![Leander Paes And Matthew Abden Pair Enters Final - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2020/02/15/Paes.gif.webp?itok=vOBP9qsH)
బెంగళూరు: ఈ ఏడాదిలో రిటైర్ కానున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పేస్ (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్)–ఆండ్రీ వాసిలెవ్స్కీ (బెలారస్) జోడీపై గెలిచింది.
80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జోడీలు తమ సరీ్వస్లను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే సూపర్ టైబ్రేక్లో మాత్రం పేస్ జంట పైచేయి సాధించి ఫైనల్కు చేరింది.