బెల్జియం ఫుట్బాల్ మ్యాచ్ రద్దు | Football: Belgium-Portugal cancelled after attacks Brussels | Sakshi

బెల్జియం ఫుట్బాల్ మ్యాచ్ రద్దు

Mar 23 2016 7:18 PM | Updated on Oct 2 2018 8:39 PM

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో బాంబు పేలుళ్ల ఘటన ప్రభావం ఫుట్బాల్ మ్యాచ్పై పడింది.

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో బాంబు పేలుళ్ల ఘటన ప్రభావం ఫుట్బాల్ మ్యాచ్పై పడింది. వచ్చే మంగళవారం బెల్జియం, పోర్చుగల్ మధ్య ఇక్కడ జరగాల్సిన ఫ్రెండ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్ను రద్దు చేశారు. బెల్జియం ఫుట్బాల్ సంఘం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. భద్రత కారణాల రీత్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మ్యాచ్ను రద్దు చేయాల్సిందిగా బ్రస్సెల్స్ సిటీ హాల్ నిర్వాహకులు తమను కోరారని చెప్పారు. బ్రస్సెల్స్లో మంగళవారం ఎయిర్పోర్ట్లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 34 మంది మరణించగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement