040 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. -
97వసారి డబుల్స్ ఫైనల్లో పేస్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కెరీర్లో 55వ డబుల్స్ టైటిల్కు విజయం దూరంలో నిలిచాడు. అమెరికాలో జరుగుతున్న విన్స్టన్ సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో పేస్–జెమీ సెరెటాని (అమెరికా) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో పేస్–సెరెటాని 6–4, 2–6, 10–8తో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)లపై గెలిచారు. ఈ విజయంతో పేస్ తన కెరీర్లో 97వసారి డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరుకున్నాడు. ఇప్పటివరకు 54 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన పేస్... 42 సార్లు రన్నరప్గా నిలిచాడు. టైటిల్ పోరులో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హొరియా టెకావ్ (రొమేనియా) ద్వయంతో పేస్ జంట తలపడుతుంది. వాస్తవానికి పేస్ ప్రస్తుతం ఇండోనేసియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాల్సింది. అయితే తనకు సరైన భాగస్వామిని ఇవ్వనందుకు నిరసనగా అతను ఆసియా క్రీడల నుంచి వైదొలిగి ఈ టోర్నీలో ఆడుతున్నాడు. -
ఏషియాడ్కు పేస్ దూరం
పాలెమ్బాంగ్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త వివాదాన్ని రేపాడు. డబుల్స్లో తన భాగస్వామిని ఎంపిక చేసిన తీరును నిరసిస్తూ ఏకంగా పోటీలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మెగా ఈవెంట్లో తనకు సరితూగే డబుల్స్ పార్ట్నర్ను ఎంపిక చేయలేదంటూ ‘ఐటా’పై విమర్శలు గుప్పించాడు. ఇండోనేసియా ఆతిథ్యమివ్వనున్న ఈ క్రీడల నుంచి పేస్ ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో నిబంధనల ప్రకారం మరో ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం లేదు. భారత టెన్నిస్ జట్టు గురువారం ఇండోనేసియా చేరుకుంది. అయితే ఈ జట్టుతో పాటు వెటరన్ స్టార్ వెళ్లలేదు. 2010, 2014 ఆసియా క్రీడల్లోనూ పాల్గొనని లియాండర్ వరుసగా మూడోసారీ ప్రతిష్టాత్మక క్రీడలకు దూరమయ్యాడు. దీనిపై వెటరన్ స్టార్ మాట్లాడుతూ ‘బరువెక్కిన హృదయంతో చెబుతున్నా... నేను ఆసియా క్రీడల్లో బరిలోకి దిగడం లేదు. సరైన డబుల్స్ భాగస్వామి లేకే క్రీడల నుంచి తప్పుకుంటున్నా. నాకు సరితూగే డబుల్స్ భాగస్వామిని చూడాలని ఇది వరకే ‘ ఐటా’ను కోరినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. అందువల్లే వైదొలగాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జోడీ కట్టడంతో విశేష అనుభవజ్ఞుడైన పేస్కు సుమిత్ నాగల్, సింగిల్స్ స్పెషలిస్ట్ రామ్కుమార్ రామనాథన్లలో ఒకరిని జత చేయాలనుకున్నారు. దీంతో అతను ఆడలేనంటూ తప్పుకున్నాడు. 1994లో జరిగిన హిరోషిమా ఆసియా క్రీడల నుంచి 2006 దోహా క్రీడల వరకు ప్రతీ ఈవెంట్ల్లోనూ పాల్గొన్న 45 ఏళ్ల పేస్ 5 స్వర్ణ పతకాలను గెలిచాడు. -
పేస్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం... ఈనెల 17న 45 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వెటరన్ స్టార్ లియాండర్ పేస్ మరోసారి ఆసియా క్రీడల బరిలోకి దిగబోతున్నాడు. ఏషియాడ్ కోసం సోమవారం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించిన ఆరుగురు సభ్యుల జట్టులో పేస్కు చోటు లభించింది. 1994 నుంచి 2006 వరకు నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని ఎనిమిది పతకాలు సాధించిన పేస్ 2010, 2014 పోటీలకు దూరమయ్యాడు. పతకాల వేటలో ఇప్పుడు మళ్లీ కొత్త ఉత్సాహంతో సన్నద్ధమయ్యాడు. సింగిల్స్లో భారత అత్యుత్తమ ర్యాంకర్ (94) అయిన యూకీ బాంబ్రీ యూఎస్ ఓపెన్కు నేరుగా అర్హత సాధించే అవకాశం ఉండటంతో అతడిని ఎంపిక నుంచి మినహాయిస్తున్నట్లు ‘ఐటా’ ప్రకటించింది. ఆసియా క్రీడల సమయంలోనే యూఎస్ ఓపెన్ టోర్నీ కూడా జరగనుంది. ముగ్గురు సింగిల్స్ స్పెషలిస్ట్లు రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సుమిత్ నాగల్లను... ముగ్గురు డబుల్స్ స్పెషలిస్ట్లు పేస్, రోహన్ బోపన్న, దివిజ్ శరణ్లను కమిటీ ఎంపిక చేసింది. డేవిస్ కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ఉన్న మహేశ్ భూపతి తాను ఏషియాడ్కు దూరంగా ఉంటానని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో జీషాన్ అలీకి ఆ బాధ్యతలు అప్పగించారు. -
పేస్ ప్రపంచ రికార్డు
తియాన్జెన్ (చైనా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డేవిస్ కప్లో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నికోల పెట్రాజెలీ (ఇటలీ–42 విజయాలు) పేరిట ఉన్న రికార్డును పేస్ బద్దలు కొట్టాడు. తొలుత డబుల్స్లో పేస్–రోహన్ బోపన్న జోడీ గెలిచి ఆశలు నిలబెట్టగా... రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్ల్లో రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ నెగ్గడంతో భారత్ 3–2తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని... వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్లోనూ పరాజయం పాలైన భారత జట్టు చావో రేవో మ్యాచ్లో సత్తా చాటింది. శనివారం జరిగిన కీలక డబుల్స్ మ్యాచ్లో పేస్–బోపన్న జోడీ 5–7, 7–6 (5/7), 7–6 (3/7)తో మావో జిన్ గాంగ్–జీ జాంగ్ జంటపై గెలుపొందింది. అనంతరం తొలి రివర్స్ సింగిల్స్లో రామ్కుమార్ 7–6 (7/4), 6–3తో డి వూ పై గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. నిర్ణాయక ఐదో మ్యాచ్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–4, 6–2తో వీబింగ్ వూను ఓడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ప్రపంచ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఘనతను నా తల్లిదండ్రులకు, నా కూతురు అయానాకు, డేవిస్ కప్ కెప్టెన్లకు, సహచరులకు, దేశ ప్రజలందరికి అంకితమిస్తున్నా. నేను భారత గడ్డపై పుట్టి, సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అందుకే వేటిని అతిగా తీసుకోకుండా స్నితప్రజ్ఞతతో ముందుకెళ్తున్నా. డేవిస్ కప్లో 0–2తో వెనుకబడిన అనంతరం తిరిగి పుంజుకోవడం గొప్ప అనుభూతి. ఈ ఘనత మరెందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. – లియాండర్ పేస్ -
లియాండర్ పేస్.. అరుదైన ఫీట్
బీజింగ్ : భారత టెన్నిస్ దిగ్గజం, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించారు. డేవిస్ కప్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. డేవిస్ కప్లో భాగంగా శనివారం రోహన్ బోపన్నతో జోడి కట్టిన పేస్ చైనా జంట జీ జాంగ్, జిన్ గాంగ్ పై 5-7,7-6(5), 7-6(3)తో విజయం సాధించారు. తద్వారా ఇరాన్ ఆటగాడు నికోలా పిట్రాంగిలీ డేవిస్లో అత్యధిక డబుల్స్ విజయాల( 42) రికార్డును పేస్ తిరగరాశారు. తద్వారా 43 విజయాలతో ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించారు. పేస్ డేవిస్ కప్ విజయాల ట్రాక్ను పరిశీలిస్తే... 1990లో డేవిస్ కప్లో జీసన్ అలీతో తొలిసారి జతకట్టిన పేస్ ఇప్పటివరకు 12మంది భాగస్వాములతో ఈ ఘనత సాధించారు. అత్యధికంగా మహేశ్ భూపతితో కలిసి 25 విజయాలు అందుకున్నారు. గత ఏప్రిల్లో ఉజ్బెకిస్తాన్తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్ను పక్కన పెట్టారు. దీంతో ఈసారి డేవిస్కప్లో పేస్ పాల్గొనడం పై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) డేవిస్కప్ పోరుకు పేస్ను ఎంపిక చేసింది. -
పేస్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్కు డేవిస్ కప్ జట్టులో చోటు దక్కింది. ఏప్రిల్ 6, 7 తేదీల్లో చైనాతో జరిగే పోరు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐ టీఏ) ఆదివారం జట్టును ప్రకటించింది. ఇందులో 44 ఏళ్ల పేస్తో పాటు యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్, రోహన్ బోపన్నలు ఉన్నారు. దివిజ్ శరణ్ రిజర్వ్ సభ్యుడిగా ఉంటాడు. గత ఏప్రిల్లో ఉజ్బెకిస్తాన్తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్ను పక్కన పెట్టారు. అయితే ఇటీవలే దుబాయ్ ఓపెన్లో పేస్ రన్నరప్గా నిలిచి డబుల్స్ ర్యాంకుల్లో మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. ‘రోహన్ బోపన్నకు పేస్తో జతకట్టడం ఇష్టం లేదు. అవసరమైతే అతను చైనాతో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి సెలక్షన్ కమిటీ చైర్మన్కు లేఖ రాశారు. అయితే భూపతి లేఖను, బోపన్న విజ్ఞప్తిని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. ‘బోపన్న ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నాడు. అలాంటి వ్యక్తి సొంత విషయాల కోసం దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి వెనుకాడితే ఏఐటీఏ ఆ ఆటగాడిని ప్రోత్సహిం చదు. ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు దేశం కోసం ఆడే అవకాశం లభిస్తుంది. అన్ని విషయాలను పక్కనబెట్టి రెండువారాల పాటు దేశం కోసం కలిసి ఆడలేరా? కెప్టెన్ భూపతి అభిప్రాయం ప్రకారం వారిద్దరి మధ్య (పేస్, బోపన్న) సఖ్యత లేదు. ఈ విషయంలో బోపన్నను ఒప్పించే బాధ్యత పేస్దే. అతను మాత్రమే ఈ పని చేయగలడు’ అని ఏఐటీఏ అధికారి వివరించారు. మరో మ్యాచ్ గెలిస్తే పేస్ డేవిస్కప్లో అత్యధిక డబుల్స్ మ్యాచ్లు నెగ్గిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. భారత జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. కొంత కాలంగా బాగా శ్రమిస్తూ ర్యాంక్ మెరుగు పరుచుకున్నా. బోపన్నతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నా. ఓ ఆటగాడిగా బోపన్న ప్రతిభను గౌరవి స్తాను. మేమిద్దరం కలిసి మంచి ప్రదర్శన చేస్తాం. -
మళ్లీ టాప్–50లోకి లియాండర్ పేస్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్–50లోకి వచ్చాడు. గతవారం దుబాయ్ ఓపెన్లో జేమీ సెరెటాని (అమెరికా)తో కలిసి రన్నరప్గా నిలవడంతో పేస్ ఆరు స్థానాలు పురోగతి సాధించాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో అతడు 46వ స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన రోహన్ బోపన్న 20వ ర్యాంక్లో, దివిజ్ శరణ్ 44వ ర్యాంక్లో ఉన్నారు. సింగిల్స్లో యూకీ బాంబ్రీ 110వ స్థానంలో ఉన్నాడు. -
సెమీస్లో పేస్ జంట
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీస్కు చేరుకున్నాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ పేస్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీ 6–3, 2–6, 17–15తో ‘సూపర్ టైబ్రేక్’లో రూబెన్ గొంజాలెజ్ (ఫిలిప్పీన్స్)–హంటర్ రీస్ (అమెరికా) జంటపై గెలుపొందింది. -
టాప్–50లో పేస్
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఏడు నెలల తర్వాత మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్లో పేస్ 14 స్థానాలను మెరుగుపరుచుకొని 47వ ర్యాంకును అందుకున్నాడు. అమెరికాకు చెందిన జేమ్స్ సెరిటానితో కలిసి తాజాగా న్యూపోర్ట్ బీచ్ టైటిల్ నెగ్గిన పేస్ ఖాతాలో 125 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. భారత్ తరఫున డబుల్స్లో రోహన్ బోపన్న (20వ స్థానం) అత్యుత్తమ స్థానంలో నిలవగా, దివిజ్ శరణ్ మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్ బెస్ట్ 45వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ 118వ ర్యాంకులో, రామ్కుమార్ రామనాథన్ 140వ స్థానంలో ఉండగా... సుమిత్ నాగల్ (218), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (244), శ్రీరామ్ బాలాజీ (391) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ సానియా మీర్జా ఒక స్థానం పడిపోయి 14వ ర్యాంక్కు చేరుకుంది. -
పేస్ జంటకు నిరాశ
పుణే: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త ఏడాదిని ఓటమితో ప్రారంభించాడు. స్వదేశంలో జరిగే ఏకైక ఏటీపీ-250 టోర్నమెంట్ టాటా ఓపెన్లో తన భాగస్వామి పురవ్ రాజాతో కలిసి బరిలోకి దిగిన పేస్కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. భారత్కే చెందిన రోహన్ బోపన్న-జీవన్ నెదున్చెజియాన్ జంట 6-3, 6-2తో పేస్-పురవ్ జోడీని అలవోకగా ఓడించింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న ద్వయం నాలుగు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జంట సర్వీస్ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. ఈ గెలుపుతో బోపన్న జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. యూకీ బాంబ్రీ రెండో రౌండ్లోకి ప్రవేశించగా... సుమీత్ నాగల్ వెనుదిరిగాడు. తొలి రౌండ్లో యూకీ 6-3, 6-4తో అర్జున్ ఖడేపై గెలుపొందగా... క్వాలిఫయర్ సుమీత్ 3-6, 3-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. -
పేస్ ఖాతాలో మరో టైటిల్
న్యూఢిల్లీ: ర్యాంకింగ్స్లో వెనుకబడిపోయినా పదును తగ్గని ఆటతీరుతో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన ఖాతాలో మరో టైటిల్ను జమ చేసుకున్నాడు. భారత్కే చెందిన పురవ్ రాజాతో జత కట్టిన 44 ఏళ్ల పేస్ అమెరికాలో జరిగిన నాక్స్విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ను సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్–పురవ్ రాజా ద్వయం 7–6 (7/4), 7–6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత ఆగస్టు నుంచి కలిసి ఆడుతున్న పేస్–పురవ్లకు ఇదే తొలి టైటిల్. మరోవైపు ఈ సీజన్లో పేస్కిది నాలుగో ఏటీపీ చాలెంజర్ టైటిల్. ఇంతకుముందు ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ లియోన్, ఇక్లే ఓపెన్ టైటిల్స్ను... స్కాట్ లిప్స్కీ (అమెరికా)తో కలిసి తలహసీ టైటిల్ను సాధించాడు. తాజా విజయంతో డబుల్స్ ర్యాంకింగ్స్లో పేస్, పురవ్ పురోగతి సాధించారు. పేస్ మూడు స్థానాలు ఎగబాకి 67వ ర్యాంక్లో... పురవ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 61వ ర్యాంక్లో ఉన్నారు. రోహన్ బోపన్న 15వ స్థానంలో కొనసాగుతుండగా... దివిజ్ శరణ్ 51వ ర్యాంక్లో ఉన్నాడు. -
సెమీస్లో పేస్ జోడీ ఓటమి
న్యూఢిల్లీ: సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్–పురవ్ రాజా (భారత్) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం రష్యాలో జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–పురవ్ రాజా ద్వయం 6–4, 3–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జూలియో పెరాల్టా (చిలీ)–హొరాసియో జెబోలాస్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడిపోయింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్ జోడీ తొలి సెట్ను నెగ్గినా... రెండో సెట్లో తడబడింది. సూపర్ టైబ్రేక్లోనూ ఈ భారత జోడీ ఒత్తిడికి లోనై పరాజయం పాలైంది. సెమీస్లో ఓడిన పేస్ జంటకు 15,450 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 10 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు!
లియాండర్ పేస్ వ్యాఖ్య కోల్కతా: సుదీర్ఘ కెరీర్లో ఎంతో సాధిం చిన తాను ఇక కొత్త గా నిరూపించుకునేదేమీ లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. ఈ ఏడాది డేవిస్ కప్ జట్టు నుంచి ఈ వెటరన్ ఆటగాడిని నాన్– ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తప్పించాడు. అయితే టెన్నిస్నే ప్రేమించే తాను సత్తా ఉన్నంత కాలం ఆడతానని, ఇప్పట్లో రిటైర్మెంట్ యోచనే లేదని తేల్చి చెప్పాడు. ‘నేను ఎవరిముందు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నేనేంటో నా కెరీరే సమాధానమిస్తుంది. ఈ వయసు లోనూ టెన్నిస్ ఆడుతున్నానంటే దానికి కారణం... నేను టెన్నిస్ను అమితంగా ప్రేమించడమే. దేశం తరఫున ఎన్నో విజయాలు సాధించాను. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడేది వ్యక్తిగతమైనా... బరిలోకి దిగేది మాత్రం... మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించేందుకే’ అని పేస్ భావోద్వేగంతో చెప్పాడు. వచ్చే ఏడాది మరిన్ని టైటిల్స్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2018లో కొత్త మిక్స్డ్ డబుల్స్ భాగస్వామితో బరిలోకి దిగుతానని, మళ్లీ విజయాలు సాధిస్తానని అతను చెప్పాడు. -
సాకేత్, యూకీ పునరాగమనం
లియాండర్ పేస్కు దక్కని స్థానం న్యూఢిల్లీ: కెనడాతో వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో తలపడే భారత జట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని, సింగిల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశారు. కెనడాలోని ఎడ్మంటన్లో సెప్టెంబరు 15 నుంచి 17 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు డబుల్స్ దిగ్గజం లియాండర్ పేస్ను జట్టులోకి ఎంపిక చేయలేదు. సాకేత్, యూకీలతోపాటు రామ్కుమార్ రామనాథన్, రోహన్ బోపన్న జట్టులోని మిగతా సభ్యులు. ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ రిజర్వ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. గత ఏప్రిల్లో స్వదేశంలో ఉజ్బెకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో గాయాల కారణంగా సాకేత్, యూకీ ఆడలేదు. ఉజ్బెకిస్తాన్తో మ్యాచ్లో ఆరుగురు సభ్యులున్న జట్టులో పేస్ను ఎంపిక చేసినా నలుగురు ఆటగాళ్లున్న తుది జట్టులో అతడికి స్థానం లభించలేదు. ‘ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున రోహన్ బోపన్న ర్యాంక్ మెరుగ్గా ఉండటంతో అతడిని ఎంపిక చేశాం. భవిష్యత్లో పేస్ పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు ఉండాలని కెప్టెన్ మహేశ్ భూపతి కోరడంతో డబుల్స్ విభాగంలో ఒకరినే ఎంపిక చేశాం. ఈసారి యూకీ, రామ్కుమార్ సింగిల్స్ మ్యాచ్లు ఆడతారు. డబుల్స్ మ్యాచ్లో సాకేత్–బోపన్న జంట బరిలోకి దిగుతుంది’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్పీ మిశ్రా తెలిపారు. -
సెమీస్లో పేస్ జంట
న్యూఢిల్లీ: అంటాల్యా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) ద్వయం సెమీఫైనల్కు చేరింది. టర్కీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్–షమస్దీన్ జంట 6–1, 6–2తో బెర్లోక్ (అర్జెంటీనా)–జోవో సుసా (పోర్చుగల్) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జంట 6–7 (9/11), 7–6 (7/4), 4–10తో మాట్ పావిక్ (క్రొయేషియా)–ఒలివెర్ మరాచ్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో బగ్దాటిస్తో రామ్కుమార్ ఆడతాడు. -
పేస్ జంటకు టైటిల్
ఇల్క్లే (బ్రిటన్): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ను సాధించాడు. శనివారం ముగిసిన ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో తన భాగస్వామి ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 2–6, 6–2, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. 45 ఏళ్ల పేస్ ఈ సీజన్లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు. -
డబుల్స్ ఫైనల్లో పేస్ జంట
ఎగాన్ ఇల్క్లే ట్రోఫీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 6–4, 7–6 (7/2)తో జాన్ మిల్మన్–లూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు బర్మింగ్హామ్ టోర్నీ మహిళల డబుల్స్లో సానియా మీర్జా (భారత్)–కోకో వాండెవాగె (అమెరికా) జంటకు క్వార్టర్ ఫైనల్లో వాకోవర్ లభించడంతో సెమీఫైనల్కు చేరింది. -
పేస్ జంట పరాజయం
ఎస్హెర్టోజెన్బాష్ (నెదర్లాండ్స్): రికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంట పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్–లిప్స్కీ జోడీ 4–6, 4–6తో రెండో సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–రాజీవ్ రామ్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. మరోవైపు తొలి రౌండ్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జోడీ 3–6, 4–6తో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)–ఆండ్రి సా (బ్రెజిల్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
పేస్ ఎక్స్ప్రెస్కు బ్రేక్!
⇒డేవిస్ కప్ జట్టులో చోటు దక్కని లియాండర్ ⇒27 ఏళ్లలో ఇదే తొలిసారి ⇒బోపన్నకే ప్రాధాన్యతనిచ్చిన మహేశ్ భూపతి ⇒తీవ్రంగా విరుచుకుపడ్డ పేస్ భారత డేవిస్ కప్ చరిత్రలో ఒక శకం ముగిసింది! దాదాపు మూడు దశాబ్దాలుగా జట్టులో అంతర్భాగమై పలు చిరస్మరణీయ విజయాలు అందించిన లియాండర్ పేస్కు మ్యాచ్ బరిలోకి దిగే తుది జట్టులో స్థానం లభించలేదు. ఉజ్బెకిస్తాన్తో జరిగే పోరులో డబుల్స్ మ్యాచ్లో పేస్ను కాదని రోహన్ బోపన్నను నాన్ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ఎంచుకున్నారు. బెంగళూరులో పరిస్థితులే కారణమంటూ మహేశ్ వివరణ ఇచ్చినా... తనతో పాత విభేదాల వల్ల కావాలనే పక్కన పెట్టినట్లు పేస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డేవిస్కప్లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు కేవలం ఒక విజయం దూరంలో ఉన్న సమయంలో చోటు కోల్పోయిన ఈ దిగ్గజం ఇక ముందు దేశం తరఫున ఆడటం దాదాపు అసాధ్యం కావచ్చు! బెంగళూరు: లియాండర్ పేస్ తొలి సారిగా భారత్ తరఫున 1990లో జపాన్తో జైపూర్లో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ బరిలోకి దిగాడు. నాటినుంచి ఇప్పటి వరకు అతను అందుబాటులో ఉన్న ప్రతీ సారి బరిలోకి దిగాడు. గాయంలాంటి కారణాలతో తనంతట తాను తప్పుకోవడం మినహా ఫామ్ పేరుతో పేస్ను ఒక్కసారి కూడా తప్పించలేదు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్తో జరిగే మ్యాచ్లో అతడిని పక్కన పెట్టారు. నేటి నుంచి ఆదివారం వరకు ఇక్కడ జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1 మ్యాచ్లో తలపడే నలుగురు సభ్యుల భారత జట్టును గురువారం నాన్ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించారు. డబుల్స్ మ్యాచ్లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ కలిసి ఆడతారు. సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఒలింపిక్స్ కాంస్య పతకం, 18 గ్రాండ్స్లామ్ల టైటిల్స్ విజేత పేస్ కంటే కూడా బోపన్న వైపు భూపతి మొగ్గు చూపారు. ప్రస్తుతం ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో పేస్ 53వ స్థానంలో ఉండగా, బోపన్న 24వ స్థానంలో కొనసాగుతున్నాడు. ‘ఇక్కడి వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయి. రోహన్ చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు. అతని ఎంపికకు అదే ప్రధాన కారణం. పేస్ను తప్పించాలనేది చాలా కఠిన నిర్ణయం. అందుకే దానిని తీసుకునేందుకు ఆలస్యమైంది. నేను మొదటి నుంచి ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లనే ఎంచుకోవాలని భావిస్తూ వచ్చాను. ఎందుకంటే వీరిలో ఇద్దరికి డేవిస్కప్లో ఆడిన అనుభవం లేదు. అందుకే ఇద్దరు డబుల్స్ స్పెషలిస్ట్లను తీసుకునే సాహసం చేయలేకపోయాను. అయితే టాప్–5లో ఉంటే తప్ప డబుల్స్ స్పెషలిస్ట్లు అనేదానిని నేను నమ్మను’ అని భూపతి వివరించారు. పేస్ బుధవారమే నగరానికి వచ్చాడని, అతనితో పోలిస్తే గత ఆదివారంనుంచి కలిసి సాధన చేస్తున్న రోహన్, బాలాజీలకే మంచి విజయావకాశాలు ఉంటాయని భూపతి అభిప్రాయ పడ్డారు. పేస్ కాస్త ముందుగా వచ్చి ఉంటే తమ ఆలోచనలో కూడా మార్పు ఉండేదేమోనన్న మహేశ్... ఈ మ్యాచ్కు దూరమైనంత మాత్రాన పేస్ కెరీర్ ముగిసినట్లు కాదని అన్నారు. ఇందుకా నన్ను పిలిచింది! డేవిస్ కప్ జట్టునుంచి తనను తొలగించడం పట్ల లియాండర్ పేస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను కావాలని తప్పించేందుకే అర్హతా ప్రమాణాలను ఇష్టారాజ్యంగా మార్చుకున్నారని అతను విమర్శించాడు. తనకు, భూపతికి మధ్య ఉన్న విభేదాలే అందుకు కారణం కావచ్చని పేస్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ‘జట్టు ఎంపిక ఒకసారేమో ర్యాంకింగ్స్ ప్రకారం జరుగుతుంది. మరోసారి వారి ఇష్టాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతుంది. కొన్ని సార్లు వ్యక్తిగతంగా కాకుండా ఎడమ వైపు కోర్టులో ఎవరు ఆడతారు, కుడి వైపు కోర్టులో ఎవరు ఆడతారు అనేదానిపై చర్చించి నిర్ణయిస్తారు. ఇప్పుడేమో ఫామ్ను బట్టి తీసుకుంటారు. ఫామ్ మాటకొస్తే ఎవరు బాగా ఆడుతున్నారో అందరికీ తెలుసు’ అని పేస్ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. గత వారమే పేస్ లియోన్లో జరిగిన మెక్సికో చాలెంజర్ టైటిల్ను గెలిచాడు. కొందరు ఇక్కడి వాతావరణం గురించి మాట్లాడుతున్నారని, అయితే సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న లియోన్లో టోర్నీ నెగ్గిన తనకు 920 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో ఆడటంలో సమస్య ఎలా ఎదురవుతుందని పేస్ వ్యంగ్యంగా అన్నాడు. కేవలం దేశంపై ప్రేమతో తాను సుదీర్ఘ ప్రయాణం చేసి మెక్సికోనుంచి వచ్చానని, ఇలా అవమానించకుండా ఫోన్లోనే చోటు లేదని చెప్పేస్తే సరిపోయేదని అతను చెప్పాడు. ‘పరిణామాలు ఎలా ఉన్నా దేశం పట్ల నా ప్రేమ షరతులు లేనిది. అందుకే ఇంత దూరం వచ్చాను. ఒక ఫోన్ చేసి నేను కావాలా వద్దా అని చెబితే ఇంత రచ్చ జరగకపోయేది కదా. అయితే నేను మున్ముందు ఇంకా ఎక్కువగా శ్రమిస్తాను. మళ్లీ భారత్ తరఫున డేవిస్ కప్ ఆడతాననే నమ్మకముంది’ అని పేస్ ఉద్వేగంగా చెప్పాడు. నేడు ఎవరితో ఎవరు? రామ్కుమార్& తేమూర్ ఇస్మయిలోవ్ (తొలి సింగిల్స్) ప్రజ్నేశ్ గుణేశ్వరన్& ఫైజీవ్ (రెండో సింగిల్స్) -
డబుల్స్ జోడీపై నిర్ణయం తీసుకోలేదు
డేవిస్ కప్ కెప్టెన్ మహేశ్ భూపతి బెంగళూరు: ఉజ్బెకిస్తాన్తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్లో భారత డబుల్స్ జోడీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తెలిపారు. ఆసియా ఓషియానియా జోన్ గ్రూప్–1 రెండో రౌండ్ మ్యాచ్ ఈనెల 7 నుంచి 9 వరకు జరగనుంది. అయితే జట్టు తరఫున నలుగురు సింగిల్స్ ఆటగాళ్లను భూపతి ఎంచుకోవడంతో డబుల్స్ జోడీపై ఆసక్తి పెరిగింది. లియాండర్ పేస్, రోహన్ బోపన్నలను రిజర్వ్లుగా ఉంచారు. ‘విజయాలతో మూడు పాయింట్లు ఎలా సాధించాలనే దానిపైనే మా దృష్టి ఉంది. ఏ ఒక్క మ్యాచ్ గురించో ఆలోచించడం సరికాదు. చాలా రోజులుగా డబుల్స్ మ్యాచ్ గురించే చాలా మంది మాట్లాడుతున్నారు. మరో రెండు రోజుల దాకా స్పష్టత రాదు’ అని భూపతి తేల్చారు. అయితే యూకీ బాంబ్రీ గాయం కారణంగా దూరం కావడంతో పేస్, బోపన్నలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇస్టోమిన్ దూరం: మరోవైపు ఉజ్బెకిస్తాన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ 71వ ర్యాంకర్ డెనిస్ ఇస్టోమిన్ గాయం కారణంగా భారత్తో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఎడమ పాదంలో గాయమవడంతో అతను రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఉజ్బెకిస్తాన్ కెప్టెన్ పీటర్ లెబెడ్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్లో శ్యామ్ న్యూఢిల్లీ: థాయ్లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో థాయ్లాండ్ బాక్సర్ థాని నరీన్రామ్పై శ్యామ్ గెలుపొందాడు. శ్యామ్తోపాటు మనోజ్ కుమార్ (69 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. అయితే వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు), దేవేంద్రో సింగ్ (52 కేజీలు)తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
వరుసగా 26వ ఏడాది... పేస్ ఖాతాలో మరో టైటిల్
లియోన్ (మెక్సికో): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొంత విరామం తర్వాత మరో టైటిల్ను గెలుచుకున్నాడు. ఇక్కడ జరిగిన లియోన్ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్ను పేస్ చేజిక్కించుకున్నాడు. తాజా విజయంతో గత 26 ఏళ్లుగా పేస్ ప్రతీ సంవత్సరం ఏటీపీ సర్క్యూట్లో కనీసం ఒక టైటిల్ను సొంతం చేసుకున్నట్లయింది. ఫైనల్లో పేస్–ఆదిల్ షమస్దీన్ (కెనడా) జోడీ 6–1, 6–4తో ల్యూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)–కారో జంపీరీ (బ్రెజిల్) జంటను చిత్తు చేసింది. పేస్ కెరీర్లో ఇది 20వ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ కాగా... ఈ సీజన్లో మొదటిది. 2017లో దుబాయ్ చాంపియన్షిప్, డెల్రే బీచ్ ఓపెన్లలో సెమీస్ వరకు చేరిన పేస్... ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచాడు. టైటిల్ నెగ్గిన పేస్–షమస్దీన్ జోడీకి 4,650 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పేస్ జోడిదే టైటిల్
లియోన్(మెక్సిక్) భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ ఈ సీజన్ లో తొలి టైటిల్ ను సాధించాడు. లియాన్ ఛాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ఆదిలో శంషుద్దీన్(కెనడా)తో కలిసి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో 6-1, 6-4 తేడాతో లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)–కారో జాంపియిరి (బ్రెజిల్) జంటపై పేస్ ద్వయం గెలిచింది. ఏకపక్షంగా సాగిన పోరులో లియాండర్-ఆదిల్లు ఆద్యంత ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జోడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టైటిల్ ను గెలుచుకున్నారు. ఇది పేస్ కెరీర్లో 20వ ఏటీపీ ఛాలెంజర్ టైటిల్ కాగా, గత 26 ఏళ్ల నుంచి ప్రతీ ఏడాది కనీసం ఒక్క టైటిల్ ను అయినా గెలిచే ఆటగాళ్ల అరుదైన జాబితాలో పేస్ చేరిపోయాడు. -
తుది పోరుకు పేస్ జోడీ
లియోన్ (మెక్సికో): భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ ఈ ఏడాది తొలి టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ఆదిల్ శంషుద్దీన్ (కెనడా)తో కలిసి పేస్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో మూడో సీడ్ పేస్–ఆదిల్ జంట 6–7 (1/7), 6–4, 10–5తో లూక్ సవిల్లీ–జాన్ పాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. ఫైనల్లో లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)–కారో జాంపియిరి (బ్రెజిల్) జంటతో పేస్ ద్వయం తలపడుతుంది. -
రిజర్వ్ సభ్యులుగా పేస్, బోపన్న
తుది జట్టులో నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లే: భూపతి న్యూఢిల్లీ: డేవిస్ కప్ కోసం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి నొప్పింపక... తానొవ్వక పద్ధతిని అవలంభించాడు. లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ ఇద్దరు డబుల్స్ ఆటగాళ్లలో ఒకరికి తీపి, మరొకరికి చేదు పంచలేక ఆ ఇద్దరినీ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంచుకున్నాడు. తుది జట్టు కోసం అతను పూర్తిగా నలుగురు సింగిల్స్ ఆటగాళ్లనే తీసుకున్నాడు. ప్రస్తుతానికైతే రామ్కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్నేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీలు తుది జట్టు సభ్యులని భూపతి ప్రకటించాడు. ఒకవేళ అప్పటి అవసరానికి అనుగుణంగా డబుల్స్ కోసం బోపన్న, పేస్లలో ఒకరిని తీసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ తప్పకుండా తీసుకుంటామని మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆ అవకాశముంటుం దని బదులిచ్చాడు. డేవిస్కప్ ఆసియా ఓసియానియా పోరులో భాగంగా భారత్ వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్తో తలపడనుంది. ప్రస్తుతం డేవిస్ కప్లో రికార్డు డబుల్స్ విజయాలపై కన్నేసిన పేస్ తనకా అవకాశం వస్తుందో రాదో తెలుసుకునేందుకు ఇంకొంత కాలం నిరీక్షించక తప్పదేమో! 42 విజయాలతో పేస్, నికోలా పీట్రాంజెలి (ఇటలీ) రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. -
లియాండర్ పేస్ భవితవ్యం తేలేది నేడే...
డేవిస్కప్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్గా గుర్తింపు పొందడానికి లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధించేందుకు పేస్కు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది నేడు తేలిపోనుంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఉజ్బెకిస్తాన్తో బెంగళూరులో జరిగే ఆసియా ఓసియానియా పోటీలో భారత్ తలపడనుంది. నలుగురు సభ్యులతో కూడిన తుది జట్టును మంగళవారం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించనున్నారు. ఒకే డబుల్స్ స్పెషలిస్ట్ను ఎంపిక చేస్తే మాత్రం రోహన్ బోపన్న లేదా పేస్లలో ఒకరికే తుది జట్టులో స్థానం లభిస్తుంది. -
పేస్ పయనమెటు?
►వెంటాడుతున్న వరుస వైఫల్యాలు ►రెండేళ్లుగా లేని ఏటీపీ డబుల్స్ టైటిల్ సాక్షి క్రీడావిభాగం వరుసగా ఏడు ఒలింపిక్స్లలో పాల్గొన్న ఏకైక టెన్నిస్ క్రీడాకారుడు... మరో విజయం సాధిస్తే డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ మ్యాచ్ల్లో గెలిచిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు... నాలుగు పదుల వయసు దాటినా ఏమాత్రం తగ్గని ఉత్సాహం... 18 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్... 27 ఏళ్లుగా అలుపెరుగని ఆట... 114 మంది భాగస్వాములతో కలిసి బరిలోకి... ఇలాంటి ఎన్నో ఘనతలు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సొంతం. కానీ కొన్నాళ్లుగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూ ట్లో పేస్కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. కొత్త కొత్త భాగస్వాములతో కలిసి టోర్నీలలో ఆడుతున్నా టైటిల్స్ మాత్రం దక్కడంలేదు. ఒకానొక సమయంలో పేస్ ఆటకు గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చినా... వాటిని అతను ఖండిస్తూ, తనలో ఆటపట్ల ఆసక్తి ఉన్నంత కాలం టెన్నిస్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 43 ఏళ్ల వయస్సులోనూ ఫిట్నెస్ సమస్యలు లేకుండా ఆడుతున్న పేస్ ఏటీపీ సర్క్యూట్లో టైటిల్ సాధించి రెండేళ్లు దాటిపోయింది. చివరిసారి అతను 2015 జనవరిలో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఆక్లాండ్ ఓపెన్లో టైటిల్ సాధించాడు. అదే ఏడాది మరో రెండు టోర్నీల్లో, గత సంవత్సరం మరో రెండు టోర్నీల్లో ఫైనల్కు చేరుకున్నా పేస్ ఖాతాలో మాత్రం టైటిల్ చేరలేదు. ఈ ఏడాది ఆరు టోర్నీల్లో ఆడిన పేస్... నాలుగింటిలో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. దుబాయ్ ఓపెన్, డెల్రే బీచ్ ఓపెన్ టోర్నీలలో మాత్రం సెమీఫైనల్కు చేరుకున్నాడు. అవకాశం దక్కేనా... డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. 42 విజయాలతో నికోలా పిట్రాంగెలి (ఇటలీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పేస్ సమం చేశాడు. గత నెలలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ సందర్భగా పేస్కు ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చినా... విష్ణువర్ధన్తో జతకట్టిన అతనికి విజయం దక్కలేదు. దాంతో ప్రపంచ రికార్డుకు పేస్ వచ్చే నెలదాకా వేచి చూడాలి. ఉజ్బెకిస్తాన్తో జరిగే మ్యాచ్లో పాల్గొనే భారత జట్టులో పేస్ ఉంటాడా లేదా అనే అనుమానం కలిగినా సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. ఆరుగురు సభ్యులతో కూడిన జట్టులో డబుల్స్ స్పెషలిస్ట్లుగా పేస్తోపాటు రోహన్ బోపన్నకు స్థానం కల్పించారు. కానీ నలుగురు సభ్యులు ఉండే తుది జట్టును ఎంపిక చేసే అధికారాన్ని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి ఇచ్చారు. తుది జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు, ఒక డబుల్స్ ప్లేయర్ ఉంటారని మహేశ్ భూపతి ప్రకటించడంతో... పేస్, బోపన్నలలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశముంది. పేస్తో కలిసి డబుల్స్లో ఆడటం ఇష్టం లేదని రియో ఒలింపిక్స్ సందర్భంగా బోపన్న ప్రకటించడం వివాదాస్పదమైంది. భారత టెన్నిస్ సంఘం జోక్యం చేసుకొని వీరిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చినా రియో ఒలింపిక్స్లో పేస్–బోపన్న జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఉజ్బెకిస్తాన్తో జరిగే మ్యాచ్లో పాల్గొనే తుది జట్టును ఈ నెలాఖర్లో మహేశ్ భూపతి ప్రకటించే అవకాశముంది. తాను ప్రపంచ రికార్డును అందుకోవాలంటే పేస్కు బోపన్నలాంటి అనుభవజ్ఞుడైన భాగస్వామి అవసరం. ఒకవేళ పేస్ను కాదని బోపన్నను భూపతి ఎంపిక చేసుకుంటే మరోసారి భారత టెన్నిస్లో వివాదం రాజుకోవడం ఖాయం. డేవిస్ కప్ పోటీలకు తాను అందుబాటులో ఉంటానని ప్రకటించాక పేస్కు తుది జట్టులో స్థానం దక్కని దాఖలాలు లేవు. ఒకవేళ పేస్కు స్థానం లభించకపోతే ఈ టెన్నిస్ దిగ్గజం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి. తొలి రౌండ్లోనే పరాజయం ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో డెల్పొట్రో (అర్జెంటీనా)తో జతకట్టిన పేస్కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ‘వైల్డ్ కార్డు’తో ఆడిన పేస్–డెల్పొట్రో జంట ఆదివారం జరిగిన తొలి రౌండ్లో 3–6, 4–6తో సామ్ క్వెరీ (అమెరికా)–గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) జోడీ చేతిలో ఓడిపోయింది. రెండు సెట్లలో ఒక్కోసారి పేస్ ద్వయం తమ సర్వీస్ను కోల్పోయింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా పేస్–డెల్పొట్రో సద్వినియోగం చేసుకోలేకపోయారు. -
పేస్కు చోటు లభించింది కానీ...
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టులో సీనియర్, దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్కు చోటు దక్కింది. అయితే మ్యాచ్లో బరిలోకి దిగే విషయాన్ని మాత్రం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి అప్పగించారు ‘ఐటా’ సెలక్టర్లు. సోమవారం సమావేశమైన ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ ఆరుగురితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు సింగిల్స్ ఆటగాళ్లున్నారు. రామ్కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్ఞేశ్ గున్నెశ్వరన్, శ్రీరామ్ బాలాజీలను సింగిల్స్ కోసం ఎంపిక చేయగా... రోహన్ బోపన్న, లియాండర్ పేస్ డబుల్స్ ఆటగాళ్లు. అయితే బరిలోకి దిగే నలుగురిని కెప్టెన్ మహేశ్ భూపతి నిర్ణయిస్తారని ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ తెలిపారు. ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోరులో భాగంగా భారత్... ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. బెంగళూరులో వచ్చే నెల 7 నుంచి ఈ మ్యాచ్లు జరుగుతాయి. దీనికి సరిగ్గా పది రోజుల ముందు తుది నలుగురు ఆటగాళ్లను భూపతి ఎంపిక చేసుకుంటాడని ఛటర్జీ పేర్కొన్నారు. మరో విజయం సాధిస్తే పేస్ డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. -
పేస్ స్థానం పదిలమేనా?
భారత డేవిస్కప్ జట్టు ఎంపిక నేడు ఉజ్బెకిస్తాన్తో ఏప్రిల్లో పోరు న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులో లియాండర్ పేస్ కొనసాగేది లేనిది నేడు తేలనుంది. సోమవారం సమావేశమయ్యే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆసియా ఓసియానియా జోన్లో భాగంగా ఉజ్బెకిస్తాన్తో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు భారత్ తలపడనుంది. డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ప్రపంచ రికార్డుకు పేస్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన పోరులో విష్ణువర్ధన్తో జతకట్టిన పేస్కు పరాజయం ఎదురైంది. దాంతో అతను ఉజ్బెకిస్తాన్తో జరిగే పోటీలో మరోసారి ప్రపంచ రికార్డుపై గురి పెట్టనున్నాడు. అయితే పేస్ను ఎంపిక చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. సింగిల్స్లో ఫామ్లో ఉన్న యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్ల బెర్త్లకు ఢోకా లేదు. సుమిత్ నాగల్ గాయంతో సెలక్షన్స్కు దూరం కాగా... హైదరాబాద్ యువ ఆటగాడు సాకేత్ మైనేని ఎంపికపై సందిగ్ధత నెలకొంది. సింగిల్స్, డబుల్స్ ఆడగల సాకేత్ ఇప్పుడు ఫిట్నెస్తో ఉన్నప్పటికీ... సెలక్టర్ల చూపు స్పెషలిస్ట్ ఆటగాళ్లపై ఉంది. అంటే ముగ్గురు స్పెషలిస్ట్ సింగిల్స్ ఆటగాళ్లని తీసుకోవాలా లేక ఇద్దరు స్పెషలిస్ట్ డబుల్స్ ఆటగాళ్లతో సరిపెట్టాలా అన్న అంశాన్ని సెలక్షన్ కమిటీ తేల్చుకోలేకపోతోంది. సీనియారిటీని పక్కన బెట్టి ర్యాంకింగ్నే పరిగణనలోకి తీసుకుంటే బోపన్న (24)కు జతగా పేస్ (62వ ర్యాంకు)ను కాదని దివిజ్ శరణ్ (54), పురవ్ రాజా (56)ల్లో ఒకరికి చోటు దక్కొచ్చు. సింగిల్స్లో ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ మూడో బెర్తు కోసం పోటీపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శనకే ఓటేసే అవకాశముంది. ఉజ్బెకిస్తాన్ మ్యాచ్తో భారత జట్టుకు మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
పేస్ జోడీపై బోపన్న జంట పైచేయి
దుబాయ్ ఓపెన్లో ఫైనల్లోకి దుబాయ్: కొత్త ఏడాదిలోనూ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గత సంవత్సరం ఒక్క డబుల్స్ టోర్నీ టైటిల్ నెగ్గలేకపోయిన 43 ఏళ్ల పేస్... ఈ ఏడాది తాను పాల్గొన్న ఆరో టోర్నమెంట్లోనూ ఫైనల్కు చేరలేకపోయాడు. స్పెయిన్కు చెందిన గిలెర్మో గార్సియా లోపెజ్తో జతగా దుబాయ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన పేస్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. భారత్కే చెందిన మరో అగ్రశ్రేణి ఆటగాడు, 36 ఏళ్ల రోహన్ బోపన్న తన భాగస్వామి మార్సిన్ మట్కోవ్స్కీ (పోలాండ్)తో కలిసి పేస్–లోపెజ్ జంటపై విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో బోపన్న–మట్కోవ్స్కీ ద్వయం 6–3, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో పేస్–లోపెజ్ జోడీని ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట ఏడు ఏస్లు సంధించింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో బోపన్న–మట్కోవ్స్కీ జోడీ 2–4తో వెనుకబడ్డా ఆ వెంటనే తేరుకొని తుదకు 10–6తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా); జులియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హŸరియా టెకావ్ (రొమేనియా) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో శనివారం జరిగే ఫైనల్లో బోపన్న ద్వయం తలపడుతుంది. -
సెమీఫైనల్లో పేస్ జోడీ
దుబాయ్: భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు లియాండర్ పేస్ దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పేస్–గార్షియల్ లోపెజ్ (స్పెయిన్) ద్వయం 7–6(3), 7–6(6) స్కోరుతో డానియెల్ నెస్టర్ (కెనడా)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై గెలుపొందింది. ఈ మ్యాచ్ గంటా 50 నిమిషాలపాటు సాగింది. సెమీ ఫైనల్లో బోపన్న –మార్సిన్ జోడీతో పేస్ జంట తలపడుతుంది. ఫెడరర్కు షాక్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి జోరుమీదున్న రోజర్ ఫెడరర్కు ఇదే టోర్నీ సింగిల్స్ విభాగంలో షాక్ తగిలింది. రష్యన్ క్వాలిఫయర్ సంచలన ప్రదర్శనతో ఫెడరర్ను ఓడించాడు. రెండో రౌండ్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–7 (7/9), 6–7 (5/8)తో ప్రపంచ 116వ ర్యాంకర్ ఎవ్గెని డన్స్కొయ్ చేతిలో పరాజయం చవిచూశాడు. -
పేస్ జంట పరాజయం
న్యూఢిల్లీ: డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) జంట పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–యెన్ సున్ లూ ద్వయం 2–6, 1–6తో మూడో సీడ్ ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)–మాక్స్ మిర్నీ (బెలారస్) జోడీ చేతిలో ఓడిపోయింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్ జంట తమ సర్వీస్ను నాలుగు సార్లు కోల్పోయింది. క్వార్టర్స్లో బ్రయాన్ బ్రదర్స్పై ‘సూపర్ టైబ్రేక్’లో సంచలన విజయం సాధించిన పేస్–యెన్ సున్ లూ ద్వయం అదే జోరును సెమీఫైనల్లో కనబర్చలేకపోయింది. -
డబుల్స్లో పేస్కు నిరాశ
కివీస్ జంట చేతిలో భారత జోడీ ఓటమి పుణే: భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ ప్రపంచ రికార్డుకు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరులో విష్ణువర్ధన్తో జతకట్టిన పేస్ జోడీకి అర్టెమ్ సితక్–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో పరాజయం ఎదురైంది. దీంతో డేవిస్ కప్ చరిత్రలో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాల (43)తో రికార్డు సృష్టించాలనుకున్న పేస్కు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఇటలీకి చెందిన నికోలా (42)తో సమంగా నిలిచిన భారత సీనియర్ స్టార్కు రెండు నెలలపాటు నిరీక్షణ తప్పదేమో! శనివారం ఇక్కడి శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన డబుల్స్ మ్యాచ్లో పేస్ జంట 6–3, 3–6, 6–7 (6/8), 3–6తో న్యూజిలాండ్ జంట చేతిలో పోరాడి ఓడింది. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ కేవలం తొలి సెట్ మాత్రమే నెగ్గింది. తదుపరి సెట్లలో కివీస్ జంట ధాటికి చేతులెత్తేసింది. తాజా పరాజయంతో భారత్ ఆధిక్యం 2–1కు తగ్గింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్ల్లో భారత కుర్రాళ్లు యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ విజయానికి రివర్స్ సింగిల్స్ కీలకమయ్యాయి. నేడు (ఆదివారం) జరిగే రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్కటైనా గెలిస్తే భారత్ ముందంజ వేస్తుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం పేస్ మాట్లాడుతూ కీలకమైన సమయంలో తమకు లభించిన బ్రేక్ పాయింట్ అవకాశాల్ని చేజార్చుకోవడం వల్లే మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. సరైన సన్నాహకాలు లేకపోయినా విష్ణువర్ధన్ ఆటతీరు అద్భుతంగా ఉందని పేస్ కితాబిచ్చాడు. -
పేస్... ఆ ఘనత సాధిస్తాడా..!
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో టెన్నిస్ దిగ్గజం పేస్కు జోడిగా విష్ణువర్ధన్ గాయంతో సాకేత్ దూరం నేటి నుంచి న్యూజిలాండ్తో డేవిస్ కప్ మ్యాచ్ పుణే: భారత టెన్నిస్ జట్టు నేటి (శుక్రవారం) నుంచి న్యూజిలాండ్తో జరిగే డేవిస్కప్ (ఆసియా/ఓసియానియా గ్రూప్ 1) మ్యాచ్ బరిలోకి దిగనుంది. దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్కు ఈ పోరు ద్వారా అరుదైన అవకాశం ముంగిట నిలిచింది. సుదీర్ఘకాలంగా టెన్నిస్లో కొనసాగుతున్న ఈ అలుపెరగని వీరుడు ప్రపంచ రికార్డుకు మరో అడుగు దూరంలోనే ఉన్నాడు. శనివారం జరిగే డబుల్స్లో 43 ఏళ్ల పేస్ గెలిస్తే డేవిస్ కప్లో అత్యధిక డబుల్స్ మ్యాచ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం అతను 42 డబుల్స్ విజయాలతో నికోలా పిట్రాంగెలి (ఇటలీ)తో సమంగా ఉన్నాడు. 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు దక్కించుకున్న పేస్కు ఇది 55వ డేవిస్ కప్ మ్యాచ్ కావడం విశేషం. ఇక ఈ గ్రూప్ 1 టైలో గెలిచిన జట్టు ఉజ్బెకిస్తాన్, కొరియా జట్ల మధ్య జరిగే విజేతతో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరిగే రెండో రౌండ్లో తలపడుతుంది. మరోవైపు చివరి నిమిషంలో పేస్ డబుల్స్ జోడిలో మార్పు జరిగింది. గత నెలలో చెన్నై ఓపెన్లో గాయపడిన సాకేత్ మైనేని ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో హైదరాబాదీ విష్ణువర్ధన్కు చోటు లభించింది. విష్ణుతో కలిసి గతంలో పేస్ లండన్ ఒలింపిక్స్లో బరిలోకి దిగాడు. రెండో రోజు శనివారం వీరిద్దరు అర్టెమ్ సిటాక్, మైకేల్ వీనస్ను ఎదుర్కొంటారు. అయితే రోహన్ బోపన్నతో మాట్లాడిన అనంతరం విష్ణు ఎంపిక జరిగిందని డ్రా విడుదల చేసిన అనంతరం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్రాజ్ తెలిపారు. ‘అదృష్టవశాత్తు విష్ణు హైదరాబాద్లో ఉండడంతో మా పని సులువైంది. కజకిస్తాన్లో జరిగే టోర్నీకి వెళ్లేందేకు అతడికి వీసా లభించలేదు’ అని అమృత్రాజ్ అన్నారు. డేవిస్కప్ గురించి మొదట పేస్, ఆ తర్వాత జీషన్ అలీ నుంచి ఫోన్లు వచ్చాయని విష్ణు చెప్పాడు. ఫ్యూచర్స్, ఐటీఎఫ్ ఈవెంట్స్ ఉన్నా దేశం కోసం ఆడటం తొలి ప్రాధాన్యతగా భావించి అంగీకరించినట్టు తెలిపాడు. భారత్దే పైచేయి కివీస్ ఆటగాళ్ల ర్యాకింగ్స్తో పోలిస్తే భారత ఆటగాళ్లు మెరుగైన స్థితిలో ఉండటంతో మన జట్టు ఫేవరెట్గా కనిపిస్తోంది. అలాగే సొంత గడ్డపై ఆడనుండటం భారత్కు కలిసొచ్చే అంశం. కివీస్పై భారత్ ఇప్పటికే 5–3 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆ మూడు పరాజయాలు కూడా 1970 దశకంలో ఎదురైనవే. 1978 నుంచి భారత్ ఇప్పటివరకు ఈ జట్టుపై ఓడింది లేదు. నేడు జరిగే తొలి మ్యాచ్లో యువ ఆటగాడు యూకీ బాంబ్రీ సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ 368 ర్యాంకర్ బాంబ్రీ కివీస్ నంబర్వన్ ఆటగాడు ఫిన్ టియర్నీని ఎదుర్కోనున్నాడు. రెండో సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్.. జోస్ స్టాథమ్తో ఆడతాడు. మ్యాచ్లు మధ్యాహ్నం ప్రారంభమై రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో కొనసాగుతాయి. ‘వారి డబుల్స్ టీమ్ పటిష్టంగా ఉంది. అలాగని వారితో సింగిల్స్ మ్యాచ్లను మేం తేలిగ్గా తీసుకోం. చివరిసారి మేం వారితో ఆడినప్పుడు అలాగే భావించి 1–2తో వెనకబడ్డాం. ఇక పేస్ రిటైర్మెంట్ అనేది పూర్తిగా అతడి వ్యక్తిగత విషయం. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది తనే’ అని అమృత్రాజ్ తేల్చారు. 2012లో కివీస్ను భారత్ 5–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆ మ్యాచ్లో పేస్ ఆడలేదు. దేశం కోసం ఆడుతున్నప్పుడు నా సర్వశక్తిని ధారపోస్తాను. 1990లో నా తొలి డేవిస్ కప్ను ప్రస్తుత కోచ్ జీషన్ అలీతో కలిసి ఆడాను. అప్పటి నుంచి 27 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాను. ఎందుకంటే నేను నా దేశ ప్రజల కోసం, దేశం కోసం, జట్టు కోసం ఆడడాన్ని ఆస్వాదిస్తాను. నా వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలుపే ముఖ్యం. సాకేత్ను దురదృష్టం వెంటాడింది. ఇలాంటి పెద్ద టోర్నీలో గాయం కారణంగా దూరం కావాలని ఏ ఆటగాడూ కోరుకోడు. టోర్నీకి ఒకరోజు ముందే విషయం తెలిసినా విష్ణు ఇందులో ఆడేందుకు అంగీకరించడం గొప్ప విషయం. అతడి అంకితభావానికి ఇది నిదర్శనం. – లియాండర్ పేస్ -
పేస్ జంట పరాజయం
చెన్నై: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు కొత్త ఏడాది కూడా కలసిరాలేదు. చెన్నై ఓపెన్లో కొత్త భాగస్వామి ఆండ్రీ సా (బ్రెజిల్)తో కలసి బరిలోకి దిగిన పేస్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జంట 6–4, 6–4తో పేస్–ఆండ్రీ సా ద్వయంపై సంచలన విజయం సాధిం చింది. ఇతర తొలి రౌండ్ డబుల్స్ మ్యాచ్ల్లో సాకేత్–రామ్కుమార్ (భారత్) జోడీ 4–6, 6–0, 5–10తో డార్సిస్ (బెల్జియం)–పెయిర్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోగా... బోపన్న–జీవన్ (భారత్) జోడీ 6–4, 6–4తో మార్సెలో (బ్రెజిల్)– మెక్టిక్ (క్రొయేషియా) ద్వయంపై గెలిచింది. -
'మహేశ్ భూపతికి అర్హత ఉంది'
చెన్నై: భారత టెన్నిస్కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే మహేశ్ భూపతిని భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ నియమించడాన్ని లియాండర్ పేస్ సమర్ధించాడు. భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా చేసే అన్ని అర్హతలూ భూపతికి ఉన్నాయని పేర్కొన్నాడు. దాంతో పాటు తన వీడ్కోలుపై కూడా సూచాయగా కొన్ని విషయాలను పేస్ వెల్లడించాడు. 'నేను ప్రస్తుతం సరదాగా కోసం ఆడుతున్నాను. నేను గేమ్ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఇంకా ఆడుతున్నా. నేను వీడ్కోలు తీసుకునే నిర్ణయం తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో అందరికీ చెప్పే టెన్నిస్ జీవితం నుంచి వైదొలుగుతా. మీరంతా నన్ను 20 ఏళ్లుగా అభిమానిస్తున్నారు. రాబోవు కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. డేవిస్ కప్ కెప్టెన్గా చేసే అన్ని అర్హతలు మహేశ్ భూపతికి ఉన్నాయి. డేవిస్ కప్ కు భూపతికి ఎందుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ చేయకూడదు' అని భూపతి పేర్కొన్నాడు. -
భూపతిని ఎప్పటికీ గౌరవిస్తా: పేస్
ముంబై: భారత టెన్నిస్కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే తన ఒకనాటి మిత్రుని గురించి పేస్ పెదవి విప్పాడు. తామిద్దరి మనస్తత్వాలు విభిన్నమని, భూపతిపై తనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశాడు. ‘నేను, భూపతి భిన్న ధృవాలం. ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నాం. మా ఇద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అంటే చెప్పలేను. ఎందుకంటే ఇద్దరిదీ తప్పు ఉండొచ్చు.. ఇద్దరిదీ కరెక్టే అయి ఉండొచ్చు. ఆటలోనూ ఎవరి శైలి వారిదే. కానీ మా ఇద్దరి మధ్య గౌరవం ఉంది. వ్యక్తిగతంగా మేమెంతో సాధించాం. అది ఎక్కడికీ పోదు. నేను అతడితో కలిసి సాధించిన విజయాల కారణంగా భూపతిని కచ్చితంగా గౌరవిస్తాను’ అని ‘ఒలింపిక్ పతకం ఎలా గెలవాలి?’ అనే కార్యక్రమంలో పాల్గొన్న పేస్ తెలిపాడు. పేస్, భూపతి కలిసి గతంలో మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచారు. -
కొత్త భాగస్వామి కోసం అన్వేషణ: పేస్
పుణే: తన కెరీర్లో 20 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నానని... వచ్చే ఏడాది దీనిని సాకారం చేసుకునేందుకు కొత్త భాగస్వామి కోసం అన్వేషణ చేస్తున్నానని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. ఇప్పటికే కెరీర్లో 18 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్ను సొంతం చేసుకున్న పేస్కు ఈ ఏడాది అంతగా కలసిరాలేదు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అతను ఏటీపీ సర్కూ ్యట్లో ఒక్క టైటిల్నూ గెలవలేదు. చాలెంజర్ స్థారుులో మాత్రం రెండు టైటిల్స్ సాధించాడు. పుణే ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత్కే చెందిన రామ్కుమార్తో బరిలోకి దిగిన పేస్ తొలి రౌండ్లో గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. 1991లో ప్రొఫెషనల్గా మారిన పేస్ ఇప్పటివరకు పురుషుల డబుల్స్లో 110 మంది భాగస్వాములతో... మిక్స్డ్ డబుల్స్లో 24 మంది భాగస్వాములతో కలిసి ఆడాడు. -
19 ఏళ్ల తర్వాత...
పుణే: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు మొదలయ్యే కేపీఐటీ-ఎంఎస్ఎల్టీఏ చాలెంజర్ ఈవెంట్ డబుల్స్ పోటీల్లో బరిలోకి దిగనున్నాడు. భారత గడ్డపై ఓ ఏటీపీ చాలెంజర్ ఈవెంట్లో పాల్గొనడం 19 ఏళ్ల అనంతరం పేస్కిదే తొలిసారి కావడం గమనార్హం. -
రన్నరప్గా పేస్ జోడి
తాష్కెంట్:ఈ సీజన్ లో తొలి ఏటీపీ టైటిల్ సాధించాలనుకున్న భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ కు నిరాశే ఎదురైంది. తాష్కెంట్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో భాగంగా పురుషుల డబుల్స్ లో పేస్-ఆండ్రీ బెగెమాన్ జంట ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన తుదిపోరులో పేస్ ద్వయం 4-6, 2-6 తేడాతో ఎల్గిన్-ఇస్టోమిన్ జోడి చేతిలో పరాజయం చెందింది. దాంతో ఈ సీజన్ మూడో ప్రయత్నంలో కూడా టైటిల్ సాధించాలనుకున్న పేస్ కల తీరలేదు. అంతకుముందు విన్సాటాన్-సలేమ్, సెయింట్ పీటర్స్ బర్గ్ ఏటీపీ టోర్నీల్లో కూడా పేస్ జంట ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. -
ఫైనల్లో పేస్ జోడి
తాష్కెంట్: భారత టెన్నిస్ వెటరన్ లియాండర్ పేస్ ఈ సీజన్లో మూడో ఏటీపీ చాలెంజర్ టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచాడు. గురువారం తాష్కెంట్ చాలెంజర్ టోర్నీ డబుల్స్ సెమీస్లో మూడో సీడ్ పేస్, ఆండ్రీ బెగెమాన్ (జర్మనీ) జోడి 6-2, 6-0 తేడాతో సంజార్, జురాబెక్ (తాష్కెంట్)లపై గెలిచింది. కేవలం 41 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ను నెగ్గిన పేస్ జంట ఇప్పటికే బియెల్లా ఈవెంట్ నెగ్గగా తన మరో సహచరుడితో పేస్ బుసాన్ టోర్నీ టైటిల్ను అందుకున్నాడు. -
పేస్, బోపన్నలకు నిరాశ
బీజింగ్: చైనా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీలకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. లియాండర్ పేస్-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) ద్వయం 6-3, 5-7, 7-10తో జాక్ సాక్ (అమెరికా)-టామిక్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో... బోపన్న-నెస్టర్ (కెనడా) జంట 6-7 (3/7), 4-6తో నాదల్-బుస్టా (స్పెరుున్) ద్వయం చేతిలో ఓడింది. -
పేస్ జంటకు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ: తన కెరీర్లో 56వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు మరోసారి నిరాశ ఎదురైంది. గత నెలలో విన్స్టన్ సాలెమ్ ఓపెన్లో నాలుగు మ్యాచ్ పాయింట్లను వదులుకొని రన్నరప్గా నిలిచిన పేస్... తాజాగా సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్లో ఒక మ్యాచ్ పాయింట్ వదులుకొని మళ్లీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. జర్మనీకి చెందిన తన భాగస్వామి ఆండ్రీ బెగెమన్తో బరిలోకి దిగిన పేస్కు ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో 6-4, 3-6, 10-12తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్) చేతిలో ఓటమి ఎదురైంది. గంటా 19 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి సెట్ను దక్కించుకున్న పేస్-బెగెమన్ జంట రెండో సెట్లో ఏడో గేమ్లో తమ సర్వీస్ను కోల్పోయింది. రెండో సెట్ను నెగ్గిన ఇంగ్లోట్-కొంటినెన్ నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో 8-9 వద్ద మ్యాచ్ పాయింట్ను కాపాడుకున్నారు. కీలకదశలో తప్పిదాలు చేసిన పేస్ ద్వయం చివరకు ఓటమిని మూటగట్టుకుంది. రన్నరప్ పేస్ జోడీకి 26,110 డాలర్ల (రూ. 17 లక్షల 41 వేలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 43 ఏళ్ల పేస్ 1997 నుంచి ప్రతి ఏడాదీ ఏటీపీ డబుల్స్ టోర్నమెంట్లలో కనీసం ఒక టైటిలైనా గెలుస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది మాత్రం అతను ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయాడు. రెండు టోర్నీల్లో మాత్రం టైటిల్కు చేరువై దూరమయ్యాడు. గతేడాది జనవరిలో ఆక్లాండ్ ఓపెన్లో టైటిల్ గెలిచాక పేస్ మరో టైటిల్ను సాధించలేకపోయాడు. -
ఫైనల్లో పేస్ ద్వయం
న్యూఢిల్లీ: సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) జోడీ 6-3, 7-6 (7/5)తో మిఖారుుల్ ఎల్గిన్-అలెగ్జాండర్ కుద్రయెత్సెవ్ (రష్యా) జంటను ఓడించింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్ ద్వయం ప్రత్యర్థి జంట సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. పేస్ కెరీర్లో ఇది 96వ ఫైనల్ కావడం విశేషం. -
గిట్టనివారే ఓర్వలేకపోతున్నారు
లియాండర్ పేస్ వ్యాఖ్య న్యూఢిల్లీ: కొందరు గిట్టని సహచరులే తనను అదేపనిగా విమర్శిస్తున్నారని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. ‘నా కెరీర్ ఏంటో నాకు తెలుసు, నేను సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. కానీ ఇవేవీ నేనంటే గిట్టని సహచరులకు తెలియవు. 18 గ్రాండ్స్లామ్ (డబుల్స్, మిక్స్డ్) టైటిళ్లు, ఏడుసార్లు ఒలింపిక్స్ ఆడిన ఘనత వారికి కనిపించవు. వాళ్లు పది జన్మలెత్తినా ఈ ఘనతల్ని సాధించలేరు. ఇలాంటివారు టెన్నిస్ కోర్టుల్లో చెమటోడ్చలేరు కానీ విమర్శించేందుకు మాత్రం తహతహలాడుతున్నారు’ అని పేస్ అన్నాడు. -
పేస్పై బోపన్న సెటైర్లు!
న్యూఢిల్లీ: గత రెండు ఒలింపిక్స్లకు భారత్ నుంచి సరైన మిక్స్డ్ డబుల్స్ జోడీని పంపలేదంటూ వెటరన్ ఆటగాడు లియాండర్ చేసిన వ్యాఖ్యలపై మరో ఆటగాడు రోహన్ బోపన్నపరోక్షంగా సెటైర్లు గుప్పించాడు. ఆ సదరు ఆటగాడికి ఎటువంటి పని లేకపోవడంతో మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి యత్సిస్తున్నాడంటూ విమర్శలు సంధించాడు. ఇలా వార్తల్లో నిలవడానికి సహచర ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవడడం అతనికి కొత్తమే కాదన్నాడు. అంతకుముందు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా పేస్ వ్యాఖ్యలపై మండిపడింది. లియాండర్ పేరును ప్రస్తావించకుండానే అతనొక విష పురుగు అంటూ ట్విట్టర్లో విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని సానియా పేర్కొంది. గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. రియో, గత లండన్ ఒలింపిక్స్లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. దీంతో సానియా, రోహన్ బోపన్ననల మిక్స్డ్ డబుల్స్ జోడి ఎంపికను పరోక్షంగా తప్పుబట్టాడు. At it again!! ...the usual ploy to stay in the news by slanging fellow players in media. #Patriotism — Rohan Bopanna (@rohanbopanna) 18 September 2016 -
పేస్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్లో వివాదం ముదురుతోంది. గత రెండు ఒలింపిక్స్కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలపై హైదరాబాదీ సానియా మీర్జా తీవ్రంగా స్పందించింది. పేస్ పేరును ప్రస్తావించకుండా ఓ విషపురుగు అంటూ విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని పరోక్షంగా పేస్ను ఉద్దేశించి సానియా ట్వీట్ చేసింది. గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించాడు. రియో, గత లండన్ ఒలింపిక్స్లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. సానియ, రోహన్ బోపన్నను ఎంపిక చేయడాన్ని తప్పుపట్టాడు. -
ఒలింపిక్స్కు మేటి జంటను పంపలేకపోయారు
న్యూఢిల్లీ: గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ యువ సంచలనం సాకేత్ మైనేని ఆటతీరును ఆకాశానికెత్తాడు. అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని కితాబిచ్చాడు. ‘రియో, గత లండన్ ఒలింపిక్స్లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదు. దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ ఒలింపిక్స్లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నాం. గత 14 నెలల్లో నాలుగు గ్రాండ్స్లామ్ మిక్స్డ్ టైటిల్స్ను సాధించిన నన్ను కాదని మరో ఆటగాడిని రియోకు పంపడం ఏమాత్రం సమంజసంగా లేదు’ అని అన్నాడు. సానియాకు జతగా రోహన్ బోపన్న బరిలోకి దిగగా ఈ జోడి సెమీఫైనల్తోపాటు కాంస్య పతక పోరులో ఓడింది. ప్రస్తుత డేవిస్ కప్ టీమ్ ఈవెంట్లో సాకేత్ మైనేనిలాంటి ఆటగాడితో జతకట్టడం బాగుందని పేస్ అన్నాడు. ఈ జోడీ... రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జోడి చేతిలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ‘మైనేని సర్వీస్ అద్భుతం. రిటర్న్ షాట్లు అసాధారణం. కెరీర్ తొలినాళ్లలోనే అతను చక్కని ఆటతీరుతో ఆదరగొడుతున్నాడు. అనుభవం సంతరించుకుంటే భారత టెన్నిస్ మేటి ఆటగాడిగా ఎదుగుతాడు’ అని తెలుగు కుర్రాడిని ప్రశంసలతో ముంచెత్తాడు. మనకు మరో 18 నెలల్లో ఆసియా గేమ్స్, నాలుగేళ్లకు టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే డబుల్స్లో ఎవరు, మిక్స్డ్ డబుల్స్లో ఎవరెవరు ఆడతారనే స్పష్టతతో ముందడుగు వేయాలని అఖిల భారత టెన్నిస్ సంఘాని (ఐటా)కి సూచించాడు. దీంతో చివరి నిమిషంలో అనవసరపు గందరగోళానికి తావుండదని చెప్పాడు. మరోవైపు ‘సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడంతో సమానం’ అని పరోక్షంగా పేస్ను ఉద్దేశించి సానియా మీర్జా వ్యాఖ్యానించడం విశేషం. -
పేస్పై నాదల్ ప్రశంసలు
న్యూఢిల్లీ:భారత టెన్నిస్ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్పై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ప్రశంసల వర్షం కురిపించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్లో లియాండర్ ఒక అసాధారణ ఆటగాడని కొనియాడాడు. టెన్నిస్ చరిత్రలో ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న లియాండర్తో తలపడటం తాను అరుదైన గౌరవంగా భావిస్తున్నాని నాదల్ పేర్కొన్నాడు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్లో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జంట 4-6, 7-6 (7/2), 6-4, 6-4 తో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జోడీపై విజయం సాధించింది. మూడు గంటలకు పైగా సాగిన పోరులో భారత జంట పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ద్వయంలో ఒకడైన పేస్ను నాదల్ ప్రత్యేకంగా అభినందించాడు. 'లియాండర్ గొప్ప మ్యాచ్ ఆడాడు. గత రాత్రి జరిగిన మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా జరిగింది. ఆ మ్యాచ్ చాలా కఠినమైన మ్యాచ్ . లియాండర్ జంట చాలా బాగా ఆడింది. లియాండర్ పేస్ దేశంలో అతనితో కలిసి ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. డబుల్స్ విభాగంలో అతి పెద్ద స్టార్లలో పేస్ ఒకడు. టెన్నిస్ చరిత్రలో లియాండర్ అత్యుత్తమ ఆటగాడు' అని నాదల్ తెలిపాడు. -
నేనింకా నిత్య విద్యార్థినే...
* నాదల్ నుంచి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి * భారత దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్య న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకుపైగా అంతర్జాతీయ కెరీర్... 18 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్... వరుసగా ఏడు ఒలింపిక్స్లు ఆడిన ఏకైక టెన్నిస్ ప్లేయర్... డేవిస్ కప్లో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన రికార్డు సమం.. ఇలా చెప్పుకుంటూ పోతే భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఖాతాలో ఘనతలు ఎన్నో ఉన్నాయి. 43 ఏళ్ల వయస్సులోనూ యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆడుతోన్న పేస్... తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకునేందుకు రాఫెల్ నాదల్ లాంటి ఆటగాళ్ల నుంచీ నేర్చుకోవడానికి సిద్ధమేనని తెలిపాడు. స్పెరుున్ జట్టుతో శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత జట్టు తలపడనున్న నేపథ్యంలో పేస్ వెలుబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... అందరూ చూసేందుకు రావాలి: 14 గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నాదల్, ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్... ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ చాంపియన్ జంట ఫెలిసియానో లోపెజ్, మార్క్ లోపెజ్లతో స్పెరుున్ ఇక్కడకు రావడం వారి ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఒకరకంగా ఈ మ్యాచ్ జరిగే మూడు రోజులు టెన్నిస్ అభిమానులకు పండగే. నేనే గనుక జూనియర్ ప్లేయర్ అరుుఉంటే ప్రతి రోజూ ఈ స్టార్స్ ఆటను చూసేందుకు వచ్చేవాడిని. నాదల్ ఏ రకంగా ఆడతాడో, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాడో చూసేందుకు అందరూ రావాలి. యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి: నాదల్, ఫెరర్లాంటి మేటి ప్లేయర్లకు భారత యువ ఆటగాళ్లు సాకేత్ మైనేని, రామ్కుమార్ పరీక్ష పెట్టే అవకాశం వచ్చింది. దీనిని వారు సద్వినియోగం చేసుకోవాలి. ఫలితం గురించి ఆలోచించకుండా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఏ రకంగా ఆడాలో తెలుసుకోవడానికి యువ ఆటగాళ్లందరూ నాదల్, ఫెరర్ల ఆటతీరును పరిశీలించాలి. జట్టులో అత్యంత సీనియర్ను కాబట్టి నేను యువ ఆటగాళ్లకు మార్గదర్శిగా ఉంటాను. జూనియర్ ఆటగాళ్లు నాకంటే బాగా ఆడుతూ, జట్టులో స్థానం లేదని చెప్పినరోజు నేనే వైదొలుగుతాను. -
ముగిసిన సానియా పోరు
యూఎస్ ఓపెన్లో ఈసారి భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. లియాండర్ పేస్, రోహన్ బోపన్న పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఇప్పటికే నిష్ర్కమించగా... వారి సరసన సానియా మీర్జా కూడా చేరింది. మిక్స్డ్ డబుల్స్లో రెండో రౌండ్లో ఓడిన సానియా... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సానియా-బార్బరా స్టిక్రోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-7 (3/7), 1-6తో టాప్ సీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స) జోడీ చేతిలో ఓడిపోరుుంది. 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోరుున ఇండో-చెక్ జంట రెండో సెట్లో మాత్రం చేతులెత్తేసింది. గత ఏడాది యూఎస్ ఓపెన్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి లియాండర్ పేస్ మిక్స్డ్ డబుల్స్లో... సానియా మహిళల డబుల్స్లో టైటిల్స్ సాధించారు. -
డిఫెండింగ్ చాంపియన్స్కు నిరాశ!
న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగిన లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడికి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ పోరులో ఈ ఇండో-స్విస్ ద్వయం 6-7(1), 6-3, 11-13 తేడాతో అమెరికా జంట కోకో వాందివెగీ-రాజీవ్ రామ్ చేతిలో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. తొలి సెట్ను టై బ్రేక్లో కోల్పోయిన పేస్-హింగిస్ల జంట, రెండో సెట్ ను చేజిక్కించుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో పేస్ జోడి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హోరాహోరీగా సాగిన మూడో సెట్ను చివరకు అమెరికా జంట కైవసం చేసుకోవడంతో మరోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ను సాధించాలనుకున్న పేస్-మార్టినా జోడి ఆశలు తీరలేదు. ఈ ఓటమితో యూఎస్ ఓపెన్లో లియాండర్ పోరాటం ముగిసింది. అంతకుముందు పురుషుల డబుల్స్ లో లియాండర్ పేస్-ఆండ్రీ బెగ్ మాన్(జర్మనీ) జంట పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో రోహన్ బోపన్న(భారత్)-గాబీ డాబ్రాస్కో(కెనడా) జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ జోడీ 5-7, 6-3, 10-7 తేడాతో లుకాస్ కుబాట్-అండ్రియా హ్లవకోవా జంటపై గెలిచి మూడో రౌండ్కు చేరింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జంట 6-2, 7-6 తేడాతో గొలుబిక్ విక్టోరియా-మెలికర్ నికోలేపై గెలిచి మూడో రౌండ్ లోకి ప్రవేశించింది. -
సానియా, పేస్, బోపన్నలు శుభారంభం
న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాళ్లు శుభారంభం చేశారు. తొలి రౌండ్ లో భాగంగా మహిళల డబుల్స్లో సానియా మీర్జా-బార్బోరా స్టికోవా( చెక్ రిపబ్లిక్) జోడితో పాటు, మిక్స్డ్ డబుల్స్లో లియాండర్ పేస్- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించగా, పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న-ఫ్రెడిక్ నీల్సన్(డెన్మార్) జంట విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన పేస్-హింగిస్ల ద్వయం 6-3, 6-2 తేడాతో సాచియా వికెరీ(అమెరికా)-తైఫో(ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 51 నిమిషాల పాటు జరిగిన పోరులో పేస్ హింగిస్లు వరుస సెట్లను కైవసం చేసుకున్నారు. మహిళల డబుల్స్లో సానియా-స్టికోవా జోడి 6-3, 6-2 తేడాతో అమెరికా జంట జదా మయీ-ఎనా షిబాహరాపై గెలిచింది. ఇక పురుషుల డబుల్స్లో బోపన్న- నీల్సన్ జంట 6-3, 6-7(3), 6-3 తేడాతో పదహారో సీడ్ రాడెక్ స్టెపనాక్(చెక్ రిపబ్లిక్)- నెనాడ్ జిమోంజిక్(సెర్బియా)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి చేరింది. -
ఇలా ప్రిపేర్ అయితే పతకం వస్తుందా?
భారత టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, రోహన్ బోపన్న రియో ఒలింపిక్స్కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి తప్పుపట్టాడు. రియో ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ డబుల్స్లో పేస్, బోపన్న జోడీ తొలిరౌండ్లోనే ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 'ఈ మెగా ఈవెంట్కు ముందు పేస్, బోపన్నలు సరిగా సాధన చేయలేదు. అత్యున్నత స్థాయి ఈవెంట్లు, మ్యాచ్లు ఆడలేదు. వీళ్లు పతకాలు గెలుస్తారని అంచనా వేయలేదు. 2004, 2008 ఒలింపిక్స్కు ముందు నేను, లియాండర్ ఎన్నో ఈవెంట్లలో ఆడాం. ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఎంతో కీలకం. అయితే ఈ ఏడాది ఇలా సాధన చేయలేదు కాబట్టే విఫలమయ్యాం' అని మహేష్ భూపతి అన్నాడు. -
రన్నరప్ పేస్ జంట
విన్స్టన్-సాలెమ్ (అమెరికా): ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు నిరాశే మిగిలింది. శనివారం జరిగిన విన్స్టన్-సాలెమ్ ఓపెన్ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో పేస్-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) ద్వయం 6-4, 6-7 (6/8), 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెరుున్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్) జంట చేతిలో ఓడిపోరుుంది. రెండో సెట్లో టైబ్రేక్లో పేస్ జంటకు మూడు మ్యాచ్ పారుుంట్లు లభించినా ఫలితం లేకపోరుుంది. 2015 జనవరిలో ఆక్లాండ్ ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత పేస్ మరో డబుల్స్ టైటిల్ గెలువలేకపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో పేస్-బెగెమన్ ద్వయం 1-6, 7-6 (7/5), 10-4తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ లిండ్స్టెడ్ (స్వీడన్)-ఐజామ్ ఉల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీపై గెలిచింది. రన్నరప్గా నిలిచిన పేస్ జంటకు 18,470 డాలర్ల (రూ. 12 లక్షల 40 వేలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
సెమీస్లో పేస్ జంట...
విన్స్టన్-సాలెమ్ (అమెరికా): టాప్ సీడ్ జోడిని బోల్తా కొట్టించిన లియాండర్ పేస్ (భారత్)-బెగెమన్ (జర్మనీ) ద్వయం విన్స్టన్ సాలెమ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో పేస్-బెగెమన్ జోడీ 6-4, 6-4తో కుబోట్ (పోలాండ్)-జిమోనిచ్ (సెర్బియా) ద్వయంపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్లో గెలిస్తే పేస్ ఈ సీజన్లో తొలిసారి ఏటీపీ టోర్నీలో ఫైనల్కు చేరుకుంటాడు. -
క్వార్టర్స్లో పేస్ జోడి
విన్స్టన్-సలేమ్ (యూఎస్ఏ):విన్స్టన్-సలేమ్ ఓపె న్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్- బెగి మన్ జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్లో పేస్ (భారత్)- ఆండ్రి బెగిమన్ (జర్మని) జోడి 6-4, 6-4తో క్రిస్ గుచినె (ఆస్ట్రేలియా)- ఆండ్రి సా (బ్రెజిల్) జంటపై విజయం సాధించింది. క్వార్టర్స్లో పేస్ జోడి టాప్ సీడ్ లూకాస్ కుబోట్ (పొలాండ్)- జిమోంజిక్ (సెర్బియా) జంటతో తలపడుతుంది. -
అంతా కలిసి ‘ఆడుకున్నారు’...
♦ దేశాన్ని నిరాశపరిచిన పేస్, బోపన్న ♦ సమన్వయం లేకుండానే బరిలోకి ♦ బలవంతంగా జత కట్టించిన సమాఖ్య బాలీవుడ్ ఆల్టైం క్లాసిక్ ‘మొగల్ ఎ ఆజం’లో దిలీప్ కుమార్, మధుబాల మధ్య ప్రేమ సన్నివేశాలు చూస్తే అమర ప్రేమికుల్లా కనిపిస్తారు. కానీ పాత గొడవల కారణంగా ఆ సినిమా షూటింగ్ సమయంలో వారి మధ్య మాటలే లేవు! కానీ ప్రొఫెషనలిజం ముందు వ్యక్తిగత ఆగ్రహావేశాలు పక్కన పెట్టి వారు అలా నటించేశారు. ఒలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్కు ముందు మాట్లాడింది లేదు, కలిసి సాధన చేసిందీ లేదు. ప్రపంచం మొత్తం స్నేహితులుగా మారిపోయిన చోట కూడా ఎడమొహం, పెడమొహమే. కానీ పాతికేళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడు, వరల్డ్ టాప్-10లో ఉన్న మరొకరు ఇగోలు పట్టించుకోరని అంతా భావించారు. దేశం కోసం ద్వేషం వీడి చెలరేగుతారని ప్రజలు నమ్మారు. కానీ లియాండర్ పేస్, రోహన్ బోపన్న అలా చేయలేదు. మ్యాచ్ గెలుపుకంటే పంతం ముఖ్యమని అనుకున్నారు. సాక్షి క్రీడా విభాగం: ఒలింపిక్స్కు కొద్ది రోజుల ముందే పేస్, బోపన్న కలిసి డబుల్స్ భాగస్వాములుగా డేవిస్ కప్ మ్యాచ్ ఆడారు. ఇద్దరూ తమ స్థాయిలో చెలరేగడంతో కొరియాపై సునాయాస విజయం దక్కింది. దాంతో ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయిందని అభిమానులు అనుకున్నారు. కానీ రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ పాత విభేదాలు బయట పడ్డాయి. మెరుగైన ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలయ్యాం, గెలుపోటములు ఆటలో సహజం అంటూ వీరిద్దరు ఎన్ని మాటలు చెప్పుకున్నా... ఈ వివరణ ఎవరినీ సంతృప్తి పరచడం లేదు. తమ సొంత ఇష్ట ప్రకారం వ్యవహరించిన వీరిద్దరు కోర్టులో ప్రత్యర్థితో కాకుండా ఒకరితో మరొకరు తలపడినట్లు అనిపించింది. పేస్ ఇలా మారిపోయాడా..? భారత్కు ప్రాతినిధ్యం వహించే సమయంలో పేస్లో ఒక్కసారిగా ఎక్కడ లేని ఎనర్జీ కనిపించేది. తనకంటే ఎంతో మెరుగైన, అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడినప్పుడు కూడా అతను ఎక్కడా తగ్గలేదు. ఇదే శైలి పేస్ను దేశం కోసం ఆడే ఆటగాడిగా గుర్తింపు తెచ్చింది. కానీ తాజా పరిణామాలు ఇన్నేళ్ల కీర్తిని దెబ్బ కొట్టేలా ఉన్నాయి. ఒలింపిక్స్కు ముందు యూరోప్లో చాలెంజర్ టోర్నీ, అమెరికాలో టీమ్ టెన్నిస్ ఆడుతున్నాడు. ఇవేమీ పెద్దగా ప్రాధాన్యత ఉన్నవి కూడా కాదు. చివరకు బోపన్న నాలుగు రోజుల పాటు తగిన భాగస్వామి లేక ఎవరో విదేశీ ఆటగాడితో తన ప్రాక్టీస్ కొనసాగించాడు. సన్నద్ధత అంటే ప్రాక్టీస్ కాదని, మ్యాచ్లు ఆడటం కూడా ప్రాక్టీస్ కిందకే వస్తుందని ఓటమి తర్వాత పేస్ చెప్పిన వివరణ సబబుగా అనిపించలేదు. పైగా ఇలాంటి ఫలితం తర్వాత కూడా ఏ మాత్రం మొహమాటపడకుండా టోక్యో 2020కు కూడా సిద్ధమని చెప్పుకోవడం నిజంగా ఆశ్చర్యపరిచింది. బోపన్న తనకు నచ్చినట్లుగా... మరో వైపు బోపన్న కూడా మొదటినుంచి తాను అనుకున్నట్లుగానే వ్యవహరించాడు. పేస్ రికార్డు గురించి తెలిసీ... 125వ ర్యాంకర్ సాకేత్ మైనేనితోనే ఆడతానని నిర్మొహమాటంగా చెప్పి అలజడి రేపాడు. చివరకు బలవంతంగా ఐటా జోడీ కట్టించినా దానిని సీరియస్గా తీసుకున్నట్లు లేదు. ఒలింపిక్స్కు ముందే వచ్చినా కనీసం సీనియర్ సహచరుడి గురించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పేస్ వస్తే ఎంత, రాకపోతే ఎంత అన్నట్లు అతను ప్రవర్తించాడు. దీన్ని బట్టి చూస్తే రియోకు వచ్చాక కూడా పేస్తో కలిసి ఆడటం అతనికి ఏ మాత్రం ఇష్టం లేదని, దానిని అతను బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నాడని అర్థమైపోతుంది. పోలండ్తో ఓడిన మ్యాచ్ తొలి సెట్లో బొపన్న అనూహ్యంగా రెండు సార్లు సర్వీస్ కోల్పోయాడు. రెండో సెట్లో 6-5తో ఆధిక్యంలో ఉన్నప్పుడు మళ్లీ సర్వీస్ కోల్పోవడంతో మ్యాచ్ టైబ్రేక్కు చేరింది. బోపన్న తన పూర్తి శక్తి సామర్థ్యాలతో మ్యాచ్ ఆడినట్లు కనిపించలేదు.మిక్స్డ్ డబుల్స్ (సానియాతో) రూపంలో మరో ప్రత్యామ్నాయం ఉండటం, అందులోనే పతకావకాశాలు కూడా కనిపిస్తుండటం వల్ల కూడా పోతే పోనీ అనుకున్నాడేమో. మళ్లీ మళ్లీ వివాదం... 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో రేగిన వివాదంతోనే అఖిల భారత టెన్ని సంఘం (ఐటా) పరువు పోయింది. నాడు సానియా మీర్జా, సంఘాన్ని చెడామడా తిట్టేసింది. నాలుగేళ్ల క్రితమే భూపతి, బోపన్న ద్వయానికి, పేస్కు మధ్య ఉన్న విభేదాలు బయట పడ్డాయి. ఆడితే మేమిద్దరమే కలిసి ఆడతామంటూ భీష్మించుకోవడంతో చివరకు పేస్కు జతగా విష్ణువర్ధన్ ను ఆడించాల్సి వచ్చింది. అప్పుడు రెండు జోడీలు చిత్తయ్యాయి. ఈ సారి ఒకే జోడీకి అవకాశం ఉన్న సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. సాకేత్ను బోపన్న కోరుకున్నా... దేశం తరఫున అత్యుత్తమ జోడి అంటూ పేస్-బోపన్నను ప్రకటించారు. బోపన్నకు అది ఇష్టం లేకపోయినా ఆడాల్సిందేనంటూ బలవంతం చేశారు. వారికి పడటం లేదని, సమన్వయంతో సాగాల్సిన డబుల్స్లో ఇది పని చేయదని తెలిసినా ఒలింపిక్స్ లోపు సర్దుకుంటుందని అతి వి శ్వాసం ప్రకటించారు. ఐటా కూడా కేవలం పేస్ ఏడో ఒలింపిక్ రికార్డునే దృష్టిలో ఉంచుకున్నట్లుంది. అతను లెజెండ్ కాబట్టి నిరాశపర్చకూడదని, తగిన గౌరవం ఇవ్వాలని భావించి ఉంటుంది. అందుకే సెంటిమెంట్కే ఎక్కువ మొగ్గు చూపి పేస్ను రియో పంపించింది. ఆ తర్వాత కూడా బోపన్నలాగే పేస్నూ ఒప్పించి కాస్త సంధి కుదిర్చే పని కూడా చేయలేదు. అతను ఒలింపిక్స్కు ముందు సాధారణ టోర్నీలు ఆడకుండా ముందే రియో వచ్చేలా, వీరిద్దరు కలిసి ప్రాక్టీస్ చేసేలా చేయలేకపోయింది. నీకు మరో అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఈ సారైనా వివాదం రాకుండా క్రమశిక్షణ పాటించమంటూ గట్టిగా చెప్పలేకపోయింది. దాంతో పేస్ తనకు నచ్చినట్లుగా వచ్చి వెళ్లాడు. మొత్తంగా ఆటగాళ్లు, సంఘం కలిసి దేశాన్ని మోసం చేశారు. పతకం ఆశలను ఆదిలోనే తుంచేశారు. షూటింగ్ పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ (క్వాలిఫయింగ్) గగన్ నారంగ్, అభినవ్ బింద్రా సాయంత్రం గం. 5.30 నుంచ ఫైనల్స్: గం. 8.30 నుంచి ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఈవెంట్ (ఎలిమినేషన్) లక్ష్మీరాణి మాఝీ సాయంత్రం గం. 6 నుంచిహాకీ పురుషులు (భారత్ x జర్మనీ) సాయంత్రం గం. 7.30 నుంచి మహిళలు (భారత్ x బ్రిటన్) మంగళవారం తెల్లవారుజామున గం.2.30 స్విమ్మింగ్ మహిళల 200 మీటర్ల ఫ్రీ స్టైల్ శివానీ కటారియా - రాత్రి గం. 9.30 పురుషుల 200 మీటర్ల బట్టర్ఫ్లై సాజన్ ప్రకాశ్ - రాత్రి గం. 10 గంటలనుంచి స్టార్స్పోర్ట్స్-1, 2లలో ప్రత్యక్ష ప్రసారం -
‘కలహాల కాపురం’ ఒక్క రోజుకే...
ఆగస్ట్ 4న లియాండర్ పేస్ రియోలో దిగాడు. 5న ప్రారంభోత్సవంలో పాల్గొని తన ఏడో ఒలింపిక్స్ ఘనతను గుర్తు చేస్తూ కొన్ని ట్వీట్లు చేశాడు... అందులోనూ బోపన్నతో వివాదంపై వివరణ కూడా ఇచ్చేశాడు! 6న ఓటమిపాలై తిరుగు పయనమయ్యాడు... ఇదీ దిగ్గజంగా, దేశం కోసం ప్రాణాలొడ్డే ఆటగాడిగా గుర్తింపు ఉన్న లియాండర్ పేస్ ఒలింపిక్స్కు ఇచ్చిన ముగింపు. రియోలో 84 గంటలు కూడా లేని పేస్ పోరాటం మైదానంలో కూడా 84 నిమిషాలకే ముగిసింది. బోపన్న కూడా తనతో బలవంతంగా జోడీ కట్టించినందుకు కావాలని ‘సహాయ నిరాకరణ’ చేశాడో, లేక నిజంగా ప్రత్యర్థులు బాగా ఆడారో కానీ మొత్తానికి ఈ బలవంతపు భాగస్వామ్యం ఒక్క మ్యాచ్కే పరిమితమైంది. ఏడు ఒలింపిక్స్ ఆడినందుకు భారత్ గర్వించాలా... లేక ఇద్దరూ కలిసి దేశాన్ని మోసం చేశారని భావించాలా! రియో: టెన్నిస్ పురుషుల డబుల్స్లో భారత జోడి లియాండర్ పేస్-రోహన్ బోపన్న తొలి రౌండ్లోనే ఓటమి పాలై ఒలింపిక్స్ నుంచి నిష్ర్కమించారు. ప్రతిష్టాత్మక క్రీడలకు ముందు కనీసం కలిసి ప్రాక్టీస్ చేయని మన జంట పేలవమైన ఆటతో ప్రత్యర్థికి తలవంచింది. పోలండ్కు చెందిన కుబోట్ లుకాజ్-మార్సిస్ మట్కోవ్స్కీ 6-4, 7-6 (6)తో పేస్-బోపన్నను చిత్తు చేశారు. గంటా 24 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. తొలి సెట్లో మూడు సార్లు సర్వీస్ కోల్పోయిన భారత జోడి సునాయాసంగా సెట్ను అప్పగించింది. రెండో సెట్లో కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఐదు ఏస్లు సంధించిన పోలండ్ జోడి దూసుకుపోయింది. అయితే భారత్ కోలుకొని వరుస పాయింట్లు సాధించడంతో సెట్ ట్రైబ్రేక్కు చేరినా... అక్కడా ప్రత్యర్థిదే పైచేయి అయింది. వాస్తవానికి భారత జంట అనుభవం, గ్రాండ్స్లామ్ డబుల్స్లలో వారి ప్రదర్శనను చూస్తే ఈ మ్యాచ్లో గెలుపు అంత కష్టమేమీ కాదు. నిజానికి చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు తప్పుకోవడంతో సెమీఫైనల్ వరకు కూడా వీరికి సులభమైన ‘డ్రా’ పడింది. సొంత ఇగోలను పక్కన పెట్టి కాస్త శ్రమించినా భారత్ ఖాతాలో పతకం చేరేది. కానీ గత లండన్ ఒలిం పిక్స్ వివాదాలను పునరావృతం చేస్తూ వీరిద్దరు దేశం కోసం కాకుండా తమ కోసం ఆడుకున్నారు. -
అతడి 25 ఏళ్ల రికార్డు చూసి మాట్లాడండీ!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్పై వస్తున్న విమర్శలపై అఖిల భారత టెన్నిస్ సమాఖ్య(ఐటా) తీవ్రంగా స్పందించింది. స్టార్ ప్లేయర్ లియాండర్ కు ఆటపై ఉన్న నిబద్ధతను, అతడి అంకితభావాన్ని ఎవ్వరూ ప్రశ్నించరాదని పేర్కొంది. ప్రస్తుతం ఏడో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న పేస్ రియోకు చాలా ఆలస్యంగా రావడంతో మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్ సమాఖ్య పేస్కు మద్ధతు తెలిపింది. డేవిస్ కప్ కెరీర్ చూస్తే చాలు పేస్ అంటే ఏంటన్నది అందరికీ అర్థమవుతుందని ఐటా సెక్రటరీ జనరల్ భరత్ ఓజా చెప్పారు. బ్రెజిల్లో అడుగుపెట్టకముందు వాషింట్టన్ కాస్టిల్స్ తరఫున వరల్డ్ టీమ్ టెన్నిస్ లో పేస్ పాల్గొన్నాడు. పేస్ 20 ఏళ్ల డేవిస్ కప్ రికార్డులు, ఆసియా గేమ్స్, ఆరు ఒలింపిక్స్ లో పాల్గొనడం గమనించిన తర్వాత పేస్పై చేస్తున్న విమర్శలను ఆపేయాలని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రాణిస్తే అన్ని విభాగాల్లో రాణించే అవకాశం ఉందని.. పేస్ పాత్ర ఎప్పుడూ కీలకమేనని భరత్ ఓజా పేర్కొన్నారు. తన భాగస్వామితో కలిసి రోహన్ బోపన్న సెర్బియాకు చెందిన జిమాంజిక్, సానియా మిర్జా(భారత్)లు ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలు ఇంటర్ నెట్లో హల్ చల్ చేయడంతో పేస్ కు ఆటపై గౌరవం లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టెన్నిస్ సమాఖ్య తీవ్రస్థాయిలో స్పందించింది. -
భారత్ అదుర్స్
చండీగఢ్: ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్లో భారత అదరగొడుతుంది. దక్షిణ కొరియాతో జరుగుతున్న డేవిస్ కప్ పోరులో భారత్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో విజయం సాధించి సత్తా చాటిన భారత జట్టు.. శనివారం జరిగిన పురుషుల డబుల్స్లో కూడా విజయం సాధించింది. భారత పురుషుల డబుల్స్ లో భాగంగా లియాండర్ పేస్-రోహన్ బోపన్న జోడి 6-3, 6-4, 6-4 తేడాతో హాంగ్ చుంగ్-యున్సియోంగ్ చుంగ్ ద్వయాన్ని మట్టికరిపించింది. తొలి సెట్ను అవలీలగా గెలిచిన పేస్ జంట.. రెండు, మూడు సెట్లలో పోరాడి గెలిచింది. గంటా 41 నిమిషాల పాటు జరిగిన డబుల్స్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అంచనాలను తగ్గట్టు రాణించి చక్కటి గెలుపును సొంతం చేసుకున్నారు. ఓవరాల్గా 17 పాయింట్లను మాత్రమే తమ సర్వీస్ల ద్వారా కోల్పోయిన భారత జట్టు ఆద్యంత నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంది. తద్వారా భారత్ 3-0 ఆధిక్యం సాధించిన భారత్.. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన డేవిస్ కప్ పోరులో భారత ఆటగాడు రామ్కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్కుమార్ను విజేతగా ప్రకటించారు. ఇక రెండో సింగిల్ మ్యాచ్ లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో యోంగ్కు లిమ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో సాకేత్ విజయం ఖరారైంది. ఆదివారం నాటి సింగిల్స్ మ్యాచ్లో సియోంగ్ చాన్ హాంగ్ తో సాకేత్ మైనేని తలపడతాడు. -
దేశం కోసం ఈగో పక్కనపెట్టి!
పురుషుల డబుల్స్ టెన్నిస్ విభాగంలో రియో ఒలింపిక్స్ బెర్త్ కోసం భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్ మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కోన్నా చివరికి స్థానం దక్కించుకున్నాడు. మరో డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న.. పేస్ తో జతకట్టేది లేదని గతంలో తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం విశేషం. ఇద్దరూ తమ ఈగోలను పక్కనపెట్టి ఆటకోసం ముందుకు రావడంతో పరిస్థితి 'ఆల్ ఈజ్ వెల్' అన్నట్లు కనిపిస్తోంది. తాజాగా వారిద్దరూ డేవిస్ కప్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఛండీగఢ్ క్లబ్ లో ప్రాక్టీస్ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పేస్ సాధించిన విజయాలను చూసిన వాళ్లు అతడిని ఖచ్చితంగా గౌరవిస్తారు. ప్రపంచంలోనే డబుల్స్ అత్యుత్తమ ఆటగాళ్లలో పేస్ ఒకడు' అని బోపన్న చెప్పాడు. అయితే పేస్ తో కలిసి ఆడనని తానెప్పుడూ చెప్పలేదని, మరో భాగస్వామిని తన ఆటతీరు బాగుంటుందని, సౌకర్యంగా ఉంటుందని మాత్రమే చెప్పినట్లు వెల్లడించాడు. గత విషయాల గురించి తాను మాట్లాడాలని భావించట్లేదని, దేశం కోసం అనగానే ఏ ఆటగాడయినా కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని పేస్ అంటున్నాడు. వందల కోట్ల ప్రజల కోసం ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఈగోలను పక్కన పెడతామని చెప్పుకొచ్చాడు. బోపన్న చాలా శ్రమిస్తాడంటూ తన భాగస్వామిని పేస్ ప్రశంసించాడు. -
పేస్ వర్సెస్ బోపన్న!
లండన్: త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్లో భారత నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న పురుషుల టెన్నిస్ డబుల్స్ జోడి రోహన్ బోపన్న-లియాండర్ పేస్లు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో ఒకరికొకరు ప్రి-క్వార్టర్స్ లోఎదురుపడే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వింబుల్డన్ డ్రా ప్రకారం ఇరు జోడీలు ఆదిలోనే అమీతుమీ తేల్చుకోనే అవకాశం ఉంది. ఈ టోర్నీలో బోపన్న-ఫ్లోరియన్ మెర్జియా(రోమేనియా)తో జత కడుతుండగా, పేస్-మార్కిన్ మాత్కోస్కి(పోలెండ్)తో జోడి కడుతున్నాడు. అయితే పేస్-మార్కిన్ మాత్కోస్కి ద్వయం తొలి పోరులో యెన్ సున్ లూ(తైపీ)-తిప్సిర్వెక్(సెర్బియా) తలపడుతుండగా, బోపన్న-ఫ్లోరియన్ మెర్జియా జంట మారిన్ డ్రాగాంజా-నికోలా మెక్టిక్(క్రొయేషియా)తో ఆడనునన్నారు. ఈ రౌండ్ను అధిగమిస్తే తదుపరి పోరులో ఈ ఇద్దరు భారత ఆటగాళ్లు ముఖాముఖి పోరులో తలపడనున్నారు. భారత నుంచి పురుషుల విభాగంలో రోహన్- పేస్ లు మాత్రమే వింబుల్డన్ కు అర్హత సాధించగా, మహిళ విభాగంలో సానియా మీర్జా పాల్గొంటుంది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా-హింగిస్ ల జోడి తొలి పోరులో అన్నా లీనా-లౌరా సిగ్మండ్ (జర్మనీ) జంటతో తలపడనుంది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. -
రియోలో త్రివర్ణం ఎగరేయాలి
భారత క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ మరో దిగ్గజం లియాండర్ పేస్కు రియో ఒలింపిక్స్ కోసం శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం పేస్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సచిన్.... ఈ ఏడాది అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. ‘చలో రియోమే తిరంగా లహరాయే’ అంటూ తన సందేశాన్ని అందించారు. -
పేస్ కు సచిన్ జన్మదిన శుభాకాంక్షలు
ముంబై: భారత టెన్నిస్ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. తాజాగా 43వ ఒడిలోకి అడుగుపెట్టిన పేస్కు సచిన్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్లో పేస్ పతకం సాధించాలని సచిన్ ఆకాంక్షించాడు. ఈ సంవత్సరం పేస్ కు ఒక చిరస్మరణీయమైనదిగా మిగిలిపోవాలని సచిన్ తెలిపాడు. ఆగస్టులో ఆరంభం కానున్న రియో ఒలింపిక్స్ లో భాగంగా పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్నతో జోడి కట్టబోతున్న పేస్ తప్పకుండా పతకం సాధిస్తాడని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పేస్-హింగిస్ల జోడి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో పేస్ డబుల్స్ , మిక్స్ డ్ డబుల్స్ లో సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్ సంఖ్య 18కు చేరింది. -
పేస్ రాకెట్స్కు రూ.లక్షన్నర
కోల్కతా: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు చెందిన రాకెట్స్కు వేలంలో రూ. లక్షా 50 వేలు పలికాయి. అలాగే భారత వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని కీపింగ్ గ్లోవ్స్, ప్యాడ్స్ రూ. లక్షకు.. పీలే సంతకం చేసిన ఫుట్బాల్ రూ.లక్షా 10 వేలకు అమ్ముడుపోయాయి. వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకునేందుకు వాడిన పేస్ రాకెట్స్ను బెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారి కొనుగోలు చేశాడు. క్రీడా వెబ్సైట్ ఎక్స్ట్రాటైమ్.ఇన్ నిర్వహించిన ఈ వేలం మోహన్ బగాన్ వీరాభిమాని, లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న బాపి మజీ, ఈస్ట్ బెంగాల్ మద్దతుదారు దివంగత అలిప్ చ క్రవర్తి కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం జరిగింది. ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి, అజింక్య రహానే జెర్సీలను కూడా అభిమానులు కొనుగోలు చేశారు. ఓవరాల్గా వేలం ద్వారా సమకూరిన రూ.14 లక్షల మొత్తాన్ని ఇరు కుటుంబాలకు అందజేశారు. -
ధోని క్రికెట్ కిట్ విలువెంతో తెలుసా!
కోల్ కతా:టీమిండియా జట్టులో అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్గా, విజయవంతమైన కెప్టెన్ నిరూపించుకున్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. జట్టును ముందుండి నడిపించడంలో, సిక్స్ తో మ్యాచ్ ను ముగించడంలో ధోని తనదైన మార్కును సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, సామాజిక సేవలో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన వేలానికి ధోని తన వంతు సాయాన్ని అందించాడు. తన గ్లోవ్స్, ప్యాడ్స్ను అందించి తన ఉదారతను చాటుకున్నాడు. ఇటీవల నిర్వహించిన వేలంలో ధోని క్రికెట్ కిట్ కు భారీ ధరనే పలికింది. స్పోర్ట్స్ వెబ్ సైట్ ఎక్స్ట్రాటైమ్.ఇన్ నిర్వహించిన వేలంలో ధోని కిట్ను లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. మరోవైపు భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ గెలిచిన రాకెట్స్కు లక్ష యాభైవేల ధర పలికింది. కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్న బాపీ మాజీ(మోహన్ బగాన్ ఫుట్ బాల్ జట్టు అభిమాని), దీర్ఘకాలికమైన వ్యాధితో బాధపడుతున్న అలిప్ చక్రబొర్తి (ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ అభిమాని) కుటుంబానికి సహాయం అందించేందుకు క్రికెట్ వెబ్ సైట్ ద్వారా వేలం నిర్వహించారు. దీనికి మహేంద్ర సింగ్ ధోని, లియాండర్ పేస్లతో పాటు పలువురు ముందుకొచ్చారు. ఈ వేలం ద్వారా ఇప్పటివరకూ వచ్చిన రూ.14 లక్షల మొత్తాన్ని ఆయా కుటుంబాలకు అందించినట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది. -
రైట్... రైట్... పేస్
* ఒలింపిక్స్కు లియాండర్ * బోపన్నకు జతగా బరిలోకి * జట్లను ప్రకటించిన ఐటా న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగాలనుకున్న లియాండర్ పేస్ కల నేరవేరనుంది. రియో ఒలింపిక్స్ టెన్నిస్లో పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్నతో జతగా పేస్ బరిలోకి దిగుతాడని అఖిల భారత టెన్నిస్ సం ఘం (ఐటా) ప్రకటించింది. బోపన్న తన బాగస్వామిగా సాకేత్ కావాలని కోరినా... ఐటా మాత్రం పేస్ వైపే మొగ్గు చూపింది. పతకం సాధించాలంటే భారత్లోని అత్యుత్తమ ఆటగాళ్లు కలిసి ఆడాలని ఐటా అభిప్రాయపడింది. ఈ నిర్ణయాన్ని బోపన్న కూడా అంగీకరించడంతో కథ సుఖాంతమయింది. అలాగే మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జా ఇష్టప్రకారమే బోపన్నను ఎంపిక చేశారు. ఇక మహిళల డబుల్స్లో సానియా, ప్రార్థన తొంబరే జోడి బరిలోకి దిగుతుంది. డేవిస్కప్ కోచ్ జీషన్ అలీని జట్టుకు కెప్టెన్గా నియమించారు. డేవిస్కప్లోనూ పేస్ వచ్చే నెల 15 నుంచి కొరియా రిపబ్లిక్తో జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1 టై కోసం ఏడుగురితో కూడిన భారత జట్టును ఐటా ఎంపిక చేసింది. ఇందులోనూ పేస్కు చోటు కల్పించారు. యూకీ బాంబ్రీ, సాకేత్, బోపన్న, రామ్కుమార్ రామనాథన్ జట్టులో ఉండగా విష్ణువర్ధన్, సుమీత్ నాగల్ రిజర్వ్ ఆటగాళ్లు. ఈ మ్యాచ్ల సమయంలో పేస్, బోపన్నల మధ్య విభేదాలు ఏవైనా ఉంటే తొలిగిపోతాయని ఐటా భావిస్తోంది. -
హమ్మయ్య.. పేస్కు పార్ట్నర్ దొరికాడు!
రియో ఒలింపిక్స్లో ఎట్టకేలకు భారత సీనియర్ ప్లేయర్ లియాండర్ పేస్కు ఊరట లభించింది. అతడికి ఒక పార్ట్నర్ దొరికాడు. రోహన్ బోపన్న ఈ ఒలింపిక్స్లో పేస్తో కలిసే ఆడాలని ఆలిండియా టెన్నిస్ సంఘం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రతినిధి అనిల్ ఖన్నా తెలిపారు. నిజానికి బోపన్న తాను సాకేత్ మైనేనితో కలిసి ఆడతానని ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. బోపన్నకు పేస్ అంటే గౌరవం ఉందని.. అయితే అతడు సాకేత్తో కలిసి ఎందుకు ఆడాలనుకున్నాడో తమకు వివరించాడని ఖన్నా చెప్పారు. సెలెక్షన్ కమిటీ మాత్రం పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న - పేస్ కలిసి ఆడాలని నిర్ణయించింది. ఇక మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, సానియా మీర్జా కలిసి ఆడతారు. సానియా ముందుగానే బోపన్నను ఎంచుకున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్లుగానే అసోసియేషన్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా - ప్రార్థనా తాంబారే కలిసి ఆడతారని అనిల్ ఖన్నా చెప్పారు. -
సాకేత్తో ఆడతా...
► ఒలింపిక్స్ డబుల్స్ భాగస్వామిపై తేల్చిన బోపన్న ► అదే జరిగితే పేస్ ‘రికార్డు’ ఆశలు గల్లంతే.. ► తుది నిర్ణయం ‘ఐటా’ చేతిలో న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగాలని భావిస్తుండగా... మరోవైపురోహన్ బోపన్న అతడి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు. రియోలో జరిగే ఈ మెగా ఈవెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న తన భాగస్వామిగా సాకేత్ మైనేనిని ఎంచుకున్నాడు. ఈవిషయాన్ని ఇప్పటికే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)కు తెలిపాడు. అయితే ఐటా మాత్రం బోపన్న నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రెండోసారి దేశం తరఫున ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నందుకు గర్వంగా ఉంది. ర్యాంకింగ్స్లో టాప్-10లో నిలిచినందున నా భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ నాకుంది. ఇప్పటికే నా సహచరుడి పేరును ఐటాకు చెప్పాను. అందరి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని బోపన్న తెలిపాడు. అయితే తన భాగస్వామి పేరును నేరుగా చెప్పకపోయినా ఐటా వర్గాలు మాత్రం... బోపన్న 28 ఏళ్ల సాకేత్ను ఎంచుకున్నాడని పేర్కొన్నాయి. మరోవైపు 18 గ్రాండ్స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని ఇప్పటికీ ఫిట్నెస్తో ఉన్న పేస్ను కాదనుకోవడం తెలివైన నిర్ణయం కాదని ఐటా అభిప్రాయపడుతోంది. ‘రోహన్ కారణంగా పేస్ తన ఏడో ఒలింపిక్స్కు దూరం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేరు. ఇందుకు అతడు చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఐటా అధికారి ఒకరు తెలిపారు. ఐటీఎఫ్ నిబంధనల ప్రకారం డబుల్స్ జట్టును జాతీయ సంఘం నామినేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో బోపన్న, సాకేత్ జోడిని ఐటా అంగీకరించకపోతే వారు కలిసి ఆడేందుకు వీలుండదు. దీంతో నేడు (శనివారం) జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో ఒలింపిక్స్కు భారత్ నుంచి ఎలాంటి జట్లను ఎంపిక చేస్తారోననే ఆసక్తి నెలకొంది. డేవిస్కప్లో పేస్కు మొండిచేయి వచ్చే నెలలో జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1లో భాగంగా కొరియాతో జరిగే డేవిస్కప్ మ్యాచ్కు లియాండర్ పేస్ను పక్కనబెట్టనున్నారు. ఇందులో ఆడేందుకు పేస్ ఆసక్తి చూపినా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఐటా భావిస్తోంది. నేడు (శనివారం) జట్టు ఎంపిక జరుగుతుంది. యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని, బోపన్న, రాంకుమార్ జట్టులో ఉంటారు. సెప్టెంబర్లో చెక్ రిపబ్లిక్తో జరిగిన ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్ టైలో ఓడిన భారత్ గ్రూప్1కి పడిపోయింది. ఇందులో తొలి రౌండ్లో బై లభించిన భారత్.. కొరియాపై నెగ్గితే మరోసారి వరల్డ్ ప్లే ఆఫ్లో ఆడే అవకాశం లభిస్తుంది. -
పేస్ కు మరోసారి షాకిచ్చిన బోపన్న!
న్యూఢిల్లీ: భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ కు మరో ప్లేయర్ రోహన్ బోపన్న షాకిచ్చాడు. ప్రస్తుతం ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో టాప్-10 లో ఉన్న బోపన్న.. అఖిల భారత టెన్నిస్ సమాఖ్య(ఏఐటీఏ)కు లేఖ రాశాడు. తాను రియో ఒలింపిక్స్ లో తన భాగస్వామిగా లియాండర్ పేస్ ను ఎంచుకోవడం లేదని, సాకేత్ మైనేనిని తనకు జోడీగా పంపించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. సెలక్షన్ కమిటీ మీటింగ్ జరిగిన మరుసటి రోజు ఈ లేఖ విషయం బయటపడింది. ప్రస్తుతం పేస్ 46వ ర్యాంకులో ఉండగా, సాకేత్ మాత్రం 125వ ర్యాంకులో కొనసాగుతుండటం గమనార్హం. సెలక్షన్ కమిటీ జూన్ 11న తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది. గతంలోనూ ఇలాగే జరిగింది... నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్తో కలిసి ఆడేందుకు రోహన్ బోపన్న నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పేస్ టాప్-10లో ఉండటంతో భారత్కే చెందిన విష్ణువర్ధన్తో కలిసి లండన్ ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. ఏ భారత క్రీడాకారుడూ ఇప్పటివరకు వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు మాత్రమే ఈ అవకాశముంది. బోపన్న లేఖతో పేస్ చారిత్రక అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం లోఉన్నాడు. శనివారం సెలక్షన్ కమిటీ నిర్ణయంపైనే పేస్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. -
క్యాన్సర్ రోగికి క్రీడాలోకం చేయూత
కోల్కతా: కెప్టెన్ కూల్ ధోని క్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇటీవలే గొంతు క్యాన్సర్తో మరణించిన అలీప్ చక్రవర్తి, లివర్ క్యాన్సర్తో పోరాడుతోన్న బాపి మజ్హి కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తన గ్లోవ్స్, ప్యాడ్స్ను వేలానికి పెట్టనున్నాడు. ఇక్కడి సెంట్రల్ కోల్కతా హోటల్లో జూన్ 11న ఈ వేలం జరుగనుంది. ధోనితో పాటు లియాండర్ పేస్, అజింక్య రహానే, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, మనీశ్ పాండే, బ్రాడ్హాగ్, షకీబుల్ హసన్, జులన్ గోస్వామి, ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి, జేజీ తమ జెర్సీలు, బ్యాట్లు, గ్లోవ్స్ లను ఈ వేలంలో ఉంచనున్నారు. -
సయోధ్య సాధ్యమేనా?
► బోపన్న చేతిలో పేస్ ‘రియో’ భవితవ్యం ► ఏఐటీఏకు మళ్లీ ఒలింపిక్ సెలక్షన్ తలనొప్పి ఏ భారత క్రీడాకారుడూ ఇప్పటివరకు వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు మాత్రమే ఈ అవకాశముంది. అయితే లియాండర్ పేస్ ఈ అరుదైన ఘనత సాధించాలంటే మాత్రం రోహన్ బోపన్న పరోక్షంగా సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి పేస్కు రోహన్ బోపన్న సహకరిస్తాడా? నిరాకరిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదైతేనేం మళ్లీ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులకు ‘రియో’ ఒలింపిక్స్ సెలెక్షన్ టెన్షన్ పట్టుకుంది. న్యూఢిల్లీ: వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడమే కాకుండా సింగిల్స్ విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకం కూడా సాధించిన లియాండర్ పేస్ ‘రియో’ ఆశలు డోలాయమానంలో పడ్డాయి. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకిం గ్స్లో భారత్కే చెందిన రోహన్ బోపన్న పదో స్థానానికి ఎగబాకి టాప్-10లోకి వచ్చా డు. పేస్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 46వ ర్యాంక్కు చేరుకున్నాడు. రియో ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్ అర్హత నిబంధనల ప్రకారం... టాప్-10లో ఉన్న డబుల్స్ క్రీడాకారుడు తమ దేశానికే చెందిన ఏటీపీ ర్యాంక్ ఉన్న క్రీడాకారుడితో జతగా కలిసి బరిలో దిగే అవకాశముంది. నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్తో కలిసి ఆడేందుకు రోహన్ బోపన్న నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పేస్ టాప్-10లో ఉండటంతో భారత్కే చెందిన విష్ణువర్ధన్తో కలిసి లండన్ ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జాతో కలిసి బరిలోకి దిగాడు. మహేశ్ భూపతితో కలిసి రోహన్ బోపన్న ఆడాడు. అయితే వీరందరూ లండన్ నుంచి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారు. నాలుగేళ్లు గడిచాయి. పరిస్థితులు తారుమారయ్యాయి. 36 ఏళ్ల బోపన్న టాప్-10లోకి వచ్చాడు. మరోవైపు మరో రెండు వారాల్లో 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న పేస్ ర్యాంకేమో పడిపోయింది. మహిళల డబుల్స్లో 29 ఏళ్ల సానియా మీర్జా ప్రపంచ నంబర్వన్ స్థానంలో ఉంది. టాప్-10లోకి తాను వస్తే ఒలింపిక్స్లో తన భాగస్వామి ఎవరో నిర్ణయించుకునే హక్కు తనకు ఉంటుందని రోహన్ బోపన్న స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో బోపన్న తనకు లియాండర్ పేస్తో కలిసి ఆడే ఉద్దేశం లేదని పరోక్షంగా తెలియజేశాడు. బోపన్న అంగీకరించకుంటే మాత్రం పేస్ ‘రియో’ ఆశలు ఆవిరైనట్టే. బోపన్న, పేస్ కాకుండా భారత్ నుంచి డబుల్స్ ర్యాంకింగ్స్లో పురవ్ రాజా (103), దివిజ్ శరణ్ (114), సాకేత్ మైనేని (125), జీవన్ నెదున్చెజియాన్ (134), మహేశ్ భూపతి (164) టాప్-200లో ఉన్నారు. ఒలింపిక్స్లో ఆడాలంటే ఆయా ఆటగాళ్లు గత నాలుగేళ్లలో కనీసం మూడుసార్లు డేవిస్ కప్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న నిబంధన ఒకటుంది. దీనిని కచ్చితంగా పాటిస్తే మాత్రం పురవ్, దివిజ్, జీవన్, భూపతిలకు రియో అవకాశాల్లేవు. కేవలం సాకేత్ మాత్రమే ఈ నిబంధనకు లోబడి ఉన్నాడు. అయితే జాతీయ టెన్నిస్ సమాఖ్య అభ్యర్థిస్తే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డేవిస్ కప్ నిబంధనను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. రంగంలోకి ఏఐటీఏ... ఒలింపిక్స్కు అర్హత కోసం ర్యాంకింగ్ తుది గడువు పూర్తి కావడంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులు రంగంలోకి దిగారు. లండన్ ఒలింపిక్స్ సమయంలో జరిగిన రచ్చ ఈసారి కాకుండా సాఫీగా సెలెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈనెల 11న సమావేశం కానున్నారు. బోపన్న, పేస్, సానియా మీర్జాలతో కూడా చర్చించాలని భావిస్తున్నారు. పేస్తో కలిసి ఒలింపిక్స్లో ఆడాలని రోహన్ బోపన్నను ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ‘డబుల్స్లో భారత్ తరపున నంబర్వన్, రెండో ర్యాంక్ ఉన్న ఆటగాళ్లు జతగా ఆడటం సముచితంగా ఉంటుంది. పేస్, బోపన్న ఇద్దరూ అనుభవజ్ఞులే. బోపన్నకు తన భాగస్వామిని ఎంచుకునే అర్హత ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి భేషజాలకు పోకుండా బోపన్న వివేకంగా వ్యవహరిస్తే సమస్యే ఉత్పన్నం కాదు. ప్రస్తుతం పేస్ ర్యాంక్ పడిపోయిన విషయం వాస్తవమే. అయితే పేస్ సాధించిన ఘనతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఏఐటీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే రోహన్ బోపన్న ఏఐటీఏ అధికారుల ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తాడా లేక లండన్ ఒలింపిక్స్ సమయంలో వ్యవహరించినట్టు మొండిగా ఉంటాడా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. మిక్స్డ్ డబుల్స్లో సానియా-బోపన్నలకు అవకాశం మిక్స్డ్ డబుల్స్ విషయానికొస్తే... ఒలింపిక్స్కు అర్హత సాధించిన క్రీడాకారుల కంబైన్డ్ ర్యాంకింగ్ ఆధారంగా ఎంట్రీ లభిస్తుంది. 16 జోడీలు మాత్రమే మిక్స్డ్ డబుల్స్లో పాల్గొనే వీలుంది. మహిళల డబుల్స్లో సానియా నెంబర్వన్ ర్యాంక్, పురుషుల డబుల్స్లో బోపన్న పదో ర్యాంక్ కలిపితే వీరిద్దరి కంబైన్డ్ ర్యాంక్ 11 అవుతుంది. కాబట్టి భారత్ నుంచి రోహన్ బోపన్న, సానియా మీర్జాలకు మాత్రమే మిక్స్డ్ డబుల్స్లో ఆడే అవకాశముంది. దాంతో మిక్స్డ్ డబుల్స్లో లియాండర్ పేస్కు బరిలో దిగే చాన్స్ లేదు. సానియాకు కూడా బోపన్నతో కలిసే మిక్స్డ్ డబుల్స్లో ఆడాలని కోరిక ఉంది. -
చరిత్ర సృష్టించిన లియాండర్
-
పేస్-హింగిస్ ‘మిక్స్డ్’ కెరీర్ స్లామ్
► ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఇండో-స్విస్ ద్వయం ► ఫైనల్లో సానియా-డోడిగ్ జోడీపై గెలుపు పారిస్: వయసు పెరిగినా వన్నె తగ్గలేదని భారత, స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, మార్టినా హింగిస్ నిరూపించారు. సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్లో పేస్-హింగిస్ జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో చాంపియన్గా అవతరించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అన్సీడెడ్ పేస్-హింగిస్ జోడీ 4-6, 6-4, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయంపై విజయం సాధించింది. ఈ విజయంతో ఇటు పేస్... అటు హింగిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జతగా... వేర్వేరుగా కెరీర్ స్లామ్ (నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గడం) ఘనతను పూర్తి చేసుకున్నారు. 42 ఏళ్ల పేస్కిది ఓవరాల్గా 18వ గ్రాండ్స్లామ్ టైటిల్. ఇందులో పురుషుల డబుల్స్ విభాగంలో 8... మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 10 ఉన్నాయి. మరోవైపు 35 ఏళ్ల హింగిస్కు 22వ గ్రాండ్స్లామ్ టైటిల్. ఇందులో మహిళల సింగిల్స్ విభాగంలో 5ు... మహిళల డబుల్స్లో 12... మిక్స్డ్ విభాగంలో 5 టైటిల్స్ ఉన్నాయి. విజేతగా నిలిచిన పేస్-హింగిస్ జంటకు లక్షా 16 వేల యూరోలు (రూ. 87 లక్షల 81 వేలు)... రన్నరప్ సానియా-డోడిగ్ జోడీకి 58 వేల యూరోలు (రూ. 43 లక్షల 90 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. సానియా-డోడిగ్ జంటతో జరిగిన ఫైనల్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. తొలి సెట్లో తొమ్మిది గేమ్ల వరుకు రెండు జోడీలు తమ సర్వీస్లను నిలబెట్టుకున్నాయి. అయితే పదో గేమ్లో పేస్ జంట సర్వీస్ను బ్రేక్ చేయడంలో సఫలమైన సానియా-డోడిగ్ ద్వయం సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో నాలుగో గేమ్లో సానియా-డోడిగ్ జోడీ సర్వీస్ను బ్రేక్ చేసిన పేస్-హింగిస్ జంట 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆరో గేమ్లో పేస్ జంట సర్వీస్ను బ్రేక్ చేసి సానియా ద్వయం స్కోరును 3-3తో సమం చేసింది. కానీ ఏడో గేమ్లో సానియా జంట సర్వీస్ను బ్రేక్ చేసి, ఆ తర్వాత తమ సర్వీస్ను కాపాడుకొని పేస్ ద్వయం 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పదో గేమ్లో తమ సర్వీస్ను నిలబెట్టుకొని సెట్ను 6-4తో దక్కించుకుంది. ఇక నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో ప్రతి పాయింట్కూ రెండు జోడీలు పోరాడాయి. చివరకు అనుభవజ్ఞులైన పేస్-హింగిస్ జోడీ పైచేయి సాధించింది. గతేడాది హింగిస్తో కలిసి ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నె గ్గిన పేస్... ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి ‘కెరీర్ స్లామ్’ పూర్తి చేసుకున్నారు. -
సానియా x పేస్
మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అమీతుమీ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జా, లియాండర్ పేస్ జోడీలు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన సెమీస్లో రెండోసీడ్ సానియా-డుడిగ్ (క్రొయేషియా) 4-6, 6-3, 12-10తో మూడోసీడ్ ఫ్రాన్స్ ద్వయం మాల్డొనోవిచ్-హెర్బర్ట్లపై విజయం సాధించగా... పేస్-హింగిస్ (స్విట్జర్లాండ్) 6-3, 3-6, 10-7తో ఆరోసీడ్ హల్వకోవా (చెక్)-వాసెలిన్ (ఫ్రాన్స్)లపై నెగ్గారు. -
ప్రి క్వార్టర్స్కు చేరిన పేస్-హింగిస్ జోడి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో లియాండర్ పేస్(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడి శుభారంభం చేసింది. తొలి రౌండ్లో భాగంగా గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్లో పేస్-హింగిస్ల జోడి 6-4, 6-4 తేడాతో అన్నా లీనా గ్రోన్ఫెల్డ్(జర్మనీ)- రాబర్ట్ ఫరాఖ్(కొలంబియా) ద్వయంపై గెలిచి ప్రి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. తొలి సెట్లో ఇరు జోడీలు 2-2 తో సమానంగా నిలిచిన సమయంలో పేస్-హింగిస్లు 4-2 తో ముందంజ వేసింది. ఆ తరువాత ఇరు జోడీలు తమ సర్వీసులు కాపాడుకుంటూ ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించారు. అయితే 10 గేమ్ లో మాత్రం పేస్-హింగిస్లు అనవసర తప్పిదాలు చేయకుండా తొలి సెట్ను గెలుచుకున్నారు. ఇక రెండో సెట్ మూడో గేమ్లో ఆధిక్యం సాధించిన పేస్-హింగిస్లు.. ఎనిమిదో గేమ్ లో రెండు బ్రేక్ పాయింట్లు లభించడంతో మరింత ముందుకు వెళ్లారు. అయితే ఆపై అన్నా లీనా గ్రోన్ఫెల్డ్-రాబర్ట్ ఫరాఖ్ లు ఎదురుదాడికి దిగినా, పేస్-హింగిస్ల తన అనుభవాన్ని ఉపయోగించి రెండో సెట్ ను కైవసం చేసుకుని ప్రి క్వార్టర్స్ కు చేరారు. గతేడాది ఈ జోడీ ఆస్ట్రేలియా, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ టైటిల్స్ ను గెలిచిన సంగతి తెలిసిందే. -
పేస్ అవకాశాలు సంక్లిష్టం
► ఒలింపిక్స్లో వైల్డ్ కార్డ్లను తొలగించిన ఐఓసీ ► ర్యాంకింగ్ ఆధారంగానే అర్హత న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో వరుసగా ఏడో ఒలింపిక్స్లో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఆశలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కొత్త నిబంధన అడ్డంకిగా మారనుంది. 2016 రియో ఒలింపిక్స్ టెన్నిస్ విభాగంలో ఎలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను అనుమతించరాదని ఐఓసీ నిర్ణయించింది. దీని ప్రకారం భారత ఆటగాళ్లకు తమ ర్యాంకింగ్స్ ఆధారంగానే అవకాశం లభిస్తుంది. గతంలో ఆటగాళ్ల గత రికార్డు, ఒలింపిక్స్లో వారి ప్రదర్శన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా దేశం వైల్డ్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తే ఒలింపిక్ కమిటీ తమ విచక్షణ మేరకు వారిని అనుమతించేది. ‘ ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్లో వైల్డ్ కార్డ్లు ఇవ్వడం లేదు. ఆటగాళ్లందరూ ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం అర్హత సాధించాల్సిందే. కాబట్టి ఏ దేశానికి చెందిన టెన్నిస్ సంఘం కూడా వీటి కోసం దరఖాస్తు చేయవద్దు’ అని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రధాన కార్యదర్శి యువాన్ మార్గెట్స్ స్పష్టం చేశారు. బోపన్న పరిస్థితి మెరుగు... రియో ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో 24 జోడీలకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. టాప్-10 ర్యాంకింగ్స్లో ఉన్న ఆటగాడికి అర్హత లభించడంతో పాటు తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం కూడా దక్కుతుంది. ఇందు కోసం జూన్ 6 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. అప్పటి వరకు ఉండే ర్యాంకులను బట్టే ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం రోహన్ బోపన్న ప్రపంచ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉన్నాడు. రాబోయే టోర్నీల్లో మెరుగ్గా ఆడితే టాప్-10లోకి చేరుకోవడం కష్టం కాకపోవచ్చు. కానీ పేస్ ఏకంగా 52వ ర్యాంక్లో ఉన్నాడు. ఇటీవల అతను వరుసగా విఫలమవుతున్నాడు. కాబట్టి మెరుపు వేగంతో ర్యాంక్ సాధించడం అంత సులువు కాదు. ఇక చాలా కాలంగా పోటీలకు దూరంగా ఉంటున్న మహేశ్ భూపతి (214)కి కూడా దాదాపుగా అవకాశాలు లేనట్లే. తుది గడువులోపు బోపన్న టాప్-10లో నిలిచి తన భాగస్వామిగా పేస్ను ఎంచుకుంటే ఈ స్టార్ ప్లేయర్ను ఒలింపిక్స్లో చూడొచ్చు. -
సెమీస్లో పేస్ జంట ఓటమి
డెల్రే బీచ్ (అమెరికా): భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) జోడీ... డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. డబుల్స్ సెమీస్లో పేస్-చార్డీ ద్వయం 2-6, 3-6తో టాప్ సీడ్ మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్లో పేస్ జంట ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాలను వృథా చేసుకుంది. -
క్వార్టర్స్లో పేస్ జోడి
డెల్రే బీచ్ (అమెరికా): భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-జెర్మీ చార్డీ (ఫ్రాన్స్)జోడి.... డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో అన్సీడెడ్ పేస్-చార్డీ 6-4, 7-5తో నాలుగోసీడ్ అమెరికా ద్వయం ఎరిక్ బట్రోక్-స్కాట్ లిప్స్కైలపై నెగ్గారు. గంటా 12 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో.. పేస్ జంట నాలుగు ఏస్లను సంధించింది. 119 పాయింట్లతో 66 గెలుచుకుని మ్యాచ్ను చేజిక్కించుకుంది. రెండుసార్లు సర్వీస్ చేజార్చుకున్న పేస్-చార్డీ... ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. క్వార్టర్స్లో పేస్ జోడి... మార్సెల్లో గ్రానోలెర్స్ (స్పెయిన్)-సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)తో తలపడుతుంది. -
సెమీస్ కు సానియా -హింగిస్ జోడి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడి సెమీ ఫైనల్ కు చేరింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సానియా జోడి 6-2,4-6, 6-1 తేడాతో గ్రోనిఫెల్డ్-కోకో వేన్ద్వెగి ద్వయంపై గెలిచి సెమీస్ కు చేరింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన ఈ జోడి.. రెండో గేమ్ లో మాత్రం ఓటమి పాలైంది. కాగా, నిర్ణయాత్మక మూడో సెట్ లో తిరిగి పుంజుకున్న సానియా జంట వరుస పాయింట్లను సాధించి ఆ గేమ్ ను కైవసం చేసుకుంది. దీంతో తమ వరుస విజయాల సంఖ్యను 34 కు పెంచుకుంది. ఇదిలా ఉండగా మిక్సడ్ డబుల్స్ లో సానియా మీర్జా-ఇవాన్ డోడిగ్ జంట మూడో రౌండ్ కు చేరింది. రెండో రౌండ్ లో ఈ జంట 7-5, 6-2 తేడాతో ఐసమ్ ఉల్ హక్ ఖరేషి- యరోస్లావా ష్వెదోవా ద్వయంపై విజయం సాధించింది. మరో మిక్సడ్ డబుల్స్ లో లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జోడి 6-1,6-2 తేడాతో జులెన్ రో్జర్- స్లోన్ స్టెఫెన్స్ జంటపై విజయం సాధించి మూడో రౌండ్ కు చేరింది. -
రియో ఒలింపిక్స్ లో సానియాతో జోడీకి ఓకే!
చెన్నై: ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్నరియో ఒలింపిక్స్ క్రీడలకు ఆటగాళ్ల ఎంపికలో రాజకీయాలకు తావుండరాదని భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ఎంపిక వివాదాలను ఈసారి సృష్టించకూడదని, మెన్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో తనతో జట్టు కట్టడానికి రోహన్ బోపన్న, సానియా మీర్జా అర్హులని ఆయన పేర్కొన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో పేస్ తో జతకట్టి ఆడటానికి బోపన్న, మహేశ్ భూపతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్న పేస్ అప్పట్లో చెత్త రాజకీయాలకు పాల్పడ్డారని, ఈసారి అలా జరుగకూడదని అన్నారు. 'డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కు సంబందించిన ఆనాటి ఘటన పునరావృతం కాబోదని ఆశిస్తున్నా. ప్రతిభ ఆధారంగానే సెలక్షన్ జరుగాలి. 2015లో నేను మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్స్ గెలుపొందాను. కాబట్టి రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత మిక్స్డ్ డబుల్స్ బృందంలో నేను ముందంజలో ఉంటానని భావిస్తున్నాను' అని పేస్ చెప్పారు. చెన్నై ఓపెన్ లో పాల్గొనడం ద్వారా 2016లో తన ఆటను మొదలుపెట్టిన పేస్ ప్రధానంగా రియో ఒలింపిక్స్ పై దృష్టి పెట్టినట్టు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో భారత తరఫున డబుల్స్ లో బోపన్నతో, మిక్స్డ్ డబుల్స్ లో సానియాతో జత కట్టాలని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
కరణ్-అర్జున్ వచ్చేశారు!
కోల్కతా: పురుషుల టెన్నిస్లో ఆ ఇద్దరు దిగ్గజాలైతే, మహిళల టెన్నిస్కు ఆమె ఏకైక క్వీన్. భారత టెన్నిస్ హేమాహేమీలు ముగ్గురు ఒకే ‘చిత్రం’లో చేరారు. కోల్కతాలో ఈ నెల 25న జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి ప్రాక్టీస్ చేశారు. ఈ కలయికను సెల్ఫీగా మలచి సానియా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. షారుఖ్-సల్మాన్ల సూపర్ హిట్ మూవీ డైలాగ్ను గుర్తు చేస్తూ ‘ నా కరణ్-అర్జున్ వచ్చేశారు. ఇద్దరిలో ఎవరు ఎవరో వారే తేల్చుకుంటారు’ అని సరదాగా కామెంట్ చేసింది. ఐపీటీఎల్ ప్రమోషన్లో భాగంగా గురువారం హైదరాబాద్లోని సానియా అకాడమీలో రెండో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది. -
పేస్-నాదల్ జంటకు షాక్
పారిస్ మాస్టర్స్ సిరీస్ పారిస్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు మరోసారి నిరాశ ఎదురైంది. పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్తో జతకట్టిన పేస్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పేస్-నాదల్ ద్వయం 3-6, 4-6తో డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)-రాబర్ట్ లిండ్స్టెట్ (స్వీడన్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు రోహన్ బోపన్న (భారత్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో 6-7 (3/7), 6-4, 10-5తో సెబాస్టియన్ కాబల్-రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై విజయం సాధించింది. -
‘డబుల్’ ట్రబుల్
♦ పేస్ జోడి ఓటమితో సన్నగిల్లిన ఆశలు ♦ 1-2తో భారత్ వెనుకంజ ♦ చెక్తో డేవిస్ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్ న్యూఢిల్లీ : సింగిల్స్తో పోలిస్తే డబుల్స్ మ్యాచ్ల్లో అత్యద్భుతంగా ఆడే భారత ఆటగాళ్లు ఈసారి మాత్రం నిరాశపరిచారు. చెక్ రిపబ్లిక్తో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్లో డబుల్స్లో భారత జోడి లియాండర్ పేస్ - రోహన్ బోపన్న అనూహ్యంగా షాక్ తిన్నారు. దీంతో భారత్ 1-2తో వెనకబడింది. చివరి రోజు (నేడు) జరిగే రెండు రివర్స్ సింగిల్స్లోనూ భారత్ గెలిస్తేనే ముందుకు వెళుతుంది. ఆటగాళ్ల బలాబలాలను బట్టి చూస్తే భారత్ ముందుకెళితే అద్భుతమే అనుకోవాలి. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో పేస్-బోపన్న 5-7, 2-6, 2-6తో రాడెక్ స్టెపానెక్-ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. రెండు గంటలా 10 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో... బోపన్న అన్ని రంగాల్లో విఫలంకావడం భారత్ను దెబ్బతీసింది. సర్వీస్తో పాటు షాట్లపై పట్టు కోల్పోయిన అతను బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. బోపన్న కొట్టిన చాలా హాఫ్ వ్యాలీలు లైన్ బయటకు వెళ్లాయి. అయితే మూడో సెట్లో కాస్త సర్వీస్ మెరుగుపడ్డా భారత్ పుంజుకోలేకపోయింది. మరోవైపు షాట్లలో నిలకడను చూపెట్టిన పేస్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. ► గత 15 ఏళ్లలో డేవిస్ కప్లో పేస్కు ఇది రెండో ఓటమి. ఇంతకుముందు 2012లో బోపన్నతో కలిసి ఉజ్బెకిస్తాన్ చేతిలో ఓడిపోయాడు. 2000 తర్వాత స్వదేశంలో పేస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ► మ్యాచ్ మొత్తంలో పేస్ నాలుగుసార్లు, బోపన్న మూడుసార్లు సర్వీస్ను కోల్పోయారు. ప్రతిసెట్ ఆరంభంలో భారత్ సర్వీస్ కోల్పోవడం చెక్కు కలిసొచ్చింది. స్టెపానెక్ రెండుసార్లు సర్వీస్ను చేజార్చుకుంటే ఆడమ్ మాత్రం సూపర్ సర్వీస్తో పాటు బలమైన రిటర్న్ షాట్స్తో భారత్ను కట్టిపడేశాడు. ► తొలిసెట్ ఐదో గేమ్లో బోపన్న సర్వీస్ కోల్పోయాడు. అతను కొట్టిన బ్యాక్హ్యాండ్ షాట్ బేస్లైన్ దాటి బయటకు వెళ్లడంతో భారత్ వెనుకబడింది. తర్వాత డబుల్ ఫాల్ట్ చేయడంతో చెక్ పుంజుకుంది. తర్వాత పావ్లాసెక్ సర్వీస్ను బ్రేక్ చేసి భారత్ పుంజుకున్నా.. తర్వాతి గేమ్లో పేస్ సర్వీస్ను చేజార్చుకున్నాడు. ఈ దశలో బోపన్నతో జరిగిన సుదీర్ఘ ర్యాలీని పావ్లాసెక్ అద్భుతమైన వ్యాలీతో ముగించాడు. 12వ గేమ్లో రాడెక్ సర్వీస్ నిలబెట్టుకోవడంతో సెట్ చెక్ సొంతమైంది. ► రెండోసెట్లో పేస్ వరుసగా రెండు గేమ్ల్లో సర్వీస్ కోల్పోయాడు. తర్వాత రాడెక్, పావ్లాసెక్లు సర్వీస్లు కాపాడుకున్నారు. ఐదో గేమ్లో బోపన్న సర్వీస్లో పావ్లాసెట్ కొట్టిన క్రాస్ కోర్టు విన్నర్కు చెక్కు రెండు బ్రేక్ పాయింట్లు వచ్చాయి. ఆరో గేమ్లో పావ్లాసెక్ సర్వీస్ కోల్పోవడంతో భారత్ స్కోరు 2-4కు చేరింది. కానీ ఏడో గేమ్లో పేస్ మళ్లీ సర్వీస్ చేజార్చుకున్నాడు. 8వ గేమ్లో స్టెపానెక్ సర్వీస్ను కాపాడుకోవడంతో చెక్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ► మూడో సెట్లో పేస్-బోపన్న సర్వీస్లు కాపాడుకోవడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లారు. కానీ పేస్ చేసిన రెండు అనవసర తప్పిదాలతో భారత్ మళ్లీ వెనుకబడిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకున్న చెక్ జోడి చెలరేగిపోయింది. స్కోరు 5-1 ఉన్న దశలో పేస్ సర్వీస్ కాపాడుకోవడంతో చెక్ ఆధిక్యం 5-2కు తగ్గింది. కానీ ఆ వెంటనే స్టెపానెక్ సర్వీస్ను కాపాడుకుని సెట్ను, మ్యాచ్ను నెగ్గారు. -
భారత్ వెనుకంజ
న్యూఢిల్లీ:డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ లో భారత్ కు చుక్కెదురైంది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన లియాండర్ పేస్-రోహన్ బోపన్నాల జోడీ 5-7, 2-6, 2-6 తేడాతో చెక్ రిపబ్లిక్ జోడీ రాడెక్ స్టెపానెక్-ఆడమ్ పావ్లాసెక్ చేతిలో ఓటమి పాలై భారత ఆశలను క్లిష్టం చేసింది. తొలిరోజు సింగిల్స్ లో సోమ్ దేవ్ దేవ్ బర్మన్ సంచలన విజయంతో భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చినా.. ఈరోజు జరిగిన డబుల్స్ లో పేస్ జోడీ వరుస సెట్లను ప్రత్యర్థులకు అప్పగించి ఓటమి చవిచూసింది. రెండు గంటల 10 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో స్టెపానెక్-ఆడమ్ లు దాటిగా ఆడి విజయం చేజిక్కించుకున్నారు. దీంతో భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. ఈ ఓటమితో డేవిస్ కప్ డబుల్స్ విభాగంలో 15 సంవత్సరాల తరువాత పేస్ కు రెండో ఓటమి ఎదురవ్వగా, మూడు సంవత్సరాల తరువాత రోహన్ బోపన్నాకు తొలి ఓటమి. గత వారం యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ సాధించిన పేస్.. డేవిస్ కప్ డబుల్స్ లో మాత్రం విఫలం చెందాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్ లో భారత్ కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మ్యాచ్ లో సోమ్ దేవ్ దేవ్ బర్మన్-యూకీ బాంబ్రీలు గెలిస్తేనే వరల్డ్ గ్రూప్ కు భారత్ అర్హత సాధిస్తుంది. -
'నయా' పేస్
♦ యూఎస్ ఓపెన్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన భారత వెటరన్ ♦ హింగిస్తో కలిసి ‘మిక్స్డ్’ టైటిల్ సొంతం రేసులోకి దూసుకొస్తున్న కుర్రాళ్ల దెబ్బకు సహచరులందరూ వెనుకబడుతున్నారు... ఒకనాటి ప్రత్యర్థులందరూ ఏదో రకంగా ఆటకు గుడ్బై చెప్పేస్తున్నారు... కానీ... భారత వెటరన్ లియాండర్ పేస్ మాత్రం వన్నె తగ్గని వజ్రంలా ఇంకా మెరుస్తూనే ఉన్నాడు..ముదిమి వయసు ముంచుకొస్తున్నా... అచంచల ఆత్మవిశ్వాసంతో ఆటకే సవాలు విసురుతున్నాడు. నాలుగు పదుల వయసులోనూ తన రాకెట్కు ‘నయా పేస్ (కొత్త వేగం)’ను జోడించి యూఎస్ ఓపెన్లో చెలరేగిపోయాడు. హింగిస్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచి... ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్స్లామ్ మిక్స్డ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా సగర్వంగా రికార్డులకెక్కాడు. న్యూయార్క్ : వయసు పెరుగుతున్నా.. రాకెట్లో పదును తగ్గలేదని నిరూపిస్తున్న భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ టెన్నిస్లో చరిత్ర సృష్టించాడు. స్విస్ ప్లేయర్ మార్టినా హింగిస్తో కలిసి యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నాలుగోసీడ్ పేస్-హింగిస్ 6-4, 3-6, 10-7తో అన్సీడెడ్ బెథానీ మాటెక్ సాండ్స్-సామ్ క్వైరీ (అమెరికా)పై విజయం సాధించారు. 77 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో-స్విస్ జోడి 32 విన్నర్లు సంధించి, ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో నాలుగింటిని కాపాడుకుంది. తొలిసెట్లో మాటెక్ సర్వీస్ను బ్రేక్ చేసిన పేస్-హింగిస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లారు. బలమైన ఫోర్హ్యాండ్, బ్యాక్హాండ్ షాట్లతో చెలరేగిన ఈ జోడి సర్వీస్లోనూ నిలకడను చూపెట్టింది. మాటెక్-క్వైరీ కూడా తమ సర్వీస్లను కాపాడుకోవడంతో ఓ దశలో పేస్ జంట స్కోరు 5-4గా మారింది. పదో గేమ్లో ఓ అద్భుతమైన విన్నర్తో హింగిస్ సెట్ను సాధించింది. రెండోసెట్లో మాటెక్-క్వైరీ పోరాటం మొదలుపెట్టారు. మాటెక్ నేరుగా రెండు విన్నర్లు కొట్టడంతో పాటు హింగిస్ సర్వీస్ను బ్రేక్ చేయడంతో 3-1 ఆధిక్యంలోకి వెళ్లారు. అయితే 2-5తో వెనుకబడి ఉన్న దశలో హింగిస్ తన సర్వీస్లో మూడు సెట్ పాయింట్లను కాపాడుకుంది. కానీ తర్వాతి గేమ్లో క్వైరీ అద్భుతమైన సర్వీస్తో సెట్ను గెలవడంతో మ్యాచ్ టైబ్రేక్కు దారితీసింది. సూపర్ టైబ్రేక్లో అమెరికా ద్వయం హింగిస్ సర్వీస్లను బ్రేక్ చేస్తూ ఒక్కసారిగా 4-1 ఆధిక్యాన్ని సాధించింది. కానీ తర్వాతి 12 గేమ్ల్లో పేస్-హింగిస్ అసలు సిసలు ఆటను చూపెట్టారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 9 గేమ్లు గెలిచి సెట్తో పాటు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విశేషాలు ►ఓవరాల్గా ప్రస్తుతం మార్టినా నవ్రతిలోవా 10 టైటిల్స్తో అగ్రస్థానంలో ఉంది. మరో టైటిల్ గెలిస్తే పేస్ ఆమెను అందుకుంటాడు. ►తాజా విజయంతో పేస్-హింగిస్ 1969 తర్వాత ఒకే ఏడాదిలో మూడు గ్రాండ్స్లామ్ మిక్స్డ్ టైటిల్స్ను సాధించిన తొలి జంటగా రికార్డు సృష్టించారు. (ఈ సీజన్లో ఈ జోడి యూఎస్ ఓపెన్తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ను కూడా సాధించింది.) 46 ఏళ్ల కిందట మార్టి రెస్సైన్-మార్గరెట్ కోర్టు ఈ ఫీట్ను సాధించారు. ►ఓవరాల్గా పేస్కు ఇది 17వ గ్రాండ్స్లామ్ టైటిల్ కాగా, హింగిస్కు 19వది. హింగిస్... టెన్నిస్లో ఉన్న నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ను భారతీయులతోనే కలిసి గెలవడం విశేషం. -
మిక్స్డ్ డబుల్స్ లో లియాండర్ ,మార్టినా విజయం
-
చరిత్ర సృష్టించిన లియాండర్ పేస్
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్, స్విట్జర్లాండ్ భామ మార్టినా హింగిస్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. ఒకే ఏడాది మూడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గి, పేస్-హింగిస్ జోడీ చరిత్ర సృష్టించింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామున జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో పేస్-హింగిస్ ద్వయం 6-4, 3-6, 10-7 తేడాతో అమెరికా జోడీ సామ్ కెర్రీ - బెథానీ మాటెక్ లపై విజయం సాధించింది. ఈ ఏడాది వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లు కూడా కైవసం చేసుకున్న విషయం విదితమే. తాజా విజయంతో 1969 తర్వాత ఓ క్యాలెండర్ ఏడాదిలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 3 గ్రాండ్ స్లామ్లు నెగ్గిన జంటగా పేస్-హింగిస్లు చరిత్ర సృష్టించారు. పేస్కు ఇది 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, స్విస్ స్టార్ మార్టినా హింగిస్ తన ఖాతాలో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. హింగిస్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించగా, అవన్నీ భారతీయ భాగస్వాములతోనే నెగ్గడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పేస్కు ఇది 9వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, అత్యధికంగా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఖాతాలో 10 టైటిల్స్ ఉన్నాయి. మరో టైటిల్ సాధిస్తే ఈ విభాగంలోనూ పేస్ తన రికార్డు మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. -
ఇటు సానియా... అటు పేస్
మార్టినా హింగిస్ జతగా మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరిన భారత స్టార్స్ న్యూయార్క్ : సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, లియాండర్ పేస్లు ‘డబుల్ ధమాకా’ సృష్టించే దిశగా మరో అడుగు ముందుకేశారు. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్తో కలిసి మహిళల డబుల్స్లో సానియా మీర్జా... మిక్స్డ్ డబుల్స్లో లియాండర్ పేస్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత జులైలో హింగిస్తో కలిసి సానియా, పేస్లు వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఇంకో రెండు విజయాలు సాధిస్తే హింగిస్ తన ఖాతా లో మరో రెండు గ్రాండ్స్లామ్ డబుల్స్ ట్రోఫీలను జమ చేసుకోనుంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-1తో సారా ఎరాని-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంటపై గెలిచింది. 77 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఈ ఇండో-స్విస్ జోడీ ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయింది. తొలి సెట్లో సానియా జంటకు కాస్త పోటీ ఎదురైనా, రెండో సెట్ మాత్రం ఏకపక్షంగా సాగింది. కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్); అనా లెనా గ్రోయెనిఫెల్డ్ (జర్మనీ)-కోకో వాండెవెగె (అమెరికా)ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సానియా-హింగిస్ జంట తలపడుతుంది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-2, 7-5తో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో పేస్ ద్వయం మూడు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సెట్లో రెండుసార్లు, రెండో సెట్లో రెండుసార్లు బోపన్న జోడీ సర్వీస్లను బ్రేక్ చేసిన పేస్ జంట తమ సర్వీస్ను ఒక్కసారి కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి గం. 9.30 మొదలయ్యే ఫైనల్లో అన్సీడెడ్ జోడీ సామ్ క్వెరీ-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో పేస్-హింగిస్ జంట అమీతుమీ తేల్చుకుంటుంది. -
యూఎస్ ఓపెన్ మిక్స్డ్ ఫైనల్లో పేస్ జోడీ
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి లియాండర్ పేస్- మార్టినా హింగిస్ జోడీ ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 4వ సీడ్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 7-5 తేడాతో 2వ సీడ్ జోడీ రోహన్ బోపన్న(భారత్) - యంగ్ జాన్ చన్ లపై విజయం సాధించింది. రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించి దిగ్విజయంగా ఈ జోడీ మిక్స్డ్ డబుల్స్ ఫైన్లల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో ఏ మాత్రం పోటీ ఇవ్వని బోపన్న-యంగ్ ద్వయం రెండో సెట్లో అద్భత పోరాట పటిమను ప్రదర్శించింది. కానీ, వెటరన్ ఆటగాడు పేస్, స్విస్ స్టార్ హింగిస్ జోడీ అనుభవం ముందు బోపన్న జంట తలవంచక తప్పలేదు. మహిళల డబుల్స్ విభాగంలోనూ మార్టినా హింగిస్ భారత స్టార్ క్రీడాకారిణి సానియా మిర్జాతో కలిసి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం విదితమే. -
డేవిస్ కప్ లో రాణించడం కష్టమే: విజయ్ అమృత్ రాజ్
సరైన సింగిల్స్ ప్లేయర్ లేకుండా డెవిస్ కప్ లో రాణించడం కష్టమే నని ప్రఖ్యాత టెన్సిస్ ప్లేయర్ విజయ్ అమృత్ రాజ్ అన్నారు. ఈనెలాఖరులో చెక్ రిపబ్లిక్ తో జరగనున్న ప్లేఆఫ్ టోర్నీలో మన అవకాశాలు అంతంత మాత్రమే అని అన్నాడు. సోమ్ దేవ్ దేవ్ బర్మన్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోదిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో లియాండ్ పేస్ కూడా ఆడనున్నాడు. దీనిపై స్పందించిన విజయ్ అమృత్ రాజ్.. లియాండ్ పేస్ రావడం వల్ల కూడా మన అవకాశాలు పెద్దగా మెరుగయ్యే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డాడు. మన టీమ్ లో కావాల్సినంత మంది డబుల్స్ ప్లేయర్స్ ఉన్నారని.. ప్రపంచ గ్రూప్ లోకి అడుగు పెట్టాలంటే.. సింగిల్స్ ప్లేయర్స్ అవసరమని చెప్పాడు. కనీసం టీమ్ లో టాప్ 50 రాంక్ సింగిల్స్ ప్లేయర్ ఉన్నా ఛాన్స్ లు ఉంటాయని.. కేవలం అత్యున్నత డబుల్స్ ప్లేయర్స్ తో డేవీస్ కప్ ప్లే ఆఫ్ లపై ఆశలు పెట్టుకోవడం అనవసరమని చెప్పాడు. డేవిస్ కప్ లో కనీసం నాలుగు సింగిల్స్ మ్యాచ్ లు ఆడాలి.. వీటిలో కనీసం ఒక్కటైనా గెలవందే.. ముందుకు వెళ్లడం అసాధ్యం. గతంలో మనం గెలిచిన డేవిస్ కప్ మ్యాచ్ ల్లో విజయాలు కేవలం కాకతాళీయమేనని చెప్పాడు. మరో వైపు రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా గురించి మాట్లాడుతూ.. సానియా టెన్నిస్ లో ఈ స్థాయికి చేరడానికి ఎంత కృషి చేసిందో తనకు తెలుసన్నాడు. సానియా మరింత కాలం సింగిల్స్ ఆడిఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. -
యూఎస్ ఓపెన్ రెండో రౌండ్ లో పేస్, బొపన్న
ఇండియన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ యూఎస్ ఓపెన్ రెండో రౌండ్ కు చేరకున్నాడు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో కెనడా- ఆస్ట్రేలియా ద్వయం టైలర్ హారీ, సి లుయ్ జంటపై 6-2, 6-2స్కోర్ తో అలవోకగా గెలిచాడు. ఈ టోర్నీలో స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో పేస్ జతకట్టాడు. మరో భారత క్రీడాకారుడు రోహన్ బొపన్న కూడా పురుషుల డబుల్స్ విభాగంలో రెండో రౌండ్ చేరుకున్నాడు. -
క్వార్టర్స్లో పేస్-వావ్రింకా జంట
సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో పేస్-వావ్రింకా జంట 7-6 (7/4), 3-6, 10-3(సూపర్ టైబ్రేక్)తో వాసెక్ పోస్పిసిల్ (కెనడా)-జాక్ సోక్ (అమెరికా) జోడీపై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడుతున్న రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
రెండో రౌండ్లో పేస్ జంట
సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్-వావ్రింకా ద్వయం 1-6, 6-1, 10-6తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. వావ్రింకాతో జతకట్టి పేస్ ఆడుతున్న రెండో టోర్నీ ఇది. గతేడాది పారిస్ మాస్టర్స్లో ఈ జంట క్వార్టర్స్కు చేరింది. -
ప్రిక్వార్టర్స్లో పేస్-ముర్రే జోడీ
మాంట్రియల్ : కెనడా ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్) -ఆండీ ముర్రే (బ్రిటన్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్-ముర్రే ద్వయం 6-3, 6-1తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయిన పేస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు తొలి రౌండ్లో ‘బై’ పొందిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్-టిప్సరెవిచ్ (సెర్బియా) జోడీతో ఆడుతుంది. -
పేస్ జోడీదే ‘మిక్స్డ్’ టైటిల్
-
పేస్ జోడీదే ‘మిక్స్డ్’ టైటిల్
లండన్ : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన ఖాతాలో 16వ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నాడు. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి అతను వింబుల్డన్ టోర్నమెంట్లో ‘మిక్స్డ్’ డబుల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. ఫైనల్లో పేస్-హింగిస్ జంట 6-1, 6-1తో పెయా (ఆస్ట్రియా)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్గా పేస్ కెరీర్లో ఇది నాలుగో వింబుల్డన్ మిక్స్డ్ టైటిల్. -
వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విజేత లియాండర్ జోడి
వింబుల్డన్: వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్్ లో లియాండర్ పేస్, హింగీస్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో 6-1, 6-1తేడాతో పేస్-హింగీస్ జోడి ఆస్ట్రేలియన్ హంగారీయన్, అలెగ్జాండర్ పేయా జోడిపై గెలుపొందింది. దాంతో వింబుల్డన్ లియాండర్కు ఇది మూడవ టైటిల్ ను కైవసం చేసుకుంది. లియాండర్ తన కెరియర్లో 16వ గ్రాండ్ స్లామ్ను గెలుచుకుంది. -
సెమీస్లో పేస్ జోడి
మిక్స్డ్లో సానియా జంటకు నిరాశ లండన్: భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ సెమీస్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఏడోసీడ్ పేస్-హింగిస్ 6-2, 6-1తో మూడోసీడ్ మత్కోవాస్కి (పోలెండ్)-వెస్నినా (రష్యా)పై నెగ్గారు. కేవలం 44 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించిన పేస్ జోడి వచ్చిన నాలుగు బ్రేక్ పాయింట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. మరో మ్యాచ్లో రెండోసీడ్ సానియా మీర్జా- బ్రూనో సోరెస్ (బ్రెజిల్) 6-3, 6-7 (6/8), 7-9తో ఐదోసీడ్ అలెగ్జాండర్ పియా (ఆస్ట్రియా)-బాబోస్ (హంగేరి) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్ సెమీస్లో రోహన్ బోపన్న-ఫ్లోరియన్ మెర్జియా (రుమేనియా) జోడి 6-4, 2-6, 3-6, 6-4, 11-13తో నాలుగోసీడ్ రోజర్ (నెదర్లాండ్స్)-హోరియా టెకాయు (రుమేనియా) చేతిలో ఓడారు. -
ప్రీ క్వార్టర్స్లో పేస్ జోడీ
లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జోడీ ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో పేస్, డానియల్ నెస్టర్ (కెనడా) 5-7, 7-6 (3), 7-6 (4), 7-5 స్కోరుతో తైపీ-రష్యా జోడీ యెన్-హున్ లు, టెమురజ్పై విజయం సాధించారు. మూడు గంటల 15 నిమిషాల పాటు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో పేస్ జోడీ చెమటోడ్చి నెగ్గింది. ఈ మెగా ఈవెంట్ మహిళల డబుల్స్లో భారత స్టార్ సానియా మీర్జా జోడీ కూడా ముందంజ వేసింది. -
షరపోవా జోరు
మూడో రౌండ్లోకి రష్యా స్టార్ జొకోవిచ్, రావ్నిక్ ముందంజ వింబుల్డన్ టోర్నమెంట్ పేస్ జంట శుభారంభం పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) ద్వయం 6-3, 6-4, 7-5తో విక్టర్ ట్రయెస్కీ-దుసాన్ లాజోవిచ్ (సెర్బియా) జంటను ఓడిం చింది. అయితే పురవ్ రాజా (భారత్)-ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ మాత్రం 1-6, 4-6, 6-4, 6-7 (7/9)తో జొనాథన్ ముర్రే (బ్రిటన్)-ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. లండన్: పచ్చికపై పసందైన ఆటతీరుతో రష్యా స్టార్ మరియా షరపోవా వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత (35.7 డిగ్రీలు) నమోదైన వేళ ఈ మాజీ చాంపియన్ ఎలాంటి ఇబ్బంది పడకుండా అలవోక విజయంతో ముందంజ వేసింది. క్వాలిఫయర్ రాచెల్ హోగెన్క్యాంప్ (నెదర్లాండ్స్)తో జరిగిన రెండో రౌండ్లో నాలుగో సీడ్ షరపోవా 6-3, 6-1తో గెలిచింది. 1976 తర్వాత వింబుల్డన్లో తొలిసారి రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ఎండ నిబంధన అమల్లోకి వచ్చింది. ఫలితంగా మహిళల విభాగం మ్యాచ్ల్లో రెండో సెట్ ప్రారంభానికి ముందు పది నిమిషాలు విరామం ఇచ్చారు. రాచెల్తో జరిగిన మ్యాచ్లో షరపోవా ఏకంగా ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేసినా, కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్లిస్కోవాకు షాక్ మరోవైపు 11వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. వాండెవెగె (అమెరికా)తో జరిగిన మ్యాచ్లో ప్లిస్కోవా 6-7 (5/7), 4-6తో ఓటమి చవిచూసింది. ఇతర మ్యాచ్ల్లో 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-3, 6-4తో ఉర్సులా రద్వాన్స్కా (పోలండ్)పై, 30వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 7-5, 4-6, 6-0తో ఫ్రీడ్సమ్ (అమెరికా)పై గెలుపొంది రెండో రౌండ్కు చేరుకున్నారు. మూడో రౌండ్లో దిమిత్రోవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), ఏడో సీడ్ మిలోస్ రావ్నిక్ (కెనడా)లతోపాటు 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో షరపోవా ప్రియుడు దిమిత్రోవ్ 7-6 (10/8), 6-2, 7-6 (7/2)తో జాన్సన్ (అమెరికా)పై, జొకోవిచ్ 6-4, 6-2, 6-3తో నిమినెన్ (ఫిన్లాండ్)పై, రావ్నిక్ 6-0, 6-2, 6-7 (5/7), 7-6 (7/4)తో టామీ హాస్ (జర్మనీ)పై గెలుపొందారు. ఇతర మ్యాచ్ల్లో 14వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6-7 (5/7), 7-6 (8/6), 6-4, 6-4తో ఇల్హాన్ (టర్కీ)పై, 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 7-6 (7/3), 6-1, 6-1తో బ్రాడీ (బ్రిటన్)పై, 26వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7-6 (7/5), 6-3, 6-4తో యువాన్ మొనాకో (అర్జెంటీనా)పై, 27వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా) 7-6 (7/3), 6-4, 7-6 (7/5)తో హెర్బెర్ట్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. వైదొలిగిన నిషికోరి మరోవైపు ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) గాయం కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. రెండో రౌండ్లో సాంటియాగో గిరాల్డో (కొలంబియా)తో ఆడాల్సిన నిషికోరి బరిలోకి దిగలేదు. -
క్వార్టర్స్లో పేస్ జంట
లండన్ : ఎగాన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్లో లియాండర్ పేస్ (భారత్)-మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ పేస్-గ్రానోలెర్స్ ద్వయం 3-6, 6-2, 11-9తో ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)-స్కాట్ లిప్స్కీ (అమెరికా) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్లో పేస్ తన కెరీర్లో 100వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగాడు. తొలి సెట్ను కోల్పోయిన పేస్ జంట రెండో సెట్లో తేరుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
పేస్ ‘సెంచరీ’
డబుల్స్లో తన 100వ భాగస్వామిగా గ్రానోలెర్స్ నాటింగ్హమ్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరో అరుదైన ఘనతను సాధించనున్నాడు. సోమవారం మొదలైన ఎగాన్ టెన్నిస్ చాంపియన్షిప్లో పేస్ పురుషుల డబుల్స్లో తన 100వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో స్పెయిన్కు చెందిన మార్సెల్ గ్రానోలెర్స్తో పేస్ జత కట్టనున్నాడు. 1991లో ప్రొఫెషనల్గా మారిన పేస్ ఇప్పటివరకు డబుల్స్లో 99 మంది భాగస్వాములతో వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. కెరీర్లో 702 మ్యాచ్ల్లో గెలిచిన పేస్, 55 డబుల్స్ టైటిల్స్ సాధించాడు. -
క్వార్టర్స్లో సానియా-హింగిస్ జంట
మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-4తో కరిన్ నాప్-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడీపై గెలిచింది. సరిగ్గా గంటపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జంట తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయినప్పటికీ ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. పేస్ జంటకు ఓటమి పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో ఉన్న లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా); రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటలకు మూడో రౌండ్లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆరో సీడ్ ఫాబియో ఫాగ్నిని-సిమోన్ బోలెలి (ఇటలీ) ద్వయం 6-2, 6-4తో పేస్-నెస్టర్ జంటపై, ఐదో సీడ్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) ద్వయం 6-3, 6-7 (7/9), 6-3తో బోపన్న-మెర్జియా జోడీపై గెలిచాయి. ప్రాంజలకు నిరాశ జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్లో ప్రాంజల 6-7 (1/7), 4-6తో ప్రిస్కిల్లా హాన్ (ఆస్ట్రేలియా) చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రాంజల నాలుగు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోవడంతో పాటు కీలకదశలో తడబాటుకులోనైన ప్రాంజలకు పరాజయం తప్పలేదు. -
పేస్ జోడీ ముందంజ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భారత వెటరన్ లియాండర్ పేస్ జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్లో పేస్ జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో పేస్-డానియల్ నెస్టర్ (కెనడా) 7-6 (7-3) 6-2 స్కోరుతో ఆండ్రీ బెగిమన్ (జర్మనీ)-జులియన్ నొలె (ఆస్ట్రియా)పై విజయం సాధించారు. -
పేస్@700
రెండో రౌండ్లో సానియా జంట పారిస్ : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరో ఘనత సాధించాడు. డబుల్స్ కెరీర్లో 700వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఫ్రెంచ్ ఓపెన్లో భాగంగా బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పదో సీడ్ పేస్-నెస్టర్ (కెనడా) ద్వయం 6-2, 5-7, 7-5తో జేమ్స్ డక్వర్త్-క్రిస్ గుకోయిన్ (ఆస్ట్రేలియా) జంటను ఓడించి రెండో రౌండ్కు చేరింది. అత్యధిక డబుల్స్ మ్యాచ్లు నెగ్గిన వారి జాబితాలో నెస్టర్ (972), మైక్ బ్రయాన్ (946), బాబ్ బ్రయాన్ (932) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మరోవైపు రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న-మెర్జియా 5-7, 6-3, 6-4తో క్రాజినోవిచ్-విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా)లపై గెలిచారు. మహిళల డబుల్స్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట అలవోక విజయంతో రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో సానియా-హింగిస్ జోడీ 6-3, 6-0తో జూలియా జార్జెస్ (జర్మనీ)-బార్బర క్రెజ్సికోవా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించింది. -
పేస్ జంట ఓటమి
మ్యూనిచ్ (జర్మనీ) : బీఎండబ్ల్యూ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్-స్టెపానెక్ జోడీ 2-6, 1-6తో టాప్ సీడ్ బ్రూనో సోరెస్ (బ్రెజిల్)-అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో పేస్ జంట ఆరంభం నుంచే ప్రత్యర్థి జోడీ దూకుడుకు సమాధానం ఇవ్వలేకపోయింది. తమ సర్వీస్ను మాత్రం నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఈ సీజన్లో తాను ఆడిన గత ఐదు టోర్నీల్లో ముగ్గురు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగిన పేస్ కేవలం రెండు మ్యాచ్ల్లోనే గెలుపొందడం గమనార్హం. -
ఐపీటీఎల్లో పేస్!
చెన్నై : గతేడాది ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)పై విమర్శలు కురిపించిన భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ మనసు మార్చుకున్నాడు. ఈ సీజన్కు తను అందుబాటులో ఉంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల 12న లీగ్ కోసం ఆటగాళ్ల ఎంపిక జరగనున్న నేపథ్యంలో పేస్ అందుబాటులో ఉంటాననడం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే గత సీజన్లో సింగపూర్, మనీలా, న్యూఢిల్లీ, దుబాయ్ జట్లు మాత్రమే బరిలోకి దిగాయి. కానీ ఈసారి ఐదో జట్టుగా బ్యాంకాక్, మకావ్ సిటీ, కౌలాలంపూర్, జకార్తా, టోక్యోలలో ఒకదాన్ని ఎంపిక చేయనున్నారు. గతేడాది ఏప్రిల్లో మహేశ్ భూపతి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐపీటీఎల్పై పేస్ అనేక అనుమానాలు వ్యక్తం చేశాడు. లీగ్లో పారదర్శకత లేదని, ఎక్కువకాలం కొనసాగడం కష్టమేనని వ్యాఖ్యానించాడు. అయితే ఫెడరర్, జొకోవిచ్, సంప్రాస్, సెరెనా బరిలోకి దిగడంతో లీగ్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు లీగ్ విషయంలో కాస్త వెనక్కి తగ్గిన పేస్ ఇప్పుడు 2015 సీజన్కు అందుబాటులో ఉంటానని ప్రకటించడం విశేషం. -
రన్నరప్ పేస్ జంట
డెల్రే బీచ్ (అమెరికా): ఈ సీజన్లో రెండో డబుల్స్ టైటిల్ను సాధించాలనుకున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు నిరాశ ఎదురైంది. డెల్రే బీచ్ ఓపెన్లో పేస్-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట రన్నరప్గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన డబుల్స్ ఫైనల్లో పేస్-క్లాసెన్ ద్వయం 3-6, 6-3, 6-10తో ప్రపంచ నంబర్వన్ జంట బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. బ్రయాన్ బ్రదర్స్కిది 104వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. -
వారెవ్వా... పేస్
⇒ 41 ఏళ్ల వయస్సులో 15వ గ్రాండ్స్లామ్ టైటిల్ ⇒హింగిస్తో కలిసి ‘మిక్స్డ్’ విభాగంలో విజేత ⇒ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడోసారి ఈ ఘనత మెల్బోర్న్: ఉత్సాహానికి అనుభవం తోడైతే అద్భుత ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి నిరూపించాడు.34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి 41 ఏళ్ల లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ జంట డానియల్ నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించింది. ఓవరాల్గా పేస్ కెరీర్లో ఇది 15 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఇందులో ఎనిమిది పురుషుల డబుల్స్ విభాగంలో, ఏడు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్లో పేస్కిది మూడో మిక్స్డ్ డబుల్స్ టైటిల్. గతంలో మార్టినా నవ్రతిలోవా (2003లో); కారా బ్లాక్ (2010లో) లతో కలసి అతను చాంపియన్గా నిలిచాడు. విజేతగా నిలిచిన పేస్-హింగిస్ జంటకు 1,42,500 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 68 లక్షల 80 వేలు) ప్రైజ్మనీ లభించింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఫైనల్ పేస్, హింగిస్ ధాటికి ఏకపక్షంగా ముగిసింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మూడు పదుల వయసు దాటినప్పటికీ పేస్, హింగిస్లిద్దరూ ఆద్యంతం సమన్వయంతో కదలడం, కీలకదశలో పాయింట్లు రాబట్టడంతో నెస్టర్-మ్లడెనోవిచ్ జంట ఏదశలోనూ తేరుకోలేకపోయింది. ‘‘ఆస్ట్రేలియాకు క్రమం తప్పకుండా రావడం, విజేతగా నిలువడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. హింగిస్తో కలిసి ఆడటం ఆనందంగా అనిపించింది. ఆమె ఆట నుంచి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను.’’ -పేస్ -
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ టైటిల్ విజేత పేస్ జోడీ
న్యూఢిల్లీ: భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. పేస్ జోడి ఫైనల్లో విజయం సాధించింది. పేస్ కిది 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్లో పేస్, మార్టినా హింగిస్ జోడి 6-4, 6-3 తేడాతో డానియల్ నెస్టార్, క్రిస్టినా (ఫ్రాన్స్) పై గెలిచారు. 41 ఏళ్ల పేస్ తన కెరీర్లో ఎనిమిది పురుషుల డబుల్స్, ఏడు మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లను సాధించాడు. -
ఫైనల్లో లియాండ్ పేస్ జోడీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జోరు కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్లో లియాండర్ పేస్ జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్లో పేస్, మార్టినా హింగీస్ ద్వయం 7-5, 6-4 స్కోరుతో సీ హీ-క్యూవాస్ జోడీపై విజయం సాధించారు. -
ఆక్లాండ్లో పేస్... సిడ్నీలో బోపన్న
కొత్త ఏడాది భారత టెన్నిస్ ఆటగాళ్లకు కలిసొస్తోంది. శుక్రవారం సానియా మీర్జా సిడ్నీ ఓపెన్లో డబుల్స్ టైటిల్ నెగ్గగా... మరుసటి రోజే భారత ఆటగాళ్ల ఖాతాలో మరో రెండు డబుల్స్ టైటిల్స్ చేరడం విశేషం. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన హైనికెన్ ఓపెన్లో లియాండర్ పేస్ (భారత్) తన భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి చాంపియన్గా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన సిడ్నీ ఓపెన్లో రోహన్ బోపన్న (భారత్) తన భాగస్వామి డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి విజేతగా అవతరించాడు. మెల్బోర్న్లో యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన ‘డ్రా’కు అర్హత సాధించాడు.. డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత ఆటగాళ్లు ఆక్లాండ్: తన 99వ భాగస్వామితో కలిసి భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తొలి టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన హైనికెన్ ఓపెన్లో పేస్-క్లాసెన్ ద్వయం 7-6 (7/1), 6-4తో డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటను ఓడించింది. కెరీర్లో 93వ డబుల్స్ ఫైనల్ ఆడిన 41 ఏళ్ల పేస్కిది 55వ టైటిల్ కావడం విశేషం. 1997 నుంచి ప్రతి ఏడాది పేస్ కనీసం ఒక టైటిలైనా గెలుస్తూ వస్తున్నాడు. విజేతగా నిలిచిన పేస్ జోడీకి 25,670 డాలర్ల (రూ. 15 లక్షల 81 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన మూడు మ్యాచ్లను సూపర్ టైబ్రేక్లో నెగ్గిన పేస్ జంట టైటిల్ పోరును మాత్రం వరుస సెట్లలో ముగించింది. సిడ్నీ: తన కొత్త భాగస్వామి డానియల్ నెస్టర్తో రోహన్ బోపన్న తొలి టైటిల్ను గెల్చుకున్నాడు. శనివారం జరిగిన సిడ్నీ ఓపెన్ ఫైనల్లో బోపన్న-నెస్టర్ (కెనడా) ద్వయం 6-4, 7-6 (7/5)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జంటపై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. గతవారం బ్రిస్బేన్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడిన ఈ జంట సిడ్నీలో మాత్రం విజేతగా నిలిచింది. టైటిల్ నెగ్గిన బోపన్న జోడీకి 24,280 డాలర్ల (రూ. 14 లక్షల 95 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 34 ఏళ్ల బోపన్నకు కెరీర్లో ఇది 11వ డబుల్స్ టైటిల్. 42 ఏళ్ల నెస్టర్కిది 86వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత 22 ఏళ్ల నుంచి నెస్టర్ ప్రతి ఏడాది కనీసం ఒక టైటిలైనా గెలుస్తున్నాడు. మైక్ బ్రయాన్ (105), బాబ్ బ్రయాన్ (103) తర్వాత ఏటీపీ సర్యూట్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డబుల్స్ ప్లేయర్గా నెస్టర్ నిలిచాడు. -
పట్టుదలే ప్రేరణ: పేస్
చెన్నై: కెరీర్లో మరిన్ని శ్రేష్టమైన ఫలితాలు సాధించాలనే తపన, పట్టుదలే తనను ఆటలో కొనసాగేందుకు ప్రేరణగా నిలుస్తున్నాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. 41 ఏళ్ల వయస్సులోనూ చలాకీగా కదులుతూ అంతర్జాతీయస్థాయిలో మంచి విజయాలు సాధిస్తున్న ఈ కోల్కతా టెన్నిస్ స్టార్ జీవితంలో ప్రతి అంశంలో అత్యున్నతంగా నిలువాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. కుమారుడిగా, దేశభక్తుడిగా, క్రీడాకారుడిగా, నాన్నగా ఇలా ప్రతి విభాగంలో అత్యుత్తమంగా ఉండాలనే పట్టుదలే మరింత పురోగతి సాధించేలా చేస్తోందన్నాడు. ‘కొన్ని ఆటంకాలు మన నియంత్రణలో ఉండవు. వేటినైతే మనం నియంత్రించగలమో వాటి గురించే స్పందించాలి. అనవసరంగా కుంగిపోయి, నిరాశవాదంతో ఉంటే సమస్యలు పరిష్కారం కావు. ఆఖరకు అన్నింటికి నా ఆటతీరే సమాధానం ఇస్తుంది. వెనుకంజ వేయడానికి కారణాలేమీ కనిపించడంలేదు’ అని ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్లో డబుల్స్లో రన్నరప్గా నిలిచిన పేస్ అన్నాడు. ‘నా జీవితంలో విమర్శకులకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వను. ఏదైతే నమ్ముతానో దాని కోసం పోరాడుతాను. ఎల్లప్పుడూ నిజంవైపే ఉంటాను. అయితే ప్రతికూలతలను ఎదుర్కొనే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’ అని ఇప్పటికే వరుసగా ఆరు ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన పేస్ తెలిపాడు. ఒకప్పుడు భారత్ నుంచి ఒకరిద్దరు అంతర్జాతీయస్థాయిలో ఆడేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 15 నుంచి 20 వరకు చేరుకుందన్నాడు. ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తేనే ఫలితం ఉంటుందని అన్నాడు. -
పేస్... ఫైనల్ నం.92
చెన్నై: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఏడోసారి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తన 99వ భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో ఈసారి బరిలోకి 41 ఏళ్ల పేస్ తన కెరీర్లో 92వ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్-క్లాసెన్ ద్వయం 6-3, 6-3తో పాబ్లో కరెనో బుస్టా-గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) జంటను ఓడించింది. పురవ్ రాజా (భారత్)-ఆదిల్ (కెనడా); యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) జోడీల మధ్య శనివారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో పేస్ ద్వయం తలపడుతుంది. చెన్నై ఓపెన్లో గతంలో బరిలోకి దిగిన ఆరుసార్లూ (2012, 2011, 2002, 1999, 1998, 1997) పేస్ డబుల్స్ టైటిల్ నెగ్గడం విశేషం. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తోపాటు డేవిడ్ గాఫిన్ (బెల్జియం), బెడెన్ (స్లొవేనియా), రొబెర్టా బాటిస్టా అగుట్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. -
సెమీస్కు పేస్ జోడి
* భూపతి-సాకేత్ జంటపై గెలుపు * చెన్నై ఓపెన్ చెన్నై: చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్, రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడి డబుల్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మహేశ్ భూపతి, సాకేత్ మైనేని జంటను 1-6, 6-1, 10-7 తేడాతో పేస్ జోడి ఓడించింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో భూపతి, సాకేత్ జంట కీలక సమయాల్లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్ను ఈ జోడి తేలిగ్గా గెలుచుకున్నప్పటికీ రెండో సెట్లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో మ్యాచ్ నిర్ణాయక మూడో సెట్కు వెళ్లింది. ఇక్కడ హోరాహోరీ పోరు ఎదురైనా పేస్ తన అనుభవాన్ని జత చేసి మ్యాచ్ను దక్కించుకున్నాడు. సింగిల్స్ మ్యాచ్ల్లో మూడో సీడ్ రాబర్టో బటిస్టా అగట్ (స్పెయిన్) 6-3, 6-2తో పీటర్ గోజోసిక్ (జర్మనీ)పై, యెన్ సున్ లు 6-4, 6-4తో పాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్)పై గెలిచారు. గిలెర్మో గార్షియా లోపెజ్ 6-7 (1), 6-2, 6-0తో ఇటో తట్సుమా (జపాన్)ను ఓడించి క్వార్టర్స్కు చేరారు. -
సీటీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ
ముంబై: కొత్తగా ప్రారంభమవుతున్న చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)... జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లందర్నీ ఒకే తాటిపైకి తెచ్చిందని భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ అన్నాడు. ఈ లీగ్లో ఆడేందుకు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పేస్... సీటీఎల్ ట్రోఫీని ఆవిష్కరించాడు. సోమవారం నుంచి పోటీలు జరుగుతాయి. -
సీటీఎల్లో పేస్
న్యూఢిల్లీ: భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పంజాబ్ మార్షల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వెన్ను నొప్పి కారణంగా డేవిడ్ ఫై (స్పెయిన్) టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో పేస్ను తీసుకున్నారు. పురుషుల డబుల్స్లో సోమ్దేవ్తో, మిక్స్డ్లో గార్బిని ముగురుజాతో కలిసి పేస్ బరిలోకి దిగుతాడని నిర్వాహకులు తెలిపారు. ‘సీటీఎల్లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతుండటంతో టోర్నీలో గట్టి పోటీ తప్పదు. కాబట్టి దీనిపై దృష్టిపెట్టా. మేం కూడా టైటిల్ ఫేవరెట్లలో ఉన్నామని నమ్ముతున్నా’ అని పేస్ వ్యాఖ్యానించాడు. -
మాజీ క్రికెటర్ అతుల్ శర్మకు ఊరట!
ముంబై: మాజీ క్రికెటర్ అతుల్ శర్మ స్టానిక కోర్టులో ఊరట లభించింది. తనను, తన కూతుర్ని చంపుతానంటూ బెదిరించారని అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లియాండర్ పేస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ముంబై స్థానిక కోర్టు... అతుల్ శర్మను నవంబర్ 27 తేది వరకు అరెస్ట్ చేయవద్దని తీర్పునిచ్చింది. గతంలో రియాపిళ్లై,లియాండర్ పేస్ లిద్దరూ సహజీవనం చేశారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. రియాపిళ్లై తో అతుల్ శర్మ సన్నిహితంగా ఉంటున్నట్టు మీడియాలో రూమర్లు చెలరేగుతున్నాయి. -
క్రికెటర్లకు అవార్డులెందుకు?
క్రీడా శాఖ ఆలోచన బెంగళూరు: భారత్ తరఫున ఆడని ఆటగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్న కేంద్ర క్రీడా శాఖ దృష్టి ప్రస్తుతం క్రికెటర్లపై పడింది. సరైన కారణం చూపకుండా భారత్కు ఆడని ప్రముఖ క్రీడాకారులకు ఇక నుంచి అర్జున, ఖేల్త్న్ర అవార్డులు కూడా దక్కకపోవచ్చు. వచ్చే ఏడాది క్రీడా అవార్డుల నిబంధనల్లో ఇలాంటి మార్గదర్శకాలను పొందుపరిచేందుకు అవకాశం ఉన్నట్టు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. ఇక కేంద్రం ఇచ్చే నిధులు తమకు అనవసరమన్నట్టు వ్యవహరించే బీసీసీఐ ఆసియా క్రీడలకు వరుసగా రెండోసారి క్రికెట్ జట్లను పంపలేదు. దీంతో బోర్డు వైఖరి కారణంగా క్రికెటర్లను కూడా అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకోకపోవచ్చని సమాచారం. నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు: పేస్ న్యూఢిల్లీ: తన పాతికేళ్ల కెరీర్లో ఎన్నడూ దేశం తరఫున ఆడేందుకు వెనుకాడలేదని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ స్పష్టం చేశాడు. ‘క్రీడా శాఖ ఏం చెప్పిందనేది పూర్తిగా నాకు తెలీదు. కానీ దేశం తరఫున ఆడేందుకు ఎప్పుడూ గర్విస్తుంటాను. ఇప్పటికే ఆరు ఒలింపిక్స్లలో పాల్గొన్నాను. గ్రాండ్స్లామ్ ఆడుతున్నప్పుడు కూడా దేశం తరఫున ఆడుతున్నట్టే భావిస్తాను’ అని పేస్ చెప్పాడు.