-
T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజుల్లోపే మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి పొట్టి ఫార్మాట్ మజాను అందించనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్ సహా మిగిలిన ప్రధాన దేశాల క్రికెట్ బోర్డులు జట్లను ప్రకటించాయి.అప్పుడు సెమీస్లోనేజూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ ఐసీసీ ఈవెంట్కు అమెరికాతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తంగా 20 జట్లు పాల్గొననున్న ఈ టీ20 వరల్డ్కప్లో టీమిండియాకు రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్లో పాల్గొన్న హిట్మ్యాన్ రెండో దఫా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు.గత ప్రపంచకప్-2022లో ఫేవరెట్గా బరిలోకి దిగిన రోహిత్ సేన సెమీస్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగగా ఇంగ్లిష్ జట్టు విజేతగా అవతరించింది. ఇక ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో గట్టి పోటీనిచ్చే, టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేనంటూ తన అంచనా తెలియజేశాడు.‘‘ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. అలాగే ఆతిథ్య వెస్టిండీస్.. ఈ నాలుగు జట్లే మెగా ఈవెంట్లో కీలకంగా మారనున్నాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. అయితే, ఈ లిస్టులో ఆయన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ పాకిస్తాన్ పేర్లను విస్మరించడం గమనార్హం.కాగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ గ్రూపు-ఏలో ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఇక జూన్ 5న టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్తాన్తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024- ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2). చదవండి: RCB vs CSK: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?.. మధ్యలో లక్నో! -
ఐపీఎల్ నుంచి స్వదేశానికి...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగింపు దశకు చేరగా... ఆయా జట్లకు కీలకమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు తిరుగుపయనమయ్యారు. జోస్ బట్లర్ (రాజస్తాన్), లివింగ్స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్, రీస్ టాప్లీ (బెంగళూరు)లు ఇంగ్లండ్కు బయలుదేరారు. వచ్చే నెల 2 నుంచి అమెరికా, వెస్టిండీస్లలో జరిగే టి20 ప్రపంచకప్కు తుది సన్నాహంగా సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్తో టి20 సిరీస్ ఆడనుంది.మే 22 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టి20ల సిరీస్ జరుగుతుంది. 22, 25, 28, 30 తేదీల్లో మ్యాచ్లు జరుగుతాయి. కాగా... ఈ ఐపీఎల్ సీజన్లో లివింగ్స్టోన్ ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రాజ స్టాన్ స్టార్ ఓపెనర్. ఈ సీజన్లో ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్ల్ని గెలిపించాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాక్స్, టాప్లీలలో జాక్స్ది కీలకపాత్ర. బెంగళూరు వరుస విజయాల్లో భాగమైన అతను లేకపోవడం జట్టుకు లోటే! చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు... చెన్నైతో ఈ నెల 18న తలపడుతుంది.ఇవి చదవండి: మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?.. కొట్టిపారేయలేం! -
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్కు ముందు రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. మరి కొన్ని రోజుల్లో టీ20 వరల్డ్కప్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో బట్లర్ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ పొట్టి వరల్డ్కప్ సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ స్వదేశంలో పాకిస్తాన్తో 4 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ మే 22న ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లు పాకిస్తాన్ సిరీస్ కంటే ముందే స్వదేశానికి రావాల్సి ఉంటుందని ఐపీఎల్ ప్రారంభంలోనే తమ ఆటగాళ్లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ ఇంగ్లండ్కు బయలు దేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది. తమ క్యాంప్ను బట్లర్ వీడి వెళ్తున్న వీడియోను రాజస్తాన్ ఎక్స్లో షేర్ చేసింది. బట్లర్తో పాటు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ జాక్స్, రీస్ టాప్లీ సైతం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యారు. విల్ జాక్స్, రీస్ టాప్లీ బట్లర్తో పాటు ఇంగ్లండ్కు వెళ్లిపోయారు. We’ll miss you, Jos bhai! 🥺💗 pic.twitter.com/gnnbFgA0o8— Rajasthan Royals (@rajasthanroyals) May 13, 2024 -
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ల కోసం పాక్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ జట్టులో కూడా వీరే..!
ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగే ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం 18 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (మే 2) ప్రకటించారు. ఇదే జట్టు నుంచే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేస్తామని పాక్ సెలెక్టర్లు తెలిపారు. ఇంగ్లండ్తో తొలి టీ20 (మే 22) అనంతరం వరల్డ్కప్ జట్టు ప్రకటన ఉంటుందని వెల్లడించారు. జట్ల ప్రకటనకు మే 24 డెడ్లైన్ కావడంతో ఆలోపే తమ వరల్డ్కప్ జట్టును వెల్లడిస్తామని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. పాక్ ఐర్లాండ్ పర్యటన ఈనెల 10న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్ మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. మే 10, 12, 14 తేదీల్లో డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం పాక్ ఐర్లాండ్ నుంచి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. మే 22, 25, 28, 30 తేదీల్లో నాలుగు టీ20 జరుగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన అనంతరం పాక్ ఇక్కడి నుంచే నేరుగా టీ20 ప్రపంచకప్ వేదికకు బయల్దేరుతుంది. టీ20 వరల్డ్కప్ యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1న ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీలో పాక్ ప్రయాణం జూన్ 6న మొదలవుతుంది. ఆ రోజున జరిగే తమ తొలి మ్యాచ్లో పాక్ ఆతిథ్య యూఎస్ఏతో తలపడనుంది. డల్లాస్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్లో పాక్.. భారత్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా జట్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది.పాక్ జట్టు విషయానికొస్తే.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహించనున్నాడు. పేసర్ హసన్ అలీ చాలాకాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అఘా సల్మాన్ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. కొద్దిరోజుల కిందట స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న హరీస్ రౌఫ్, ఆజమ్ ఖాన్ తిరిగి జట్టులోకి చేరారు. మణికట్టు స్పిన్నర్ ఉసామా మీర్, పేసర్ జమాన్ ఖాన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు.ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉస్మాన్ ఖాన్ -
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న ఇంగ్లండ్ కౌంటీ (గ్లోసెస్టర్షైర్) క్రికెటర్ బెన్ వెల్స్ 23 ఏళ్ల చిన్న వయసులోనే క్రికెట్కు వీడ్కోలు పలికాడు.వెల్స్ అరుదైన అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతితో (ARVC) బాధపడుతున్నట్లు ఇటీవల జరిపిన హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ARVC సమస్యతో బాధపడుతున్న వారు శారీరక శ్రమకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు.శారీరక శ్రమ లేకుండా క్రికెట్ ఆడటం అసాధ్యం కాబట్టి వెల్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆటకు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. కెరీర్ అర్దంతరంగా ముగియడంతో వెల్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. క్రికెట్ పట్ల తనకున్న మక్కువను వ్యక్తపరుస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. దీన్ని వెల్స్ కౌంటీ జట్టు గ్లోసెస్టర్షైర్ తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. వికెట్కీపర్ బ్యాటర్ అయిన వెల్స్.. 2021లో అరంగేట్రం చేసి స్వల్పకెరీర్లో ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 15 లిస్ట్-ఏ మ్యాచ్లు, 9 టీ20లు ఆడాడు. వెల్స్ ఇటీవలే లిస్ట్-ఏ ఫార్మాట్లో మెరుపు సెంచరీతో మెరిశాడు. లండన్ వన్డే కప్లో భాగంగా డర్హమ్తో జరిగిన మ్యాచ్లో వెల్స్ ఈ సెంచరీ చేశాడు. వెల్స్కు లిస్ట్-ఏ కెరీర్లో ఇది తొలి శతకం. కాగా, ఇంగ్లండ్ జాతీయ జట్టు ఆటగాడు జేమ్స్ టేలర్ కూడా వెల్స్ బాధపడుతున్న గుండె సమస్య కారణంగానే క్రికెట్కు అర్దంతరంగా వీడ్కోలు పలికాడు. -
టీమిండియాకు నో ఛాన్స్.. వరల్డ్కప్ సెమీస్కు చేరేది ఆ నాలుగు జట్లే: మైఖేల్ వాన్
టీ20 వరల్డ్కప్ 2024 ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టోర్నీ విజేతపై క్రికెట్ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు తమతమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పలానా జట్టు జగజ్జేతగా నిలుస్తుందని కొందరంటుంటే.. ఈ ఈ జట్లు సెమీస్కు చేరతాయని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా చాలామంది వ్యాఖ్యాతల లాగే వరల్డ్కప్పై తన అంచనాలను వెల్లడించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈసారి సెమీఫైనల్స్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఈసారి ఫైనల్ ఫోర్కు చేరడం కష్టమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వాన్ చెప్పిన జోస్యంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వాన్కు టీమిండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టు ఏ ప్రాతిపదిన సెమీస్కు చేరదో విశ్లేషించాలని సూచిస్తున్నారు. వరల్డ్కప్లో పాల్గొనే టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని.. సెమీస్కు కాదు, ఈసారి ఏకంగా టైటిలే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాపై అవాక్కులు చవాక్కులు పేలడం అలవాటుగా మార్చుకున్న వాన్కు తగు రీతిలో చురకలంటిస్తున్నారు. వాస్తవానికి ఈసారి వరల్డ్కప్ సెమీఫైనలిస్ట్లకు అంచనా వేయడం చాలా కష్టం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరల్డ్కప్లో టఫ్ ఫైట్ నెలకొంది. అన్ని జట్లు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా, అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. దీంతో ఏ జట్టు సెమీఫైనల్కు చేరుతుందో చెప్పడం చాలా కష్టం. వాన్ లాంటి అనుభజ్ఞులైన వ్యాఖ్యాతలు అశాస్త్రియమైన అంచనాలు వేసి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ కోసం న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఇదివరకే ప్రకటించారు. జట్ల ప్రకటనకు ఇవాళే ఆఖరి తేదీ (మే 1) కావడంతో మరికొన్ని గంటల్లో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించవచ్చు. పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఉగాండ, వెస్టిండీస్, పపువా న్యూ గినియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ దేశాలు తమ వరల్డ్కప్ జట్లు ప్రకటించాల్సి ఉంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్ టి20 జట్టులో జోఫ్రా ఆర్చర్
గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఏడాది తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. టి20 ప్రపంచకప్లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును మంగళవారం ప్రకటించారు. ఆర్చర్ పునరాగమనం చేయగా... జోస్ బట్లర్ కెపె్టన్గా కొనసాగుతాడు. మొయిన్ అలీ, బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, స్యామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లే, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అల్టిమేటం.. ఐపీఎల్ జట్లకు షాక్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్లో పాల్గొంటున్న తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 22లోగా స్వదేశానికి చేరుకోవాలని ఆజ్ఞాపించింది. టీ20 వరల్డ్కప్కు ముందు ఇంగ్లండ్ స్వదేశంలో పాక్తో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్కప్ కోసం ప్రకటించిన జట్టే ఈ సిరీస్లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసమే ఈసీబీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉండాలని ఆదేశించింది.పాక్తో ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి (మే 22) ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి కీలక దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే సంబంధిత జట్లపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పాక్తో సిరీస్ కోసమని ఐపీఎల్కు డుమ్మా కొడితే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలినట్లే.టీ20 వరల్డ్కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ఐపీఎల్ 2024లో వివిధ జట్లకు ఆడుతున్న ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టు సభ్యులు..జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)మొయిన్ అలీ (సీఎస్కే)బెయిర్స్టో (పంజాబ్)సామ్ కర్రన్ (పంజాబ్)లివింగ్స్టోన్ (పంజాబ్)విల్ జాక్స్ (ఆర్సీబీ)ఫిల్ సాల్ట్ (కేకేఆర్)రీస్ టాప్లే (ఆర్సీబీ)ఐపీఎల్ ప్లే ఆఫ్స్..మే 21: క్వాలిఫయర్-1మే 22: ఎలిమినేటర్మే 24: క్వాలిఫయర్-2మే 26: ఫైనల్ -
టీ20 వరల్డ్కప్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ బౌలర్ రీఎంట్రీ
టీ20 వరల్డ్కప్ 2024 కోసం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో ఆసక్తికర ఎంపికలేమీ జరుగలేదు. మోచేతి గాయం కారణంగా ఏడాదికాలంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇచ్చాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ జోర్డన్ను అనూహ్యంగా ఎంపిక చేశారు. జట్టులో స్పెషలిస్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేకపోవడంతో ఆ కోటాలో బెన్ డకెట్కు అవకాశం దక్కింది. వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేసినా బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో ఆదిల్ రషీద్, టామ్ హార్ట్లీ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్.. ఆల్రౌండర్ల కోటాలో విల్ జాక్స్, లివింగ్స్టోన్, సామ్ కర్రన్.. పేసర్ల విభాగంలో రీస్ టాప్లే, మార్క్ వుడ్ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.టీ20 వరల్డ్కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ -
మిస్టరీ.. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది..
అది 12వ శతాబ్దం. వారసత్వ సంక్షోభంతో ఇంగ్లండ్ సింహాసనం కోసం అంతర్యుద్ధం జరుగుతున్న కాలమది. దాన్ని చరిత్రలో ‘ది అనార్కీ’ అని పిలుస్తారు. ఆ అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే!సఫెక్లోని వూల్పిట్ అనే గ్రామంలో కొందరు పొలం పనులు చేసుకుంటున్నారు. అప్పుడే ఉన్నట్టుండి, సమీపంలో తోడేళ్ల కోసం తవ్విన గుంతలో ఎండుటాకుల అలికిడి బాగా పెరిగింది. ‘అబ్బ.. తోడేళ్లు పడినట్లు ఉన్నాయి. ఈ రోజుకి మన పంట పండింది’ అనుకున్నారు. వారంతా నెమ్మదిగా తోడేళ్ల గుంత వైపు నడిచారు. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది. ఆ అస్పష్టతకు కారణం స్వరం కాదు, భాష. ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అక్కడున్నవారెవ్వరికీ అర్థంకాలేదు.దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూస్తే ఆ గుంతలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చూస్తుంటే వారిద్దరూ అక్కా, తమ్ముడు అని అర్థమవుతోంది. కానీ ఇద్దరూ ఆకుపచ్చ చర్మంతో ఉన్నారు. వారి ఒంటి మీద దుస్తులు అసాధారణంగా, వింతగా కనిపించాయి. మానవులు కాదనే అనుమానం ఓ వైపు.. పసివాళ్లు అనే జాలి మరోవైపు.. పెనుగులాడుతుంటే.. చివరికి జాలే గెలిచింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పైకి తీసి, ‘రిచర్డ్ డి కాల్నే’ అనే ఊరిపెద్ద ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే పిల్లలకు ఆవాసం ఏర్పాటు చేశారు. అయితే తినడానికి ఏం పెట్టినా పిల్లలు వద్దన్నారు. వాళ్లు చెప్పిన మాటలు పిల్లలకు అర్థం కాలేదు. పిల్లల అవసరం పెద్దలకు బోధపడలేదు.ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు.. చాలారోజుల పాటు తిండి తినలేదట. అయితే కొంత కాలానికి.. ‘కాల్నే’ తోటలో పెరుగుతున్న బఠాణీ మొక్కల నుంచి బఠాణీలను తెంపుకుని తినడం మొదలుపెట్టారు. అలా కొన్ని నెలల పాటు వాటి మీదే బతకారు వాళ్లు. దాంతో ఆ పిల్లలు వేరే లోకం నుంచి వచ్చి పడ్డారన్న వాదన స్థానికుల్లో బలపడింది. తర్వాత కొంత కాలానికి.. ‘కాల్నే’ ఇంట్లో కాల్చిన రొట్టెలను తినడం మొదలుపెట్టారా పిల్లలు. దానివల్ల క్రమంగా వారి చర్మం రంగు మారుతూ వచ్చింది. పిల్లలు స్థానిక భాషను నేర్చుకుని.. మాట్లాడటం ప్రారంభించారు. అలా నెమ్మదిగా వాళ్లు సాధారణ మనుషులుగా మారుతున్న తరుణంలో.. ఉన్నట్టుండి పిల్లాడు చనిపోయాడు.తమ్ముడి మరణంతో ఆ పాప చాలా కుంగిపోయింది. తేరుకోవడానికి నెలలు పట్టింది. ఆ బాధలో చుట్టుపక్కలవారితో అనుబంధం పెరిగి.. అమ్మాయి మాటల్లో స్పష్టత వచ్చింది. ఆమె ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకుంది. భాష పూర్తిగా నేర్చుకున్న తర్వాత.. ఆ అమ్మాయి మాటలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ‘నేను, నా సోదరుడు గతంలో ఉన్న చోటకి.. ఇప్పుడు ఉంటున్న చోటికి చాలా తేడా ఉంది. అది వేరే గ్రహంలా అనిపిస్తోంది.మేము ఇక్కడికి ఎలా వచ్చామో మాకు తెలియదు. మేము తోడేళ్ల గుంతలో పడకముందు వరకూ మా నాన్నతోనే ఉన్నాం. ఉన్నట్టుండి పెద్ద గంటల మోత వినిపించింది. మేము ఆ సమీపంలో పెద్ద నదిని కూడా చూశాం. ఆ క్షణంలో మాకేమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి మీ ముందు ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. ఆ పిల్ల అంత చెప్పుకొచ్చినా ఆ అక్క, తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారనేది అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు.అలా ‘కాల్నే’ ఇంట్లోనే పెరిగిన ఆ అమ్మాయికి.. ‘ఆగ్నెస్ బారే’ అనే పేరుపెట్టారు. దగ్గర్లోని కింగ్స్ లిన్ పట్టణానికి చెందిన ‘ఆర్చ్డీకన్ రిచర్డ్’ని పెళ్లి చేసుకుంది. నివేదికల ప్రకారం ఆమెకు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆమె వంశస్థుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. ఆమెకు పుట్టిన పిల్లలు ఆకుపచ్చరంగులో పుట్టారని, వారు తిరిగి తమ పూర్వీకులను వెతుక్కుంటూ వెళ్లిపోయారంటూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆనాడు ఆ పిల్లల్ని చూసిన కొందరు చిత్రకారులు.. కొన్ని చిత్రాలను గీసి భద్రపరచారట.అయితే తర్వాత కాలంలో .. ఈ అక్కా తమ్ముళ్లిద్దరూ బెల్జియంలోని ఫ్లాండర్స్కి చెందిన ఫ్లెమిష్ వలసదారుల పిల్లలు కావచ్చు అనే ఓ వాదన పుట్టుకొచ్చింది. 12వ శతాబ్దంలో అనేక మంది ఫ్లెమిష్ వలసదారులు.. వూల్పిట్ సమీపంలోని ఫోర్న్హామ్ సెయింట్ మార్టిన్ పట్టణానికి చేరుకున్నారనే ఆధారాలూ దొరికాయి. ఫోర్న్హామ్ను, పూల్పిట్లను.. లార్క్ నది వేరు చేస్తుంది. ఆ పాప చెప్పిన నది అదే కావచ్చని అంచనా వేశారు.కింగ్ హెన్రీ ఐఐ పాలనలో, ఫోర్న్హామ్ యుద్ధంలో చాలామంది ఫ్లెమిష్ వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం కారణంగా ఆ అక్కాతమ్ముళ్లిద్దరూ తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మారి ఉండొచ్చు. పాప విన్న పెద్ద గంటల చప్పుడు .. యుద్ధానికి సంబంధించిందే అయ్యుండొచ్చు. అలా అనాథలైన ఈ పిల్లలు.. అడవి బాటలో పడి పోషకాహారం కరవై అనారోగ్యానికి గురై ఉండొచ్చని, పిల్లల్ని కాపాడినవారికి వీరి డచ్ భాష అర్థమై ఉండకపోవచ్చని అంచనా వేశారు.ఈ అంచనా నిజమైతే.. పిల్లల చర్మం ఎందుకు ఆకుపచ్చగా ఉంది? అనే ప్రశ్న.. మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. పోషకాహారం అందకుంటే చర్మం ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అందుకే సమతుల ఆహారం తీసుకున్నా కొద్ది రోజులకే వాళ్ల చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరిందని గుర్తుచేస్తూ.. పై వాదనకు బలాన్నిచ్చారు నిపుణులు.ఇదిలా ఉండగా.. ఆర్సెనిక్ పాయిజనింగ్ వల్ల కూడా చర్మం ఆకుపచ్చగా మారుతుందనే మరో వాదన వచ్చి షాక్నిచ్చింది అందరికీ! పిల్లలపై ఆ విషప్రయోగం జరిగి ఉంటుందా? కావాలనే పిల్లలకు ఈ విషం ఇచ్చి.. అడవిలో వదిలేసి వెళ్లారా? అనే ప్రశ్నలు ఈ కథను ఉత్కంఠగా మార్చాయి.అయితే ఆ ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు దొరకలేదు. ఆ దిశలో అన్వేషణ కొనసాగుతుండగానే.. ఆ పిల్లలు ఏలియ¯Œ ్స అని కొందరు నమ్మసాగారు. పిల్లలు దొరకడం నిజమే. కానీ ఎలా దొరికారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే ఊహాజనితమైన ఈ కథనాన్ని ప్రేరణగా తీసుకుని.. ఎన్నో నవలలు, పద్యాలు, నాటకాలు, సినిమాలు, డ్రామాలు పుట్టుకొచ్చాయి. దాదాపు ఎనిమిది శతాబ్దాలకు పైగా ఈస్టోరీ మిస్టరీగా కొనసాగుతునే ఉంది. — సంహిత నిమ్మనఇవి చదవండి: Funday Story: చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’? -
అద్భుతమైన సిక్సర్లు.. తండ్రిని గుర్తు చేసిన రాకీ ఫ్లింటాఫ్
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. రాకీ.. తండ్రి తరహాలోనే భారీ సిక్సర్లు కొడుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు. లాంకాషైర్ రెండో జట్టుకు ఆడుతూ డర్హమ్తో జరిగిన మ్యాచ్లో రాకీ కొట్టిన సిక్సర్లు తండ్రి ఆండ్రూను గుర్తు చేశాయి. రాకీ కొట్టిన సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. రాకీ సిక్సర్లు కొట్టిన విధానం తండ్రిని పోలి ఉందని నెటిజన్లు కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్లో రాకీ మూడు సిక్సర్లు బాదగా.. అందులోని ఓ సిక్సర్ ఆండ్రూ ట్రేడ్ మార్క్ సిక్సర్కు (పుల్షాట్) మక్కీ టు మక్కీగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. రాకీ మెరుపు షాట్లు ఆడుతూ తండ్రి బాటలోనే నడుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. Rocky Flintoff with 3️⃣ sixes on his way to an unbeaten half-century for the 2nd XI! 💥👏 Our 2nd XI clash with Durham ends in a draw as the rain interrupts once again. Scorecard 📋➡ https://t.co/WieghotbNI 🌹 #RedRoseTogether pic.twitter.com/Rrc2SWUB9t — Lancashire Cricket (@lancscricket) April 18, 2024 డర్హమ్తో జరిగిన మ్యాచ్లో తండ్రి తరహాలోనే ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రాకీ రెండు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ సమయానికి లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ పెద్ద కొడుకు కోరె ఫ్లింటాఫ్ కూడా లాంకాషైర్కే ఆడటం మరో విశేషం. ఆండ్రూ అలియాస్ ఫ్రెడ్డీ ఇద్దరు కొడుకులు క్రికెట్లో రాణిస్తుండటంతో ఇంగ్లండ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెడ్డీ 20వ శతాబ్దం చివరి నుంచి దాదాపు పదేళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్కు మకుటం లేని మహారాజుగా వెలిగిన విషయం తెలిసిందే. 2005 యాషెస్ సిరీస్లో ఫ్రెడ్డీ ఆల్రౌండర్గా విశేషంగా రాణించాడు. 2009లో క్రికెట్కు గుడ్బై చెప్పిన అనంతరం ప్రొఫెషనల్ బాక్సర్గా, ఫ్యాషన్ ప్రమోటర్గా, కార్ రేసర్గా, టీవీ ప్రజెంటర్గా పలు రంగాల్లో కాలు మోపిన ఫ్రెడ్డీ ప్రతి రంగంపై తనదైన ముద్ర వేశాడు. 2022లో కారు ప్రమాదానికి గురైన ఫ్రెడ్డీ.. ఇటీవలే క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. 46 ఏళ్ల ఫ్రెడ్డీ ఇంగ్లండ్ వన్డే జట్టుకు జీతం లేకుండా కోచ్గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది నవంబర్లో ఫ్రెడ్డీ హండ్రెడ్ లీగ్లోని నార్త్రన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత హండ్రెడ్ ఎడిషన్లో ఫ్రెడ్డీ సూపర్ చార్జర్స్ హెడ్ కోచ్గా వ్యవహరించాడు. -
ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు పైబడటం, దీర్ఘకాలిక అనారోగ్య కారణాల చేత సుబ్బా రో మృతి చెందినట్లు తెలుస్తుంది. భారత మూలాలున్న సుబ్బా రో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 1958-61 మధ్యలో 13 టెస్ట్లు ఆడి 46.85 సగటున 984 పరుగులు చేశాడు. సుబ్బా రో ఫస్ట్క్లాస్ కెరీర్లో సర్రే, నార్తంప్టన్ఫైర్ కౌంటీల తరఫున 260 మ్యాచ్లు ఆడి 14182 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 73 అర్దశతకాలు ఉన్నాయి. సుబ్బా రో కెరీర్ అత్యధిక స్కోర్ 300 పరుగులుగా ఉంది. పార్ట్ టైమ్ లెగ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సుబ్బా రో ఫస్ట్క్లాస్ క్రికెట్లో 87 వికెట్లు తీశాడు. 1981 భారత్, శ్రీలంక పర్యటనల్లో సుబ్బా రో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజర్గా వ్యవహరించాడు. 1985-1990 మధ్యలో సుబ్బా రో ఇంగ్లండ్ టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డును చైర్మన్గా వ్యవహరించాడు. రామన్ సుబ్బా రో మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ సంతాపం తెలిపాయి. ఈసీబీ, ఐసీసీలకు సుబ్బా రో చేసిన సేవలు ఎనలేనివని కొనియాడాయి. కాగా, రామన్ సుబ్బా రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఆంధ్రప్రదేశ్లోని బాపట్లకు చెందిన వాడు. సుబా రో తల్లి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ బ్రిటన్ మహిళ. పంగులూరి వెంకట సుబ్బారావు ఉన్నత చదువుల కోసం లండన్కు వెళ్లగా అక్కడ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి సంతానమే రామన్ సుబ్బా రో. -
స్పిన్ దిగ్గజం కన్నుమూత
ఇంగ్లండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్వుడ్ (78) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా డెరిక్ తుదిశ్వాస విడిచాడని తెలుస్తుంది. 1966-82 మధ్య ఇంగ్లండ్ తరఫున 86 టెస్ట్ల్లో 297 వికెట్లు పడగొట్టిన డెరిక్.. ఆ జట్టు తరఫున నేటికి అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్గా చలామణి అవుతున్నాడు. అలాగే డెరిక్ ఇంగ్లండ్ తరఫున ఆరో అత్యధిక వికెట్ టేకర్గానూ కొనసాగుతున్నాడు. కౌంటీల్లో కెంట్కు సుదీర్ఘకాలం పాటు (1963-87) ప్రాతనిథ్యం వహించిన డెరిక్.. ఆ జట్టు తరఫున 900కు పైగా మ్యాచ్లు ఆడి 2523 వికెట్లు పడగొట్టాడు. 17 ఏళ్ల వయసులోనే కెంట్కు ఆడటం మొదలుపెట్టిన డెరిక్.. 25 ఏళ్ల వయసులోపే 1000 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టి రికార్డుల్లోకెక్కాడు. డెరిక్ కెంట్ తరఫున ఓ సీజన్లో 100కు పైగా వికెట్ల ఘనతను 10 సార్లు సాధించాడు. 1966 సీజన్లో డెరిక్ ఏకంగా 157 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ 1966, 1967, 1978, 1979 సంవత్సరాల్లో ఇంగ్లండ్ లీడింగ్ బౌలర్గా కొనసాగాడు. డెరిక్ 1969 సెప్టెంబర్ నుంచి 1973 ఆగస్ట్ వరకు ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్గా చలామణి అయ్యాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుకు వన్డేల్లో సైతం ప్రాతినిథ్యం వహించిన డెరిక్.. ఈ ఫార్మాట్లో 26 మ్యాచ్లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ 1975 వన్డే వరల్డ్కప్లోనూ ఇంగ్లండ్కు ఆడాడు. వికెట్లు పడగొట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్న డెరిక్.. 2009లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ఎంపికయ్యాడు. డెరిక్ 2006లో కెంట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా.. 2008లో ఎంసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. డెరిక్ మరణం కెంట్ క్రికెట్ కుటుంబానికి తీరని లోటు అని క్లబ్ ప్రస్తుత అధ్యక్షుడు సైమన్ ఫిలిప్ సంతాప ప్రకటన విడుదల చేశారు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన హ్యారీ బ్రూక్
కౌంటీ ఛాంపియన్షిప్ 2024లో (డివిజన్ 2) భాగంగా లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, యార్క్షైర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ప్రస్తుత సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను 4 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల చేత బ్రూక్ ప్రస్తుత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బ్రూక్ స్థానాన్ని డీసీ యాజమాన్యం సౌతాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్తో భర్తీ చేసింది. బ్రూక్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బ్రూక్ ఐపీఎల్ నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుని వ్యక్తిగత కారణాలను సాకుగా చూపాడంటూ ప్రచారం జరుగుతుంది. బ్రూక్ను 2023 వేలంలో సన్రైజర్స్ 13.25 కోట్లకు సొంతం చేసుకోగా.. తాజాగా సీజన్లో అతనికి ఆ స్థాయి మొత్తం లభించలేదు. ఈ కారణంగానే బ్రూక్ ఐపీఎల్ను స్కిప్ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. బ్రూక్తో పాటు ఆడమ్ లిత్ (101) కూడా సెంచరీతో కదంతొక్కడంతో యార్క్షైర్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అంతకుముందు లీసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 354 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ హ్యారిస్ (56), బెన్ మైక్ (90), టామ్ స్క్రీవెన్ (56) అర్దసెంచరీలతో రాణించారు. యార్క్షైర్ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన తర్వాత లీసెస్టర్షైర్ సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. 26/0 స్కోర్ వద్ద భారీ వర్షం కురువడంతో మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. -
ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రీలంక సంచలన బ్యాటర్
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డును శ్రీలంక సంచలన బ్యాటర్ కమిందు మెండిస్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఈ అవార్డు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్కు దక్కింది. పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ పోటీపడగా.. మెజార్టీ మద్దతు శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్కు లభించింది. Kamindu Mendis and Maia Bouchier have won the ICC Player of the Month awards for March 2024. 🌟 pic.twitter.com/h2QClz51SA — CricTracker (@Cricketracker) April 8, 2024 మహిళల విషయానికివస్తే.. ఈ విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లే గార్డ్నర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ పోటీ పడగా.. మైయా బౌచియర్ను అవార్డు వరించింది. మెండిస్ మార్చిలో బంగ్లాదేశ్తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో అతను రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మైయా బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్లో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్గా నమోదైంది. ఈ సిరీస్ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. -
టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లో పూర్తి స్థాయి ఆల్రౌండర్గా సేవలందించడం కోసం వరల్డ్కప్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్కే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు. కాగా, ఇంగ్లండ్ ఈ ఏడాది మొత్తం 12 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ టెస్ట్ల షెడ్యూల్ బిజీగా ఉండటంతో పూర్తి స్థాయి ఆల్రౌండర్గా సేవలందించడం కోసం స్టోక్స్ ఐపీఎల్, టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకున్నాడు. జులైలో వెస్టిండీస్తో సిరీస్ నుంచి ఇంగ్లండ్ టెస్ట్ ప్రయాణం మొదలవుతుంది. అనంతరం ఈ జట్టు స్వదేశంలో భారత్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత ఆసీస్లో యాషెస్ సిరీస్.. ఇలా ఈ వార్షిక సంవత్సరంలో ఇంగ్లండ్ 12 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఇటీవల భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మోకాలి శస్త్ర చికిత్స కారణంగా స్టోక్స్ బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. భారత్తో తాజాగా జరిగిన సిరీస్లో స్టోక్స్ చాలాకాలం తర్వాత బంతి పట్టాడు. ఇదిలా ఉంటే యుఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ జూన్ 4న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. బార్బడోస్లో జరిగే ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ను స్కాట్లాండ్ ఢీకొంటుంది. -
Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్..!
41 సంవత్సరాల 7 నెలల 8 రోజులు.. ఈ వయసులో అంతర్జాతీయ క్రీడల్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకొని ఎక్కడో ఒక చోట కోచ్గానో లేక వ్యాఖ్యాతగానో పని చేస్తూ ఉంటారు. లేదంటే ఆటకు దూరంగా దానితో సంబంధం లేకుండా కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. కానీ జేమ్స్ అండర్సన్ ఇంకా క్రికెట్ మైదానంలో పరుగెడుతూ ఉన్నాడు. పట్టుదలగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటతత్త్వమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏకంగా 700 వికెట్ల మైలురాయిని అందుకునేలా చేసింది. 21 ఏళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ కెరీర్ అతని స్థాయి ఏమిటో చూపిస్తే, అలసట లేకుండా సాగుతున్న ప్రయాణం ఎన్నో అద్భుత ప్రదర్శనలను ప్రపంచ క్రికెట్ అభిమానులకు అందించింది. సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ సంవత్సరాలు ఆటలో కొనసాగడంలో విశేషం లేదు. గతంలోనూ చాలామంది ఇంతకంటే ఎక్కువ ఏళ్లు క్రికెట్ ఆడారు. కానీ ఎంతో కఠోర శ్రమతో కూడిన పేస్ బౌలింగ్లో అన్ని ప్రతికూలతలను, గాయాలను దాటి ఒక బౌలర్ ఇలా సత్తా చాటడం ఎంతో అరుదైన విషయం. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జిమ్మీ అండర్సన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ క్రికెట్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 187 టెస్టు మ్యాచ్లు.. జిమ్మీ అండర్సన్ కెరీర్ ఇది. ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. 16 ఏళ్లకే అరంగేట్రం చేసిన బ్యాటర్గా సచిన్తో పోలిస్తే 20 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన అండర్సన్ కెరీర్ ప్రస్థానం పూర్తిగా భిన్నం. టి–20ల కాలంలో నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోతున్న ఈతరం బౌలర్లతో పోటీ పడుతూ రోజుకు 15–20 వరకు అంతర్జాతీయ టెస్టుల్లో బౌలింగ్ చేయడం అసాధారణం. వీటికి 194 వన్డేలు అదనం. టెస్టులు, వన్డేలు కలిపి అతను దాదాపు 50 వేల బంతులు బౌలింగ్ చేశాడు. వన్డేలకు దాదాపు 9 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా టెస్టుల్లో ఇంకా అదే జోరును అండర్సన్ కొనసాగించి చూపిస్తున్నాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జేమ్స్ అండర్సన్ క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. అతను చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే బాగా ఇష్టపడ్డాడు. చూడటంతో పాటు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా ఆడేవాడు. అందుకే ఇంట్లోనూ ప్రోత్సాహం లభించింది. స్కూల్ క్రికెట్నుంచే అతను బౌలింగ్పై దృష్టి పెట్టాడు. సాధనతో ఆపై పూర్తి స్థాయి పేస్ బౌలర్గా సత్తా చాటాడు. దాంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్థానిక లాంక్షైర్ కౌంటీ మైనర్ లీగ్లలో అండర్సన్ సత్తా చాటాడు. దాంతో లాంక్షైర్ ప్రధాన కౌంటీ టీమ్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అండర్సన్ ఎంత మెరుగ్గా కౌంటీల్లో ప్రభావం చూపించాడంటే లాంక్షైర్ తరఫున కేవలం 3 వన్డేలు ఆడగానే అతనికి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు లభించడం విశేషం. తన జెర్సీపై కనీసం తన పేరు, నంబర్ కూడా లేకుండానే హడావిడిగా టీమ్తో కలిసిన అండర్సన్ అడిలైడ్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్ను ప్రదర్శించాడు. దాంతో 2003 వరల్డ్ కప్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇలా మొదలైన ఆరంభం రెండు దశాబ్దాలుగా గొప్పగా సాగుతూనే ఉంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలతో.. అండర్సన్ కెరీర్ ఆరంభంలో రెండు పార్శా్వలతో సాగింది. చక్కటి బౌలింగ్తో లయతో సాగుతున్నప్పుడు అతనిలాంటి మంచి బౌలర్ ఎవరూ లేరన్నట్లుగా వికెట్ల వర్షం కురిసింది. కానీ ఒక్కసారి లయ కోల్పోతే అంత చెత్త బౌలర్ లేరన్నట్లుగా బ్యాటర్లు చితకబాదారు. లార్డ్స్ మైదానంలో తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే ఐదు వికెట్లతో తన రాకను ఘనంగా చాటడం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్పై వన్డేల్లో హ్యట్రిక్ అతడికి తగిన గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ అప్పటికే ఇంగ్లండ్ జట్టులో పలువురు సీనియర్లు పాతుకుపోయి ఉండటంతో తగినన్ని అవకాశాలు దక్కలేదు. దాంతో విరామాలతో వచ్చిన అవకాశాల్లో అండర్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే 2005 తర్వాత ఇంగ్లండ్ ప్రధాన పేసర్లంతా ఆటకు గుడ్బై చెప్పడంతో వచ్చిన అండర్సన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వెలింగ్టన్లో న్యూజిలాండ్పై చెలరేగి ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించడంతో టీమ్లో స్థానం సుస్థిరమైంది. సంప్రదాయ స్వింగ్, సీమ్ బౌలింగ్తో పాటు రివర్స్ స్వింగ్ విద్యలో కూడా ఆరితేరిన తర్వాత అండర్సన్ మరింత ప్రమాదకరంగా మారాడు. కెరీర్ ఆరంభంలో తన యాక్షన్ను మార్చుకొని కొంత ఇబ్బందిపడిన అతను కొద్ది రోజులకే మళ్లీ తన పాత్ సైడ్ ఆర్మ్ యాక్షన్కు వచ్చి అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 2010 తర్వాత అండర్సన్ తనను తాను అత్యుత్తమ పేసర్గా తీర్చి దిద్దుకున్నాడు. ఇంగ్లండ్లో హీరో లేదా జీరో అయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉండే సిరీస్ యాషెస్. సొంత గడ్డపై పలుమార్లు ఆసీస్ బ్యాటర్ల పని పట్టిన అండర్సన్ కెరీర్లో 2010–11 ఆస్ట్రేలియా పర్యటన హైలైట్గా నిలిచింది. ఆసీస్ను వారి సొంతగడ్డపై 3–1తో చిత్తుగా ఓడించడంలో 24 వికెట్లతో అండర్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్పైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2015 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్బై చెప్పిన అండర్సన్ తాను అనుకున్నట్లుగా ఈ ఫార్మాట్లో మరిన్ని గొప్ప ప్రదర్శనలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగి.. అండర్సన్ సొంత మైదానాల్లో మాత్రమే రాణిస్తాడని, వాతావరణంలో కాస్త మంచు, తేమ ఉంటేనే స్వింగ్తో చెలరేగుతాడనేది అతనిపై పలు సందర్భాల్లో వచ్చిన విమర్శ. అయితే ఒక్కో ఏడాది ఆటలో రాటుదేలుతూ పోయిన తర్వాత ఇలాంటి విమర్శలకు అతను చెక్ పెట్టాడు. ఇంగ్లండ్లోని అన్ని వేదికలపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో సహజంగానే అతని పేరు కనిపిస్తుంది. కానీ వీటికి తోడు శ్రీలంకలోని గాలేలో 6 వికెట్లు, కేప్టౌన్లో 5 వికెట్లు, అడిలైడ్లో 5 వికెట్లు, 2012లో నాగ్పూర్లో భారత్పై 4 కీలక వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన.. ఇలా విదేశీ గడ్డపై అండర్సన్ తీసిన వికెట్లు అతని ప్రభావాన్ని చూపించాయి. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఇప్పటి వరకు అతని ఆటలో సాగిన పురోగతి, వేర్వేరు ప్రత్యర్థులపై నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాస్టర్ ఆఫ్ స్వింగ్ నుంచి అతను మాస్టర్ ఆఫ్ ఆల్ కండిషన్స్గా మారాడు. 700 వికెట్లు ముగ్గురే సాధించగా వారిలో మురళీధరన్, వార్న్ స్పిన్నర్లు కాగా అండర్సన్ తొలి పేస్ బౌలర్. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ ఎక్కువ టెస్టులు ఆడటం సహజంగానే అండర్సన్కు కలిసి వచ్చినా, అతను ఆటడం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే వైన్లాగా అతను మారాడు. అతని వికెట్లను మూడు దశలుగా విడగొడితే; తొలి 44 టెస్టుల్లో సగటు 35 కాగా, తర్వాతి 47 టెస్టుల్లో అది 28కి తగ్గింది. ఇక 2014నుంచి ఆడిన 96 టెస్టుల్లో సగటు ఏకంగా 22.66కి తగ్గడం అంటే బౌలర్గా అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండర్సన్ ఏకంగా 220 వికెట్లు తీయడం విశేషం. స్వింగ్కు పెద్దగా అనుకూలించని ఉపఖండపు పిచ్లపై కూడా గత పదేళ్లలో అండర్సన్ 23.56 సగటును నమోదు చేయడం అతను ఎంత ప్రభావం చూపించాడో చెబుతుంది. మురళీధరన్ (800 వికెట్లు)ను చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మరో 9 వికెట్లు తీసి షేన్వార్న్ (708)ను దాటడం అండర్సన్ తదుపరి లక్ష్యం. ఇంగ్లండ్ బోర్డు అతనిపై నమ్మకముంచితే, అతని ఘనతలను పరిగణనలోకి తీసుకొని వేటు వేయకుండా మరికొంత కాలం ఆడే అవకాశం కల్పిస్తే సచిన్ అత్యధిక టెస్టుల (200) రికార్డును అండర్సన్ అధిగమించగలడు. ఒకవేళ ఆ లోపే అతని ఆట ముగిసిపోయినా, వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా అతను సాధించిన ఘనతల విలువ ఏమాత్రం తగ్గదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది. -
సత్తా చాటిన హీథర్ నైట్.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్లో భాగంగా ఇవాళ (మార్చి 19) జరిగిన తొలి మ్యాచ్లో స్థానిక మహిళా టీమ్ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సత్తా చాటిన హీథర్ నైట్.. హీథర్ నైట్ మెరుపు అర్దశతకంతో (39 బంతుల్లో 63; 8 ఫోర్లు,సిక్స్) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. నైట్కు జతగా మైయా బౌచియర్ (43 నాటౌట్), డంక్లీ (32) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్, ఫ్రాన్ జోనాస్, లియా తుహుహు తలో వికెట్ పడగొట్టారు. తడబడిన న్యూజిలాండ్.. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వేగంగా పరుగులు సాధించలేక లక్ష్యానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుజీ బేట్స్ (65) అర్దశతకంతో రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన వారు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. బ్రూక్ హల్లీడే 27 నాటౌట్, జార్జియా ప్లిమ్మర్ 21 పరుగులు చేయగా.. మ్యాడీ గ్రీన్ 8, జెస్ కెర్ 8 నాటౌట్, ఇసబెల్లా గేజ్, మికేలా గ్రేగ్ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు పడగొట్టగా.. సారా గ్లెన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 మార్చి 22న జరుగనుంది. -
UK YouTuber Couple: ఆటోప్రయాణంలో అడుగడుగునా ఆనందమే వైరల్
ఇంగ్లాండ్కు చెందిన లియామ్, జావిన్ దంపతులకు మన దేశం అంటే చాలా ఇష్టం. ‘దోజ్ హ్యాపీ డేస్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఈ దంపతులు మన దేశానికి వచ్చారు. వారి స్థాయికి ఏ ఫైవ్స్టార్ హోటల్లోనో ఉండవచ్చు. ఖరీదైన కారులో ప్రయాణించవచ్చు. అలా కాకుండా ఈ డైనమిక్ ద్వయం ఒక ఆటోరిక్షాలో అమృత్సర్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో ప్రాంతాలు పర్యటించింది. ఆటోకు ‘పీట్’ అని పేరు పెట్టి అందంగా అలంకరించారు. ఆటోడ్రైవింగ్ నేర్చుకున్నారు. చెన్నైలోని ట్రాఫిక్ ప్రాంతాల్లో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘ఫరవాలేదు. ఇక మనం ముందుకు వెళ్లవచ్చు’ అని నమ్మకం వచ్చిన తరువాతే ప్రయాణం ప్రారంభించారు. తమ ఆటో ప్రయాణంలో చెప్పలేనంత సందడి ఉన్న సంతలను, ధ్యానముద్రతో ఉన్న ప్రశాంత దేవాలయాలను, విభిన్న విశ్వాసాలు, ఆచారాల సామరస్య దృశ్యాలను, బాటసారులను, చెట్టుచేమను చూస్తూ ఎంజాయ్ చేశారు. నోరూరించే వంటకాలను ఆస్వాదించారు. -
Bengaluru: స్టంప్ బ్రేక్ చేసిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైరల్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం కర్ణాటక జట్టుకు ఆడుతున్నాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దిగి అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు! అదేంటీ.. ఆర్చర్.. కర్ణాటక టీమ్లో ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?! ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్షిప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ససెక్స్, లంకాషైర్ జట్లు ఇండియాకు వచ్చాయి. బెంగళూరులో పదిరోజుల పాటు జరుగనున్న శిక్షణా శిబిరంలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ససెక్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా బెంగళూరుకు విచ్చేశాడు. ససెక్స్- కర్ణాటక(అండర్ 19, అండర్ 23 ప్లేయర్లు కలగలిసిన టీమ్) జట్ల మధ్య తొలి రోజు ఆటకు దూరంగా ఉన్న అతడు.. శుక్రవారం బరిలోకి దిగాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా కర్ణాటక జట్టులోకి వచ్చి మార్నింగ్ సెషన్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌల్ చేసిన ఆర్చర్ దెబ్బకు స్టంప్ బ్రేక్ అయిపోయింది. ఇక మరో సందర్భంలో బ్యాటర్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పెవిలియన్కు పంపాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కర్ణాటక తరఫున.. తమ బ్యాటర్లను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసిన వీడియోలను ససెక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2023 టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్).. ఇంతవరకు మళ్లీ కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. కుడి మోచేతి గాయంతో బాధపడుతున్న అతడు.. టీ20 ప్రపంచకప్-2024 నాటికి ఇంగ్లండ్ జట్టుతో చేరే అవకాశం ఉంది. Jofra’s taken another wicket and broken the stump! 🚨 pic.twitter.com/9L7X2u4PEt — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 Wicket - Alsop out lbw, b Archer The KSCA XI’s newest addition looks like a decent player tbf. 😅 pic.twitter.com/KXOTr6AgRI — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 -
ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం
ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-2024 నుంచి బ్రూక్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీకి బ్రూక్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియాతో టెస్టు సిరీస్ నుంచి సైతం బ్రూక్ ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. కాగా గతేడాది సీజన్తో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున బ్రూక్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ ఏకంగా రూ.13.23 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. కానీ ఎస్ఆర్హెచ్ నమ్మకాన్ని బ్రూక్ వమ్ము చేశాడు. 11 మ్యాచ్ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని ఐపీఎల్-2024కు ముందు ఆరెంజ్ ఆర్మీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన హ్యారీని రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అయితే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం ఈ ఏడాది సీజన్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడికి బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చేసింది. చదవండి: Happy Birthday Siraj: బ్యాటర్ టూ బౌలర్.. తండ్రి మరణాన్ని సైతం తట్టుకుని! ఎంతో మందికి -
ధూమ్ ధామ్
హిమాలయాల చెంత భారత టెస్టు క్రికెట్ ప్రదర్శన మరింత ఉన్నతంగా శిఖరానికి చేరింది...ధర్మశాలలో అంచనాలకు అనుగుణంగా చెలరేగిన మన జట్టు ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టి టెస్టు సిరీస్ను 4–1తో సగర్వంగా గెలుచుకుంది... 259 పరుగుల ఆధిక్యం అంటేనే టీమిండియా గెలుపు లాంఛనం అనిపించింది... కానీ ఇంగ్లండ్ కనీస స్థాయి పోరాటపటిమ కూడా ప్రదర్శించలేక చేతులెత్తేసింది. బజ్బాల్ ముసుగులో అసలు టెస్టును ఎలా ఆడాలో మరచిపోయిన ఆ జట్టు ఆటగాళ్లు గుడ్డిగా బ్యాట్లు ఊపి పేలవ షాట్లతో వేగంగా తమ ఓటమిని ఆహ్వానించారు. తన వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో అశ్విన్ ఈ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకోగా...విజయంతో తమ వంతు పాత్ర పోషించిన కుర్రాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఓటమితో మొదలైన ఈ ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్కు ఇన్నింగ్స్ విజయంతో భారత్ ఘనమైన ముగింపునిచ్చింది. ధర్మశాల: సొంతగడ్డపై టెస్టుల్లో భారత జట్టు తమ స్థాయి ఏమిటో మరోసారి చూపించింది. మూడో రోజే ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు వెనుకబడి శనివారం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్ (128 బంతుల్లో 84; 12 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, అశ్విన్ (5/77) ఐదు వికెట్లు పడగొట్టాడు. 7 వికెట్లతో పాటు కీలక పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ తర్వాతి నాలుగు మ్యాచ్లు గెలిచి సిరీస్ను 4–1తో సొంతం చేసుకుంది. 2 డబుల్ సెంచరీలు సహా మొత్తం 712 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. రూట్ మినహా... వెన్నునొప్పితో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో కెపె్టన్ రోహిత్ మైదానంలోకి దిగలేదు. దాంతో బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఆలస్యం చేయకుండా రెండో ఓవర్లోనే అశ్విన్ కు బౌలింగ్ బాధ్యత అప్పగించాడు. అంతే...ఐదో బంతికి డకెట్ (2) అవుట్తో మొదలైన ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. కొద్ది సేపటికి క్రాలీ (0) కూడా వెనుదిరగ్గా, ఒలీ పోప్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో జానీ బెయిర్స్టో (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్లు), రూట్ మాత్రమే 56 పరుగుల భాగస్వామ్యంతో కొద్దిసేపు ప్రతిఘటించారు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్లోనే మూడు సిక్సర్లతో బెయిర్స్టో దూకుడు ప్రదర్శించాడు. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే బెయిర్స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, స్టోక్స్ (2) పేలవ ఫామ్ కొనసాగింది. లంచ్ వరకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. విరామం తర్వాత ఫోక్స్ (8)ను పడగొట్టి అశ్విన్ ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లతో దెబ్బ కొట్టగా...తర్వాతి వికెట్ జడేజా ఖాతాలో చేరింది. మరో ఎండ్లో పోరాడుతున్న రూట్ ఇక లాభం లేదనుకొని ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్లో కొట్టిన షాట్కు లాంగాన్ వద్ద బుమ్రా క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. టెస్టు క్రికెట్కు ప్రోత్సాహకాలు... యువ ఆటగాళ్లు టెస్టు ఫార్మాట్పై మరింత శ్రద్ధ పెట్టేందుకు బీసీసీఐ కొత్త తరహా ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. టెస్టులు రెగ్యులర్గా ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుతో పాటు ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ పేరుతో భారీ మొత్తం అందించనుంది. 2022–23 సీజన్నుంచే దీనిని వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఏడాదిలో భారత జట్టు ఆడే టెస్టుల్లో కనీసం సగానికి పైగా టెస్టులు ఆడితే రూ. 30 లక్షలు అందిస్తారు. 75 శాతం పైగా మ్యాచ్లు ఆడితే ఈ మొత్తం రూ.45 లక్షలు అవుతుంది. తుది జట్టులో లేని ప్లేయర్కు ఇందులో సగం లభిస్తుంది. ఉదాహరణకు భారత జట్టు ఏడాదిలో 10 టెస్టులో ఆడితే ఒక ఆటగాడు అన్ని మ్యాచ్లలోనూ బరిలోకి దిగితే అతనికి రూ.4.50 కోట్లు లభిస్తాయి. ఒక్కో మ్యాచ్ ఫీజు రూ.15 లక్షల ద్వారా వచ్చే రూ.1.50 కోట్లకు ఇది అదనం. సగంకంటే తక్కువ టెస్టులు ఆడితే ఇది వర్తించదు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218; భారత్ తొలి ఇన్నింగ్స్ 477; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) సర్ఫరాజ్ (బి) అశ్విన్ 0; డకెట్ (బి) అశ్విన్ 2; పోప్ (సి) యశస్వి (బి) అశ్విన్ 19; రూట్ (సి) బుమ్రా (బి) కుల్దీప్ 84; బెయిర్స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; స్టోక్స్ (బి) అశ్విన్ 2; ఫోక్స్ (బి) అశ్విన్ 8; హార్ట్లీ (ఎల్బీ) (బి) బుమ్రా 20; వుడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; బషీర్ (బి) జడేజా 13; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 195. వికెట్ల పతనం: 1–2, 2–21, 3–36, 4–92, 5–103, 6–113, 7–141, 8–141, 9–189, 10–195. బౌలింగ్: బుమ్రా 10–2–38–2, అశ్విన్ 14–0–77–5, జడేజా 9–1–25–1, కుల్దీప్ 14.1–0–40–2, సిరాజ్ 1–0–8–0. జిమ్మీ@ 700 ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్గా, తొలి పేసర్గా ఘనతకెక్కాడు. శనివారం కుల్దీప్ను అవుట్ చేయడంతో ఈ వికెట్ అతని ఖాతాలో చేరింది. అత్యధిక వికెట్ల జాబితాలో స్పిన్నర్లు మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే అతనికంటే ముందున్నారు. 41 ఏళ్ల 7 నెలల వయసులో తన 187వ టెస్టులో అతను ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. మే 2003లో జింబాబ్వేపై అండర్సన్ తన తొలి టెస్టు ఆడాడు. 178 = 178 భారత జట్టు టెస్టు చరిత్రలో తొలి సారి విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా వచ్చింది. ఇప్పటివరకు మన విజయాలకంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. భారత్ మొత్తం 579 టెస్టులు ఆడగా 222 మ్యాచ్లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. 36 అశ్విన్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 36వ సారి. రిచర్డ్ హ్యాడ్లీ (36)ని సమం చేశాడు. ‘ఒక టెస్టు గెలవాలంటే అన్నీ సరిగ్గా కుదరాలి. ఈ సారి మేం అలాగే చేయగలిగాం. కొందరు ఆటగాళ్లు ఏదో ఒక దశలో సిరీస్లో అందుబాటులో ఉండరని తెలుసు. టెస్టులు ఎక్కువగా ఆడకపోయినా ఈ కుర్రాళ్లందరికీ మంచి అనుభవం ఉంది. మ్యాచ్కు అనుగుణంగా వారిని వాడుకున్నాం. ఒత్తిడి ఎదురైనప్పుడు అంతా సరిగా స్పందించారు. ఇది సమష్టి విజయం. పరుగులు చేయడం గురించే చర్చిస్తాం కానీ టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. మా బౌలర్లు దానిని చేసి చూపించారు. కుల్దీప్, యశస్వి గొప్పగా ఆడారు’ –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
IND Vs ENG 5th Test Photos: టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం (ఫొటోలు)
-
Ind Vs Eng: బంతి గింగిరాలు.. మూడోరోజే ఇంగ్లండ్ కథ ముగిసేనా?
ధర్మశాల టెస్టు మ్యాచ్ రెండో రోజు ఊహించినట్లుగానే అంచనాలకు అనుగుణంగా సాగింది...పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్ ఇంగ్లండ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శుక్రవారం ఆటలో 338 పరుగులు రాబట్టింది...రోహిత్, గిల్ సెంచరీలు పూర్తి చేసుకొని సగర్వంగా నిలవగా...యువ ఆటగాళ్లు పడిక్కల్, సర్ఫరాజ్ భారీ భాగస్వామ్యంతో తమ వంతు పాత్ర పోషించారు. ఒక దశలో ఒక పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయినా దాని ప్రభావం జట్టుపై పడలేదు... ఫలితంగా ఇప్పటికే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమిండియా విజయానికి కావాల్సిన సరంజామాను సిద్ధం చేసుకుంది. సుదీర్ఘ భారత పర్యటనలో తమ చివరి ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్లను ఎదుర్కొని ఇంగ్లండ్ ఏమాత్రం పోరాటపటిమ కనబరుస్తుందనేది చూడాలి. ఒకవేళ భారత స్పిన్నర్లు రాణిస్తే మూడోరోజు భారత్ ఘన విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ధర్మశాల: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 4–1తో ముగించే దిశగా భారత జట్టు వేగంగా దూసుకుపోతోంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 120 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (150 బంతుల్లో 110; 12 ఫోర్లు, 5 సిక్స్లు), రోహిత్ శర్మ (162 బంతుల్లో 103; 13 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 171 పరుగులు జోడించారు. దేవ్దత్ పడిక్కల్ (103 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (60 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 97 పరుగులు జత చేయడం విశేషం. శతకాలు పూర్తి... రెండో రోజు ఆటను రోహిత్, గిల్ బౌండరీలతో దూకుడుగా మొదలు పెట్టారు. వీరిని నిలువరించేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. 68 పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్ను క్రాలీ వదిలేయడం భారత్కు కలిసి రాగా, 64 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ముఖ్యంగా వుడ్, బషీర్ బౌలింగ్లో భారత బ్యాటర్లు ధారాళంగా పరుగులు రాబట్టారు. ఇదే జోరును కొనసాగిస్తూ మూడు బంతుల వ్యవధిలో ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు. 154 బంతుల్లో రోహిత్ 12వ టెస్టు సెంచరీ రాగా, 137 బంతుల్లో గిల్ నాలుగో సెంచరీని అందుకున్నాడు. తొలి సెషన్లో భారత్ 30 ఓవర్లలో 129 పరుగులు చేయగా, ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే లంచ్ తర్వాత వరుస ఓవర్లలో వీరిద్దరు వెనుదిరిగారు. గత జూన్ తర్వాత తొలి సారి బౌలింగ్కు దిగిన స్టోక్స్ తన మొదటి బంతికే రోహిత్ను బౌల్డ్ చేయగా, తర్వాతి ఓవర్లో గిల్ను మరో చక్కటి బంతితో అండర్సన్ బౌల్డ్ చేశాడు. కుర్రాళ్ల జోరు... మూడో వికెట్గా గిల్ అవుటైన సమయంలో భారత్ ఆధిక్యం 61 పరుగులు మాత్రమే! రెండు కీలక వికెట్లు తీసి ఒత్తిడి పెంచేందుకు ఇంగ్లండ్ సిద్ధం కాగా...భారత యువ బ్యాటర్లు పడిక్కల్, సర్ఫరాజ్ దానిని సమర్థంగా అడ్డుకున్నారు. మూడో టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్, అరంగేట్ర బ్యాటర్ పడిక్కల్ భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లింది. అండర్సన్ ఓవర్లో మూడు ఫోర్లతో ధాటిని చూపిన పడిక్కల్ తొలి 30 పరుగుల్లో 7 ఫోర్లు ఉండటం విశేషం. మరో వైపు ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన సర్ఫరాజ్ ఆ తర్వాత జోరు పెంచాడు. వుడ్ బౌలింగ్లో అతను కొట్టిన 3 ఫోర్లు, సిక్స్ హైలైట్గా నిలిచాయి. బషీర్ ఓవర్లో 2 ఫోర్లతో సర్ఫరాజ్ 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో సెషన్లో భారత్ 24 ఓవర్లలో 112 పరుగులు రాబట్టింది. అయితే టీ విరామం తర్వాత తొలి బంతికే సర్ఫరాజ్ వెనుదిరిగాడు. అనంతరం 83 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్న పడిక్కల్ కూడా కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు. జురేల్ (15) ప్రభావం చూపలేకపోగా...హార్ట్లీ ఒకే ఓవ ర్లో జడేజా (15), అశ్విన్ (0)లను వెనక్కి పంపాడు. ఈ దశలో కుల్దీప్ (27 బ్యాటింగ్) పట్టుదల కనబర్చగా, బుమ్రా (19 బ్యాటింగ్) అండగా నిలిచాడు. వీరిద్దరు 18 ఓవర్ల పాటు మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు. మూడోరోజు ఆటలో బంతే కీలకం.. భారత జట్టు ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉంది. ఇక, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా భారత స్పిన్నర్లు చెలరేగితే నేడే దాదాపు భారత్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొదటిరోజే కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ను తక్కువ స్కోర్కే ఆలౌట్ చేసింది భారత జట్టు. అదే విధంగా మూడో రోజు కూడా పిచ్ స్పిన్కు అనుకూలిస్తే మన బౌలర్లు తప్పకుండా సత్తా చాటుతారు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218; భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బి) స్టోక్స్ 103; గిల్ (బి) అండర్సన్ 110; పడిక్కల్ (బి) బషీర్ 65; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) బషీర్ 56; జడేజా (ఎల్బీ) (బి) హార్ట్లీ 15; జురేల్ (సి) డకెట్ (బి) బషీర్ 15; అశ్విన్ (బి) హార్ట్లీ 0; కుల్దీప్ (బ్యాటింగ్) 27; బుమ్రా (బ్యాటింగ్) 19; ఎక్స్ట్రాలు 6; మొత్తం (120 ఓవర్లలో 8 వికెట్లకు) 473. వికెట్ల పతనం: 1–104, 2–275, 3–279, 4–376, 5–403, 6–427, 7–427, 8–428. బౌలింగ్: అండర్సన్ 14–1–59–1, వుడ్ 15–1–89–0, హార్ట్లీ 39–3–126–2, బషీర్ 44–5–170–4, స్టోక్స్ 5–1–17–1, రూట్ 3–0–8–0.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
'నా కొడుకు రాహుల్ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్లిస్ట్లో రిషి సునాక్ దంపతులు
మంచు విష్ణు ప్రాజెక్ట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
తప్పక చదవండి
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
Advertisement