Leander Paes
-
భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్గా ఎదుగుతుంది: లియాండర్ పేస్
ముంబై: భారత్ నుంచి మరో గ్రాండ్స్లామ్ చాంపియన్ తయారు అయ్యేందుకు పదేళ్లు పడుతుందని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతోందని... 2036 ఒలింపిక్స్కు మనదేశం ఆతిథ్యమివ్వడంతో పాటు పతకాల పట్టిక టాప్–10లో నిలిచే దిశగా అడుగులు ముందుకు వేస్తోందని పేర్కొన్నాడు. ముంబైలో బుధవారం జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా పేస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో పేస్తో పాటు మహేశ్ భూపతి, సానియా మీర్జా, సోనాలీ బెంద్రే, రకుల్ప్రీత్ పాల్గొన్నారు. ‘దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. వారిని గుర్తించి సానపెట్టాల్సిన అవసరముంది. రాబోయే రోజుల్లో భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్గా ఎదుగుతుంది’ అని పేస్ ఆశాభావం వ్యక్తంచేశాడు.చదవండి: ENG vs PAK: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పేస్, విజయ్ అమృత్రాజ్
న్యూపోర్ట్ (అమెరికా): భారత దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్లకు గొప్ప గౌరవం లభించింది. ఈ ఇద్దరికీ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించారు. ఆసియా నుంచి ఈ గౌరవం పొందిన టెన్నిస్ క్రీడాకారులు వీరిద్దరే కావడం విశేషం. 51 ఏళ్ల పేస్ వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో (1992 బార్సిలోనా నుంచి 2016 రియో వరకు) పోటీపడ్డ ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.1996 అట్లాంటా ఒలింపిక్స్లో వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్ డేవిస్కప్లో భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తన సుదీర్ఘ కెరీర్లో పురుషుల డబుల్స్లో 8 గ్రాండ్స్లామ్ టైటిల్స్, మిక్స్డ్ డబుల్స్లో 10 గ్రాండ్స్లామ్ టైటిల్స్ను గెల్చుకున్న పేస్కు ‘ప్లేయర్ కేటగిరీ’లో హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎంపిక చేశారు.ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా పేస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు 70 ఏళ్ల విజయ్ అమృత్రాజ్ 1974, 1987లలో భారత జట్టు డేవిస్కప్ ఫైనల్కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటి వరకు 28 దేశాల నుంచి 267 మంది టెన్నిస్ ప్లేయర్లకు ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో స్థానాన్ని కల్పించారు. -
హాల్ ఆఫ్ ఫేమ్లోకి భారత టెన్నిస్ దిగ్గజాలు
టెన్నిస్కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఇద్దరు భారత దిగ్గజాలు ప్రవేశించారు. వేర్వేరు జమానాల్లో భారత టెన్నిస్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆసియా నుంచి హాల్ ఆఫ్ ఫేమ్కు ఎంపికైన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారులుగా లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ కూడా టెన్నిస్లో అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. పేస్, అమృత్రాజ్లకు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడంతో ఈ జాబితాలో ప్రాతినిథ్యం లభించిన 28వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. 50 ఏళ్ల లియాండర్ పేస్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాజీ నంబర్ వన్గా చలామణి అయ్యాడు. 90వ దశకంలో పేస్ కెరీర్ పీక్స్లో ఉండింది. పేస్ తన కెరీర్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 18 గ్రాండ్స్లామ్ టైటిళ్లు సాధించాడు. పేస్ 1996 ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించాడు. ఓవరాల్గా పేస్ 1990-2020 మధ్యలో 54 డబుల్స్ టైటిళ్లు సాధించాడు. విజయ్ అమృత్రాజ్ విషయానికొస్తే.. ఈ 70 ఏళ్ల భారత టెన్నిస్ లెజెండ్ 70, 80 దశకాల్లో భారత్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాడు. కెరీర్లో ఓవరాల్గా 15 టైటిళ్లు సాధించిన అమృత్రాజ్ ఆతర్వాత టెన్నిస్ ప్రమోటర్గా, వ్యాఖ్యాతగా మంచి గురింపు తెచ్చుకున్నాడు. -
కలిసిరాని ప్రేమ, నాలుగోసారి బ్రేకప్ చెప్పిన ఖడ్గం బ్యూటీ!
ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ, టెన్నిస్ ఛాంపియన్ లియాండర్ పేస్ల బంధానికి బీటలు వారింది. వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో కిమ్ తన ఇన్స్టాగ్రామ్లో లియాండర్ పేస్తో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కుతారనుకుంటే ఇలా సడన్గా బ్రేకప్ చెప్పుకున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. కిమ్కు బ్రేకప్ కొత్త కాదు! ఖడ్గం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగధీరలో 'ఏం పిల్లడో ఎల్దం వస్తవా' స్పెషల్ పాటతో మరింత పాపులర్ అయింది. హిందీలోనూ పలు చిత్రాలు చేసిన ఆమె సినిమాల కంటే కూడా లవ్ ఎఫైర్స్తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో ప్రేమాయణం నడిపిన ఆమె పలు కారణాలతో అతడికి బ్రేకప్ చెప్పింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను పెళ్లాడగా కొంతకాలానికే అతడికి విడాకులిచ్చేసింది. తర్వాత నటుడు హర్షవర్ధన్ రాణేతో ప్రేమాయణం సాగించినప్పటికీ అదీ ఎంతోకాలం నిలవలేదు. రెండేళ్లుగా టెన్నిస్ స్టార్ లియాండర్పేస్తో రిలేషన్లో ఉన్న ఆమె చివరకు అతడికి కూడా బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. లియాండర్కు కూతురు కూడా ఉంది.. అటు లియాండర్ పేస్ కూడా ఎంతోమందితో ఎఫైర్స్ నడిపాడు. ప్రముఖ మోడల్ రియా పిళ్లైతో సహజీవనం చేయగా వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. తర్వాత కిమ్తో లవ్లో పడ్డాడు. 2020 చివరిలో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ టెన్నిస్ స్టార్.. 1992 నుంచి 2016 వరకూ మొత్తం 7 ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. అతని సుదీర్ఘ కెరీర్లో 1996లో జరిగిన అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించడమే కాకుండా 18 గ్రాండ్స్లామ్(డబుల్స్, మిక్స్డ్ డబుల్స్)ల్లో విజేతగా నిలిచాడు. -
Leander Paes: ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి.. బతకడం కష్టమన్నారు.. అయినా
Leander Paes Inspirational Journey: 1996 ఆగస్టు 3.. భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయమైన రోజు.. ఒలింపిక్స్లో పతకం గురించి ఎదురు చూసి చూసి ఇక మనకు రాదులే అనుకొని నిట్టూర్చిన ఒక తరం క్రీడాభిమానులకు సుదినం.. ఒలింపిక్స్ వేదికపై జాతీయ జెండా ఎగురవేసేందుకు నేనున్నానంటూ ఒక్కడు దూసుకొచ్చాడు.. 16 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ను చేర్చాడు. వ్యక్తిగత విభాగంలోనైతే 44 ఏళ్ల తర్వాత భారత ఆటగాడి పేరు వినిపించింది. మెగా వేదికపై విజయంతో తానేంటో చూపించిన అతని పేరు లియాండర్ పేస్! ఈ విజయంతో ఆగిపోకుండా ఆ తర్వాతా.. ఏళ్ల పాటు భారత టెన్నిస్కు పర్యాయపదంలా నిలిచిన స్టార్... వరుసగా మూడు ఒలింపిక్స్లలో కనీసం ఒక్క పతకం కూడా సాధించలేని మన దేశం.. అసలు ఒలింపిక్స్ అంటే మనవి కావు, మనకు ఎలాగూ పతకాలు గెలిచే అవకాశమే లేదు.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అనుకుంటున్న సమయం.. ఎప్పుడో 1980లో హాకీలో పతకం వచ్చింది. ఆ తర్వాత 1984, 1988, 1992.. క్యాలెండర్ మారింది కానీ కనీసం కంచు మోత కూడా వినిపించలేదు. భారత్కు మిగిలింది రిక్త హస్తమే.. సరిగ్గా చెప్పాలంటే ఒక తరం మొత్తం ఒలింపిక్స్ పతకం గురించి ఆలోచించడమే మానేసింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఒలింపిక్స్ పతకం భారత క్రీడలకు కొత్త ఊపిరి పోసింది. అప్పటినుంచి ప్రతి ఒలింపిక్స్లో భారత్ వరుసగా ఏదో ఒక పతకం గెలుస్తూనే వచ్చింది. టీనేజర్ నుంచి వెటరన్ వరకు.. 1990లో టీనేజర్గా పేస్.. డేవిస్ కప్ డబుల్స్ మ్యాచ్లో సీనియర్ సహచరుడు జీషాన్ అలీతో కలసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్పై భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 47 ఏళ్ల వయసు వచ్చే వరకు అదే ఉత్సాహం, అదే జోరు.. పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్.. దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్నాడు. అలుపు లేని ఆటసారి 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్.. ఒలింపిక్స్లో కాంస్య పతకం... 55 కెరీర్ టైటిల్స్.. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకున్న రికార్డులు మరో ఎత్తు. ఫిట్నెస్ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజుల్లేవు.. ఇదెలా సాధ్యం ఈ మనిషికి? మూడు పదులు దాటగానే కెరీర్ చరమాంకంలోకి వచ్చిందని చాలా మంది భావించే ఆటలో 47 ఏళ్ల వయసు వచ్చినా గ్రాండ్గా ఆడి చూపించిన అద్భుతం పేరే లియాండర్ పేస్. అతను తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన రోజు నుంచి ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే వరకు చూస్తే టెన్నిస్లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి ఎడ్బర్గ్, బెకర్, లెండిల్ లాంటి వాళ్లు ఆటకు గుడ్బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్ కెరీర్ సాగింది. ఆపై ఫెడరర్, నాడల్, జొకోవిచ్ల కాలంలోనూ పేస్ రాకెట్ మాట్లాడింది. కెరీర్లో ఎక్కువ భాగం డబుల్స్లోనే అయినా మ్యాచ్ ఫిట్నెస్ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్ గేమ్ అయిన క్రికెట్లో 24 ఏళ్లు ఆడిన సచిన్ను (ఆ)హాశ్చర్యంతో చూశారు భారత క్రీడాభిమానులు. కానీ టెన్నిస్లాంటి వ్యక్తిగత క్రీడలో 30 ఏళ్లు సత్తా చాటడం పేస్లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. అట్లాంటాతో అంబరాన... 1990లో పేస్.. జూనియర్ వింబుల్డన్, 1991లో యూఎస్ ఓపెన్ గెలిచి వరల్డ్ నంబర్వన్గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత కాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 ఒలింపిక్స్లో అతని వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్కు వ్యక్తిగత ఒలింపిక్స్ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్.. ఆ తర్వాత తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్స్ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్లో పీట్ సంప్రాస్ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్ కూడా ఉంది. డేవిస్ కప్ సూపర్ స్టార్ పేస్కు సంబంధించి ప్రతి భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్ కప్ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే ‘వాలి’ బలం రెట్టింపు అయిపోయినట్లు.. భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్ ఆటతీరు కూడా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోర్నీల సంగతి ఎలా ఉన్నా.. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్ పతకం తర్వాత లియాండర్ ఆడిన అన్ని డేవిస్కప్ మ్యాచ్లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంతటి ఆటగాడైనా సరే.. తన వీరోచిత ప్రదర్శనతో పేస్.. డేవిస్ కప్లో భారత్కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్సెవిక్, టిమ్ హెన్మన్, వేన్ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్ ర్యాంక్ల్లో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచ్చిన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్కప్ వరల్డ్ గ్రూప్లో భారత్ సెమీస్కు చేరడంలో పేస్దే కీలక పాత్ర. మృత్యువుతో పోరాడి.. 2003లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న సమయంలో కోర్టు అటు వైపు నుంచి బంతి పేస్ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి. శరీరంపై నియంత్రణ కోల్పోయి.. నిలబడేందుకు భాగస్వామి మార్టినా నవ్రతిలోవాను ఆసరాగా చేసుకున్నాడు. అది బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్కు మద్దతుగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకునేందుకు కూడా మార్టినా సిద్ధమైంది. దాన్నుంచి కోలుకున్న తర్వాత పేస్ మళ్లీ ప్రాక్టీస్కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. ప్రస్థానం సాగిస్తూ... పేస్ ఆటతీరు భీకరమైన సర్వీస్లు, బెంబేలెత్తించే ఏస్లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్లో కూడా అతను వాలీలు, డ్రాప్ షాట్లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్ వద్ద పేస్ ఆట తన పార్ట్నర్ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్.. కుర్రాళ్ల ఆటగా మారిపోయిన కొత్త తరంలో కూడా పేస్ నెట్ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ మాజీ సహచరుడు మహేశ్ భూపతి ప్రశంసించడం అతని ఆటలో పదునును చూపించింది. రాడ్లేవర్ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్.. వేర్వేరు భాగస్వాములతో కలసి 100కు పైగా మ్యాచుల్లో డబుల్స్ బరిలోకి దిగాడు. ఆటను పిచ్చిగా ప్రేమించిన పేస్ ఏ స్థాయిలోనైనా చివరి వరకు ఆడుతూనే వచ్చాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్లో తొలిసారి అతను చాలెంజర్ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. (క్లిక్ చేయండి: మేరీ కోమ్.. బాక్సింగ్ రింగ్ను శాశించిన ఉక్కు మహిళ) - మొహమ్మద్ అబ్దుల్ హాది -
లియాండర్ పేస్ గురువు కన్నుమూత
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. తన గురువులా భావించే మాజీ టెన్నిస్ ప్లేయర్, డేవిడ్ కప్ మాజీ కెప్టెన్ నరేశ్ కుమార్ బుధవారం రాత్రి కన్నుమూశారు.16 ఏళ్ల టీనేజర్ లియాండర్ పేస్కు మెంటార్గా వ్యవహరించిన నరేశ్ కుమార్.. పేస్ తన కెరీర్లో ఎదగడంలో పరోక్షంగా కీలకపాత్ర పోషించాడు. ఇక 1990 డేవిస్ కప్లో పేస్కు మెంటార్గా వ్యహరించిన నరేశ్ కుమార్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా, ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 93 ఏళ్ల నరేశ్ కుమార్ గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నిద్రలోనే మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యలు తెలిపారు. ఇక నరేశ్ కుమార్ 1928 డిసెంబర్ 22న లాహోర్లో జన్మించారు. ఆయనకు భార్య సునీత. కొడుకు అర్జున్, ఇద్దరు కూతుర్లు గీతా, ప్రియాలు సంతానం. 1949లో ఆసియా చాంపియన్షిప్స్ ద్వారా టెన్నిస్లో అరంగేట్రం చేసిన నరేశ్ కుమార్.. ఆ తర్వాత మరో టెన్నిస్ ప్లేయర్ రమానాథన్ కృష్ణన్తో కలిసి దాదాపు దశాబ్దానికి పైగా భారత్ నుంచి టెన్నిస్లో కీలకపాత్ర పోషించాడు. ఇక 1952లో డేవిస్ కప్ జర్నీ ఆరంభించిన నరేశ్ కుమార్ ఆ తర్వాత భారత్ తరపున డేవిడ్ కప్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక 1955లో నరేశ్ కుమార్ తన టెన్నిస్ కెరీర్లో ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో సింగిల్స్ విభాగంలో భారత్ తరపున తొలిసారి నాలుగో రౌండ్కు చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే నాలుగో రౌండ్లో అప్పటి టెన్నిస్ ప్రపంచ నెంబర్వన్ టోనీ ట్రేబర్ట్ చేతిలో ఓడినప్పటికి అతన్ని ముప్పతిప్పలు పెట్టి ఔరా అనిపించాడు. ఇక నరేశ్ కుమార్ ఖాతాలో ఐదు సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. 1952, 1953లో ఐరిస్ చాంపియన్షిప్స్.. 1952లో వెల్ష్ చాంపియన్స్, 1957లో ఎసెక్స్ చాంపియన్షిప్స్లు సొంతం చేసుకున్నాడు. ఇక 1969లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో నరేశ్ కుమార్ తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. అర్జున అవార్డు అందుకున్న నరేశ్ కుమార్.. 2000వ సంవత్సరంలో ద్రోణాచార్య లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న తొలి భారత టెన్నిస్ కోచ్గా నిలిచారు. -
టెన్నిస్ స్టార్తో త్వరలోనే ఖడ్గం బ్యూటీ వివాహం!
బాలీవుడ్ నటి, ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్బర్డ్స్ తమ ప్రేమను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కిమ్ శర్మ, పేస్ల తల్లిదండ్రులు కూడా ఇటీవలె ముంబైకి చేరుకున్నారని, పెళ్లికి సంబంధించి ఇరు కుటుంసభ్యులు చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి పేరెంట్స్ కిమ్, పేస్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో అతి త్వరలోనే అతి త్వరలోనే వీరిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. కిమ్-పేస్ల తల్లిదండ్రులు ఇలా కలుసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను వీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా కిమ్ కిమ్.. ఖడ్గం,మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆమె సినిమాల కంటే లవ్ ఎఫైర్స్తోనే బాగా పాపులర్ అయ్యింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కిమ్ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం నటుడు హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం లియాండర్ పేస్తో రిలేషన్షిప్లో ఉంది. -
మహిమాతో బ్రేకప్.. రియాతో సహజీవనం.. లియాండర్ పేస్ బ్రేకప్ స్టోరీ
ఆట లౌక్యాన్ని ప్రదర్శిస్తుంది.. నటన భావోద్వేగాన్ని అనుసరిస్తుంది! ఈ రెండిటి మధ్య ప్రేమ కుదిరితే లౌక్యం గెలుస్తుంది.. భావోద్వేగం వీలైతే సర్దుకుపోతుంది.. వీల్లేకపోతే ఓటమిని అంగీకరిస్తుంది.. బాలీవుడ్తో టెన్నిస్ కూడా ప్రేమలో పడింది. ఆ జంటే మహిమా చౌధరి, లియాండర్ పేస్!! లియాండర్, మహిమా.. ఒకరికొకరు పరిచయం అయ్యేనాటికి ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. ఒక పార్టీలో కలుసుకున్నారు ఇద్దరికీ కామన్గా ఉన్న స్నేహితుల ద్వారా. తొలి చూపులోనే మహిమాతో ప్రేమలో పడ్డాడు లియాండర్. అతని ప్రేమను చూసి మురిసిపోయింది మహిమా. కెరీర్ కన్నా అతనితో కలసి ఆస్వాదించే కాలానికే ప్రాధాన్యమిచ్చింది. ఇంకా చెప్పాలంటే లియాండర్ కెరీరే ముఖ్యమనుకుంది. అందుకే టెన్నిస్ ఆడడానికి అతను ఎక్కడికి వెళ్లితే అక్కడికి వెంటే వెళ్లింది. అతని బాగోగులను పట్టించుకుంది. అలా మూడేళ్లు సంతోషంగా గడిచిపోయాయి ఆ ఇద్దరి జీవితంలో! 2003... నెమ్మదిగా లియాండర్ పేస్ మది చలించసాగింది. కళ్లు ఇంకొకరి కోసం వెదకసాగాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్ రియా పిళ్లై. ఎక్కడో ఈవెంట్లో ఆమెను చూశాడు. ఇట్టే మనసు పారేసుకున్నాడు. ఆ విషయం రియాతో చెప్పాడు కూడా. అప్పటికే సంజయ్ దత్తో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న రియా.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. ఫోన్ కబుర్లు, డిన్నర్ డేట్లు షెడ్యూల్లో భాగమయ్యాయి. రియాకు తన టైమ్ ఇవ్వడం వల్ల సహజంగానే మహిమాకు దూరమవసాగాడు లియాండర్. గ్రహించింది ఆమె. కారణం అడిగింది. ‘చూస్తున్నావ్ కదా మ్యాచ్లు, ఎండార్స్మెంట్స్తో బిజీగా ఉంటున్నాను’ అని చెప్పాడు పొడిపొడిగా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో లియాండర్ ఎంగేజ్ అవడం మహిమా ఆలోచనల్లో అనుమానానికి తావిచ్చింది. ఒకసారి రియాతో అతను మాట్లాడుతుండగా విన్నది కూడా. నిలదీసింది. అప్పుడూ అదేం లేదంటూ ఆ సందర్భాన్ని తప్పించాడు. అయినా మహిమా మనసు లియాండర్ ప్రవర్తనను తప్పుపడుతూనే ఉంది. అందుకే లియాండర్ చెప్పే మాటలను నమ్మలేదు. ఒకసారి.. లియాండర్.. రియాతో చనువుగా ఉండడాన్ని చూసింది మహిమా. ‘ఇప్పుడు ఏం మాయ చేసి.. ఏ అబద్ధం చెప్పి దాటవేస్తావ్?’ అని ప్రశ్నించింది కళ్ల నిండా నీళ్లతో. తలవంచుకున్నాడు లియాండర్. చెదిరిన మనసుతో అతని జీవితం నుంచి తప్పుకుంది మహిమా. సహజీవనం మహిమాతో బ్రేకప్ తర్వాత వెంటనే రియాతో సహజీవనం స్టార్ట్ చేశాడు లియాండర్. 2005 –08 మధ్యలో ఆ ఇద్దరూ ముంబైలోని కొలాబాలో పెళ్లీ చేసుకున్నారని వదంతి. ఆ ఇద్దరికీ కూతురు పుట్టింది. పేరు అయానా. సంతోషంగా సాగిపోతోంది వాళ్ల కాపురం అనే అనుకున్నారు లియాండర్ అభిమానులు.. 2014లో లియాండర్, అతని తండ్రి మీద రియా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ పెట్టేదాకా. ఆ వార్త విని అంతా హతాశులయ్యారు. కూతురి కస్టడీ కోసమూ కేస్ ఫైల్ చేసింది రియా. వాళ్ల ప్రేమ.. అలా వివాదంగా ఎందుకు మారిందనే ఆరా మొదలైంది రియా అభిమానుల్లో. ‘రియా కోసం నన్ను మోసం చేసినట్టే ఇంకెవరికోసమో రియానూ మోసం చేసి ఉంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మహిమా. ఆమె అన్నట్టుగానే కొన్నాళ్లకే.. టెన్నిస్ క్రీడాకారిణి తన్వీ షాతో లియాండర్ ప్రేమలో పడ్డాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లోని సత్యాన్ని ఇటు లియాండర్ కానీ అటు తన్వీ కాని నిర్ధారించలేదు. కానీ ప్రస్తుతమైతే లియాండర్.. బాలీవుడ్ నటి కిమ్ శర్మతో రిలేషన్షిప్లో ఉన్నాడని వినికిడి. వాళ్లిద్దరూ కలసి గోవాలో హాలిడేస్ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వినికిడిని ఈ దృశ్యాలు నిజం చేసినట్టుగా భావిస్తున్నారు క్రీడా, సినీ అభిమానులు. మహిమా ఏం చేస్తోంది? లియాండర్ కోసం తన కెరీర్ను నిర్లక్ష్యం చేసిన మహిమా .. ప్రేమలో అతను చేసిన మోసం నుంచి బయటపడ్డాక బాబీ ముఖర్జీ అనే ఆర్కిటెక్ట్, బిజినెస్మన్ను పెళ్లిచేసుకుంది. వాళ్లకో కూతురు అరియానా. కానీ పరస్పర విరుద్ధమైన స్వభావాలు.. దాని వల్ల తలెత్తిన స్పర్థల వల్ల మహిమా, బాబీ సఖ్యంగా ఉండలేకపోయారు. కూతురుని పెట్టుకుని విడిగా ఉంటోంది మహిమా. మళ్లీ సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నిస్తోంది. లియాండర్ పేస్ గొప్ప టెన్నిస్ ప్లేయర్ కావచ్చు. కానీ నాతో మాత్రం ఫెయిర్గా లేడు. అతను ఇంకో స్త్రీ చుట్టూ తిరుగుతున్నాడనే నిజం తెలిసినప్పుడు నేనేమంత షాక్ అవలేదు. ఎందుకంటే అప్పటికే అతనెలాంటివాడో తెలిసిపోయింది. అందుకే ఆ బ్రేకప్ కూడా నా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకరకంగా నాకు హెల్పే చేసింది. నాలో పరిణతిని పెంచింది! – ఒక ఇంటర్వ్యూలో లియాండర్ పేస్ గురించి మహిమా చౌధరి. -ఎస్సార్ -
టీఎంసీ గూటికి దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు
Leander Paes Join TMC కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన టీఎంసీ.. గోవాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. గోవాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం టీఎంసీలోకి వలసలు భారీగా పెరిగాయి. రాజకీయ నాయకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా టీఎంసీలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ టీఎంసీలో చేరారు. ఆయనతో పాటు నటి నసిఫా అలీ, సామాజిక కార్యకర్త మృణాళిని దేశప్రభు శనివారం టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. వీరంతా మమతా బెనర్జీ సమక్షంలో వీరు పార్టీలో చేరినట్లు ప్రకటించారు. We are extremely delighted to share that Shri @Leander joined us today in the presence of our Hon'ble Chairperson @MamataOfficial! Together, we shall ensure that every single person in this nation sees the Dawn of Democracy that we have been waiting for since 2014! — All India Trinamool Congress (@AITCofficial) October 29, 2021 (చదవండి: ‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?) టీఎంసీలో చేరిన అనంతరం లియాండ్ పేస్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాను. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. దేశంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. దీదీ నిజమైన చాంపియన్’’ అన్నారు. చదవండి: జేమ్స్ బాండ్ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు -
Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు!
Leander Paes- Mahesh Bhupathi Web Series Break Point: వ్యక్తిగతంగా ఒకరితో మరొకరికి పడకపోయినా కోర్టులో దిగితే మాత్రం కలిసి కట్టుగా అద్భుత విజయాలు సాధించడం తమకే చెల్లిందని భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నిరూపించారు. దశాబ్దానికిపైగా భారత టెన్నిస్ ముఖ చిత్రంగా ఉన్న వీరిద్దరు 1994–2006, 2008–2011 మధ్య డబుల్స్ జోడీగా చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. 1999లో జరిగిన నాలుగు గ్రాండ్స్లామ్ టోరీ్నల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)నూ పురుషుల డబుల్స్లో ఫైనల్కు చేరిన ఈ జంట... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ల్లో విజేతలుగా నిలిచింది. అనంతరం 2001 ఫ్రెంచ్ ఓపెన్లో ఈ జోడి మరోసారి చాంపియన్గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వీరిని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ అంటూ భారతీయులు కీర్తించారు. అయితే ఈ గొప్ప ఘనతలు సాధించే సమయంలో తమ మధ్య సఖ్యత లేదని వీరు వ్యాఖ్యానించారు. అయినా ఏదో తెలియని సోదరభావం తమని కలిసి ఆడేలా చేసిందని వీరు పేర్కొన్నారు. పేస్, భూపతిల ఆట, అనుబంధం, స్పర్ధలు, గెలుపోటములు... ఇలా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని పలు ఆసక్తికర అంశాలతో ‘బ్రేక్ పాయింట్’ అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ట్రయిలర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేస్, భూపతి అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అశ్విని అయ్యర్ తివారి, నితీశ్ తివారిల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రేక్ పాయింట్’ ‘జీ5’ ఓటీటీలో అక్టోబర్ 1న విడుదల కానుంది. -
Kim Sharma: ‘ఖడ్గం’ ఫేమ్ కిమ్ శర్మ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తోంది?
Kadgam Actress Kim Sharma Life Story: ‘ముసుగు వేయొద్దు మనస్సు మీద.. వలలు వేయొద్దు వయస్సు మీద’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలో అలరించిన కిమ్ శర్మ గుర్తుంది కదా.. తన గ్లామర్ తో కుర్రాల మనసుల మీది ముసుగు లాగేసిందీ ఈ బోల్డ్ బ్యూటీ. తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’మగధీర (స్పెషల్ సాంగ్) వంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామ.. ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్ మూవీ డర్(1993)లో అతిథి పాత్రతో వెండితెరకు పరిచయం అయింది కిమ్ శర్మ. ఆ తర్వాత మొహబతీన్ సినిమాలో హీరోయిన్ గా అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ .. 2002లో ఖడ్గం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కిమ్ శర్మ. ఆ తర్వాత మగధీర సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించి మెప్పించింది. (చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా) యువరాజ్ ప్రేమాయణం.. బిజినెస్ మ్యాన్తో వివాహం ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది ఈ భామ. పబ్లిక్గా చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అప్పట్లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరికీ 2007లో బ్రేకప్ అయిపోయింది. 2010లో బిజినెస్ టైకూన్ అలీ పంజనీని పెళ్లి చేసుకున్న కిమ్ శర్మ భర్తతోపాటు కెన్యాకు వెళ్లిపోయింది. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో అతనితో విడాకులు తీసుకొని తిరిగి ముంబై వచ్చేసింది. విడాకులు తీసుకునే సమయంలో ఆమె మాజీ ప్రియుడు యువరాజ్ సింగ్ కిమ్ కెన్యాకు వెళ్లడం గమనార్హం. అలీతో విడాకులు తీసుకున్న తర్వాత కిమ్ శర్మ, హర్షవర్థన్ రాణేల డేటింగ్ నడిపిందని వార్తలు వచ్చాయి. లియాండర్ పేస్తో డేటింగ్! ప్రస్తుతం ఈ బ్యూటీ టెన్నిస్ మాజీ ప్లేయర్ లియాండర్ పేస్తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి గోవాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లిన ఫోటోలు కూడా మీడియాకు చిక్కాయి. అయితే వీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కానీ.. వారి డేటింగ్ విషయమై ఇంతవరకు నోరు విప్పలేదు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కిమ్.. త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
టెన్నిస్ దిగ్గజంతో ఖడ్గం బ్యూటీ డేటింగ్..?
ముంబై: 1996 అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 18 గ్రాండ్స్లామ్ల విజేత(డబుల్స్, మిక్స్డ్ డబుల్స్), భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్(48).. ఖడ్గం సినిమా బ్యూటీ కిమ్ శర్మతో డేటింగ్లో ఉన్నాడని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ.. వీరి జోడీ గోవా బీచ్లో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అయితే వీరిద్దరూ ఇలా కెమెరా కంటికి చిక్కడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో వీరు దగ్గరగా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా గోవా పర్యటనకు సంబంధించిన ఫోటోలను వారు బస చేసిన హోటల్ యాజమాన్యమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa) కాగా, 2007లో కిమ్ శర్మ.. టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువ్రాజ్సింగ్తో ప్రేమాయణం సాగించింది. అయితే, వీరిద్దరికి పొసగకపోవడంతో కొద్దికాలంలోనే విడిపోయారు. ఆతర్వాత యువీ.. హేజిల్ కీచ్ను పెళ్లి చేసుకోగా, కిమ్ 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను మనువాడింది. అయితే, 2016లో అతని నుంచి కూడా విడాకులు తీసుకున్న ఈ 40 ఏళ్ల ఢిల్లీ భామ.. ఆతర్వాత నటుడు హర్షవర్ధన్ రాణేతో ప్రేమాయణం సాగించింది. View this post on Instagram A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa) ఆతర్వాత ఏమైందో తెలీదు కానీ ప్రస్తుతం ఆమె పేస్తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పేస్ సైతం చాలా మందితో ఎఫైర్లు నడిపాడు. ఇటీవలి కాలంలో అతను ప్రముఖ మోడల్ రియా పిళ్ళైతో సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతానికైతే పేస్, కిమ్ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. కాగా, కిమ్.. కృష్ణవంశీ పాపులర్ సినిమా ఖడ్గంలో 'ముసుగు వేయొద్దు మనసు మీద'.. అలాగే మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ భారీ ప్రేక్షకాధరణ పొందింది. View this post on Instagram A post shared by The Project Café Ahmedabad (@theprojectcafeahd) -
‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?
కోల్కతా: వరుసగా ఎనిమిది ఒలింపిక్స్లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ శుక్రవారం స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు. ‘మహమ్మారి బారిన పడతామని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత కూడా నేను నా లక్ష్యంపై స్పష్టతతో ఉన్నా. శారీరకంగా, మానసికంగా ఒలింపిక్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చరిత్ర పుటల్లో భారత్ పేరు లిఖించేందుకే నేను 30 ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పుడు నాకు 48 ఏళ్లు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. నేను కొట్టే టెన్నిస్ బంతికి నా వయస్సు గురించి తెలియదు. కేవలం ఎంత బలంగా, వేగంగా బాదుతున్నాననే అంశంపై అది కదులుతుంది. నాలో మరో ఒలింపిక్స్ ఆడేందుకు కావాల్సినంత ప్రేరణ ఉంది. విశ్వ క్రీడల్లో అత్యధికంగా వరుసగా ఎనిమిదిసార్లు టెన్నిస్ ఆడిన వ్యక్తిగా భారత్ పేరిట రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. టోక్యో ద్వారా ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నా’ అని పేస్ వివరించాడు. నిజానికి గతేడాది క్రిస్మస్ రోజున... 2020 టెన్నిస్ సీజన్తో తన ప్రొఫెషనల్ కెరీర్ను ముగిస్తానని పేస్ ప్రకటించాడు. ఈ మేరకు ‘వన్ లాస్ట్ రోర్’ స్లోగన్తో ఇతర టోర్నీల్లో పాల్గొన్నాడు. కరోనా కారణంగా ఏడాదిపాటు ఒలింపిక్స్ వాయిదా పడటంతో పేస్ మళ్లీ రాకెట్పట్టడం అనుమానంగా మారింది. తాజాగా పేస్ తన మనసులో మాటను బయటపెట్టడంతో ఒలింపిక్స్లో అతని ప్రాతినిధ్యం ఖాయంగానే అనిపిస్తోంది. ఈ సైకిల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పేస్.. సైకిల్ను నడిపించే ప్రయత్నంలో ఇలా జారి కిందిపడ్డాడు. -
స్పాన్సర్లు వస్తారా?
కోల్కతా: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో జపాన్ దేశం ఒలింపిక్స్ను ఎలా నిర్వహిస్తుందో తనకు అర్థం కావడం లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. ఒక అగ్రశ్రేణి ఆటగాడికి కరోనా సోకితే పరిస్థితి ఏమిటని అతను ప్రశ్నించాడు. ‘ఒలింపిక్స్కు అండగా నిలిచే కార్పొరేట్ స్పాన్సర్లు ఎప్పటిలాగే ముందుకొస్తారా అనేది సందేహమే. ఒకవేళ ప్రేక్షకులు లేకుండా నిర్వహించాల్సి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు. మైదానాలు ఖాళీగా ఉంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. క్రీడలు కూడా ఒక పెద్ద వ్యాపారమే. నా చేతులకు కూడా పెద్ద మొత్తంలో బీమా ఉంటుంది. అనుమతి లేకుండా నేను టమాటాలు కూడా కోయలేను. ఫుట్బాల్ లీగ్లు ప్రారంభించారు సరే దురదృష్టవశాత్తూ ఏ రొనాల్డోకో, మెస్సీకో కోవిడ్–19 సోకితే ఏం చేస్తారు. ఆ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడటాన్ని మనం ఊహించగలమా. ఫుట్బాల్ అయినా సరే మ్యాచ్లో ఏదో ఒక సమయంలో ఆటగాళ్లు దగ్గరకు వస్తూనే ఉంటారు కదా. ఇలాంటి స్థితిలో క్రీడలు ఎలా సాధ్యం’ అని 1996 అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అభిప్రాయం వ్యక్తం చేశాడు. నాలో కొత్త వెర్షన్ను చూస్తారు... సుమారు మూడు దశాబ్దాలుగా సాగుతున్న ప్రొఫెషనల్ కెరీర్కు గుడ్బై చెప్పే క్రమంలో ‘వన్ లాస్ట్ రోర్’ అంటూ ఈ ఏడాది ముగిసేవరకు ఆడే విధంగా 2020 ఆరంభంలో పేస్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా టోక్యో ఒలింపిక్స్లో పాల్గొని ఎనిమిదోసారి ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని కూడా అతను కలగన్నాడు. అయితే ఇప్పుడు కోవిడ్–19 కారణంగా అంతా తలకిందులైంది. ఒలింపిక్స్ సంవత్సరంపాటు వాయిదా పడగా... ప్రస్తుత సీజన్లో ఎన్ని టెన్నిస్ టోర్నీలు జరుగుతాయనేది కూడా సందేహమే. ఈ నేపథ్యంలో అరుదైన ఘనత సాధించే అవకాశం తనకు దూరం కావచ్చని అతను అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్స్ గురించి నేను నిజంగానే ఆందోళన చెందుతున్నాను. ఒక చరిత్ర సృష్టించేందుకు, భవిష్యత్తుపై నా ముద్ర నిలిచిపోయేందుకు నాకు అది మంచి అవకాశంగా కనిపించింది. ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా సీజన్ను ముగించాలని అనుకున్నా. కానీ ఏడాది ఆలస్యమైన పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అనేది సందేహమే. దాదాపు 30 ఏళ్ల ఆట తర్వాత ఇక చాలంటూ రిటైర్ కావాలని గత సెప్టెంబరులో అనుకున్నాను. అయితే విరామం తీసుకొని కుటుంబంతో గడిపాక ఆలోచన మారింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా నాన్నతో ఎంతో సమయం వెచ్చించగలగడం సంతోషం. లాక్డౌన్ ముగిశాక మళ్లీ కోర్టులోకి అడుగు పెడతాను. ఒక కొత్త వెర్షన్ పేస్ను మీరు చూస్తారు. 30 ఏళ్ల వయసు లో ఎలా ఉండేవాడినో అలా వస్తాను’ అని పేస్ వెల్లడించాడు. -
100 గ్రాండ్ స్లామ్లు ఆడటం నా కల
న్యూఢిల్లీ: 100 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆడాలనుకున్న తన కల కరోనా కారణంగా అనిశ్చితిలో పడిందని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. రికార్డుస్థాయిలో వరుసగా ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాలన్న తన ఆశయాన్ని కూడా కరోనా చిదిమేసిందని పేర్కొన్నాడు. తన కెరీర్కు ఈ ఏడాదే చివరిదని పేస్ గతంలోనే ప్రకటించాడు. ఇప్పటివరకు 97 గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడిన పేస్ మరో మూడింటిలో పాల్గొంటే 100 గ్రాండ్స్లామ్ల మైలురాయిని చేరుకుంటాడు. అయితే కరోనాతో గ్రాండ్స్లామ్ టోర్నీల నిర్వహణపై అనిశ్చితితోపాటు ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తన ఆశలు నెరవేరేలా లేవన్నాడు. ‘100 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ప్రాతినిధ్యం, ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో ఆడిన టెన్నిస్ ప్లేయర్గా రికార్డు సృష్టించడం నా ముందున్న లక్ష్యాలు. వాటిని సాధించాలని పట్టుదలతో ఉన్నా. ఒకవేళ అందుకోలేకపోయినా... ఇప్పటివరకు సాధించిన వాటిపట్ల సంతృప్తిగానే ఉంటా. లాక్డౌన్ ఎత్తేశాక 2021లో కూడా ఆడాలా? వద్దా? అనేది నా టీమ్తో కలిసి నిర్ణయం తీసుకుంటా’ అని పేస్ వివరించాడు. -
టైటిల్ పోరుకు పేస్ జోడీ
బెంగళూరు: ఈ ఏడాదిలో రిటైర్ కానున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పేస్ (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్)–ఆండ్రీ వాసిలెవ్స్కీ (బెలారస్) జోడీపై గెలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జోడీలు తమ సరీ్వస్లను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే సూపర్ టైబ్రేక్లో మాత్రం పేస్ జంట పైచేయి సాధించి ఫైనల్కు చేరింది. -
మూడు దశాబ్దాల ఆటకు వీడ్కోలు
29 ఏళ్ల క్రితం... 16 ఏళ్ల ఒక టీనేజీ కుర్రాడు తొలిసారి భారత జట్టు తరఫున డేవిస్ కప్ మ్యాచ్ ఆడాడు. డబుల్స్ మ్యాచ్లో సీనియర్ సహచరుడు జీషాన్ అలీతో కలిసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్పై భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు 46 ఏళ్ల ప్రాయంలోనూ కూడా అదే ఉత్సాహం, అదే జోరు... పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్... దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్న ఆ శరీరానికి అలసట వచ్చేసింది. వయసును గెలిచిన ‘ఆ కుర్రాడు’ వచ్చే ఏడాది తన మూడు దశాబ్దాల టెన్నిస్ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం 18 గ్రాండ్స్లామ్ టైటిల్స్... ఒలింపిక్స్లో కాంస్య పతకం... 55 కెరీర్ టైటిల్స్... ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకుంటూ వస్తున్న రికార్డులకైతే అంతే కనిపించడం లేదు. అలసిపోవడం లేదు, ఫిట్నెస్ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజులే లేవు... ఈ మనిషికి ఎలా సాధ్యం. మూడు పదులు దాటగానే కెరీర్ చరమాంకంలోకి వచి్చందని చాలా మంది భావించే ఆటలో 46 ఏళ్ల వయసు వచి్చనా గ్రాండ్గా ఆడి చూపిస్తున్న అద్భుతం పేరే లియాండర్ పేస్. అతను తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన రోజు నుంచి డేవిస్ కప్లో కొత్త రికార్డు సృష్టించే వరకు టెన్నిస్లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి స్టీఫెన్ ఎడ్బర్గ్, బోరిస్ బెకర్, ఇవాన్ లెండిల్లాంటి వాళ్లు ఆటకు గుడ్బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్ కెరీర్ సాగింది. ఇప్పుడు ఫెడరర్, నాడల్, జొకోవిచ్ల కాలంలోనూ పేస్ రాకెట్ మాట్లాడుతూనే ఉంది. పేస్ ఆడేది డబుల్స్లోనే అయినా మ్యాచ్ ఫిట్నెస్ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్ గేమ్ అయిన క్రికెట్లో 24 ఏళ్లు ఆడిన సచిన్ను ఆశ్చర్యంతో భారత క్రీడాభిమానులు చూశారు. కానీ టెన్నిస్లాంటి క్రీడలో 29 ఏళ్లుగా సత్తా చాటడం పేస్లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. అట్లాంటాతో అంబరాన... పేస్ 1990లో జూనియర్ వింబుల్డన్... 1991లో జూనియర్ యూఎస్ ఓపెన్ గెలిచి వరల్డ్ నంబర్వన్గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత సుదీర్ఘకాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్కు వ్యక్తిగత ఒలింపిక్ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్... ఇప్పటికీ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్లో పీట్ సంప్రాస్ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్ కూడా ఉంది. డేవిస్ కప్ సూపర్ స్టార్... పేస్కు సంబంధించి ప్రతీ భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్ కప్ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే వాలి బలం రెట్టింపు అయిపోయినట్లు... భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్ ఆటతీరు కూడా ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోరీ్నల సంగతి ఎలా ఉన్నా... దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్ పతకం తర్వాత లియాండర్ ఆడిన అన్ని డేవిస్కప్ మ్యాచ్లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంత బలమైన ఆటగాడు అయినా వీరోచిత ప్రదర్శనతో పేస్ డేవిస్ కప్లో భారత్కు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్సెవిచ్, టిమ్ హెన్మన్, వేన్ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్ ర్యాంక్లలో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచి్చన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్కప్ వరల్డ్ గ్రూప్లో భారత్ సెమీస్ చేరడంలో పేస్దే కీలక పాత్ర. మృత్యువుతో పోరాడి... 2003లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న సమయంలో అటు వైపు కోర్టు నుంచి బంతి పేస్ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లు కమ్మాయి. శరీరంపై నియంత్రణ లేక నిలబడేందుకు భాగస్వామి మారి్టనా నవ్రతిలోవాను పట్టుకున్నాడు. అది బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. చివరకు అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్కు మద్దతుగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకునేందుకు కూడా మారి్టనా నవ్రతిలోవా సిద్ధమైంది. దాని నుంచి కోలుకున్న తర్వాత పేస్ మళ్లీ ప్రాక్టీస్కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. వచ్చే ఏడాదే ఆఖరు... పేస్ ఆటతీరు భీకరమైన సరీ్వస్లు, బెంబేలెత్తించే ఏస్లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్లో కూడా అతను వాలీలు, డ్రాప్ షాట్లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్ వద్ద పేస్ ఆట తన పార్ట్నర్ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్ కుర్రాళ్ల ఆటగా మారిపోయిన ఈతరంలో కూడా పేస్ నెట్ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ ఇటీవల మాజీ సహచరుడు మహేశ్ భూపతి ప్రశంసించడం అతని ఆటలో ఇంకా పదును మిగిలి ఉందనే చూపిస్తోంది. రాడ్ లేవర్ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్, 100కు పైగా వేర్వేరు భాగస్వాములతో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు. ఇటీవల పదే పదే అతని రిటైర్మెంట్పై వార్తలు రావడం, దానిని అతను ఖండించడం చాలా సార్లు జరిగాయి. వయసు పెరిగిన కొద్దీ ఇలాంటివి వినిపించడం సహజం. అయితే ఆటను పిచి్చగా ప్రేమించే పేస్, ఏ స్థాయిలోనైనా దానిని కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్లో తొలిసారి అతను చాలెంజర్ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. డబుల్స్లో ప్రస్తుతం ప్రపంచ 105వ ర్యాంకర్గా ఉన్న పేస్ వచ్చే ఏడాది కెరీర్కు వీడ్కోలు పలుకనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించాడు. కొన్ని విశేషాలు.... ►అంతర్జాతీయ టెన్నిస్లో 700కు పైగా విజయాలు సాధించిన కేవలం ఎనిమిది మంది ఆటగాళ్ళలో ఒకడు. 18 గ్రాండ్స్లామ్లు (8 పురుషుల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్) గెలిచాడు. ►వరుసగా 7 ఒలింపిక్స్లలో (1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016) పాల్గొన్న ఏకైక టెన్నిస్ ఆటగాడు. 1999లో డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. వరుసగా 19 సీజన్ల పాటు (1997–2015) ఏడాదికి కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచాడు. ►తన ప్రొఫెషనల్ కెరీర్లో పేస్ ఇప్పటివరకు 55 టైటిల్స్ సాధించాడు. ఇందులో సింగిల్స్లో ఒక టైటిల్ ఉండగా... మిగతా 54 టైటిల్స్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. ►సింగిల్స్ విభాగంలో పేస్ 101 మ్యాచ్ల్లో గెలిచి... 99 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. డబుల్స్లో పేస్ 767 మ్యాచ్ల్లో విజయం సాధించి... 455 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో పేస్ 85,71,006 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 61 కోట్ల 11 లక్షలు) సంపాదించాడు. ►1990లో జపాన్పై డేవిస్ కప్లో అరంగేట్రం చేసిన పేస్ 57 సార్లు డేవిస్ కప్ బరిలోకి దిగాడు. 92 మ్యాచ్ల్లో గెలిచి (సింగిల్స్లో 48; డబుల్స్లో 44)... 35 మ్యాచ్ల్లో (సింగిల్స్లో 22; డబుల్స్లో 12) ఓడిపోయాడు. డేవిస్కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (44) సాధించిన ప్లేయర్గా పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ►ముందుగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేరి్పన క్రమశిక్షణ, చేసిన మార్గదర్శనం, కల్పించిన వాతావరణం ఇవన్నీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. వారు నా పట్ల కనబరిచిన అనిర్వచనీయమైన ప్రేమ ఎప్పటికీ మరువలేను. అమ్మా–నాన్న... మీరు లేకుంటే నేనూ లేను. ఐ లవ్ యూ. మా అక్కలకు థ్యాంక్స్ చెప్పాలి. జాక్వి, మరియాలిద్దరు నాకంటే పెద్దవాళ్లు. వాళ్లే నన్నింతలా మార్చేశారు. జీవన ప్రయాణంలో ఎత్తుపల్లాలు అర్థమయ్యేలా చేశారు. నేనో పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు బాగా సహకరించారు. తల్లిదండ్రులు చెప్పిన నైతిక విలువల్ని నేనూ పాటించేలా చేశారు. ఐ లవ్ యూ సిస్టర్స్. ఇక నా గారాలపట్టి... కుమార్తె అయానా! పాప లవ్స్ యూ. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అంశం కూతుర్ని కలిగి ఉండటం అనేది నీ వల్లే నాకు అర్థమైంది. అయానా నీవే నాకు స్ఫూర్తి. నా కెరీర్లో మిగిలున్నది 2020 టెన్నిస్ క్యాలెండరే! కేవలం ఎంపిక చేసుకున్న టోర్నీలే ఆడతాను. నా జట్టుతో చేసే ఆఖరి క్రీడా పయనాన్ని గొప్పగా మలచుకుంటా. సహచరులు, మిత్రులు, అభిమానులతో ఆనందంగా గడుపుతా. నా సుదీర్ఘ ప్రయాణానికి అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. అభిమానులకు విన్నపం. నాతో ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఉంటే ‘లియాండర్ మెమోరిస్’కు షేర్ చేయండి. నేను నా మధుర స్మృతుల్ని మీతో పంచుకుంటాను. ‘గుడ్బై ఇయర్గా 2020 నాకు ఉద్వేగంగా గడువనుంది. భారంగా నేను రాకెట్ను విడువనున్నాను. – ట్విట్టర్లో లియాండర్ పేస్ పేస్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ పురుషుల డబుల్స్ ► ఆస్ట్రేలియన్ ఓపెన్: 2012 ►ఫ్రెంచ్ ఓపెన్: 1999, 2001, 2009 ►వింబుల్డన్: 1999 ►యూఎస్ ఓపెన్: 2006, 2009, 2013 మిక్స్డ్ డబుల్స్ ►ఆస్ట్రేలియన్ ఓపెన్: 2003, 2010, 2015 ►ఫ్రెంచ్ ఓపెన్: 2016 ►వింబుల్డన్: 1999, 2003, 2010, 2015 ►యూఎస్ ఓపెన్: 2008, 2015 ►పేస్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో అర్జున అవార్డు...1996–1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’... 2001లో ‘పద్మశ్రీ’... 2014లో ‘పద్మభూషణ్’ అవార్డులు అందజేసింది. -
భారత్ 3.. పాకిస్తాన్ 0
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్లో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పాకిస్తాన్తో జరిగిన మూడో మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించి తన స్కోరు 3-0కు పెంచుకుంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్-–జీవన్ నెడుంజెళియన్ జోడీ 6-1, 6-3 తేడాతో అబ్దుల్ హుజైఫా రెహ్మాన్–షోయబ్ మొహమ్మద్ తేడాతో గెలిచింది. తొలి సెట్ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 3-3తో ఉన్నప్పుడు నువ్వు-నేనా అన్నట్లు సాగింది. కాగా, లియాండర్ పేస్ జంట అద్భుతమైన స్మాష్లను సంధించడంతో పైచేయి సాధించింది. ఇదే ఊపును కొనసాగించడంతో ఆ సెట్ను 6-3 తేడాతో గెలుచుకోవడంతో పాటు మ్యాచ్ను కూడా సొంతం చేసుకుంది. కేవలం 53 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక్కడ పాకిస్తాన్ టెన్నిస్ ఆటగాళ్ల అనుభవలేమి స్పష్టంగా కనబడింది. పేస్ రికార్డు 44కు చేరింది.. గతేడాది డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డబుల్స్ ఆటగాడిగా రికార్డు సాధించిన లియాండర్ పేస్ తన రికార్డును మరింత పెంచుకున్నాడు. తాజా విజయంతో డబుల్స్ విభాగంలో 44వ గెలుపును అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఇటాలియన్ ఆటగాడు నికోలా పీట్రెంజెలీ(42) ఉన్నాడు. 57 డేవిస్ కప్ మ్యాచ్లకు గాను 44 విజయాలను పేస్ సాధించగా, నికోలా 66 మ్యాచ్ల్లో 42 విజయాలు నమోదు చేశాడు. పేస్ 44 డబుల్స్ డేవిస్ కప్ రికార్డు సుదీర్ఘ కాలం చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం టెన్నిస్ ఆడుతున్న డబుల్స్ ప్లేయర్లు ఎవరూ టాప్-10లో లేరు. పాకిస్తాన్తో తటస్థ వేదికపై శనివారం మొదలైన ఈ పోరులో భారత్ 2–0తో ఆధిక్యంతో దూసుకుపోయింది. తొలి మ్యాచ్లో ప్రపంచ 176వ ర్యాంకర్, 25 ఏళ్ల రామ్కుమార్ రామనాథన్ 6–0, 6–0తో 17 ఏళ్ల షోయబ్ మొహమ్మద్పై గెలిచాడు. రెండో మ్యాచ్లో ప్రపంచ 131వ ర్యాంకర్, 22 ఏళ్ల సుమీత్ నాగల్ 6–0, 6–2తో 17 ఏళ్ల అబ్దుల్ హుజైఫా రెహ్మాన్పై గెలిచాడు. తాజా గెలుపుతో భారత్ ఆధిక్యం 3-0కు పెరిగింది. దాంతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్తో క్రొయేషియా జట్టుతో పోరుకు మార్గం సుగుమం అయ్యింది. -
పేస్ పునరాగమనం!
న్యూఢిల్లీ: భద్రతా కారణాలదృష్ట్యా పాకిస్తాన్లో డేవిస్ కప్ మ్యాచ్ ఆడేందుకు పలువురు భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారులు విముఖత చూపిన నేపథ్యంలో... వెటరన్ స్టార్, 46 ఏళ్ల లియాండర్ పేస్ ముందుకొచ్చాడు. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా నవంబర్ 29, 30వ తేదీల్లో ఇస్లామాబాద్లో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కోసం తాను అందుబాటులో ఉంటానని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వర్గాలకు తెలిపాడు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) కోరిక మేరకు... ఈ పోటీలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేసేందుకు అవసరమైన పత్రాలను పాకిస్తాన్ అధికారులకు పంపించామని ఏఐటీఏ జనరల్ సెక్రటరీ హిరణ్మయ్ చటర్జీ తెలిపారు. పాకిస్తాన్తో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేనితోపాటు అర్జున్ ఖడే, విజయ్ సుందర్ ప్రశాంత్, శ్రీరామ్ బాలాజీ, సిద్ధార్థ్ రావత్, మనీశ్ సురేశ్ కుమార్, శశికుమార్ ముకుంద్ ఉన్నారు. -
మొన్న అర్జున్.. నిన్న పేస్తో ఆటాడిన ధోని
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ అనంతరం టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రికెట్కు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్కు విరామం తీసుకున్న ధోని.. ప్రస్తుతం కూడా సెలక్షన్స్కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధోని సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన ఛారిటి ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొని అభిమానులను అలరించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఛారిటి ఫుట్బాల్ మ్యాచ్లను రితి స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం జరిగిన ఓ మ్యాచ్లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్తో, సోమవారం జరిగిన మరో మ్యాచ్లో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్తో ధోని తలపడ్డాడు. ఈ మ్యాచ్కు సంబంధించిన ఫోటోలను రితి స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారాయి. ఇక ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్పై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ధోని ప్రత్యామ్నయంగా వచ్చిన యువ క్రికెటర్ రిషభ్ పంత్ వరుసగా విపలమవుతుండటం అందరినీ నిరాశకు గురిచేస్తోంది. -
పేస్-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, అతనితో సహజీవనం చేసిన మాజీ స్నేహితురాలు రియా పిళ్లై మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ‘కుటుంబ సంరక్షణ కేసు’లో దిగువ కోర్టుకు సుప్రీం కోర్టు మరో ఏడాది గడువు ఇచ్చింది. పేస్, రియా మధ్య ఉన్న వివాద పరిష్కారానికి సంవత్సరం వ్యవధి ఇచ్చి ఆపై తీర్పునివ్వాలని ఫ్యామిలీ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2014లో పేస్పై రియా గృహ హింస కేసు పెట్టడంతో తొలిసారి వివాదం కోర్టుకు చేరింది. తమ కూతురు సంరక్షణ, భరణం అంశాల్లో వీరిద్దరి మధ్య వివాదం ముదిరింది. వీరిద్దరు కూర్చొని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినా అది సాధ్యం కాలేదు. భరణం కింద ఇల్లు గానీ డబ్బు గానీ ఇవ్వాలని రియా కోరగా... తాను అసలు ఆమెను పెళ్లే చేసుకోలేదు కాబట్టి కుదరదని పేస్ కోర్టులో మరో కేసు దాఖలు చేశాడు. -
సెమీస్లో పేస్ జంట
న్యూపోర్ట్ (అమెరికా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఏటీపీ–250 టోర్నమెంట్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ లియాండర్ పేస్–మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–రాబర్ట్ లిండ్స్టెట్ (స్వీడన్) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్ 1995లో హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్ జాన్ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్జోస్ టోర్నీ) తర్వాత ఏటీపీ టోర్నీలో సెమీఫైనల్కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. -
ఇంకా ఆడుతున్నాడు... గెలుస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్. వయసులో ఫిఫ్టీకి చేరువవుతున్నా... వన్నె తగ్గని ఈ వెటరన్ స్టార్ టోక్యో ఒలింపిక్స్పై కూడా దృష్టి పెట్టాడు. 46 ఏళ్ల పేస్ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నాడు. పురుషుల డబుల్స్లో స్థానిక భాగస్వామి బెనోయిట్ పెయిర్తో కలిసి శుభారంభం చేశాడు. టెన్నిస్లో ఓపెన్ శకం మొదలయ్యాక మ్యాచ్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా పేస్ నిలిచాడు. తన కీర్తి కిరీటంలో చేరిన ఈ ఘనతపై అతను మాట్లాడుతూ ‘30 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా. నా సుదీర్ఘ ప్రస్థానంలో 12 తరాల ఆటగాళ్లను చూశా. ఆల్టైమ్ గ్రేట్ పీట్ సంప్రాస్, ప్యాట్ రాఫ్టర్లు సింగిల్స్ ఆడితే... నేను డబుల్స్ ఆడాను. టెన్నిస్లో నాకంటూ గౌరవాన్ని సంపాదించుకున్నాను’ అని అన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా...రాఫెల్ నాదల్, అతని మాజీ కోచ్ టోనీ ఎదురుపడినపుడు ఆసక్తికర సంభాషణ జరిగిందన్నాడు. ‘నేను నా డబుల్స్ మ్యాచ్ ముగించుకొని వస్తుంటే వాళ్లిద్ద రూ ఎదురయ్యారు. నన్ను గుర్తించిన కోచ్ టోనీ... లియో (పేస్) నీకు 46 ఏళ్ల వయసు కదా! అంటే ఔనన్నా. రొలాండ్ గారోస్లో 1989 (జూనియర్స్), తర్వాత సీనియర్స్ ఆడావుగా అంటే ఔననే చెప్పా. ఇన్నేళ్లయినా మళ్లీ ఇక్కడ తొలి గేమ్ గెలిచావంటా... అంటే ఔననే తల ఊపాను. వెంటనే నాదల్తో చూశావా నాదల్... 46 వయసులో పేస్ ఆడటమే కాదు గెలవడం కూడా చేస్తున్నాడు’ అని చెప్పారు. ఓ మేటి కోచ్ మరో దిగ్గజ ఆటగాడు (నాదల్)తో తన గురించి చెబుతుంటే ఎంతో సంతోషం కలిగిందన్నాడు. టెన్నిస్లో అప్పటి దిగ్గజాల నుంచి ఇప్పటి గ్రేటెస్ట్ స్టార్ల వరకు అందరూ తనను గుర్తిస్తారని, గౌరవంతో చూస్తారని పేస్ చెప్పుకొచ్చాడు. నాదల్, రోజర్ ఫెడరర్లిద్దరూ తనకు టీనేజ్ వయసు నుంచే తెలుసని చెప్పాడు. ‘నా జీవితంలో టెన్నిస్తో నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. సుదీర్ఘ కెరీర్ను కొనసాగిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడైతే (ఫ్రెంచ్ ఓపెన్లో) నాలుగు సార్లు డబుల్స్ టైటిల్ సాధించాను. అలసట ఎరుగని నా పయనంలో ఆటను ఇప్పుడప్పుడే ఆపలేను. 2020 ఒలింపిక్స్ కూడా ఆడేస్తానేమో. ఇప్పటికే అత్యధిక ఒలింపిక్స్ (6) ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాను. మరోటి ఆడితే ఆ రికార్డును మెరుగుపరుచుకుంటా’ అని పేస్ వివరించాడు. -
క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది: శ్రీశాంత్
న్యూఢిల్లీ : ‘42 ఏళ్ల వయసులో లియాండ్ పేస్ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. 36 ఏళ్ల వయసులో కనీసం కొంతవరకైనా మంచి క్రికెట్ ఆడలేనా’అంటూ క్రికెటర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు. అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ)ను సుప్రీం కోర్టు ఆదేశించడంతో శ్రీశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందన్నాడు. వయసు అసలు సమస్యే కాదన్న శ్రీశాంత్.. ఫిట్గా ఉన్నంత కాలం క్రికెట్ ఆడొచ్చన్నాడు. ఈ ఆరు సంవత్సరాలు తన జీవితంలో చీకటి రోజులుగా మిగిలిపోతాయన్నాడు. తాను నిర్దోషినని తెలిసి కూడా బీసీసీఐ నిషేధం విధించిందన్నాడు. ఇప్పటికైనా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. (శ్రీశాంత్కు భారీ ఊరట) వాళ్లు టచ్లో ఉన్నారు.. తనపై నిషేధం విధించడంతో కనీసం క్లబ్ క్రికెట్ కూడా ఆడలేకపోయానని శ్రీశాంత్ వాపోయాడు. కౌంటీ క్రికెట్ ఆడటానికి కూడా బీసీసీఐ అనుమతి నిరాకరించిందని గుర్తుచేశాడు. క్రికెట్ ఆడకున్నా తన సహచర క్రికెటర్లతో సంబంధాలు తెగిపోలేదని వివరించాడు. హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, రైనాలతో టచ్లో ఉన్నట్లు తెలిపాడు. ఈ గడ్డుకాలంలో తనకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, లాయర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక టీమిండియా గెలిచిన 2007, 2011 ప్రపంచకప్లలో శ్రీశాంత్ సభ్యుడన్న విషయం తెలిసిందే. టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహించాడు. (పోలీస్ టార్చర్ భరించలేకే ఒప్పుకున్నా: శ్రీశాంత్) అసలేం జరిగిందంటే.. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్పై నిషేధాన్ని కేరళ సింగిల్ బెంచ్ హైకోర్టు ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్పై 2017 అక్టోబర్లో శ్రీశాంత్పై నిషేధాన్ని కొనసాగించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
‘ఆ ముగ్గురు’ కలిసి పని చేయాలి!
మొనాకో: ఈతరం భారత టెన్నిస్ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలంటే ముగ్గురు దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి పని చేయాలని మాజీ వరల్డ్ నంబర్వన్, జర్మన్ స్టార్ బోరిస్ బెకర్ అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ అభివృద్ధి కోసం కాకుండా ఈ ముగ్గురు తమలో తాము కలహించుకోవడం తాను చూస్తున్నానని అతను అన్నాడు. గత కొంత కాలంగా డబుల్స్ భాగస్వాముల విషయంలో పేస్, భూపతి, సానియా వివాదంలో భాగమయ్యారు. వీరి మధ్య విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కాయి. ఇదే విషయాన్ని బెకర్ గుర్తు చేశాడు. ‘టెన్నిస్లో భారత్ గతంలో మంచి ఫలితాలు సాధించింది. అయితే ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్ల అవసరం ఉంది. వారిలో కొందరన్నా మరింత ముందుకు వెళ్లి ఫలితాలు సాధిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కానీ మున్ముందు విజయాలు దక్కవచ్చు. దేశంలో ఆటకు మంచి ఆదరణ కూడా ఉంది. పేస్, భూపతి, సానియాలాంటి వారి అవసరం ఇప్పుడు దేశానికి ఉంది. వారు ఆట కోసం ఏదైనా చేయాలి. వారి మధ్య గొడవలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. కానీ ముగ్గురు కలిసి పని చేయడమొక్కటే పరిష్కార మార్గం’ అని బెకర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఫెడరర్ 20 గ్రాండ్స్లామ్ల ఘనతను తాజా ఫామ్ ప్రకారం చూస్తే వచ్చే రెండేళ్లలో నొవాక్ జొకోవిచ్ అధిగమిస్తాడని బెకర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓటమిని ఒప్పుకోని తత్వం ఉన్న జొకోవిచ్ అద్భుత రీతిలో పునరాగమనం చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని కూడా అతను అన్నాడు. జొకోవిచ్కు 2014–16 మధ్య బెకర్ కోచ్గా వ్యవహరించగా... ఆ సమయంలో సెర్బియా స్టార్ ఆరు గ్రాండ్స్లామ్లు గెలిచాడు. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్లో ఆదివారం ముగిసిన ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్–వరేలా (మెక్సికో) ద్వయం రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో పేస్–వరేలా జోడీ 6–3, 4–6, 2–10తో శాండర్–వీజెన్ (బెల్జియం) జంట చేతిలో ఓడింది. రన్నరప్గా నిలిచిన పేస్ జోడీకి 3,820 యూరోలు (రూ. 3 లక్షల 18 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. యూపీ యోధ గెలుపు పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో రైడర్లు శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్ చెలరేగడంతో యూపీ యోధ జట్టు మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ యో«ధ 38–36తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. విజేత జట్టు తరఫున శ్రీకాంత్ 12, ప్రశాంత్ 11 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్లో నితీశ్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 43–32తో పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యచ్ల్లో పుణేరీ పల్టన్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
ఫైనల్లో పేస్ జోడీ
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ సీజన్లో ఆరోసారి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్– వరేలా (మెక్సికో) ద్వయం టైటిల్కు విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్–వరేలా జోడీ 7–5, 7–6 (7/5)తో సిమోన్ బొలెలీ–బ్రాకియాలి (ఇటలీ) ద్వయంపై గెలిచింది. -
పేస్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సాంటో డొమింగో ఓపెన్లో పేస్–వరేలా (మెక్సికో) జోడీ విజేతగా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ పేస్–వరేలా జంట 4–6, 6–3, 10–5తో బెహర్ (ఉరుగ్వే)–రొబెర్టో (ఈక్వెడార్) ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. ఈ టైటిల్తో 110 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రూ. 5.70 లక్షల ప్రైజ్మనీ పేస్ ఖాతాలో చేరింది. 45 ఏళ్ల పేస్ వరేలాతో కలిసి గతవారం మాంట్రీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. -
లియాండర్ పేస్పై వేటు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ను సెర్బియాతో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేయలేదు. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు సెర్బియాలో ఈ పోటీ జరుగుతుంది. గత ఏప్రిల్లో చైనాతో జరిగిన మ్యాచ్లో నెగ్గి డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (43) సాధించిన ప్లేయర్గా లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సెర్బియాతో మ్యాచ్ కోసం రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్లతో కూడిన ఐదుగురు సభ్యుల భారత జట్టును ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన జంట బోపన్న–దివిజ్ డబుల్స్ మ్యాచ్ ఆడుతుంది. యూకీ బాంబ్రీ, రామ్కుమార్, ప్రజ్నేశ్ సింగిల్స్లో పోటీపడతారు. మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా, జీషాన్ అలీ కోచ్గా వ్యవహరిస్తారు. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: కెరీర్లో 55వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు నిరాశ ఎదురైంది. అమెరికాలో జరిగిన విన్స్టాన్ సాలెమ్ ఓపెన్ టోర్నీలో పేస్–సెరెటాని (అమెరికా) జంట రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో పేస్ ద్వయం 4–6, 2–6తో రోజర్ (నెదర్లాండ్స్)–టెకావ్ (రొమేనియా) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్గా నిలిచిన పేస్ జోడీ ఖాతాలో 20,040 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. -
97వసారి డబుల్స్ ఫైనల్లో పేస్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కెరీర్లో 55వ డబుల్స్ టైటిల్కు విజయం దూరంలో నిలిచాడు. అమెరికాలో జరుగుతున్న విన్స్టన్ సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో పేస్–జెమీ సెరెటాని (అమెరికా) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో పేస్–సెరెటాని 6–4, 2–6, 10–8తో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)లపై గెలిచారు. ఈ విజయంతో పేస్ తన కెరీర్లో 97వసారి డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరుకున్నాడు. ఇప్పటివరకు 54 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన పేస్... 42 సార్లు రన్నరప్గా నిలిచాడు. టైటిల్ పోరులో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హొరియా టెకావ్ (రొమేనియా) ద్వయంతో పేస్ జంట తలపడుతుంది. వాస్తవానికి పేస్ ప్రస్తుతం ఇండోనేసియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాల్సింది. అయితే తనకు సరైన భాగస్వామిని ఇవ్వనందుకు నిరసనగా అతను ఆసియా క్రీడల నుంచి వైదొలిగి ఈ టోర్నీలో ఆడుతున్నాడు. -
ఏషియాడ్కు పేస్ దూరం
పాలెమ్బాంగ్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త వివాదాన్ని రేపాడు. డబుల్స్లో తన భాగస్వామిని ఎంపిక చేసిన తీరును నిరసిస్తూ ఏకంగా పోటీలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మెగా ఈవెంట్లో తనకు సరితూగే డబుల్స్ పార్ట్నర్ను ఎంపిక చేయలేదంటూ ‘ఐటా’పై విమర్శలు గుప్పించాడు. ఇండోనేసియా ఆతిథ్యమివ్వనున్న ఈ క్రీడల నుంచి పేస్ ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో నిబంధనల ప్రకారం మరో ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం లేదు. భారత టెన్నిస్ జట్టు గురువారం ఇండోనేసియా చేరుకుంది. అయితే ఈ జట్టుతో పాటు వెటరన్ స్టార్ వెళ్లలేదు. 2010, 2014 ఆసియా క్రీడల్లోనూ పాల్గొనని లియాండర్ వరుసగా మూడోసారీ ప్రతిష్టాత్మక క్రీడలకు దూరమయ్యాడు. దీనిపై వెటరన్ స్టార్ మాట్లాడుతూ ‘బరువెక్కిన హృదయంతో చెబుతున్నా... నేను ఆసియా క్రీడల్లో బరిలోకి దిగడం లేదు. సరైన డబుల్స్ భాగస్వామి లేకే క్రీడల నుంచి తప్పుకుంటున్నా. నాకు సరితూగే డబుల్స్ భాగస్వామిని చూడాలని ఇది వరకే ‘ ఐటా’ను కోరినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. అందువల్లే వైదొలగాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జోడీ కట్టడంతో విశేష అనుభవజ్ఞుడైన పేస్కు సుమిత్ నాగల్, సింగిల్స్ స్పెషలిస్ట్ రామ్కుమార్ రామనాథన్లలో ఒకరిని జత చేయాలనుకున్నారు. దీంతో అతను ఆడలేనంటూ తప్పుకున్నాడు. 1994లో జరిగిన హిరోషిమా ఆసియా క్రీడల నుంచి 2006 దోహా క్రీడల వరకు ప్రతీ ఈవెంట్ల్లోనూ పాల్గొన్న 45 ఏళ్ల పేస్ 5 స్వర్ణ పతకాలను గెలిచాడు. -
పేస్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం... ఈనెల 17న 45 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వెటరన్ స్టార్ లియాండర్ పేస్ మరోసారి ఆసియా క్రీడల బరిలోకి దిగబోతున్నాడు. ఏషియాడ్ కోసం సోమవారం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించిన ఆరుగురు సభ్యుల జట్టులో పేస్కు చోటు లభించింది. 1994 నుంచి 2006 వరకు నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని ఎనిమిది పతకాలు సాధించిన పేస్ 2010, 2014 పోటీలకు దూరమయ్యాడు. పతకాల వేటలో ఇప్పుడు మళ్లీ కొత్త ఉత్సాహంతో సన్నద్ధమయ్యాడు. సింగిల్స్లో భారత అత్యుత్తమ ర్యాంకర్ (94) అయిన యూకీ బాంబ్రీ యూఎస్ ఓపెన్కు నేరుగా అర్హత సాధించే అవకాశం ఉండటంతో అతడిని ఎంపిక నుంచి మినహాయిస్తున్నట్లు ‘ఐటా’ ప్రకటించింది. ఆసియా క్రీడల సమయంలోనే యూఎస్ ఓపెన్ టోర్నీ కూడా జరగనుంది. ముగ్గురు సింగిల్స్ స్పెషలిస్ట్లు రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సుమిత్ నాగల్లను... ముగ్గురు డబుల్స్ స్పెషలిస్ట్లు పేస్, రోహన్ బోపన్న, దివిజ్ శరణ్లను కమిటీ ఎంపిక చేసింది. డేవిస్ కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ఉన్న మహేశ్ భూపతి తాను ఏషియాడ్కు దూరంగా ఉంటానని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో జీషాన్ అలీకి ఆ బాధ్యతలు అప్పగించారు. -
పేస్ ప్రపంచ రికార్డు
తియాన్జెన్ (చైనా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డేవిస్ కప్లో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నికోల పెట్రాజెలీ (ఇటలీ–42 విజయాలు) పేరిట ఉన్న రికార్డును పేస్ బద్దలు కొట్టాడు. తొలుత డబుల్స్లో పేస్–రోహన్ బోపన్న జోడీ గెలిచి ఆశలు నిలబెట్టగా... రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్ల్లో రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ నెగ్గడంతో భారత్ 3–2తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని... వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్లోనూ పరాజయం పాలైన భారత జట్టు చావో రేవో మ్యాచ్లో సత్తా చాటింది. శనివారం జరిగిన కీలక డబుల్స్ మ్యాచ్లో పేస్–బోపన్న జోడీ 5–7, 7–6 (5/7), 7–6 (3/7)తో మావో జిన్ గాంగ్–జీ జాంగ్ జంటపై గెలుపొందింది. అనంతరం తొలి రివర్స్ సింగిల్స్లో రామ్కుమార్ 7–6 (7/4), 6–3తో డి వూ పై గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. నిర్ణాయక ఐదో మ్యాచ్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–4, 6–2తో వీబింగ్ వూను ఓడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ప్రపంచ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఘనతను నా తల్లిదండ్రులకు, నా కూతురు అయానాకు, డేవిస్ కప్ కెప్టెన్లకు, సహచరులకు, దేశ ప్రజలందరికి అంకితమిస్తున్నా. నేను భారత గడ్డపై పుట్టి, సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అందుకే వేటిని అతిగా తీసుకోకుండా స్నితప్రజ్ఞతతో ముందుకెళ్తున్నా. డేవిస్ కప్లో 0–2తో వెనుకబడిన అనంతరం తిరిగి పుంజుకోవడం గొప్ప అనుభూతి. ఈ ఘనత మరెందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. – లియాండర్ పేస్ -
లియాండర్ పేస్.. అరుదైన ఫీట్
బీజింగ్ : భారత టెన్నిస్ దిగ్గజం, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించారు. డేవిస్ కప్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. డేవిస్ కప్లో భాగంగా శనివారం రోహన్ బోపన్నతో జోడి కట్టిన పేస్ చైనా జంట జీ జాంగ్, జిన్ గాంగ్ పై 5-7,7-6(5), 7-6(3)తో విజయం సాధించారు. తద్వారా ఇరాన్ ఆటగాడు నికోలా పిట్రాంగిలీ డేవిస్లో అత్యధిక డబుల్స్ విజయాల( 42) రికార్డును పేస్ తిరగరాశారు. తద్వారా 43 విజయాలతో ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించారు. పేస్ డేవిస్ కప్ విజయాల ట్రాక్ను పరిశీలిస్తే... 1990లో డేవిస్ కప్లో జీసన్ అలీతో తొలిసారి జతకట్టిన పేస్ ఇప్పటివరకు 12మంది భాగస్వాములతో ఈ ఘనత సాధించారు. అత్యధికంగా మహేశ్ భూపతితో కలిసి 25 విజయాలు అందుకున్నారు. గత ఏప్రిల్లో ఉజ్బెకిస్తాన్తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్ను పక్కన పెట్టారు. దీంతో ఈసారి డేవిస్కప్లో పేస్ పాల్గొనడం పై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) డేవిస్కప్ పోరుకు పేస్ను ఎంపిక చేసింది. -
పేస్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్కు డేవిస్ కప్ జట్టులో చోటు దక్కింది. ఏప్రిల్ 6, 7 తేదీల్లో చైనాతో జరిగే పోరు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐ టీఏ) ఆదివారం జట్టును ప్రకటించింది. ఇందులో 44 ఏళ్ల పేస్తో పాటు యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్, రోహన్ బోపన్నలు ఉన్నారు. దివిజ్ శరణ్ రిజర్వ్ సభ్యుడిగా ఉంటాడు. గత ఏప్రిల్లో ఉజ్బెకిస్తాన్తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్ను పక్కన పెట్టారు. అయితే ఇటీవలే దుబాయ్ ఓపెన్లో పేస్ రన్నరప్గా నిలిచి డబుల్స్ ర్యాంకుల్లో మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. ‘రోహన్ బోపన్నకు పేస్తో జతకట్టడం ఇష్టం లేదు. అవసరమైతే అతను చైనాతో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి సెలక్షన్ కమిటీ చైర్మన్కు లేఖ రాశారు. అయితే భూపతి లేఖను, బోపన్న విజ్ఞప్తిని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. ‘బోపన్న ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నాడు. అలాంటి వ్యక్తి సొంత విషయాల కోసం దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి వెనుకాడితే ఏఐటీఏ ఆ ఆటగాడిని ప్రోత్సహిం చదు. ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు దేశం కోసం ఆడే అవకాశం లభిస్తుంది. అన్ని విషయాలను పక్కనబెట్టి రెండువారాల పాటు దేశం కోసం కలిసి ఆడలేరా? కెప్టెన్ భూపతి అభిప్రాయం ప్రకారం వారిద్దరి మధ్య (పేస్, బోపన్న) సఖ్యత లేదు. ఈ విషయంలో బోపన్నను ఒప్పించే బాధ్యత పేస్దే. అతను మాత్రమే ఈ పని చేయగలడు’ అని ఏఐటీఏ అధికారి వివరించారు. మరో మ్యాచ్ గెలిస్తే పేస్ డేవిస్కప్లో అత్యధిక డబుల్స్ మ్యాచ్లు నెగ్గిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. భారత జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. కొంత కాలంగా బాగా శ్రమిస్తూ ర్యాంక్ మెరుగు పరుచుకున్నా. బోపన్నతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నా. ఓ ఆటగాడిగా బోపన్న ప్రతిభను గౌరవి స్తాను. మేమిద్దరం కలిసి మంచి ప్రదర్శన చేస్తాం. -
మళ్లీ టాప్–50లోకి లియాండర్ పేస్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్–50లోకి వచ్చాడు. గతవారం దుబాయ్ ఓపెన్లో జేమీ సెరెటాని (అమెరికా)తో కలిసి రన్నరప్గా నిలవడంతో పేస్ ఆరు స్థానాలు పురోగతి సాధించాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో అతడు 46వ స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన రోహన్ బోపన్న 20వ ర్యాంక్లో, దివిజ్ శరణ్ 44వ ర్యాంక్లో ఉన్నారు. సింగిల్స్లో యూకీ బాంబ్రీ 110వ స్థానంలో ఉన్నాడు. -
సెమీస్లో పేస్ జంట
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీస్కు చేరుకున్నాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ పేస్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీ 6–3, 2–6, 17–15తో ‘సూపర్ టైబ్రేక్’లో రూబెన్ గొంజాలెజ్ (ఫిలిప్పీన్స్)–హంటర్ రీస్ (అమెరికా) జంటపై గెలుపొందింది. -
టాప్–50లో పేస్
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఏడు నెలల తర్వాత మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్లో పేస్ 14 స్థానాలను మెరుగుపరుచుకొని 47వ ర్యాంకును అందుకున్నాడు. అమెరికాకు చెందిన జేమ్స్ సెరిటానితో కలిసి తాజాగా న్యూపోర్ట్ బీచ్ టైటిల్ నెగ్గిన పేస్ ఖాతాలో 125 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. భారత్ తరఫున డబుల్స్లో రోహన్ బోపన్న (20వ స్థానం) అత్యుత్తమ స్థానంలో నిలవగా, దివిజ్ శరణ్ మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్ బెస్ట్ 45వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ 118వ ర్యాంకులో, రామ్కుమార్ రామనాథన్ 140వ స్థానంలో ఉండగా... సుమిత్ నాగల్ (218), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (244), శ్రీరామ్ బాలాజీ (391) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ సానియా మీర్జా ఒక స్థానం పడిపోయి 14వ ర్యాంక్కు చేరుకుంది. -
పేస్ జంటకు నిరాశ
పుణే: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త ఏడాదిని ఓటమితో ప్రారంభించాడు. స్వదేశంలో జరిగే ఏకైక ఏటీపీ-250 టోర్నమెంట్ టాటా ఓపెన్లో తన భాగస్వామి పురవ్ రాజాతో కలిసి బరిలోకి దిగిన పేస్కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. భారత్కే చెందిన రోహన్ బోపన్న-జీవన్ నెదున్చెజియాన్ జంట 6-3, 6-2తో పేస్-పురవ్ జోడీని అలవోకగా ఓడించింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న ద్వయం నాలుగు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జంట సర్వీస్ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. ఈ గెలుపుతో బోపన్న జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. యూకీ బాంబ్రీ రెండో రౌండ్లోకి ప్రవేశించగా... సుమీత్ నాగల్ వెనుదిరిగాడు. తొలి రౌండ్లో యూకీ 6-3, 6-4తో అర్జున్ ఖడేపై గెలుపొందగా... క్వాలిఫయర్ సుమీత్ 3-6, 3-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. -
పేస్ ఖాతాలో మరో టైటిల్
న్యూఢిల్లీ: ర్యాంకింగ్స్లో వెనుకబడిపోయినా పదును తగ్గని ఆటతీరుతో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన ఖాతాలో మరో టైటిల్ను జమ చేసుకున్నాడు. భారత్కే చెందిన పురవ్ రాజాతో జత కట్టిన 44 ఏళ్ల పేస్ అమెరికాలో జరిగిన నాక్స్విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ను సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్–పురవ్ రాజా ద్వయం 7–6 (7/4), 7–6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత ఆగస్టు నుంచి కలిసి ఆడుతున్న పేస్–పురవ్లకు ఇదే తొలి టైటిల్. మరోవైపు ఈ సీజన్లో పేస్కిది నాలుగో ఏటీపీ చాలెంజర్ టైటిల్. ఇంతకుముందు ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ లియోన్, ఇక్లే ఓపెన్ టైటిల్స్ను... స్కాట్ లిప్స్కీ (అమెరికా)తో కలిసి తలహసీ టైటిల్ను సాధించాడు. తాజా విజయంతో డబుల్స్ ర్యాంకింగ్స్లో పేస్, పురవ్ పురోగతి సాధించారు. పేస్ మూడు స్థానాలు ఎగబాకి 67వ ర్యాంక్లో... పురవ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 61వ ర్యాంక్లో ఉన్నారు. రోహన్ బోపన్న 15వ స్థానంలో కొనసాగుతుండగా... దివిజ్ శరణ్ 51వ ర్యాంక్లో ఉన్నాడు. -
సెమీస్లో పేస్ జోడీ ఓటమి
న్యూఢిల్లీ: సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్–పురవ్ రాజా (భారత్) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం రష్యాలో జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–పురవ్ రాజా ద్వయం 6–4, 3–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జూలియో పెరాల్టా (చిలీ)–హొరాసియో జెబోలాస్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడిపోయింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్ జోడీ తొలి సెట్ను నెగ్గినా... రెండో సెట్లో తడబడింది. సూపర్ టైబ్రేక్లోనూ ఈ భారత జోడీ ఒత్తిడికి లోనై పరాజయం పాలైంది. సెమీస్లో ఓడిన పేస్ జంటకు 15,450 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 10 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు!
లియాండర్ పేస్ వ్యాఖ్య కోల్కతా: సుదీర్ఘ కెరీర్లో ఎంతో సాధిం చిన తాను ఇక కొత్త గా నిరూపించుకునేదేమీ లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. ఈ ఏడాది డేవిస్ కప్ జట్టు నుంచి ఈ వెటరన్ ఆటగాడిని నాన్– ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తప్పించాడు. అయితే టెన్నిస్నే ప్రేమించే తాను సత్తా ఉన్నంత కాలం ఆడతానని, ఇప్పట్లో రిటైర్మెంట్ యోచనే లేదని తేల్చి చెప్పాడు. ‘నేను ఎవరిముందు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నేనేంటో నా కెరీరే సమాధానమిస్తుంది. ఈ వయసు లోనూ టెన్నిస్ ఆడుతున్నానంటే దానికి కారణం... నేను టెన్నిస్ను అమితంగా ప్రేమించడమే. దేశం తరఫున ఎన్నో విజయాలు సాధించాను. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడేది వ్యక్తిగతమైనా... బరిలోకి దిగేది మాత్రం... మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించేందుకే’ అని పేస్ భావోద్వేగంతో చెప్పాడు. వచ్చే ఏడాది మరిన్ని టైటిల్స్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2018లో కొత్త మిక్స్డ్ డబుల్స్ భాగస్వామితో బరిలోకి దిగుతానని, మళ్లీ విజయాలు సాధిస్తానని అతను చెప్పాడు. -
సాకేత్, యూకీ పునరాగమనం
లియాండర్ పేస్కు దక్కని స్థానం న్యూఢిల్లీ: కెనడాతో వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో తలపడే భారత జట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని, సింగిల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశారు. కెనడాలోని ఎడ్మంటన్లో సెప్టెంబరు 15 నుంచి 17 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు డబుల్స్ దిగ్గజం లియాండర్ పేస్ను జట్టులోకి ఎంపిక చేయలేదు. సాకేత్, యూకీలతోపాటు రామ్కుమార్ రామనాథన్, రోహన్ బోపన్న జట్టులోని మిగతా సభ్యులు. ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ రిజర్వ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. గత ఏప్రిల్లో స్వదేశంలో ఉజ్బెకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో గాయాల కారణంగా సాకేత్, యూకీ ఆడలేదు. ఉజ్బెకిస్తాన్తో మ్యాచ్లో ఆరుగురు సభ్యులున్న జట్టులో పేస్ను ఎంపిక చేసినా నలుగురు ఆటగాళ్లున్న తుది జట్టులో అతడికి స్థానం లభించలేదు. ‘ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున రోహన్ బోపన్న ర్యాంక్ మెరుగ్గా ఉండటంతో అతడిని ఎంపిక చేశాం. భవిష్యత్లో పేస్ పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు ఉండాలని కెప్టెన్ మహేశ్ భూపతి కోరడంతో డబుల్స్ విభాగంలో ఒకరినే ఎంపిక చేశాం. ఈసారి యూకీ, రామ్కుమార్ సింగిల్స్ మ్యాచ్లు ఆడతారు. డబుల్స్ మ్యాచ్లో సాకేత్–బోపన్న జంట బరిలోకి దిగుతుంది’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్పీ మిశ్రా తెలిపారు. -
సెమీస్లో పేస్ జంట
న్యూఢిల్లీ: అంటాల్యా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) ద్వయం సెమీఫైనల్కు చేరింది. టర్కీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్–షమస్దీన్ జంట 6–1, 6–2తో బెర్లోక్ (అర్జెంటీనా)–జోవో సుసా (పోర్చుగల్) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జంట 6–7 (9/11), 7–6 (7/4), 4–10తో మాట్ పావిక్ (క్రొయేషియా)–ఒలివెర్ మరాచ్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో బగ్దాటిస్తో రామ్కుమార్ ఆడతాడు. -
పేస్ జంటకు టైటిల్
ఇల్క్లే (బ్రిటన్): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ను సాధించాడు. శనివారం ముగిసిన ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో తన భాగస్వామి ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 2–6, 6–2, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. 45 ఏళ్ల పేస్ ఈ సీజన్లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు. -
డబుల్స్ ఫైనల్లో పేస్ జంట
ఎగాన్ ఇల్క్లే ట్రోఫీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 6–4, 7–6 (7/2)తో జాన్ మిల్మన్–లూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు బర్మింగ్హామ్ టోర్నీ మహిళల డబుల్స్లో సానియా మీర్జా (భారత్)–కోకో వాండెవాగె (అమెరికా) జంటకు క్వార్టర్ ఫైనల్లో వాకోవర్ లభించడంతో సెమీఫైనల్కు చేరింది. -
పేస్ జంట పరాజయం
ఎస్హెర్టోజెన్బాష్ (నెదర్లాండ్స్): రికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంట పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్–లిప్స్కీ జోడీ 4–6, 4–6తో రెండో సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–రాజీవ్ రామ్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. మరోవైపు తొలి రౌండ్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జోడీ 3–6, 4–6తో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)–ఆండ్రి సా (బ్రెజిల్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
పేస్ ఎక్స్ప్రెస్కు బ్రేక్!
⇒డేవిస్ కప్ జట్టులో చోటు దక్కని లియాండర్ ⇒27 ఏళ్లలో ఇదే తొలిసారి ⇒బోపన్నకే ప్రాధాన్యతనిచ్చిన మహేశ్ భూపతి ⇒తీవ్రంగా విరుచుకుపడ్డ పేస్ భారత డేవిస్ కప్ చరిత్రలో ఒక శకం ముగిసింది! దాదాపు మూడు దశాబ్దాలుగా జట్టులో అంతర్భాగమై పలు చిరస్మరణీయ విజయాలు అందించిన లియాండర్ పేస్కు మ్యాచ్ బరిలోకి దిగే తుది జట్టులో స్థానం లభించలేదు. ఉజ్బెకిస్తాన్తో జరిగే పోరులో డబుల్స్ మ్యాచ్లో పేస్ను కాదని రోహన్ బోపన్నను నాన్ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ఎంచుకున్నారు. బెంగళూరులో పరిస్థితులే కారణమంటూ మహేశ్ వివరణ ఇచ్చినా... తనతో పాత విభేదాల వల్ల కావాలనే పక్కన పెట్టినట్లు పేస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డేవిస్కప్లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు కేవలం ఒక విజయం దూరంలో ఉన్న సమయంలో చోటు కోల్పోయిన ఈ దిగ్గజం ఇక ముందు దేశం తరఫున ఆడటం దాదాపు అసాధ్యం కావచ్చు! బెంగళూరు: లియాండర్ పేస్ తొలి సారిగా భారత్ తరఫున 1990లో జపాన్తో జైపూర్లో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ బరిలోకి దిగాడు. నాటినుంచి ఇప్పటి వరకు అతను అందుబాటులో ఉన్న ప్రతీ సారి బరిలోకి దిగాడు. గాయంలాంటి కారణాలతో తనంతట తాను తప్పుకోవడం మినహా ఫామ్ పేరుతో పేస్ను ఒక్కసారి కూడా తప్పించలేదు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్తో జరిగే మ్యాచ్లో అతడిని పక్కన పెట్టారు. నేటి నుంచి ఆదివారం వరకు ఇక్కడ జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1 మ్యాచ్లో తలపడే నలుగురు సభ్యుల భారత జట్టును గురువారం నాన్ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించారు. డబుల్స్ మ్యాచ్లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ కలిసి ఆడతారు. సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఒలింపిక్స్ కాంస్య పతకం, 18 గ్రాండ్స్లామ్ల టైటిల్స్ విజేత పేస్ కంటే కూడా బోపన్న వైపు భూపతి మొగ్గు చూపారు. ప్రస్తుతం ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో పేస్ 53వ స్థానంలో ఉండగా, బోపన్న 24వ స్థానంలో కొనసాగుతున్నాడు. ‘ఇక్కడి వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయి. రోహన్ చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు. అతని ఎంపికకు అదే ప్రధాన కారణం. పేస్ను తప్పించాలనేది చాలా కఠిన నిర్ణయం. అందుకే దానిని తీసుకునేందుకు ఆలస్యమైంది. నేను మొదటి నుంచి ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లనే ఎంచుకోవాలని భావిస్తూ వచ్చాను. ఎందుకంటే వీరిలో ఇద్దరికి డేవిస్కప్లో ఆడిన అనుభవం లేదు. అందుకే ఇద్దరు డబుల్స్ స్పెషలిస్ట్లను తీసుకునే సాహసం చేయలేకపోయాను. అయితే టాప్–5లో ఉంటే తప్ప డబుల్స్ స్పెషలిస్ట్లు అనేదానిని నేను నమ్మను’ అని భూపతి వివరించారు. పేస్ బుధవారమే నగరానికి వచ్చాడని, అతనితో పోలిస్తే గత ఆదివారంనుంచి కలిసి సాధన చేస్తున్న రోహన్, బాలాజీలకే మంచి విజయావకాశాలు ఉంటాయని భూపతి అభిప్రాయ పడ్డారు. పేస్ కాస్త ముందుగా వచ్చి ఉంటే తమ ఆలోచనలో కూడా మార్పు ఉండేదేమోనన్న మహేశ్... ఈ మ్యాచ్కు దూరమైనంత మాత్రాన పేస్ కెరీర్ ముగిసినట్లు కాదని అన్నారు. ఇందుకా నన్ను పిలిచింది! డేవిస్ కప్ జట్టునుంచి తనను తొలగించడం పట్ల లియాండర్ పేస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను కావాలని తప్పించేందుకే అర్హతా ప్రమాణాలను ఇష్టారాజ్యంగా మార్చుకున్నారని అతను విమర్శించాడు. తనకు, భూపతికి మధ్య ఉన్న విభేదాలే అందుకు కారణం కావచ్చని పేస్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ‘జట్టు ఎంపిక ఒకసారేమో ర్యాంకింగ్స్ ప్రకారం జరుగుతుంది. మరోసారి వారి ఇష్టాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతుంది. కొన్ని సార్లు వ్యక్తిగతంగా కాకుండా ఎడమ వైపు కోర్టులో ఎవరు ఆడతారు, కుడి వైపు కోర్టులో ఎవరు ఆడతారు అనేదానిపై చర్చించి నిర్ణయిస్తారు. ఇప్పుడేమో ఫామ్ను బట్టి తీసుకుంటారు. ఫామ్ మాటకొస్తే ఎవరు బాగా ఆడుతున్నారో అందరికీ తెలుసు’ అని పేస్ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. గత వారమే పేస్ లియోన్లో జరిగిన మెక్సికో చాలెంజర్ టైటిల్ను గెలిచాడు. కొందరు ఇక్కడి వాతావరణం గురించి మాట్లాడుతున్నారని, అయితే సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న లియోన్లో టోర్నీ నెగ్గిన తనకు 920 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో ఆడటంలో సమస్య ఎలా ఎదురవుతుందని పేస్ వ్యంగ్యంగా అన్నాడు. కేవలం దేశంపై ప్రేమతో తాను సుదీర్ఘ ప్రయాణం చేసి మెక్సికోనుంచి వచ్చానని, ఇలా అవమానించకుండా ఫోన్లోనే చోటు లేదని చెప్పేస్తే సరిపోయేదని అతను చెప్పాడు. ‘పరిణామాలు ఎలా ఉన్నా దేశం పట్ల నా ప్రేమ షరతులు లేనిది. అందుకే ఇంత దూరం వచ్చాను. ఒక ఫోన్ చేసి నేను కావాలా వద్దా అని చెబితే ఇంత రచ్చ జరగకపోయేది కదా. అయితే నేను మున్ముందు ఇంకా ఎక్కువగా శ్రమిస్తాను. మళ్లీ భారత్ తరఫున డేవిస్ కప్ ఆడతాననే నమ్మకముంది’ అని పేస్ ఉద్వేగంగా చెప్పాడు. నేడు ఎవరితో ఎవరు? రామ్కుమార్& తేమూర్ ఇస్మయిలోవ్ (తొలి సింగిల్స్) ప్రజ్నేశ్ గుణేశ్వరన్& ఫైజీవ్ (రెండో సింగిల్స్) -
డబుల్స్ జోడీపై నిర్ణయం తీసుకోలేదు
డేవిస్ కప్ కెప్టెన్ మహేశ్ భూపతి బెంగళూరు: ఉజ్బెకిస్తాన్తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్లో భారత డబుల్స్ జోడీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తెలిపారు. ఆసియా ఓషియానియా జోన్ గ్రూప్–1 రెండో రౌండ్ మ్యాచ్ ఈనెల 7 నుంచి 9 వరకు జరగనుంది. అయితే జట్టు తరఫున నలుగురు సింగిల్స్ ఆటగాళ్లను భూపతి ఎంచుకోవడంతో డబుల్స్ జోడీపై ఆసక్తి పెరిగింది. లియాండర్ పేస్, రోహన్ బోపన్నలను రిజర్వ్లుగా ఉంచారు. ‘విజయాలతో మూడు పాయింట్లు ఎలా సాధించాలనే దానిపైనే మా దృష్టి ఉంది. ఏ ఒక్క మ్యాచ్ గురించో ఆలోచించడం సరికాదు. చాలా రోజులుగా డబుల్స్ మ్యాచ్ గురించే చాలా మంది మాట్లాడుతున్నారు. మరో రెండు రోజుల దాకా స్పష్టత రాదు’ అని భూపతి తేల్చారు. అయితే యూకీ బాంబ్రీ గాయం కారణంగా దూరం కావడంతో పేస్, బోపన్నలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇస్టోమిన్ దూరం: మరోవైపు ఉజ్బెకిస్తాన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ 71వ ర్యాంకర్ డెనిస్ ఇస్టోమిన్ గాయం కారణంగా భారత్తో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఎడమ పాదంలో గాయమవడంతో అతను రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఉజ్బెకిస్తాన్ కెప్టెన్ పీటర్ లెబెడ్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్లో శ్యామ్ న్యూఢిల్లీ: థాయ్లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో థాయ్లాండ్ బాక్సర్ థాని నరీన్రామ్పై శ్యామ్ గెలుపొందాడు. శ్యామ్తోపాటు మనోజ్ కుమార్ (69 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. అయితే వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు), దేవేంద్రో సింగ్ (52 కేజీలు)తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
వరుసగా 26వ ఏడాది... పేస్ ఖాతాలో మరో టైటిల్
లియోన్ (మెక్సికో): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొంత విరామం తర్వాత మరో టైటిల్ను గెలుచుకున్నాడు. ఇక్కడ జరిగిన లియోన్ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్ను పేస్ చేజిక్కించుకున్నాడు. తాజా విజయంతో గత 26 ఏళ్లుగా పేస్ ప్రతీ సంవత్సరం ఏటీపీ సర్క్యూట్లో కనీసం ఒక టైటిల్ను సొంతం చేసుకున్నట్లయింది. ఫైనల్లో పేస్–ఆదిల్ షమస్దీన్ (కెనడా) జోడీ 6–1, 6–4తో ల్యూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)–కారో జంపీరీ (బ్రెజిల్) జంటను చిత్తు చేసింది. పేస్ కెరీర్లో ఇది 20వ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ కాగా... ఈ సీజన్లో మొదటిది. 2017లో దుబాయ్ చాంపియన్షిప్, డెల్రే బీచ్ ఓపెన్లలో సెమీస్ వరకు చేరిన పేస్... ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచాడు. టైటిల్ నెగ్గిన పేస్–షమస్దీన్ జోడీకి 4,650 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పేస్ జోడిదే టైటిల్
లియోన్(మెక్సిక్) భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ ఈ సీజన్ లో తొలి టైటిల్ ను సాధించాడు. లియాన్ ఛాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ఆదిలో శంషుద్దీన్(కెనడా)తో కలిసి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో 6-1, 6-4 తేడాతో లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)–కారో జాంపియిరి (బ్రెజిల్) జంటపై పేస్ ద్వయం గెలిచింది. ఏకపక్షంగా సాగిన పోరులో లియాండర్-ఆదిల్లు ఆద్యంత ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జోడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టైటిల్ ను గెలుచుకున్నారు. ఇది పేస్ కెరీర్లో 20వ ఏటీపీ ఛాలెంజర్ టైటిల్ కాగా, గత 26 ఏళ్ల నుంచి ప్రతీ ఏడాది కనీసం ఒక్క టైటిల్ ను అయినా గెలిచే ఆటగాళ్ల అరుదైన జాబితాలో పేస్ చేరిపోయాడు. -
తుది పోరుకు పేస్ జోడీ
లియోన్ (మెక్సికో): భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ ఈ ఏడాది తొలి టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ఆదిల్ శంషుద్దీన్ (కెనడా)తో కలిసి పేస్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో మూడో సీడ్ పేస్–ఆదిల్ జంట 6–7 (1/7), 6–4, 10–5తో లూక్ సవిల్లీ–జాన్ పాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. ఫైనల్లో లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)–కారో జాంపియిరి (బ్రెజిల్) జంటతో పేస్ ద్వయం తలపడుతుంది. -
రిజర్వ్ సభ్యులుగా పేస్, బోపన్న
తుది జట్టులో నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లే: భూపతి న్యూఢిల్లీ: డేవిస్ కప్ కోసం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి నొప్పింపక... తానొవ్వక పద్ధతిని అవలంభించాడు. లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ ఇద్దరు డబుల్స్ ఆటగాళ్లలో ఒకరికి తీపి, మరొకరికి చేదు పంచలేక ఆ ఇద్దరినీ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంచుకున్నాడు. తుది జట్టు కోసం అతను పూర్తిగా నలుగురు సింగిల్స్ ఆటగాళ్లనే తీసుకున్నాడు. ప్రస్తుతానికైతే రామ్కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్నేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీలు తుది జట్టు సభ్యులని భూపతి ప్రకటించాడు. ఒకవేళ అప్పటి అవసరానికి అనుగుణంగా డబుల్స్ కోసం బోపన్న, పేస్లలో ఒకరిని తీసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ తప్పకుండా తీసుకుంటామని మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆ అవకాశముంటుం దని బదులిచ్చాడు. డేవిస్కప్ ఆసియా ఓసియానియా పోరులో భాగంగా భారత్ వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్తో తలపడనుంది. ప్రస్తుతం డేవిస్ కప్లో రికార్డు డబుల్స్ విజయాలపై కన్నేసిన పేస్ తనకా అవకాశం వస్తుందో రాదో తెలుసుకునేందుకు ఇంకొంత కాలం నిరీక్షించక తప్పదేమో! 42 విజయాలతో పేస్, నికోలా పీట్రాంజెలి (ఇటలీ) రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. -
లియాండర్ పేస్ భవితవ్యం తేలేది నేడే...
డేవిస్కప్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్గా గుర్తింపు పొందడానికి లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధించేందుకు పేస్కు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది నేడు తేలిపోనుంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఉజ్బెకిస్తాన్తో బెంగళూరులో జరిగే ఆసియా ఓసియానియా పోటీలో భారత్ తలపడనుంది. నలుగురు సభ్యులతో కూడిన తుది జట్టును మంగళవారం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించనున్నారు. ఒకే డబుల్స్ స్పెషలిస్ట్ను ఎంపిక చేస్తే మాత్రం రోహన్ బోపన్న లేదా పేస్లలో ఒకరికే తుది జట్టులో స్థానం లభిస్తుంది. -
పేస్ పయనమెటు?
►వెంటాడుతున్న వరుస వైఫల్యాలు ►రెండేళ్లుగా లేని ఏటీపీ డబుల్స్ టైటిల్ సాక్షి క్రీడావిభాగం వరుసగా ఏడు ఒలింపిక్స్లలో పాల్గొన్న ఏకైక టెన్నిస్ క్రీడాకారుడు... మరో విజయం సాధిస్తే డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ మ్యాచ్ల్లో గెలిచిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు... నాలుగు పదుల వయసు దాటినా ఏమాత్రం తగ్గని ఉత్సాహం... 18 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్... 27 ఏళ్లుగా అలుపెరుగని ఆట... 114 మంది భాగస్వాములతో కలిసి బరిలోకి... ఇలాంటి ఎన్నో ఘనతలు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సొంతం. కానీ కొన్నాళ్లుగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూ ట్లో పేస్కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. కొత్త కొత్త భాగస్వాములతో కలిసి టోర్నీలలో ఆడుతున్నా టైటిల్స్ మాత్రం దక్కడంలేదు. ఒకానొక సమయంలో పేస్ ఆటకు గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చినా... వాటిని అతను ఖండిస్తూ, తనలో ఆటపట్ల ఆసక్తి ఉన్నంత కాలం టెన్నిస్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 43 ఏళ్ల వయస్సులోనూ ఫిట్నెస్ సమస్యలు లేకుండా ఆడుతున్న పేస్ ఏటీపీ సర్క్యూట్లో టైటిల్ సాధించి రెండేళ్లు దాటిపోయింది. చివరిసారి అతను 2015 జనవరిలో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఆక్లాండ్ ఓపెన్లో టైటిల్ సాధించాడు. అదే ఏడాది మరో రెండు టోర్నీల్లో, గత సంవత్సరం మరో రెండు టోర్నీల్లో ఫైనల్కు చేరుకున్నా పేస్ ఖాతాలో మాత్రం టైటిల్ చేరలేదు. ఈ ఏడాది ఆరు టోర్నీల్లో ఆడిన పేస్... నాలుగింటిలో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. దుబాయ్ ఓపెన్, డెల్రే బీచ్ ఓపెన్ టోర్నీలలో మాత్రం సెమీఫైనల్కు చేరుకున్నాడు. అవకాశం దక్కేనా... డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. 42 విజయాలతో నికోలా పిట్రాంగెలి (ఇటలీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పేస్ సమం చేశాడు. గత నెలలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ సందర్భగా పేస్కు ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చినా... విష్ణువర్ధన్తో జతకట్టిన అతనికి విజయం దక్కలేదు. దాంతో ప్రపంచ రికార్డుకు పేస్ వచ్చే నెలదాకా వేచి చూడాలి. ఉజ్బెకిస్తాన్తో జరిగే మ్యాచ్లో పాల్గొనే భారత జట్టులో పేస్ ఉంటాడా లేదా అనే అనుమానం కలిగినా సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. ఆరుగురు సభ్యులతో కూడిన జట్టులో డబుల్స్ స్పెషలిస్ట్లుగా పేస్తోపాటు రోహన్ బోపన్నకు స్థానం కల్పించారు. కానీ నలుగురు సభ్యులు ఉండే తుది జట్టును ఎంపిక చేసే అధికారాన్ని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి ఇచ్చారు. తుది జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు, ఒక డబుల్స్ ప్లేయర్ ఉంటారని మహేశ్ భూపతి ప్రకటించడంతో... పేస్, బోపన్నలలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశముంది. పేస్తో కలిసి డబుల్స్లో ఆడటం ఇష్టం లేదని రియో ఒలింపిక్స్ సందర్భంగా బోపన్న ప్రకటించడం వివాదాస్పదమైంది. భారత టెన్నిస్ సంఘం జోక్యం చేసుకొని వీరిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చినా రియో ఒలింపిక్స్లో పేస్–బోపన్న జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఉజ్బెకిస్తాన్తో జరిగే మ్యాచ్లో పాల్గొనే తుది జట్టును ఈ నెలాఖర్లో మహేశ్ భూపతి ప్రకటించే అవకాశముంది. తాను ప్రపంచ రికార్డును అందుకోవాలంటే పేస్కు బోపన్నలాంటి అనుభవజ్ఞుడైన భాగస్వామి అవసరం. ఒకవేళ పేస్ను కాదని బోపన్నను భూపతి ఎంపిక చేసుకుంటే మరోసారి భారత టెన్నిస్లో వివాదం రాజుకోవడం ఖాయం. డేవిస్ కప్ పోటీలకు తాను అందుబాటులో ఉంటానని ప్రకటించాక పేస్కు తుది జట్టులో స్థానం దక్కని దాఖలాలు లేవు. ఒకవేళ పేస్కు స్థానం లభించకపోతే ఈ టెన్నిస్ దిగ్గజం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి. తొలి రౌండ్లోనే పరాజయం ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో డెల్పొట్రో (అర్జెంటీనా)తో జతకట్టిన పేస్కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ‘వైల్డ్ కార్డు’తో ఆడిన పేస్–డెల్పొట్రో జంట ఆదివారం జరిగిన తొలి రౌండ్లో 3–6, 4–6తో సామ్ క్వెరీ (అమెరికా)–గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) జోడీ చేతిలో ఓడిపోయింది. రెండు సెట్లలో ఒక్కోసారి పేస్ ద్వయం తమ సర్వీస్ను కోల్పోయింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా పేస్–డెల్పొట్రో సద్వినియోగం చేసుకోలేకపోయారు. -
పేస్కు చోటు లభించింది కానీ...
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టులో సీనియర్, దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్కు చోటు దక్కింది. అయితే మ్యాచ్లో బరిలోకి దిగే విషయాన్ని మాత్రం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి అప్పగించారు ‘ఐటా’ సెలక్టర్లు. సోమవారం సమావేశమైన ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ ఆరుగురితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు సింగిల్స్ ఆటగాళ్లున్నారు. రామ్కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్ఞేశ్ గున్నెశ్వరన్, శ్రీరామ్ బాలాజీలను సింగిల్స్ కోసం ఎంపిక చేయగా... రోహన్ బోపన్న, లియాండర్ పేస్ డబుల్స్ ఆటగాళ్లు. అయితే బరిలోకి దిగే నలుగురిని కెప్టెన్ మహేశ్ భూపతి నిర్ణయిస్తారని ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ తెలిపారు. ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోరులో భాగంగా భారత్... ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. బెంగళూరులో వచ్చే నెల 7 నుంచి ఈ మ్యాచ్లు జరుగుతాయి. దీనికి సరిగ్గా పది రోజుల ముందు తుది నలుగురు ఆటగాళ్లను భూపతి ఎంపిక చేసుకుంటాడని ఛటర్జీ పేర్కొన్నారు. మరో విజయం సాధిస్తే పేస్ డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. -
పేస్ స్థానం పదిలమేనా?
భారత డేవిస్కప్ జట్టు ఎంపిక నేడు ఉజ్బెకిస్తాన్తో ఏప్రిల్లో పోరు న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులో లియాండర్ పేస్ కొనసాగేది లేనిది నేడు తేలనుంది. సోమవారం సమావేశమయ్యే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆసియా ఓసియానియా జోన్లో భాగంగా ఉజ్బెకిస్తాన్తో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు భారత్ తలపడనుంది. డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ప్రపంచ రికార్డుకు పేస్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన పోరులో విష్ణువర్ధన్తో జతకట్టిన పేస్కు పరాజయం ఎదురైంది. దాంతో అతను ఉజ్బెకిస్తాన్తో జరిగే పోటీలో మరోసారి ప్రపంచ రికార్డుపై గురి పెట్టనున్నాడు. అయితే పేస్ను ఎంపిక చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. సింగిల్స్లో ఫామ్లో ఉన్న యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్ల బెర్త్లకు ఢోకా లేదు. సుమిత్ నాగల్ గాయంతో సెలక్షన్స్కు దూరం కాగా... హైదరాబాద్ యువ ఆటగాడు సాకేత్ మైనేని ఎంపికపై సందిగ్ధత నెలకొంది. సింగిల్స్, డబుల్స్ ఆడగల సాకేత్ ఇప్పుడు ఫిట్నెస్తో ఉన్నప్పటికీ... సెలక్టర్ల చూపు స్పెషలిస్ట్ ఆటగాళ్లపై ఉంది. అంటే ముగ్గురు స్పెషలిస్ట్ సింగిల్స్ ఆటగాళ్లని తీసుకోవాలా లేక ఇద్దరు స్పెషలిస్ట్ డబుల్స్ ఆటగాళ్లతో సరిపెట్టాలా అన్న అంశాన్ని సెలక్షన్ కమిటీ తేల్చుకోలేకపోతోంది. సీనియారిటీని పక్కన బెట్టి ర్యాంకింగ్నే పరిగణనలోకి తీసుకుంటే బోపన్న (24)కు జతగా పేస్ (62వ ర్యాంకు)ను కాదని దివిజ్ శరణ్ (54), పురవ్ రాజా (56)ల్లో ఒకరికి చోటు దక్కొచ్చు. సింగిల్స్లో ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ మూడో బెర్తు కోసం పోటీపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శనకే ఓటేసే అవకాశముంది. ఉజ్బెకిస్తాన్ మ్యాచ్తో భారత జట్టుకు మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
పేస్ జోడీపై బోపన్న జంట పైచేయి
దుబాయ్ ఓపెన్లో ఫైనల్లోకి దుబాయ్: కొత్త ఏడాదిలోనూ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గత సంవత్సరం ఒక్క డబుల్స్ టోర్నీ టైటిల్ నెగ్గలేకపోయిన 43 ఏళ్ల పేస్... ఈ ఏడాది తాను పాల్గొన్న ఆరో టోర్నమెంట్లోనూ ఫైనల్కు చేరలేకపోయాడు. స్పెయిన్కు చెందిన గిలెర్మో గార్సియా లోపెజ్తో జతగా దుబాయ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన పేస్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. భారత్కే చెందిన మరో అగ్రశ్రేణి ఆటగాడు, 36 ఏళ్ల రోహన్ బోపన్న తన భాగస్వామి మార్సిన్ మట్కోవ్స్కీ (పోలాండ్)తో కలిసి పేస్–లోపెజ్ జంటపై విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో బోపన్న–మట్కోవ్స్కీ ద్వయం 6–3, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో పేస్–లోపెజ్ జోడీని ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట ఏడు ఏస్లు సంధించింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో బోపన్న–మట్కోవ్స్కీ జోడీ 2–4తో వెనుకబడ్డా ఆ వెంటనే తేరుకొని తుదకు 10–6తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా); జులియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హŸరియా టెకావ్ (రొమేనియా) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో శనివారం జరిగే ఫైనల్లో బోపన్న ద్వయం తలపడుతుంది. -
సెమీఫైనల్లో పేస్ జోడీ
దుబాయ్: భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు లియాండర్ పేస్ దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పేస్–గార్షియల్ లోపెజ్ (స్పెయిన్) ద్వయం 7–6(3), 7–6(6) స్కోరుతో డానియెల్ నెస్టర్ (కెనడా)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై గెలుపొందింది. ఈ మ్యాచ్ గంటా 50 నిమిషాలపాటు సాగింది. సెమీ ఫైనల్లో బోపన్న –మార్సిన్ జోడీతో పేస్ జంట తలపడుతుంది. ఫెడరర్కు షాక్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి జోరుమీదున్న రోజర్ ఫెడరర్కు ఇదే టోర్నీ సింగిల్స్ విభాగంలో షాక్ తగిలింది. రష్యన్ క్వాలిఫయర్ సంచలన ప్రదర్శనతో ఫెడరర్ను ఓడించాడు. రెండో రౌండ్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–7 (7/9), 6–7 (5/8)తో ప్రపంచ 116వ ర్యాంకర్ ఎవ్గెని డన్స్కొయ్ చేతిలో పరాజయం చవిచూశాడు. -
పేస్ జంట పరాజయం
న్యూఢిల్లీ: డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) జంట పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–యెన్ సున్ లూ ద్వయం 2–6, 1–6తో మూడో సీడ్ ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)–మాక్స్ మిర్నీ (బెలారస్) జోడీ చేతిలో ఓడిపోయింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్ జంట తమ సర్వీస్ను నాలుగు సార్లు కోల్పోయింది. క్వార్టర్స్లో బ్రయాన్ బ్రదర్స్పై ‘సూపర్ టైబ్రేక్’లో సంచలన విజయం సాధించిన పేస్–యెన్ సున్ లూ ద్వయం అదే జోరును సెమీఫైనల్లో కనబర్చలేకపోయింది. -
డబుల్స్లో పేస్కు నిరాశ
కివీస్ జంట చేతిలో భారత జోడీ ఓటమి పుణే: భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ ప్రపంచ రికార్డుకు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరులో విష్ణువర్ధన్తో జతకట్టిన పేస్ జోడీకి అర్టెమ్ సితక్–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో పరాజయం ఎదురైంది. దీంతో డేవిస్ కప్ చరిత్రలో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాల (43)తో రికార్డు సృష్టించాలనుకున్న పేస్కు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఇటలీకి చెందిన నికోలా (42)తో సమంగా నిలిచిన భారత సీనియర్ స్టార్కు రెండు నెలలపాటు నిరీక్షణ తప్పదేమో! శనివారం ఇక్కడి శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన డబుల్స్ మ్యాచ్లో పేస్ జంట 6–3, 3–6, 6–7 (6/8), 3–6తో న్యూజిలాండ్ జంట చేతిలో పోరాడి ఓడింది. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ కేవలం తొలి సెట్ మాత్రమే నెగ్గింది. తదుపరి సెట్లలో కివీస్ జంట ధాటికి చేతులెత్తేసింది. తాజా పరాజయంతో భారత్ ఆధిక్యం 2–1కు తగ్గింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్ల్లో భారత కుర్రాళ్లు యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ విజయానికి రివర్స్ సింగిల్స్ కీలకమయ్యాయి. నేడు (ఆదివారం) జరిగే రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్కటైనా గెలిస్తే భారత్ ముందంజ వేస్తుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం పేస్ మాట్లాడుతూ కీలకమైన సమయంలో తమకు లభించిన బ్రేక్ పాయింట్ అవకాశాల్ని చేజార్చుకోవడం వల్లే మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. సరైన సన్నాహకాలు లేకపోయినా విష్ణువర్ధన్ ఆటతీరు అద్భుతంగా ఉందని పేస్ కితాబిచ్చాడు. -
పేస్... ఆ ఘనత సాధిస్తాడా..!
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో టెన్నిస్ దిగ్గజం పేస్కు జోడిగా విష్ణువర్ధన్ గాయంతో సాకేత్ దూరం నేటి నుంచి న్యూజిలాండ్తో డేవిస్ కప్ మ్యాచ్ పుణే: భారత టెన్నిస్ జట్టు నేటి (శుక్రవారం) నుంచి న్యూజిలాండ్తో జరిగే డేవిస్కప్ (ఆసియా/ఓసియానియా గ్రూప్ 1) మ్యాచ్ బరిలోకి దిగనుంది. దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్కు ఈ పోరు ద్వారా అరుదైన అవకాశం ముంగిట నిలిచింది. సుదీర్ఘకాలంగా టెన్నిస్లో కొనసాగుతున్న ఈ అలుపెరగని వీరుడు ప్రపంచ రికార్డుకు మరో అడుగు దూరంలోనే ఉన్నాడు. శనివారం జరిగే డబుల్స్లో 43 ఏళ్ల పేస్ గెలిస్తే డేవిస్ కప్లో అత్యధిక డబుల్స్ మ్యాచ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం అతను 42 డబుల్స్ విజయాలతో నికోలా పిట్రాంగెలి (ఇటలీ)తో సమంగా ఉన్నాడు. 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు దక్కించుకున్న పేస్కు ఇది 55వ డేవిస్ కప్ మ్యాచ్ కావడం విశేషం. ఇక ఈ గ్రూప్ 1 టైలో గెలిచిన జట్టు ఉజ్బెకిస్తాన్, కొరియా జట్ల మధ్య జరిగే విజేతతో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరిగే రెండో రౌండ్లో తలపడుతుంది. మరోవైపు చివరి నిమిషంలో పేస్ డబుల్స్ జోడిలో మార్పు జరిగింది. గత నెలలో చెన్నై ఓపెన్లో గాయపడిన సాకేత్ మైనేని ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో హైదరాబాదీ విష్ణువర్ధన్కు చోటు లభించింది. విష్ణుతో కలిసి గతంలో పేస్ లండన్ ఒలింపిక్స్లో బరిలోకి దిగాడు. రెండో రోజు శనివారం వీరిద్దరు అర్టెమ్ సిటాక్, మైకేల్ వీనస్ను ఎదుర్కొంటారు. అయితే రోహన్ బోపన్నతో మాట్లాడిన అనంతరం విష్ణు ఎంపిక జరిగిందని డ్రా విడుదల చేసిన అనంతరం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్రాజ్ తెలిపారు. ‘అదృష్టవశాత్తు విష్ణు హైదరాబాద్లో ఉండడంతో మా పని సులువైంది. కజకిస్తాన్లో జరిగే టోర్నీకి వెళ్లేందేకు అతడికి వీసా లభించలేదు’ అని అమృత్రాజ్ అన్నారు. డేవిస్కప్ గురించి మొదట పేస్, ఆ తర్వాత జీషన్ అలీ నుంచి ఫోన్లు వచ్చాయని విష్ణు చెప్పాడు. ఫ్యూచర్స్, ఐటీఎఫ్ ఈవెంట్స్ ఉన్నా దేశం కోసం ఆడటం తొలి ప్రాధాన్యతగా భావించి అంగీకరించినట్టు తెలిపాడు. భారత్దే పైచేయి కివీస్ ఆటగాళ్ల ర్యాకింగ్స్తో పోలిస్తే భారత ఆటగాళ్లు మెరుగైన స్థితిలో ఉండటంతో మన జట్టు ఫేవరెట్గా కనిపిస్తోంది. అలాగే సొంత గడ్డపై ఆడనుండటం భారత్కు కలిసొచ్చే అంశం. కివీస్పై భారత్ ఇప్పటికే 5–3 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆ మూడు పరాజయాలు కూడా 1970 దశకంలో ఎదురైనవే. 1978 నుంచి భారత్ ఇప్పటివరకు ఈ జట్టుపై ఓడింది లేదు. నేడు జరిగే తొలి మ్యాచ్లో యువ ఆటగాడు యూకీ బాంబ్రీ సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ 368 ర్యాంకర్ బాంబ్రీ కివీస్ నంబర్వన్ ఆటగాడు ఫిన్ టియర్నీని ఎదుర్కోనున్నాడు. రెండో సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్.. జోస్ స్టాథమ్తో ఆడతాడు. మ్యాచ్లు మధ్యాహ్నం ప్రారంభమై రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో కొనసాగుతాయి. ‘వారి డబుల్స్ టీమ్ పటిష్టంగా ఉంది. అలాగని వారితో సింగిల్స్ మ్యాచ్లను మేం తేలిగ్గా తీసుకోం. చివరిసారి మేం వారితో ఆడినప్పుడు అలాగే భావించి 1–2తో వెనకబడ్డాం. ఇక పేస్ రిటైర్మెంట్ అనేది పూర్తిగా అతడి వ్యక్తిగత విషయం. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది తనే’ అని అమృత్రాజ్ తేల్చారు. 2012లో కివీస్ను భారత్ 5–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆ మ్యాచ్లో పేస్ ఆడలేదు. దేశం కోసం ఆడుతున్నప్పుడు నా సర్వశక్తిని ధారపోస్తాను. 1990లో నా తొలి డేవిస్ కప్ను ప్రస్తుత కోచ్ జీషన్ అలీతో కలిసి ఆడాను. అప్పటి నుంచి 27 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాను. ఎందుకంటే నేను నా దేశ ప్రజల కోసం, దేశం కోసం, జట్టు కోసం ఆడడాన్ని ఆస్వాదిస్తాను. నా వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలుపే ముఖ్యం. సాకేత్ను దురదృష్టం వెంటాడింది. ఇలాంటి పెద్ద టోర్నీలో గాయం కారణంగా దూరం కావాలని ఏ ఆటగాడూ కోరుకోడు. టోర్నీకి ఒకరోజు ముందే విషయం తెలిసినా విష్ణు ఇందులో ఆడేందుకు అంగీకరించడం గొప్ప విషయం. అతడి అంకితభావానికి ఇది నిదర్శనం. – లియాండర్ పేస్ -
పేస్ జంట పరాజయం
చెన్నై: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు కొత్త ఏడాది కూడా కలసిరాలేదు. చెన్నై ఓపెన్లో కొత్త భాగస్వామి ఆండ్రీ సా (బ్రెజిల్)తో కలసి బరిలోకి దిగిన పేస్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జంట 6–4, 6–4తో పేస్–ఆండ్రీ సా ద్వయంపై సంచలన విజయం సాధిం చింది. ఇతర తొలి రౌండ్ డబుల్స్ మ్యాచ్ల్లో సాకేత్–రామ్కుమార్ (భారత్) జోడీ 4–6, 6–0, 5–10తో డార్సిస్ (బెల్జియం)–పెయిర్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోగా... బోపన్న–జీవన్ (భారత్) జోడీ 6–4, 6–4తో మార్సెలో (బ్రెజిల్)– మెక్టిక్ (క్రొయేషియా) ద్వయంపై గెలిచింది. -
'మహేశ్ భూపతికి అర్హత ఉంది'
చెన్నై: భారత టెన్నిస్కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే మహేశ్ భూపతిని భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ నియమించడాన్ని లియాండర్ పేస్ సమర్ధించాడు. భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా చేసే అన్ని అర్హతలూ భూపతికి ఉన్నాయని పేర్కొన్నాడు. దాంతో పాటు తన వీడ్కోలుపై కూడా సూచాయగా కొన్ని విషయాలను పేస్ వెల్లడించాడు. 'నేను ప్రస్తుతం సరదాగా కోసం ఆడుతున్నాను. నేను గేమ్ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఇంకా ఆడుతున్నా. నేను వీడ్కోలు తీసుకునే నిర్ణయం తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో అందరికీ చెప్పే టెన్నిస్ జీవితం నుంచి వైదొలుగుతా. మీరంతా నన్ను 20 ఏళ్లుగా అభిమానిస్తున్నారు. రాబోవు కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. డేవిస్ కప్ కెప్టెన్గా చేసే అన్ని అర్హతలు మహేశ్ భూపతికి ఉన్నాయి. డేవిస్ కప్ కు భూపతికి ఎందుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ చేయకూడదు' అని భూపతి పేర్కొన్నాడు. -
భూపతిని ఎప్పటికీ గౌరవిస్తా: పేస్
ముంబై: భారత టెన్నిస్కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే తన ఒకనాటి మిత్రుని గురించి పేస్ పెదవి విప్పాడు. తామిద్దరి మనస్తత్వాలు విభిన్నమని, భూపతిపై తనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశాడు. ‘నేను, భూపతి భిన్న ధృవాలం. ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నాం. మా ఇద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అంటే చెప్పలేను. ఎందుకంటే ఇద్దరిదీ తప్పు ఉండొచ్చు.. ఇద్దరిదీ కరెక్టే అయి ఉండొచ్చు. ఆటలోనూ ఎవరి శైలి వారిదే. కానీ మా ఇద్దరి మధ్య గౌరవం ఉంది. వ్యక్తిగతంగా మేమెంతో సాధించాం. అది ఎక్కడికీ పోదు. నేను అతడితో కలిసి సాధించిన విజయాల కారణంగా భూపతిని కచ్చితంగా గౌరవిస్తాను’ అని ‘ఒలింపిక్ పతకం ఎలా గెలవాలి?’ అనే కార్యక్రమంలో పాల్గొన్న పేస్ తెలిపాడు. పేస్, భూపతి కలిసి గతంలో మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచారు. -
కొత్త భాగస్వామి కోసం అన్వేషణ: పేస్
పుణే: తన కెరీర్లో 20 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నానని... వచ్చే ఏడాది దీనిని సాకారం చేసుకునేందుకు కొత్త భాగస్వామి కోసం అన్వేషణ చేస్తున్నానని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. ఇప్పటికే కెరీర్లో 18 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్ను సొంతం చేసుకున్న పేస్కు ఈ ఏడాది అంతగా కలసిరాలేదు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అతను ఏటీపీ సర్కూ ్యట్లో ఒక్క టైటిల్నూ గెలవలేదు. చాలెంజర్ స్థారుులో మాత్రం రెండు టైటిల్స్ సాధించాడు. పుణే ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత్కే చెందిన రామ్కుమార్తో బరిలోకి దిగిన పేస్ తొలి రౌండ్లో గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. 1991లో ప్రొఫెషనల్గా మారిన పేస్ ఇప్పటివరకు పురుషుల డబుల్స్లో 110 మంది భాగస్వాములతో... మిక్స్డ్ డబుల్స్లో 24 మంది భాగస్వాములతో కలిసి ఆడాడు. -
19 ఏళ్ల తర్వాత...
పుణే: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు మొదలయ్యే కేపీఐటీ-ఎంఎస్ఎల్టీఏ చాలెంజర్ ఈవెంట్ డబుల్స్ పోటీల్లో బరిలోకి దిగనున్నాడు. భారత గడ్డపై ఓ ఏటీపీ చాలెంజర్ ఈవెంట్లో పాల్గొనడం 19 ఏళ్ల అనంతరం పేస్కిదే తొలిసారి కావడం గమనార్హం. -
రన్నరప్గా పేస్ జోడి
తాష్కెంట్:ఈ సీజన్ లో తొలి ఏటీపీ టైటిల్ సాధించాలనుకున్న భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ కు నిరాశే ఎదురైంది. తాష్కెంట్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో భాగంగా పురుషుల డబుల్స్ లో పేస్-ఆండ్రీ బెగెమాన్ జంట ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన తుదిపోరులో పేస్ ద్వయం 4-6, 2-6 తేడాతో ఎల్గిన్-ఇస్టోమిన్ జోడి చేతిలో పరాజయం చెందింది. దాంతో ఈ సీజన్ మూడో ప్రయత్నంలో కూడా టైటిల్ సాధించాలనుకున్న పేస్ కల తీరలేదు. అంతకుముందు విన్సాటాన్-సలేమ్, సెయింట్ పీటర్స్ బర్గ్ ఏటీపీ టోర్నీల్లో కూడా పేస్ జంట ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. -
ఫైనల్లో పేస్ జోడి
తాష్కెంట్: భారత టెన్నిస్ వెటరన్ లియాండర్ పేస్ ఈ సీజన్లో మూడో ఏటీపీ చాలెంజర్ టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచాడు. గురువారం తాష్కెంట్ చాలెంజర్ టోర్నీ డబుల్స్ సెమీస్లో మూడో సీడ్ పేస్, ఆండ్రీ బెగెమాన్ (జర్మనీ) జోడి 6-2, 6-0 తేడాతో సంజార్, జురాబెక్ (తాష్కెంట్)లపై గెలిచింది. కేవలం 41 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ను నెగ్గిన పేస్ జంట ఇప్పటికే బియెల్లా ఈవెంట్ నెగ్గగా తన మరో సహచరుడితో పేస్ బుసాన్ టోర్నీ టైటిల్ను అందుకున్నాడు. -
పేస్, బోపన్నలకు నిరాశ
బీజింగ్: చైనా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీలకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. లియాండర్ పేస్-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) ద్వయం 6-3, 5-7, 7-10తో జాక్ సాక్ (అమెరికా)-టామిక్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో... బోపన్న-నెస్టర్ (కెనడా) జంట 6-7 (3/7), 4-6తో నాదల్-బుస్టా (స్పెరుున్) ద్వయం చేతిలో ఓడింది. -
పేస్ జంటకు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ: తన కెరీర్లో 56వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు మరోసారి నిరాశ ఎదురైంది. గత నెలలో విన్స్టన్ సాలెమ్ ఓపెన్లో నాలుగు మ్యాచ్ పాయింట్లను వదులుకొని రన్నరప్గా నిలిచిన పేస్... తాజాగా సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్లో ఒక మ్యాచ్ పాయింట్ వదులుకొని మళ్లీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. జర్మనీకి చెందిన తన భాగస్వామి ఆండ్రీ బెగెమన్తో బరిలోకి దిగిన పేస్కు ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో 6-4, 3-6, 10-12తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్) చేతిలో ఓటమి ఎదురైంది. గంటా 19 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి సెట్ను దక్కించుకున్న పేస్-బెగెమన్ జంట రెండో సెట్లో ఏడో గేమ్లో తమ సర్వీస్ను కోల్పోయింది. రెండో సెట్ను నెగ్గిన ఇంగ్లోట్-కొంటినెన్ నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో 8-9 వద్ద మ్యాచ్ పాయింట్ను కాపాడుకున్నారు. కీలకదశలో తప్పిదాలు చేసిన పేస్ ద్వయం చివరకు ఓటమిని మూటగట్టుకుంది. రన్నరప్ పేస్ జోడీకి 26,110 డాలర్ల (రూ. 17 లక్షల 41 వేలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 43 ఏళ్ల పేస్ 1997 నుంచి ప్రతి ఏడాదీ ఏటీపీ డబుల్స్ టోర్నమెంట్లలో కనీసం ఒక టైటిలైనా గెలుస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది మాత్రం అతను ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయాడు. రెండు టోర్నీల్లో మాత్రం టైటిల్కు చేరువై దూరమయ్యాడు. గతేడాది జనవరిలో ఆక్లాండ్ ఓపెన్లో టైటిల్ గెలిచాక పేస్ మరో టైటిల్ను సాధించలేకపోయాడు. -
ఫైనల్లో పేస్ ద్వయం
న్యూఢిల్లీ: సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) జోడీ 6-3, 7-6 (7/5)తో మిఖారుుల్ ఎల్గిన్-అలెగ్జాండర్ కుద్రయెత్సెవ్ (రష్యా) జంటను ఓడించింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్ ద్వయం ప్రత్యర్థి జంట సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. పేస్ కెరీర్లో ఇది 96వ ఫైనల్ కావడం విశేషం. -
గిట్టనివారే ఓర్వలేకపోతున్నారు
లియాండర్ పేస్ వ్యాఖ్య న్యూఢిల్లీ: కొందరు గిట్టని సహచరులే తనను అదేపనిగా విమర్శిస్తున్నారని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. ‘నా కెరీర్ ఏంటో నాకు తెలుసు, నేను సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. కానీ ఇవేవీ నేనంటే గిట్టని సహచరులకు తెలియవు. 18 గ్రాండ్స్లామ్ (డబుల్స్, మిక్స్డ్) టైటిళ్లు, ఏడుసార్లు ఒలింపిక్స్ ఆడిన ఘనత వారికి కనిపించవు. వాళ్లు పది జన్మలెత్తినా ఈ ఘనతల్ని సాధించలేరు. ఇలాంటివారు టెన్నిస్ కోర్టుల్లో చెమటోడ్చలేరు కానీ విమర్శించేందుకు మాత్రం తహతహలాడుతున్నారు’ అని పేస్ అన్నాడు. -
పేస్పై బోపన్న సెటైర్లు!
న్యూఢిల్లీ: గత రెండు ఒలింపిక్స్లకు భారత్ నుంచి సరైన మిక్స్డ్ డబుల్స్ జోడీని పంపలేదంటూ వెటరన్ ఆటగాడు లియాండర్ చేసిన వ్యాఖ్యలపై మరో ఆటగాడు రోహన్ బోపన్నపరోక్షంగా సెటైర్లు గుప్పించాడు. ఆ సదరు ఆటగాడికి ఎటువంటి పని లేకపోవడంతో మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి యత్సిస్తున్నాడంటూ విమర్శలు సంధించాడు. ఇలా వార్తల్లో నిలవడానికి సహచర ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవడడం అతనికి కొత్తమే కాదన్నాడు. అంతకుముందు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా పేస్ వ్యాఖ్యలపై మండిపడింది. లియాండర్ పేరును ప్రస్తావించకుండానే అతనొక విష పురుగు అంటూ ట్విట్టర్లో విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని సానియా పేర్కొంది. గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. రియో, గత లండన్ ఒలింపిక్స్లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. దీంతో సానియా, రోహన్ బోపన్ననల మిక్స్డ్ డబుల్స్ జోడి ఎంపికను పరోక్షంగా తప్పుబట్టాడు. At it again!! ...the usual ploy to stay in the news by slanging fellow players in media. #Patriotism — Rohan Bopanna (@rohanbopanna) 18 September 2016 -
పేస్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్లో వివాదం ముదురుతోంది. గత రెండు ఒలింపిక్స్కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలపై హైదరాబాదీ సానియా మీర్జా తీవ్రంగా స్పందించింది. పేస్ పేరును ప్రస్తావించకుండా ఓ విషపురుగు అంటూ విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని పరోక్షంగా పేస్ను ఉద్దేశించి సానియా ట్వీట్ చేసింది. గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించాడు. రియో, గత లండన్ ఒలింపిక్స్లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. సానియ, రోహన్ బోపన్నను ఎంపిక చేయడాన్ని తప్పుపట్టాడు. -
ఒలింపిక్స్కు మేటి జంటను పంపలేకపోయారు
న్యూఢిల్లీ: గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ యువ సంచలనం సాకేత్ మైనేని ఆటతీరును ఆకాశానికెత్తాడు. అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని కితాబిచ్చాడు. ‘రియో, గత లండన్ ఒలింపిక్స్లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదు. దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ ఒలింపిక్స్లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నాం. గత 14 నెలల్లో నాలుగు గ్రాండ్స్లామ్ మిక్స్డ్ టైటిల్స్ను సాధించిన నన్ను కాదని మరో ఆటగాడిని రియోకు పంపడం ఏమాత్రం సమంజసంగా లేదు’ అని అన్నాడు. సానియాకు జతగా రోహన్ బోపన్న బరిలోకి దిగగా ఈ జోడి సెమీఫైనల్తోపాటు కాంస్య పతక పోరులో ఓడింది. ప్రస్తుత డేవిస్ కప్ టీమ్ ఈవెంట్లో సాకేత్ మైనేనిలాంటి ఆటగాడితో జతకట్టడం బాగుందని పేస్ అన్నాడు. ఈ జోడీ... రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జోడి చేతిలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ‘మైనేని సర్వీస్ అద్భుతం. రిటర్న్ షాట్లు అసాధారణం. కెరీర్ తొలినాళ్లలోనే అతను చక్కని ఆటతీరుతో ఆదరగొడుతున్నాడు. అనుభవం సంతరించుకుంటే భారత టెన్నిస్ మేటి ఆటగాడిగా ఎదుగుతాడు’ అని తెలుగు కుర్రాడిని ప్రశంసలతో ముంచెత్తాడు. మనకు మరో 18 నెలల్లో ఆసియా గేమ్స్, నాలుగేళ్లకు టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే డబుల్స్లో ఎవరు, మిక్స్డ్ డబుల్స్లో ఎవరెవరు ఆడతారనే స్పష్టతతో ముందడుగు వేయాలని అఖిల భారత టెన్నిస్ సంఘాని (ఐటా)కి సూచించాడు. దీంతో చివరి నిమిషంలో అనవసరపు గందరగోళానికి తావుండదని చెప్పాడు. మరోవైపు ‘సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడంతో సమానం’ అని పరోక్షంగా పేస్ను ఉద్దేశించి సానియా మీర్జా వ్యాఖ్యానించడం విశేషం. -
పేస్పై నాదల్ ప్రశంసలు
న్యూఢిల్లీ:భారత టెన్నిస్ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్పై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ప్రశంసల వర్షం కురిపించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్లో లియాండర్ ఒక అసాధారణ ఆటగాడని కొనియాడాడు. టెన్నిస్ చరిత్రలో ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న లియాండర్తో తలపడటం తాను అరుదైన గౌరవంగా భావిస్తున్నాని నాదల్ పేర్కొన్నాడు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్లో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జంట 4-6, 7-6 (7/2), 6-4, 6-4 తో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జోడీపై విజయం సాధించింది. మూడు గంటలకు పైగా సాగిన పోరులో భారత జంట పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ద్వయంలో ఒకడైన పేస్ను నాదల్ ప్రత్యేకంగా అభినందించాడు. 'లియాండర్ గొప్ప మ్యాచ్ ఆడాడు. గత రాత్రి జరిగిన మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా జరిగింది. ఆ మ్యాచ్ చాలా కఠినమైన మ్యాచ్ . లియాండర్ జంట చాలా బాగా ఆడింది. లియాండర్ పేస్ దేశంలో అతనితో కలిసి ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. డబుల్స్ విభాగంలో అతి పెద్ద స్టార్లలో పేస్ ఒకడు. టెన్నిస్ చరిత్రలో లియాండర్ అత్యుత్తమ ఆటగాడు' అని నాదల్ తెలిపాడు. -
నేనింకా నిత్య విద్యార్థినే...
* నాదల్ నుంచి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి * భారత దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్య న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకుపైగా అంతర్జాతీయ కెరీర్... 18 గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్... వరుసగా ఏడు ఒలింపిక్స్లు ఆడిన ఏకైక టెన్నిస్ ప్లేయర్... డేవిస్ కప్లో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన రికార్డు సమం.. ఇలా చెప్పుకుంటూ పోతే భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఖాతాలో ఘనతలు ఎన్నో ఉన్నాయి. 43 ఏళ్ల వయస్సులోనూ యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆడుతోన్న పేస్... తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకునేందుకు రాఫెల్ నాదల్ లాంటి ఆటగాళ్ల నుంచీ నేర్చుకోవడానికి సిద్ధమేనని తెలిపాడు. స్పెరుున్ జట్టుతో శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత జట్టు తలపడనున్న నేపథ్యంలో పేస్ వెలుబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... అందరూ చూసేందుకు రావాలి: 14 గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నాదల్, ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్... ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ చాంపియన్ జంట ఫెలిసియానో లోపెజ్, మార్క్ లోపెజ్లతో స్పెరుున్ ఇక్కడకు రావడం వారి ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఒకరకంగా ఈ మ్యాచ్ జరిగే మూడు రోజులు టెన్నిస్ అభిమానులకు పండగే. నేనే గనుక జూనియర్ ప్లేయర్ అరుుఉంటే ప్రతి రోజూ ఈ స్టార్స్ ఆటను చూసేందుకు వచ్చేవాడిని. నాదల్ ఏ రకంగా ఆడతాడో, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాడో చూసేందుకు అందరూ రావాలి. యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి: నాదల్, ఫెరర్లాంటి మేటి ప్లేయర్లకు భారత యువ ఆటగాళ్లు సాకేత్ మైనేని, రామ్కుమార్ పరీక్ష పెట్టే అవకాశం వచ్చింది. దీనిని వారు సద్వినియోగం చేసుకోవాలి. ఫలితం గురించి ఆలోచించకుండా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఏ రకంగా ఆడాలో తెలుసుకోవడానికి యువ ఆటగాళ్లందరూ నాదల్, ఫెరర్ల ఆటతీరును పరిశీలించాలి. జట్టులో అత్యంత సీనియర్ను కాబట్టి నేను యువ ఆటగాళ్లకు మార్గదర్శిగా ఉంటాను. జూనియర్ ఆటగాళ్లు నాకంటే బాగా ఆడుతూ, జట్టులో స్థానం లేదని చెప్పినరోజు నేనే వైదొలుగుతాను. -
ముగిసిన సానియా పోరు
యూఎస్ ఓపెన్లో ఈసారి భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. లియాండర్ పేస్, రోహన్ బోపన్న పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఇప్పటికే నిష్ర్కమించగా... వారి సరసన సానియా మీర్జా కూడా చేరింది. మిక్స్డ్ డబుల్స్లో రెండో రౌండ్లో ఓడిన సానియా... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సానియా-బార్బరా స్టిక్రోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-7 (3/7), 1-6తో టాప్ సీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స) జోడీ చేతిలో ఓడిపోరుుంది. 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోరుున ఇండో-చెక్ జంట రెండో సెట్లో మాత్రం చేతులెత్తేసింది. గత ఏడాది యూఎస్ ఓపెన్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి లియాండర్ పేస్ మిక్స్డ్ డబుల్స్లో... సానియా మహిళల డబుల్స్లో టైటిల్స్ సాధించారు.