
ఫైనల్లో పేస్ ద్వయం
సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
న్యూఢిల్లీ: సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) జోడీ 6-3, 7-6 (7/5)తో మిఖారుుల్ ఎల్గిన్-అలెగ్జాండర్ కుద్రయెత్సెవ్ (రష్యా) జంటను ఓడించింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్ ద్వయం ప్రత్యర్థి జంట సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. పేస్ కెరీర్లో ఇది 96వ ఫైనల్ కావడం విశేషం.