పాకిస్తాన్ విజయలక్ష్యం 40 | england set target of 40 runs for pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ విజయలక్ష్యం 40

Published Sun, Aug 14 2016 8:05 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

పాకిస్తాన్ విజయలక్ష్యం 40

లండన్: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ విజయం అంచున నిలిచింది. నాల్గో రోజు ఆటలో ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం 40 పరుగులనే నిర్దేశించడంతో పాకిస్తాన్ విజయం దాదాపు ఖాయమైంది. 88/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెయిర్ స్టో(81) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.

 

పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా మరోసారి ఇంగ్లండ్ కు చుక్కలు చూపించాడు. యాసిర్ ఐదు వికెట్లు సాధించి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 542 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 328 పరుగులు చేసింది. ఈ సిరీస్లో తొలి టెస్టును పాకిస్తాన్ గెలవగా, ఆ తరువాత రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement