పేస్ జంట ఓటమి | Leander Paes team defeat | Sakshi

పేస్ జంట ఓటమి

May 1 2015 1:25 AM | Updated on Apr 3 2019 4:59 PM

పేస్ జంట ఓటమి - Sakshi

పేస్ జంట ఓటమి

బీఎండబ్ల్యూ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం ముగిసింది.

మ్యూనిచ్ (జర్మనీ) : బీఎండబ్ల్యూ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్-స్టెపానెక్ జోడీ 2-6, 1-6తో టాప్ సీడ్ బ్రూనో సోరెస్ (బ్రెజిల్)-అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.

53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో పేస్ జంట ఆరంభం నుంచే ప్రత్యర్థి జోడీ దూకుడుకు సమాధానం ఇవ్వలేకపోయింది. తమ సర్వీస్‌ను మాత్రం నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఈ సీజన్‌లో తాను ఆడిన గత ఐదు టోర్నీల్లో ముగ్గురు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగిన పేస్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలుపొందడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement