-
జూబ్లీహిల్స్లో బీఎండబ్ల్యూ కారు దగ్ధం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని రోడ్ నం.45లోని నందగిరి హిల్స్ చౌరస్తాలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ బీఎండబ్ల్యూ కారు అగ్నికి ఆహుతి అయింది. ఈ కారులో ఎవరున్నారు..? కారు ఎవరిది..? అనే వివరాలు తెలుసుకోడానికి జూబ్లీహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. టీఎస్ 09 ఎఫ్ఎఫ్ 1880 నంబరు బీఎండబ్ల్యూ కారు జూబ్లీహిల్స్ రోడ్ నం–45లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ మీదుగా సినీ హీరో బాలకృష్ణ నివాసం వైపు నుంచి ఫిలింనగర్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కారులో పొగలు రావడంతో అందులో ఉన్న వ్యక్తి కిందకు దిగారు. క్షణాల్లోనే ఇంజన్లో నుంచి మంటలు రావడం, కారు మొత్తం మంటలు వ్యాపించడంతో కారు నడుపుతున్న వ్యక్తి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఘటన స్థలంలో వాహనదారులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకునే లోగానే కారు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై కారులో మంటలు వ్యాపించడంతో అసలే ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడే రహదారులన్నీ వాహనాలతో స్తంభించిపోయాయి. ఫలితంగా స్తంభించిన ట్రాఫిక్ను దాటుకొని ఫైర్ ఇంజన్ రావడం చాలా కష్టతరమైంది. ఎట్టకేటకు ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకున్నా.. అప్పటికే కారు పూర్తిగా కాలిపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఈ కారు ఎవరిది, ఎవరు నడుపుతున్నారు.. ఎందుకు కాలిపోయింది.. అనే వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన స్థలాన్ని జూబ్లీహిల్స్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పరిశీలించి, రెండు గంటలు శ్రమించి కొంతమేర ట్రాఫిక్ను అదుపులోకి తీసుకువచ్చారు. -
బైక్ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు.. ఒకరు మృతి
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, తాగి డ్రైవ్ చేయడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి కారణాలు ప్రమాదాలకు మూలంగా మారాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోర్షే కారుతో 24 ఏళ్ల టెక్కీలపై దూసుకెళ్లిన ఈ ఘటనలో రోజుకో కుట్ర కోణం వెలుగుచూస్తోంది.తాజాగా పంజాబ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొహాలిలో బుధవారం రాత్రి జరిగింది ప్రమాదం. బనూర్ వైపు నుంచి వస్తున్న కారు జిరాక్పూర్ పాటియాలా హైవేపై బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీకి, కారుకు మధ్య బైక్ ఇరుక్కుపోయింది.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా.. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాహిబ్ అనే వ్యక్తి మరణించారడు. పభాత్ గ్రామానికి చెందిన సుమిత్, రాజ్వీర్లు సింగ్లు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు పాటియాలా హైవేను దిగ్బంధించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత కారు డ్రౌవర్ పరారయ్యాడు. కారుపై వీఐపీ నెంబర్ ఉందని పోలీసులు తెలిపారు. రవాణా మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2022లో 67,000 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. 30,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. -
బానెట్పై వ్యక్తితో కారు డ్రైవ్ చేసిన మైనర్.. తర్వాత ఏం జరిగిందంటే?
మైనర్ బాలుడు కారు డ్రైవింగ్ కారణంగా ఇద్దరి ప్రాణాలు బలిగొన్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ఉదంతంలో రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే పోర్షే కారు ప్రమాదం ఘటన మరవక ముందే కారు బొనెట్పై ఓ వ్యక్తిని ఉంచి మైనర్ కారు డ్రైవ్ చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల మైనర్ ముంబైలోని రద్దీ ప్రాంతమైన కళ్యాణ్ రోడ్డుపై నడిపాడు. మైనర్ డ్రైవ్ చేయడమే కాకుండా కారు బానెట్పై ఓ వ్యక్తి ప్రమాదకరంగా పడకుకొని ఉన్నాడు. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు చూసి షాక్కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు స్పందించారు. బాలుడు డ్రైవ్ చేసిన కారు బానెట్పై పడుకున్న వ్యక్తిని 21 ఏళ్ల మతాలియాగా గుర్తించారు. అతడితోపాటు కారు యజమాని అయిన బాలుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.What's wrong with people?Even as the Pune Porsche horror hasn't faded, a man in #Mumbai was seen doing stunts on busy road.Icing on the cake is, a 17-year-old-boy was driving the BMW on busy #Kalyan road with man lying on its bonnet.Man and the father of teenager arrested. pic.twitter.com/9Ps0qoLaJy— Sahil Sinha (@iSahilSinha) May 27, 2024 -
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతదేశంలో 2 సిరీస్ షాడో ఎడిషన్ను రూ. 46.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ షాడో ఎడిషన్ 220ఐ ఎం స్పోర్ట్స్ అనే ట్రిమ్లో మాత్రమే లభిస్తుంది. ఇది బ్లాక్ అవుట్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్తో సూక్ష్మమైన అప్డేట్లను పొందుతుంది.బీఎండబ్ల్యూ షాడో ఎడిషన్ బ్లాక్ ఎడిషన్ కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, రియర్ స్పాయిలర్ వంటి వాటితో పాటు.. ఆధునిక ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మొదలైనవి ఉన్నాయి.ఆల్పైన్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 179 హార్స్ పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా ముందు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 7.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త బీఎండబ్ల్యూ 2 సిరీస్ షాడో ఎడిషన్.. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటో గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. -
ఒకసారి ఛార్జ్చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీ
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5 మోడల్ను తాజాగా తన వినియోగదారులకు పరిచయం చేసింది. సెడాన్ సిరీస్లో భాగంగా విడుదల చేసిన కార్లలో తొలి ఎలక్ట్రిక్ మోడల్ ఇదేనని కంపెనీ వర్గాలు తెలిపాయి.సింగిల్ ఛార్జింగ్తో 516 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెప్పింది. ఇది గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిసింది. 83.9కిలోవాల్ హవర్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ కారు కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవనుంది. -
ఖరీదైన కారు కొన్న స్టార్ డైరెక్టర్.. ఏకంగా అన్ని కోట్లా?
స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. గత మూడు నాలుగేళ్లలో దర్శకుడిగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయని ఇతడు.. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా ఓ మూవీ తీస్తున్నారు. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అది అలా ఉండగా ఇప్పుడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అలానే ఈ ఖరు ధర తెలిసి అందరూ షాకవుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్లోనే) స్టాలిన్, గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో యమ క్రేజ్ తెచ్చుకున్న మురుగదాస్.. 2020లో రజనీకాంత్తో 'దర్బార్' మూవీ తీశాడు. అది ఘోరంగా ఫెయిల్ కావడంతో పూర్తిగా డైరెక్షన్ పక్కనబెట్టేశాడు. నిర్మాతగా రెండు సినిమాలు తీశాడు అవి కూడా ఏమంత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో అలరించలేకపోయాయి. ప్రస్తుతం శివకార్తికేయన్తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది రిలీజ్ కావొచ్చు. ఇకపోతే తాజాగా దాదాపు రూ.1.30 కోట్ల విలువ చేసే బీఎమ్డబ్ల్యూ ఎక్స్ 7 (BMW X7) కారుని కొనుగోలు చేశాడు. షోరూంలో మురుగదాస్ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న పిక్స్ వైరల్ అయ్యాయి. అదే టైంలో ఈ కారు ఏకంగా రూ.కోటి కంటే ఎక్కువ కాస్ట్ అని తెలిసి షాకవుతున్నారు. దర్శకుడిగా ఫామ్లో లేనప్పటికీ కాస్ట్ లీ కారు కొన్నాడని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?) -
మోస్ట్ వాంటెడ్గా నాడు తండ్రి.. నేడు కొడుకు
హైదరాబాద్: అప్పట్లో మహ్మద్ షకీల్ ఆమీర్ అలియాస్ బోధన్ షకీల్... ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్... హైదరాబాద్ పోలీసులు వాంటెడ్గా మారారు. 2007 నాటి నకిలీ పాస్పోర్ట్స్ కేసులో షకీల్, తాజాగా ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదం, తదనంతర నాటకీయ పరిణామాల కేసులో సాహిల్ నిందితులుగా ఉన్నారు. పదహారేళ్ళ క్రితం తండ్రి కోసం పరుగులు పెట్టిన సిటీ కాప్స్ ఇప్పుడు కుమారుడి కోసం వెతుకుతున్నారు. సాహిల్ దుబాయ్కి పారిపోవడంతో అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ప్రమాదం నేపథ్యంలో వెస్ట్జోన్ పోలీసులు గతేడాది జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మరో యాక్సిడెంట్ ఫైల్ను బయటకు తీస్తున్నారు. ముప్పతిప్పలు పెట్టిన షకీల్... మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్లో ఢిల్లీలో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నగరంలో నమోదైన కేసులో బోధన్ షకీల్ నిందితుడిగా మారాడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్ కోసం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. కారు కేసులో కుమారుడి కోసం... నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ జరిగిన దాదాపు పదహారేళ్ల తర్వాత ‘బీఎండబ్ల్యూ కారు’ కేసు చోటు చేసుకుంది. పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసు నుంచి సాహిల్ను తప్పించడానికి పోలీసులు ప్రయతి్నంచడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పరారీలో ఉన్న సాహిల్ కోసం పంజగుట్టతో పాటు వెస్ట్జోన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తు అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. షకీల్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడని, అక్కడ నుంచే కుమారుడని తప్పించే కథ మొత్తం నడిపి, అతడినీ అక్కడికే రప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నాటి కేసులోనూ గోల్మాల్ జరిగిందా? తాజాగా పంజగుట్ట పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కేసు గతేడాది నాటి జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ను మరోసారి తెరపైకి తెచ్చింది. 2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు అశ్వతోష్ (రెండు నెలలు) మృతి చెందాడు. ఈ థార్ కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో సాహిల్పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జూబ్లీహిల్స్లో ప్రమాదానికి కారణమైన కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాపను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ ఉదంతం చాలా బాధాకరమంటూ జరిగిన విషయాన్ని తాను తన కజిన్తో మాట్లాడి తెలుసుకున్నానని షకీల్ పేర్కొన్నారు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. ఈ కేసులో పోలీసులు సైతం సాహిల్కు క్లీన్చిట్ ఇచ్చేశారు. తాజాగా పంజగుట్ట కేసులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు నాటి జూబ్లీహిల్స్ కేసును తిరగదోడుతున్నారు. అప్పట్లో జరిగిన ప్రమాదంలోనూ సాహిల్ పాత్ర ఉందా? ఏదైనా గోల్మాల్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పశి్చమ మండల డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్ మీడియాకు వెల్లడించారు. -
బీఎండబ్ల్యూ కార్లు ప్రియం
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచుతోంది. జనవరి 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. విదేశీ మారకపు రేట్లు, పెరుగుతున్న తయారీ ఖర్చులలో హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎండబ్ల్యూ వెల్లడించింది. ఇప్పటికే మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ఆడి తదితర కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
రూ.100 కోట్ల సినిమా.. డైరెక్టర్కి గిఫ్ట్గా కాస్ట్లీ కారు
సినిమా హిట్ అయితే హీరో, డైరెక్టర్ ఎంత ఆనందపడతారో.. ఆ మూవీ తీసిన నిర్మాత అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీలవుతాడు. ఎందుకంటే కోట్లు పెడతాడు కదా! అలా లాభాలు వచ్చిన ఆనందంలో చిత్రబృందానికి కళ్లు చెదిరే బహుమతులు ఇస్తుంటారు. మొన్నీమధ్య 'జైలర్' నిర్మాత కార్ల దగ్గర నుంచి గోల్డ్ కాయిన్స్ వరకు చాలా ఇచ్చాడు. ఇప్పుడు మరో నిర్మాత.. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడి రుణం తీర్చుకున్నాడు. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అప్పుడెప్పుడో 'పందెం కోడి' లాంటి సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో మన దగ్గర హిట్ కొట్టలేకపోయాడు. చాలా ఏళ్ల తర్వాత 'మార్క్ ఆంటోని'గా వచ్చిన విశాల్.. తమిళంలో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా ఓవరాల్గా రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 'మార్క్ ఆంటోని'లో విశాల్ కంటే ఎస్జే సూర్య నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. టైమ్ ట్రావెల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ తెలుగులో డీసెంట్ టాక్ అందుకుంది. ఈ చిత్రంతో హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్ని నిర్మాత వినోద్ సర్ప్రైజ్ చేశాడు. దాదాపు రూ.90 లక్షలు విలువైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) Blockbuster #MarkAntony Prod Vinod gifted a BMW Car to Dir Adhik Ravichandran 👏 pic.twitter.com/KNirFQjFD4 — Christopher Kanagaraj (@Chrissuccess) October 30, 2023 -
ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!
బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' (Kim Sharma) పేరు తెలుగు వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ మగధీర సినిమాలో జోర్సే.. జోర్సే పాట గుర్తొస్తే తప్పకుండా ఈమే గుర్తొస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఖడ్గం, ఆంజనేయులు సినిమాల్లో కూడా తనదైన రీతిలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. కిమ్ శర్మ కొనుగోలు చేసిన కొత్త కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 (BMW i7) ఎలక్ట్రిక్ సెడాన్. ఇటీవలే ఈ కారుతో ఓ రెస్టారెంట్ వెలుపల కనిపించింది. ఈ సెడాన్ ధర రూ. 1.95 కోట్లు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఒక వీడియోను కార్స్ ఫర్ యు అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో గమనించినట్లయితే, బీఎండబ్ల్యూ ఐ7 కారు దిగి రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోవడం చూడవచ్చు. గతంలో ఈమె భారతదేశంలో అత్యంత సరసమైన కారు 'టాటా నానో' (Tata Nano) ఉపయోగించేది. అయితే దీని స్థానంలో ఖరీదైన బీఎండబ్ల్యూను చేర్చింది. బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన బీఎండబ్ల్యూ కార్లలో ఐ7 ఒకటి. ఇది అద్భుతమై డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో బ్లూ యాక్సెంట్లు, కొత్త డైమండ్ అల్లాయ్ వీల్ వంటివి గమనించవచ్చు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్కు షాక్.. ఎక్స్(ట్విటర్)కు రూ.3.21 కోట్లు ఫైన్ - కారణం ఇదే! ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ సెడాన్ 14.9 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ & 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. అంతే కాకుండా రెండవ వరుస ప్రయాణికుల కోసం ఇందులో 31.3 ఇంచెస్ 8కే సినిమా స్క్రీన్ ఉంటుంది. డోర్స్ వద్ద కూడా 5.5 ఇంచెస్ టచ్స్క్రీన్ ఉంటుంది. బీఎండబ్ల్యూ ఐ7 రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి 544 హార్స్ పవర్, 745 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని 101.7 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 600 కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. దీని టాప్ స్పీడ్ 239 కిమీ/గం. -
టీవీఎస్–బీఎండబ్ల్యూ తొలి ఎలక్ట్రిక్ బైక్ తయారీ ప్రారంభం
హోసూరు: బీఎండబ్ల్యూ మోటోరాడ్ సహకారంతో టీవీఎస్ మోటార్ కంపెనీ, తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘సీఈ 2’ తయారీని శుక్రవారం హోసూరు ప్లాంట్లో ప్రారంభించింది. బీఎండబ్ల్యూ, టీవీఎస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ఈ ప్లాంట్లో తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ జీ310 సీసీ మోటారు సైకిల్ లక్షన్నర వాహనాన్ని విడుదల చేశారు. టీవీఎస్ మోటార్, బీఎండబ్ల్యూ మోటార్ సంయక్తంగా బీఎండబ్ల్యూ జీ310ఆర్, బీఎండబ్ల్యూ 310 జీఎస్, బీఎండబ్ల్యూ జీ310ఆర్ఆర్, టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310, టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 310 వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇరు కంపెనీలు అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ బైక్ సీఈ02ను తొలుత యూరప్ మార్కెట్లో విక్రయించనున్నారు. తర్వాత భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈ2 తయారీ, 310 సీసీ బైక్ 1,50,000 యూనిట్ను ఒకే రోజు ఉత్పత్తి చేయడం ప్రత్యేక సందర్భంగా కంపెనీ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ గ్రూప్ విక్రయాల్లో టీవీఎస్ మోటార్ వాటా 12 శాతంగా ఉంటుందని తెలిపారు. రెండు గ్రూపుల మధ్య బంధం మరిన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వరుస సమస్యలతో యాపిల్ ఉక్కిరిబిక్కిరి.. ఐఫోన్ 15తో ఈ సారి ఏకంగా
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కి వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి? ఇటీవల ఆ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫోన్లలో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బంది పడుతుండగా.. ఫోన్లోని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని యాపిల్ సైతం హామీ ఇచ్చింది. అయినప్పటికీ, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు యాపిల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా, బీఎండబ్ల్యూ వినియోగదారులు ఐఫోన్ 15 ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే సమయంలో హార్డ్వేర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నివేదికల ప్రకారం బీఎండబ్ల్యూ వైర్లెస్ ఛార్జర్లు ఐఫోన్ 15 ఎస్ వేడెక్కడానికి కారణమవుతున్నాయి. కారు వైర్లెస్ ఛార్జర్లను ఉపయోగిస్తున్నప్పుడు వారి ఐఫోన్ 15 చాలా వేడెక్కిందని, దానిని డిస్కనెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదని బీఎండబ్ల్యూ కార్ల యాజమానులు చెప్పారంటూ నివేదికలు హైలెట్ చేశాయి. ఫోన్ కూల్ అయ్యే వరకు వేచి చూసి ఆ తర్వాత ఫోన్ పనితీరు పునఃప్రారంభమవుతున్నట్లు గమనించానని ఓ వినియోగదారుడు తెలిపాడు. మరి ఈ సమస్య నుంచి యాపిల్, ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఆ రెండు కంపెనీలు బీఎండబ్ల్యూ కార్లలోని ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇంతకుముందు బీఎండబ్ల్యూ కార్ల వినియోగదారులతో పాటు ఇతర ఐఫోన్ 15 యూజర్లు యాపిల్కు వరుస ఫిర్యాదులు చేశారు. వాటిల్లో ప్రధానంగా... ఫోన్ మాట్లాడేటప్పుడు లేదంటే, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ వెనుక భాగం హీటెక్కుతుంది. ఇన్స్టాగ్రామ్,ఉబెర్ వంటి యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని కొందరు వినియోగదారులు నమ్ముతున్నారు. మరికొందరు ఆ ఫోన్ల లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా అనిపిస్తుందని, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు యాపిల్కు ఫిర్యాదు చేయడం గమనార్హం. చదవండి👉 ఐఫోన్ 15లో మరో సమస్య.. తలలు పట్టుకుంటున్న యాపిల్ లవర్స్ -
పండుగ సీజన్లో కొత్త కారు కొనాలా? ఎంచుకో ఓ బెస్ట్ ఆప్షన్..
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే రానున్న పండుగ సీజన్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు మరిన్ని లేటెస్ట్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. కాగా ఈ వారం మార్కెట్లో విడుదలైన కార్లు ఏవి? వాటి వివరాలేంటి? అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హోండా ఎలివేట్ (Honda Elevate) హోండా కంపెనీ గత కొంత కాలంలో దేశీయ విఫణిలో విడుదల చేయాలనుకున్న ఎలివేట్ కారుని ఈ వారం ప్రారంభంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇది మొత్తం నాలుగు ట్రిమ్లలో మార్కెట్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 121 హార్స్ పవర్ అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ఆటోమేటిక్ పొందుతుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue ADAS) ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం (ADAS)తో విడుదలైంది. దీని ధర రూ. 10.33 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి వాటితో మరింత సురక్షితమైన వాహనంగా నిలుస్తోంది. వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge) స్వీడిష్ కార్ల తయారీ సంస్థ దేశీయ మార్కెట్లో 'వోల్వో' రూ. 61.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన 'సీ40 రీఛార్జ్' లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ మీద 530 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ (BMW 2 Series M Performance Edition) జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0 లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 179 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ (Hyundai i20 facelift) దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఇది అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ కలిగి, కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్తో ఆధునిక హంగులు పొందుతుంది. ఈ ఫేస్లిఫ్ట్ ఇప్పుడు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. -
టెస్లా కార్ల డిజైన్లను తలదన్నేలా.. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్ ఎలా ఉందో చూశారా?
ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..టెస్లాకు గట్టిపోటీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టెస్లాను తలదన్నేలా ఇప్పటి వరకు ఏ కార్లలో లేని డిజైన్లతో ప్రత్యేకమైన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోటో టైప్ను విడుదల చేసింది. ముఖ్యంగా, చైనా ఎలక్ట్రిక్ మార్కెట్లో తొలిస్థానంలో ఉన్న టెస్లా, ఇతర స్థానిక ఆటోమొబైల్ కంపెనీలను వెనక్కి నెట్టి, వాహనదారుల్ని ఆకట్టుకునేలా ఈ కారును డిజైన్ చేసింది. ‘బీఎండబ్ల్యూ న్యూ క్లాస్సే’ (bmw Neue Klasse) పేరుతో విడుదల కానున్న బీఎండబ్ల్యూ కారును వచ్చే వారం జర్మనీ మ్యూనిచ్లో జరిగే ఇంటర్నేషన్ మోటార్స్ షో (iss) ప్రదర్శనకు పెట్టనుంది. 2025లో ఈ మార్కెట్లోకి విడుదల చేయనుంది. అదే సమయంలో మెర్సిడెజ్ బెంజ్ గ్రూప్ సైతం న్యూ బ్యాటరీ పవర్డ్ మోడల్స్తో పాటు, వోక్స్వ్యాగన్ కార్ విడుదల కావాల్సి ఉంది. కానీ కార్లలో తలెత్తిన సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా ఫోర్ష్, ఆడి కార్ల విడుదల కంటే ఆలస్యంగా మార్కెట్కు పరిచయం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డిజైన్లు, ఫీచర్లు అదరగొట్టేస్తున్నాయ్ దశబ్ధాల కాలంగా రెండు డోర్లతో విడుదల చేసే కూపే (cupe) తరహా కార్లకు బీఎండబ్ల్యూ స్వస్తి చెప్పింది. బదులుగా, విండ్స్క్రీన్ మొత్తం వెడల్పు చేసింది. దీంతో పాటు వాయిస్ కమాండ్లు, హ్యాండ్ మూమెంట్తో డ్రైవింగ్ చేసేలా డిజిటల్ డిస్ప్లేను డిజైన్ చేసింది. చైనా కంపెనీలైన బీవైడీ కో, ఎన్ఐఓ ఐఎన్సీకి పోటీగా స్థానిక వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా అదిరిపోయే ఫీచర్లతో ఈవీ కారును రూపొందిస్తుంది. bmw Neue Klasse రేంజ్ ఎంతంటే బీఎండబ్ల్యూ న్యూ క్లాస్సే మోడల్లు 800 కిలోమీటర్ల (497 మైళ్ళు) పరిధిని కలిగి ఉంటాయి. అరగంటలో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. గత సంవత్సరం, మెర్సిడెస్ నుండి ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ ఒకే ఛార్జ్తో 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచింది. కాగా, బీఎండబ్ల్యూ, మెర్సిడైజ్ బెంజ్, ఆడి కార్లు చైనా ప్రీమియం సెగ్మెంట్లలో ఆదిపత్యాన్ని చెలాయించాయి. కానీ అక్కడ ఈవీ కార్లకు డిమాండ్ పెరడగడంతో ఫ్యూయిల్ కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అందుకే ఆటోమొబైల్ సంస్థ ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారించాయి. -
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కొత్త కారు.. ఎన్ని కోట్లో తెలుసా?
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే తమిళ్ వాళ్ల కంటే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే గ్యాంగస్టర్ సినిమాలతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. 'ఖైదీ', 'విక్రమ్'తో మన దగ్గర కోట్లాది మంది ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్న లోకేశ్.. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!) ప్రస్తుతం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో డిఫరెంట్ సినిమాలు తీస్తున్న లోకేశ్ కనగరాజ్.. కార్తీతో 'ఖైదీ' తీశాడు. దానికి కమల్హాసన్ 'విక్రమ్' మూవీతో లింక్ చేశాడు. ఇప్పుడు దళపతి విజయ్తో 'లియో' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 20న ఇది థియేటర్లలోకి రానుంది. అంటే రెండు నెలల టైముంది. ఈ గ్యాప్లో కాస్ట్ లీ బీఎండబ్ల్యూ కారు కొనేశాడు. కార్లలో లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారుని ఇప్పుడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత రూ.కోటి 70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. విజయ్ 'లియో' కోసం రూ.70 కోట్లు అందుకున్నాడనే టాక్ నడుస్తోంది. ఇలా హీరోలని మించి లోకేశ్ క్రేజ్ సంపాదించాడు. Lokesh Kanagaraj gets a brand new BMW 7 series car priced at ₹1.70 cr [Ex Showroom] pic.twitter.com/B2g7gehRfR — Manobala Vijayabalan (@ManobalaV) August 17, 2023 (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!) -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!
బాలీవుడ్లో ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ-2 సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోకు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ- 2లో కంటెస్టెంట్గా పాల్గొన్న జియా శంకర్ ఇటీవలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే రియాలిటీ షో నుంచి బయటకొచ్చేసిన జియాశంకర్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కారు ముందు జియాశంకర్ కొబ్బరికాయ కొడుతూ కనిపించింది. (ఇది చదవండి: చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్కు ఛాన్స్) అంతే కాకుండా జియా తన కొత్త కారు ముందు పోజులిస్తూ ఉత్సాహంగా కనిపించింది. ఆ తర్వాత అక్కడున్న వారందరికీ స్వీట్లు కూడా పంచింది. జియా కొనుగోలు చేసిన కారు యస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ కాగా.. ముంబయిలో ఈ మోడల్ కారు ధర దాదాపు రూ. 1.3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జియా బిగ్ బాస్ ఓటీటీ- 2లో పాల్గొనడంతో ప్రేక్షకుల్లో మరింత ఆదరణ తెచ్చుకుంది. ఆమె ఈ రియాలిటీ షోలో టాప్-6 కంటెస్టెంట్స్లో ఒకరిగా నిలిచింది. ఆమె 2013లో తెలుగు చిత్రం ఎంత అందంగా ఉన్నావే చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించింది. రితీష్ దేశ్ముఖ్, జెనీలియా దేశ్ముఖ్లతో కలిసి మరాఠీ చిత్రం వేద్లో చివరిసారిగా జియా కనిపించింది. అంతే కాకుండా జియా లవ్ బై ఛాన్స్, ప్యార్ తునే క్యా కియా, మేరీ హనికరక్ బీవీ, కాటేలాల్ అండ్ సన్స్, లాల్ ఇష్క్, పిశాచిని, గుడ్నైట్ ఇండియా వంటి అనేక ప్రముఖ టీవీ షోలలో కనిపించింది. (ఇది చదవండి: జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక వేత్త & మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన మనసును దోచిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక వీడియో ట్విటర్ వేదికగా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కారు రయ్ అంటూ వచ్చి, కొన్ని క్షణాల్లోనే రోబోగా మారిన సందర్భాలు చాలానే చూసి ఉంటారు. అయితే నిజ జీవితం ఇలాంటి సన్నివేశం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు బీఎండబ్ల్యూ ఒక రోబో మాదిరిగా మారింది. టర్కీ దేశానికీ చెందిన కంపెనీ 2016లో ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను ఎంతో ఫిదా చేసింది. వీడియో షేర్ చేస్తూ.. టర్కిష్ R&D కంపెనీ అభివృద్ధి చేసి ప్రదర్శించిన 'ట్రాన్స్ఫార్మర్', మన ఆర్ అండ్ డీలో కూడా ఇలాంటి ఫన్ ఉండాలంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ 'వేలు మహీంద్రా'ను ట్యాగ్ చేశారు. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని లక్షల సంఖ్యలో వీక్షించగా.. వేలమంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీదే ఇలాంటి ఉత్పత్తుల మీద కూడా ద్రుష్టి పెడితే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా పరోక్షంగా వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. A real-life ‘transformer’ developed & showcased by a Turkish R&D company. We should be having such fun at our R&D too! @Velu_Mahindra ? pic.twitter.com/Ru1uK01RaA — anand mahindra (@anandmahindra) August 7, 2023 -
లగ్జరీ కార్ల సేల్స్ బీభత్సం.. ఏ వెహికల్ను ఎక్కువగా కొన్నారంటే
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల పరిశ్రమ భారత్లో కొత్త పుంతలు తొక్కుతోంది. అమ్మకాల పరంగా ఈ ఏడాది ఆల్ టైమ్ హై దిశగా పరిశ్రమ దూసుకెళుతోంది. లగ్జరీ కార్ల విక్రయాల్లో దేశంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ , ఆడి 2023 జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో వ్యాపారం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో మెర్సిడెస్ బెంజ్ దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,528 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. బీఎండబ్ల్యూ గ్రూప్ అత్యధికంగా 5,867 యూ నిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో 391 మి నీ బ్రాండ్ కార్లున్నాయి. గతేడాదితో పోలిస్తే బీఎండబ్లు్య గ్రూప్ 5 శాతం వృద్ధి సాధించింది. ఆడి నుంచి 3,474 యూనిట్ల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022 జనవరి–జూన్తో పోలిస్తే 97% ఎక్కువ. సుమారు 47,000 యూనిట్లు.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–జూన్లో సుమారు 21,000 యూనిట్ల లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. తొలి అర్ధ భాగంతో పోలిస్తే జూలై–డిసెంబర్ పీరియడ్ మెరుగ్గా ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. 2023లో భారత్లో సుమారు 46,000–47,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్లో అత్యధికంగా 2018లో సుమారు 40,000 యూనిట్ల లగ్జరీ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు. ‘లగ్జరీ విభాగం 2019లో అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా నష్టపోయింది. మహమ్మారి రాకతో 2020 నుంచి వృద్ధికి ఆటంకం కలిగింది. 2023 పునరుజ్జీవన సంవత్సరం. ప్రతి కంపెనీ వృద్ధి సాధిస్తోంది. ఏదో ఒక కంపెనీ మరో సంస్థ కంటే బలంగా ఎదుగుతోంది. ఇదే వాస్తవికత. ఇది కొనసాగుతూ ఉంటుంది’ అని తెలిపారు. రికార్డులు బ్రేక్ అవుతాయి.. ఈ ఏడాది రెండవ అర్ధ భాగంలో రికార్డులు బద్దలు అవుతాయని బీఎండబ్లు్య గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ‘2023 జనవరి–జూన్ కంటే జూలై–డిసెంబర్ మెరుగ్గా ఉంటుంది. సరఫరా సాధారణ స్థితికి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటే బీఎండబ్లు్యకు 2023 రికార్డు సంవత్సరం అవుతుంది. డిమాండ్, ఉత్పత్తులు బలంగా ఉన్నాయి. ఎక్స్5 రాక కలిసి వస్తోంది. కస్టమర్ల నుంచి స్పందన బాగుంది. కొత్త మోడళ్ల రాక, ఇప్పటికే ఉన్న కార్లతోపాటు బలమైన భారత ఆర్థిక వ్యవస్థ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోంది. సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. ప్రజల ఆర్జన పెరుగుతోంది. ప్రస్తుతం కొన్ని పాశ్చాత్య దేశాల మాదిరిగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మనం ఎదుర్కోవడం లేదు. మాకు ఇక్కడ ఇది ఇప్పటికీ సహేతుక స్థాయి. భారత ఆర్థిక వ్యవస్థలో బలమైన పునాది ఉంది. ఇది వృద్ధికి అవకాశం ఇస్తుంది’ అని వివరించారు. 2030 నాటికి రెండింతలు.. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేయడం వంటి ఇతర అంశాలు, మెరుగైన బోనస్లు, చెల్లింపులు ఉన్నాయి. చాలా కంపెనీలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ప్రస్తుతం పరిశ్రమ బలంగా ఊపందుకుంటోంది. వినియోగదార్లు లగ్జరీ కార్ల వైపు చాలా స్పృహతో మళ్లుతున్నారు. కాబట్టి డిమాండ్ కొనసాగుతోంది’ అని సంతోష్ చెప్పారు. మొత్తం కార్ల విభాగం మాత్రమే కాకుండా లగ్జరీ సెగ్మెంట్ కూడా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నామని బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘మధ్య, దీర్ఘకాలిక వృద్ధి కథనం చెక్కుచెదరకుండా ఉంది. మొత్తం కార్ల విభాగంలో ప్రస్తుతం లగ్జరీ విభాగం వాటా కేవలం 1 శాతం మాత్రమే. 2030 నాటికి ఇది 2 శాతానికి చేరుతుంది. పరిశ్రమ సరైన దిశలో పయనిస్తోంది’ అని తెలిపారు. -
జర్మన్ కారు కొనుగోలు చేసిన టైగర్ ష్రాఫ్ - ధర అక్షరాలా..
Tiger Shroff BMW: బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'టైగర్ ష్రాఫ్' (Tiger Shroff) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆయన ఇటీవల జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, టైగర్ ష్రాఫ్ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ సెడాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మూవీజ్ అడ్డా అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఇందులో కారుని స్పష్టంగా చూడవచ్చు. టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ 330 ఎల్ఐ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 258 పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. (ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!) డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, 190 పీఎస్ పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో గంటాకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతంగా అవుతుంది. ఈ లగ్జరీ సెడాన్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్స్ లభిస్తాయి. -
బంజారాహిల్స్లో కారు బీభత్సం.. రాంగ్రూట్లో వచ్చి బైక్ను ఢీకొట్టి.
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో జీహెచ్ఎంసీ ఏరియా మేనేజర్ పనిచేస్తున్న బాలచందర్ తీవ్రంగా గాయపడ్డారు. నికులు బాల చందర్ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు నెంబర్ (TS09EJ5688) పోలీసులు నిర్థారించారు. ఈ సమయంలో కారులో డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కొత్త వెర్షన్ బీఎండబ్ల్యూ బైక్ భలే ఉందే.. ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్లో న్యూ వెర్షన్ బైక్ను విడుదల చేసింది. 1000ఆర్ఆర్ పేరుతో లాంచ్ చేసిన బైక్ ప్రారంభ ధర రూ.49 లక్షలుగా ఉంది. అప్డేట్ చేసిన ఎం 1000 ఆర్ఆర్ను సైతం వాహనదారులకు పరిచయం చేసింది. దీని ధర రూ.49లక్షలుగా ఉంది. ఎం 1000 ఆర్ఆర్ కాంపిటీషన్ పేరిట తీసుకొచ్చిన మరో బైక్ ధర రూ.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ వేరియంట్లో బ్లాక్స్ట్రోమ్ మెటాలిక్ అండ్ ఎం మోటార్స్పోర్ట్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ సూపర్ బైక్లో లిక్విడ్ కూల్డ్ 999సీసీ, ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్, 212హెచ్పీ, 113 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది. కేవలం 3.1 సెకన్లలో 0-100 కేపీఎంహెచ్ స్పీడ్ అందుకోగలదు. అయితే, టాప్ స్పీడ్ 314కేపీఎంహెచ్ వరకు దూసుకెళ్లగలదు. కంప్లీట్ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) తో వస్తున్న ఈ బైక్ ప్రీ ఆర్డర్లు అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా అథరైజ్డ్ డీలర్ల వద్ద జూన్ 28 నుంచి ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని పేర్కొంది. -
ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ భామ.. ఎన్ని కోట్లంటే?
విక్కీ డోనర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ లాంటి చిత్రాల్లో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్. తాజాగా బీఎండబ్ల్యూ ఎక్స్7 లగ్జరీ కారును కొనుగోలు చేసింది భామ. ఈ విషయాన్ని కార్లను విక్రయించే డీలర్షిప్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. యామీ గౌతమ్ కొనుగోలు చేసిన వాటిలో ఖరీదైన లగ్జరీ కారుగా నిలవనుంది. (ఇది చదవండి: దళపతి విజయ్పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!) యామీ గౌతమ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు విలువ దాదాపు 1.24 కోట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. యామీ గౌతమ్ గ్యారేజీలో ఇది మూడో లగ్జరీ కారుగా నిలవనుంది. ఆమెకు ఇప్పటికే ఆడి ఏ4, ఆడి క్యూ7 మోడల్ కార్లు ఉన్నాయి. అయితే మూడింటిలో తాజాగా కొన్న కారు అత్యంత ఖరీదైనదిగా సమాచారం. (ఇది చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) -
ప్రభాస్ రేంజే వేరు.. డార్లింగ్ కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే!
ఈశ్వర్ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన నటుడు 'ప్రభాస్' (Prabhas) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంలో తెరకెక్కాడు. సుమారు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన ప్రభాస్ సినిమాల గురించి తెలిసిన చాలా మందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడనేది తెలిసి ఉండక పోవచ్చు. ఈ కథనంలో ప్రభాస్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లంబోర్ఘిని అవెంటడోర్ భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ కలిగి ఉన్న కొంతమందిలో ప్రభాస్ ఒకరు. ఈ కారు ధర రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. ఇది లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ ఎస్ రోడ్స్టర్. ఇది 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 740 హార్స్ పవర్ 690 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో సింగిల్ క్లచ్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండటం వల్ల అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒకటి. ఈ కారు ప్రభాస్ గ్యారేజిలో కూడా ఉంది. 2016లో బ్లాక్ కలర్ ఫోర్త్ జనరేషన్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కొనుగోలు చేశారు. ఈ SUV లో 4.4 లీటర్ డీజిల్ వి8 ఇంజిన్ కలిగి 340 పీఎస్ పవర్, 740 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రభాస్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ కారు ధర సుమారు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ. ప్రభాస్ గ్యారేజిలో ఉన్న అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీనిని 2013లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 460 పీఎస్ పవర్, 720 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?) జాగ్వార్ ఎక్స్జే భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే జాగ్వార్ ఎక్స్జే ప్రభాస్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కలర్ ఆప్షన్లో కనిపించే ఈ కారుని 2012లో కొనుగోలు చేశారు. ఇది 3.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజిన్ కలిగి 275 పీఎస్ పవర్ 600 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ -స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) బీఎండబ్ల్యూ ఎక్స్3 జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ఎక్స్3 మోడల్ కారుని 2018లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారుని ప్రభాస్ చాలా అరుదుగా వినియోగిస్తారని తెలుస్తోంది. నిజానికి బీఎండబ్ల్యూ ఎక్స్3 మూడు వేరియంట్లలో లభిస్తుంది. కావున ప్రభాస్ ఇందులో ఏ వేరియంట్ కొన్నారనేది స్పష్టంగా తెలియదు. ఇది డీజిల్ ఇంజిన్ కలిగి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుందని తెలుస్తుంది. -
బీఎండబ్ల్యూ అంటే... బ్యూటీఫుల్ మంజు వారియర్!
అందాల కథానాయిక మంజు వారియర్కు బైక్ రైడింగ్ సాహసాలు అంటే ఇష్టం. తాజాగా ఒక అడవిలో తన బీఎండబ్ల్యూ బైక్ రైడింగ్కు సంబంధించిన ఫోటోలను ‘యూ గాట్ ఇట్ గర్ల్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ–నాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా మంజు వారియర్ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఐరన్ గర్ల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ‘వావ్ అమేజింగ్. కీప్ ఇట్ అప్’లాంటి ప్రశంసల మాట ఎలా ఉన్నా, కొద్దిమంది మాత్రం మంజూకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ‘నేను కూడా రైడర్ని. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్ఫేస్ హెల్మెట్ ధరించండి’ అని శ్రీరామ్గోపాలక్రిష్ణన్ అనే యాజర్ సలహా ఇచ్చారు. మరి కొందరు ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి రైడింగ్ బూట్స్ ధరించాలనే దాని గురించి చెప్పారు. బైక్ రైడింగ్లో మంజు వారియర్కు హీరో అజిత్ స్ఫూర్తి. ఆయనతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటుంది. -
భారత్లో బీఎండబ్ల్యూ ఎం2 లాంచ్ - ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో ఎం2 స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ధర రూ.98 లక్షలు. రెండు డోర్లు, నాలుగు సీట్లను కలిగి ఉంది. పూర్తిగా తయారైన కారును భారత్కు దిగుమతి చేస్తారు. బీఎండబ్ల్యూ ఎమ్2 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్లైన్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 460 hp పవర్ & 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 4.1 సెకన్లు, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 4.3 సెకన్లలో అందుకుంటుంది.