Football
-
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టును గట్టెక్కించిన కాస్టనెడా
పనాజీ: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. చర్చిల్ బ్రదర్స్ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది. ఇంటర్ కాశీ జట్టుతో జరిగిన గత మ్యాచ్లో స్టాపేజ్ టైమ్లో గోల్ సమరి్పంచుకొని గెలవాల్సిన మ్యాచ్ను శ్రీనిధి జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకోగా... చర్చిల్ బ్రదర్స్ జట్టుతో స్టాపేజ్ టైమ్లో (90+11వ నిమిషంలో) గోల్ సాధించి ఓడిపోవాల్సిన మ్యాచ్లో ‘డ్రా’తో గట్టెక్కింది. స్టాపేజ్ టైమ్లో లభించిన పెనాల్టీ కిక్ను శ్రీనిధి డెక్కన్ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ కాస్టనెడా గోల్గా మలిచాడు. ఈ లీగ్లో ‘టాప్ గోల్స్కోరర్’గా కొనసాగుతున్న కాస్టనెడాకిది 15వ గోల్ కావడం విశేషం. అంతకుముందు 29వ నిమిషంలో పాపె గసామా చేసిన గోల్తో చర్చిల్ బ్రదర్స్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 13 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 20 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో 7 మ్యాచ్ల్లో గెలిచి, 7 మ్యాచ్ల్లో ఓడి, 6 మ్యాచ్లను ‘డ్రా’గా ముగించి 27 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్లో ఈనెల 30 గోకులం కేరళ ఎఫ్సీ జట్టుతో ఆడుతుంది. -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్
భారత ఫుట్బాల్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మళ్లీ నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. 40 ఏళ్ల ఛెత్రీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. ఛెత్రీ త్వరలో జరుగనున్న ఫిఫా ఇంటర్నేషనల్ విండోలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల భారత జట్టులో ఛెత్రీకి చోటు దక్కింది. ఏడాది గడుస్తున్నా భారత జట్టులో తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోవడంతో రిటైర్మెంట్ విషయంలో ఛెత్రీ మనసు మార్చుకున్నాడు. పదేళ్లకు పైగా భారత జట్టుకు నాయకత్వం వహించిన ఛెత్రీ.. గతేడాది జూన్ 6న రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్కతాలో కువైట్తో జరిగిన ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఛెత్రీకి చివరిది.2005లో భారత్ తరఫున అరంగ్రేటం చేసిన ఛెత్రీ.. భారత ఆల్టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్గా కెరీర్ ముగించాడు. ఛెత్రీ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. ఛెత్రీ తన కెరీర్లో 94 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో నాలుగో అత్యధిక గోల్ స్కోరర్గా ఛెత్రీ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, అలీ డై మాత్రమే ఛెత్రీ కంటే ఎక్కువ గోల్స్ చేశారు.ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇండియన్ సూపర్ లీగ్లో బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ఛెత్రీ 12 మ్యాచ్ల్లో 23 గోల్స్ చేసి ఐఎస్ఎల్లో భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.కాగా, భారత ఫుట్బాల్ జట్టు ఏఎఫ్సీ ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్ సన్నాహకాల్లో భాగంగా మార్చి 19న మాల్దీవ్స్తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఏఎఫ్సీ ఆసియా కప్-2027 క్వాలిఫయర్స్లో (మార్చి 25) బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్.. బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, సింగపూర్ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీలో భారత్ మ్యాచ్లు షిల్లాంగ్లోని జవహర్ లాల్ స్టేడియంలో జరుగనున్నాయి.ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం భారత జట్టు..గోల్ కీపర్స్- అమరిందర్ సింగ్, గుర్మీత్ సింగ్, విశాల్ కైత్డిఫెండర్స్- ఆషికి కురునియన్, ఆయుశ్ దేవ్ ఛెత్రీ, బ్రాండన్ ఫెర్నాండెస్, బ్రైసన్ ఫెర్నాండెస్, జీక్సన్ సింగ్ థౌనౌజమ్, లాలెంగ్మావియా, లిస్టన్ కొలాకో, మహేశ్ సింగ్ నోరెమ్, సురేశ్ సింగ్ వాంగ్జమ్ఫార్వర్డ్స్- సునీల్ ఛెత్రీ, ఫరూక్ ఛౌదరీ, ఇర్ఫాన్ యద్వాద్, లల్లియన్జువాలా ఛంగ్టే, మన్వీర్ సింగ్ -
ఖేలో.. అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్
ఎన్నో విశిష్టతలున్న భాగ్యనగరం అంతర్జాతీయ క్రీడల్లోనూ తన ప్రశస్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా క్రికెట్, టెన్నిస్ వంటి ప్రజాధరణ ఉన్న క్రీడలతో పాటు బ్యాడ్మింటన్ వంటి క్రీడలతో దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ అందించిన ఘనత నగరానికి ఉంది. ఇదే కోవలో మరిన్ని అంతర్జాతీయ క్రీడలు నగరంలో రాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ఫుట్బాల్ సైతం ఈ మధ్య తన ప్రశస్తిని పెంచుకుంటుంది. నగరవాసులు అమెరికన్ ఫుట్బాల్పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆదరణ దృష్ట్యా తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రారంభమై ఈ క్రీడ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. అమెరికన్ ఫుట్బాల్ క్రీడను నగరంతో పాటు రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసేందుకు అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ (టాఫా) కృషి చేస్తుంది. ఇందులో భాగంగా 2025–28 మధ్య కాలానికి అధ్యక్షుడిగా చాగన్ల బల్వీర్ందర్ నాథ్ను నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో అమెరికన్ ఫుట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్ ప్రోత్సహించి, ఒలింపిక్స్ వేదికల పై మన క్రీడాకారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఈ అమెరికన్ ఫుట్బాల్ ప్రసిద్ధి చెందింది. సాకర్, రగ్బీ నుంచి వచ్చిన ఈ గేమ్ 2022లో లీగ్ వార్షిక ఆదాయం 18.6 బిలియన్ డాలర్లుగా నమోదు చేసి ప్రపంచంలోనే విలువైనస్పోర్ట్స్ లీగ్లో భాగంగా చేరింది. రాష్ట్ర వ్యాప్త గుర్తింపు దిశగా..ఈ క్రీడను హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. దీని కోసం ప్రత్యేకంగా అన్ని పట్టణాల్లో, జిల్లాల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పిస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా అసోసియేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేయనున్నాం. మరో రెండేళ్లలో నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా అంతర్జాతీయ స్థాయి లీగ్ను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందులో దాదాపు 22 దేశాలను భాగం చేస్తున్నాం. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్లో ఔత్సాహిక క్రీడాకారులకు, యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నాం. టాఫా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు నడిపల్లి, ఏఎఫ్ఎఫ్ఐ సీఈఓ సందీప్ చౌదరి వంటి దార్శనికుల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందించాలని కొరనున్నాం. – చాగన్ల బల్వీర్ందర్ నాథ్, టాఫా అధ్యక్షులు.అమెరికన్ ఫుట్బాల్ గేమ్లో కాంటాక్ట్, నాన్కాంటాక్ట్ అనే ఈ విభాగాల్లో పోటీ ఉంటుంది. నాన్ కాంటాక్ట్ విభాగంలోని ఫ్లాగ్ గేమ్ ఇక్కడ అభివృద్ధిలో ఉంది. రగ్బీలా ఇందులో మ్యాన్ పుల్లింగ్ ఉండదు. నేను 13 ఏళ్ల నుంచి ఈ గేమ్ ఆడుతున్నాను. అంతేకాకుండా ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాను. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం నాలుగు నేషనల్స్ గెలిచింది. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాం. ఇందులో స్థానిక క్రీడాకారులను భాగం చేసేందుకు టాఫా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి మాదిరిగా ఇక్కడ కూడా ఈ క్రీడకు పాపులారిటీ తీసుకురానున్నాం. – జీవీ మణికంఠ రెడ్డి, ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ కెప్టెన్ -
భారత ఫుట్బాల్ జట్టులో తెలంగాణ ప్లేయర్
న్యూఢిల్లీ: నాలుగు దేశాలు పాల్గొనే పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జాలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ సౌమ్య చోటు సంపాదించింది. ఈనెల 7 నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న భారత జట్టు నేడు యూఏఈకి బయలుదేరి వెళుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను ఈనెల 20న జోర్డాన్తో... రెండో మ్యాచ్ను 23న రష్యాతో... మూడో మ్యాచ్ 26న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఈ ఏడాది మే–జూన్లలో జరిగే ఆసియా కప్–2027 క్వాలిఫయర్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా పింక్ లేడీస్ కప్లో భారత జట్టు బరిలోకి దిగుతోంది.‘పింక్ లేడీస్ కప్ టోర్నీ ద్వారా భారత క్రీడాకారిణులకు తమ సామర్థ్యమేంటో తెలుస్తుంది. రష్యాతో పోలిస్తే దక్షిణ కొరియా జట్టు పూర్తి భిన్నంగా ఉంటుంది. రెండు జట్ల వీడియోలు పరిశీలించాను. రష్యా శైలితో పోలిస్తే కొరియా ఆటలో చాలా వేగం ఉంది. ఫలితంగా భారత జట్టు రెండు రకాలుగా వ్యూహాలు రచించి ఆడాల్సి ఉంటుంది’ అని భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి తెలిపాడు. భారత మహిళల ఫుట్బాల్ జట్టు: ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, పాయల్ బసుదె, శ్రేయా హుడా (గోల్కీపర్లు), అరుణ బాగ్, కిరన్ పిస్దా, మార్టినా థోక్చోమ్, నిర్మలా దేవి ఫాన్జుబమ్, పూరి్ణమ కుమారి, సంజు, సిల్కీ దేవి హెమమ్, స్వీటీ దేవి ఎన్గాంగ్బమ్ (డిఫెండర్లు), బబీనా దేవి లిషామ్, గ్రేస్ డాంగ్మె, మౌసుమి ముర్ము, ప్రియదర్శిని సెల్లాదురై, ప్రియాంక దేవి నోరెమ్, రత్నబాల దేవి నోంగ్మైథెమ్ (మిడ్ ఫీల్డర్లు), కరిష్మా పురుషోత్తమ్, లిండా కోమ్ సెర్టో, మనీషా, రేణు, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్). -
మెస్సీ కాదు!.. నేనే అత్యుత్తమ ఆటగాడిని: రొనాల్డో
దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్బాలర్ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.నేనే ‘కంప్లీట్ ప్లేయర్’స్పానిష్ మీడియా అవుట్లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడినివాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్బాలర్ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్కి, నేను నా క్లబ్కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే. అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్బాలర్గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్గా 923 గోల్స్తో టాప్ గోల్స్కోరర్గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 648 మిలియన్ల మంది ఫాలోవర్లుఅయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
కళ్లు చెదిరే ఇన్స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సోషల్ మీడియాలో ఒక పోస్ట్కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్ను పోస్ట్ చేశాడు. ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్తో అవార్డు కూడా పొందాడు. ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలువిశేషం ఏమిటంటేఅతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్ను పొగడ్తలతో ముంచెత్తారు.రిజ్వాన్ స్పందన“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపురిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను, మరో చేతిలో ఫుట్బాల్ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్) View this post on Instagram A post shared by muhammed riswan (@riswan_freestyle) కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్బాల్తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
తెలంగాణ ‘డ్రా’తో మొదలు
సాక్షి, హైదరాబాద్: ఐదున్నర దశాబ్దాల తర్వాత హైదరాబాద్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ (రెండో రౌండ్)లో తెలంగాణ ‘డ్రా’తో మొదలు పెట్టింది. శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్లో తెలంగాణ, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడాయి. అడపాదడపా తెలంగాణ స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా స్కోరు చేసేందుకు చేసిన ప్రయత్నాల్ని రాజస్తాన్ డిఫెండర్లు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.అలాగే రాజస్తాన్ దాడుల్ని తెలంగాణ రక్షణ పంక్తి నిలువరించడంతో మొదటి అర్ధభాగం ఒక్క గోల్ అయినా నమోదుకు కాకుండానే 0–0తో ముగిసింది. ద్వితీయార్ధం మొదలైన ఎనిమిది నిమిషాలకే రాజస్తాన్ ఖాతా తెరిచింది. 53వ నిమిషంలో ఫార్వర్డ్ ఆటగాడు అమిత్ గోడార చక్కని సమన్వయంతో తెలంగాణ డిఫెండర్లను బోల్తాకొటిస్తూ గోల్ను లక్ష్యానికి చేర్చడంతో రాజస్తాన్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు తెలంగాణ స్ట్రయికర్లు ఎంతగా శ్రమించినా ఫినిషింగ్ లోపాలతో గోల్ అయితే కాలేదు. ఇక పరాజయం ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తేజావత్ సాయి కార్తీక్ ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు. 90వ నిమిషంలో చాకచక్యంగా సాయి కార్తీక్ చేసిన గోల్తో తెలంగాణ 1–1తో గట్టెక్కింది. గోల్ పోస్ట్ వద్ద రాజస్తాన్ స్ట్రయికర్లను నిలువరించిన తెలంగాణ డిఫెండర్ తజాముల్ హుస్సేన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీ రెండో రౌండ్లో మొత్తం 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. టాప్–4లో నిలిచిన టీమ్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్లలో బెంగాల్ 3–1తో జమ్మూ కశీ్మర్పై... మణిపూర్ 1–0తో సరీ్వసెస్పై గెలుపొందాయి. -
టెక్బాల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత్కు తొలి పతకం
టెక్బాల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2024లో భారత్కు తొలి పతకం లభించింది. పురుషుల డబుల్స్ విభాగంలో అనాస్ బేగ్, డెక్లన్ గొంజాల్వెస్ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. టెక్బాల్ క్రీడలోకి ఇటీవలే ప్రవేశించిన బేగ్-గొంజాల్వెస్ జోడీ అంచనాలకు మించి రాణించి అభిమానులను ఆకట్టుకుంది. తృటిలో స్వర్ణం రేసు నుంచి తప్పుకున్న భారత జోడీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బేగ్-గొంజాల్వెస్ జోడీ సెమీఫైనల్లో పటిష్టమైన థాయ్లాండ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. టెక్బాల్లో పతకం సాధించిన 11వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది.On our photo of the day none other than team India! The duo who achieved a historical bronze medal!•#Teqball #WTCH24 #WorldChampionships #Vietnam pic.twitter.com/AGzzVv8sRI— TEQBALL (@Teqball) December 8, 2024టెక్బాల్ అంటే.. టెక్బాల్ అనేది సెపక్ తక్రా మరియు టేబుల్ టెన్నిస్ అంశాలతో కూడిన క్రీడ. ఈ క్రీడను కర్వ్డ్ (వంగిన) టేబుల్పై ఆడతారు. ఈ క్రీడలో ఆటగాళ్ళు చేతులు మినహా మిగతా అన్ని శరీర భాగాలను వాడతారు. ఈ క్రీడలో ఫుట్బాల్ తరహా బంతిని వాడతారు. టెక్బాల్ను సింగిల్స్ లేదా డబుల్స్ గేమ్గా ఆడవచ్చు. ఈ క్రీడ 2014లో పరిచయం చేయబడింది. ఈ క్రీడ అంతర్జాతీయ టెక్బాల్ ఫెడరేషన్ (FITEQ) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. ప్రపంచ స్థాయి ఫుట్బాల్ ఆటగాళ్లు ఈ క్రీడ పట్ల ఆకర్షితులవుతున్నారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ నాని
పోర్చుగీస్ స్టార్ ఫుట్బాలర్, మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఆటగాడు నాని రిటైర్మెంట్ ప్రకటించాడు. 32 ఏళ్ల నాని సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. నాకు ఇష్టమైన క్రీడకు వీడ్కోలు చెప్పే సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ ప్లేయర్గా నా కెరీర్ను ముగించాలని నిర్ణయించుకున్నాను.నా ఈ 20 ఏళ్ల అద్భుత ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు. నా కొత్త లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తాను. మళ్లీ మనం కలుద్దాం అని ఇన్స్టాగ్రామ్లో నాని రాసుకొచ్చాడు. కాగా నాని 2007 మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున తన కెరీర్ను ఆరంభించాడు. ఈ ప్రతిష్టాత్మక క్లబ్ తరపున 230 మ్యాచ్లు ఆడి 41 గోల్స్ చేశాడు. గోల్స్ సమయంలో మరో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కీలక సహచరుడిగా నానికి పేరుంది. నాని తన వాలెన్సియా, లాజియో, ఓర్లాండో సిటీ, వెనిజియా, మెల్బోర్న్ విక్టరీ అదానా డెమిర్స్పోర్ల వంటి మొత్తం 10 క్లబ్ల తరపున ఆడాడు.నాని తన జాతీయ జట్టు పోర్చుగల్ తరపున 112 మ్యాచ్లు ఆడి 24 గోల్స్ చేశాడు. అదే విధంగా 2016లో యూరోపియన్ ఛాంపియన్షిప్ విజేత నిలిచిన పోర్చుగల్ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు.చదవండి: ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్కు భారీ షాక్ -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్బాల్ లీగ్ ఐ–లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు రెండో విజయం నమోదు చేసింది. డెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలీన్ (21వ, 86వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మన్చోంగ్ (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి జట్టు ఆరు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్లో ఈనెల 9న ఢిల్లీ ఎఫ్సీతో శ్రీనిధి డెక్కన్ జట్టు తలపడుతుంది. -
57 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో సంతోష్ ట్రోఫీ ఫైనల్
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ సీనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్ ‘సంతోష్ ట్రోఫీ’ ఫైనల్ రౌండ్ పోటీలు హైదరాబాద్లో జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 14 నుంచి 31 వరకు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తామని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ప్రకటించింది. చివరిసారి హైదరాబాద్ 1967లో సంతోష్ ట్రోఫీ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఈసారి ఫైనల్ రౌండ్ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడతాయి. ఇందులో తొమ్మిది గ్రూప్ విజేతలుగా కాగా... గత ఏడాది చాంపియన్ సర్వీసెస్, రన్నరప్ గోవా జట్లు ఉన్నాయి. 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ దశ మ్యాచ్లు డెక్కన్ ఎరీనాలో జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్లు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తారు. రెండు గ్రూప్ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు డిసెంబర్ 26, 27వ తేదీల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో తలపడతాయి. సెమీఫైనల్స్ డిసెంబర్ 29న, ఫైనల్ డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సంతోష్ ట్రోఫీ 77 సార్లు జరిగింది. పశ్చిమ బెంగాల్ జట్టు రికార్డుస్థాయిలో 32 సార్లు విజేతగా నిలిచింది. -
ఫుట్బాల్ మ్యాచ్లో గొడవ.. 100 మంది మృతి
సౌత్ ఆఫ్రికాలోని గినియా దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్జెరెకోర్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఆదివారం ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.అనంతరం వందలాది మంది వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను కూడా ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ క్రమంలో వంద మందికిపైగా మరణించగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.⚠️🔞 WARNING: GRAPHIC 18+ 🔞⚠️❗️🇬🇳 - At least 100 people lost their lives in violent clashes between rival fans during a football match in N'zerekore, Guinea. This tragic event, which occurred at the end of a game, resulted in hundreds of fatalities. Medical sources confirmed… pic.twitter.com/xV3COoViUE— 🔥🗞The Informant (@theinformant_x) December 2, 2024 -
బ్రెజిలియన్ సాకర్ స్టార్ నెయ్మార్.. అదిరిపోయే లగ్జరీ పెంట్ హౌస్ (ఫోటోలు)
-
దుబాయ్లో ఫుట్బాల్ సూపర్స్టార్ ఇల్లు: దిమ్మతిరిగే ఫీచర్లు
దుబాయ్లో బ్రెజిలియన్ ఫుట్బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. దుబాయ్లోని బుగాట్టి రెసిడెన్స్లో ఉన్న ఈ పెంట్హౌస్ విలాసవంతమైన జీవన కళాఖండ మంటున్నారు నిపుణులు.తాజా కొనుగోలుతో ఈ ఫుట్బాల్ సూపర్స్టార్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోలో లగ్జరీ పెంట్హౌస్ను కూడా జోడించాడు. దీని ధర రూ.456 కోట్లు. అంతేకాదు దుబాయ్లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిత మవుతున్న ఇది ప్రపంచంలోని తొలి బుగాట్టి బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లలో భాగం. ఫ్రెంచ్ రివేరా- ఆధారిత ప్రైవేట్ బీచ్తో పాటు ఇందులో నివసించేందుకు వీలుగా లగ్జరీ ఫీచర్లను అందించారు. ఈ ఆకాశహర్మ్యం (స్కై మాన్షన్) 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి దుబాయ్ అందాలను వీక్షించడమే కాదు, మార్బుల్ బార్ కౌంటర్, కుషన్డ్ కుర్చీలతో కూడిన హై-ఎండ్ బార్, ప్రైవేట్ పూల్తోపాటు లగ్జరీ కార్లను నేరుగా అతని పెంట్ హౌస్లో పార్క్ చేయడానికి వీలుగా ప్రత్యేక కార్ లిఫ్ట్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. ఐవరీ అండ్ బ్లాక్-థీమ్తో బెడ్రూమ్స్, గ్రిల్స్, కర్టెన్లు, కుషన్లు సోఫా మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by AZR (@azrorganization) -
హైదరాబాద్: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫుట్బాల్ సందడి (ఫొటోలు)
-
కొడుకు పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన సానియా మీర్జా.. వారం తర్వాత ఇలా (ఫొటోలు)
-
పిడుగుపాటుకు ఫుట్బాల్ ఆటగాడి మృతి.. వైరల్ వీడియో
ఫుట్బాల్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా పిడుగు పడి ఓ ఫుట్బాలర్ ప్రాణాలు కోల్పోయాడు. రిఫరీ, మరో నలుగురు ఆటగాళ్లు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో గత ఆదివారం జరిగింది.వివరాల్లోకి వెళితే.. పెరూలోని హ్యూయాన్కాయోలో నవంబర్ 3వ తేదీన దేశీయ ఫుట్బాల్ క్లబ్లు అయిన జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొకా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్లుండి వర్షం మొదలుకావండతో రిఫరీ మ్యాచ్ను నిలిపివేశాడు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ బాట పడుతుండగా.. 39 ఏళ్ల జోస్ హ్యూగో లా క్రూజ్ మెసాపై పిడుగు పడింది. In Peru, a soccer player died after being struck by lightning during a matchThe tragedy occurred on November 3 during a match between clubs Juventud Bellavista and Familia Chocca, held in the Peruvian city of Huancayo.During the game, a heavy downpour began and the referee… pic.twitter.com/yOqMUmkxaJ— NEXTA (@nexta_tv) November 4, 2024పిడుగు నేరుగా హ్యూగోపై పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పిడుగు ప్రభావం సమీపంలో గల రిఫరీ సహా నలుగురు ఆటగాళ్లపై పడటంతో వారు ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఐదుగురికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.గతంలో కూడా పిడుగుపాటు కారణంగా ఫుట్బాల్ మైదానంలో ఆటగాళ్లు మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేసియాలో ఇలాగే ఓ స్థానిక ఆటగాడిపై పిడుగు పడటంతో అతను కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. -
ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న రోడ్రి
స్పానిష్ ఫుట్బాలర్, మాంచెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ రోడ్రీ ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్-2024 అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం రోడ్రీతో రియల్ మాడ్రిడ్కు చెందిన వినిసియస్ జూనియర్, జూడ్ బెల్లింగ్హమ్తో పోటీ పడ్డారు. మాంచెస్టర్ సిటీ గత సీజన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడంతో రోడ్రీ కీలకపాత్ర పోషించాడు. అలాగే స్పెయిన్ ఈ ఏడాది యూరో టైటిల్ గెలవడంలోనూ కీ రోల్ ప్లే చేశాడు. ఇంగ్లీష్ క్లబ్ నుంచి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న తొలి ఫుట్బాలర్ రోడ్రీనే. మహిళల విషయానికొస్తే.. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ అవార్డు స్పెయిన్ కే చెందిన ఐటానా బొన్మాటీకి దక్కింది. బొన్మాటీ బార్సిలోనా క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఉత్తమ యువ ఫుట్బాలర్ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు లామిన్ యామల్కు దక్కింది. ఉత్తమ పురుషుల జట్టుగా రియల్ మాడ్రిడ్, ఉత్తమ మహిళల జట్టుగా బార్సిలోనా అవార్డులు దక్కించుకున్నాయి. పారిస్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
జంషెడ్పూర్కు మూడో విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో జంషెడ్పూర్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. జంషెడ్పూర్ జట్టు తరఫున రెయి తెచికవా (21వ నిమిషంలో), లాల్చుంగ్నుంగా (70వ ని.లో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో జంషెడ్పూర్ జట్టు కన్నా ఎక్కువసేపు బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ఈస్ట్బెంగాల్ జట్టు వరుస దాడులతో ఒత్తిడి పెంచినా.. జంషెడ్పూర్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. జంషెడ్పూర్కు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఇది మూడో విజయం కాగా.. 9 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ 3–0తో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్పై గెలిచింది. మోహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (8వ నిమిషంలో), సుభాశీష్ బోస్ (31వ ని.లో), గ్రెగ్ స్టెవార్ట్ (36వ ని.లో) తలా ఒక గోల్ కొట్టారు. తాజా సీజన్లో మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో విజయం కాగా... 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మొహమ్మదన్ జట్టు రెండో ఓటమి మూటగట్టుకుంది. గత నెల 13న మొదలైన ఐఎస్ఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఎనిమిది మ్యాచ్ల్లో ఫలితాలు రాగా... ఏడు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. 11 రోజుల విరామం అనంతరం ఈ నెల 17న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్తో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ ఆడనుంది. -
12న భారత్, వియత్నాం ఫుట్బాల్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత సీనియర్ పురుషుల ఫుట్బాల్ జట్టు ఈ నెల 12న వియత్నాంతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. నిజానికి వియత్నాంలో ఈనెల 7 నుంచి 15 వరకు భారత్ ముక్కోణపు టోర్నీలో పాల్గొనాల్సి ఉండగా... మూడో దేశం లెబనాన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లెబనాన్లోని హెజ్»ొల్లా ఉగ్రవాద సంస్థ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్లో గగనతల ప్రయాణం క్లిష్టమైంది. దీంతో లెబనాన్ తప్పుకోవాల్సి వచ్చింది. ముక్కోణపు టోర్నీ సాధ్యపడకపోవడంతో ఇరు దేశాల ఫుట్బాల్ సమాఖ్యలు ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణకు మొగ్గుచూపాయి. ‘లెబనాన్ వైదొలగడంతో ముక్కోణపు టోర్నీ రద్దయ్యింది. దీంతో ఆతిథ్య వియత్నాం జట్టుతో భారత సీనియర్ జట్టు ఏకైక ఫ్రెండ్లీ మ్యాచ్ను ఆడుతుంది’ అని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వియత్నాం రాజధాని హనోయ్కి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తియెన్ తువోంగ్ స్టేడియంలో ఈ నెల 12న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్కడికి బయలుదేరే ముందు భారత ఫుట్బాల్ ఆటగాళ్లంతా 5న కోల్కతాలో కలుసుకుంటారు. హెడ్కోచ్ మనొలో మార్కెజ్ నేతృత్వంలో 6న ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటారు. ఆ మరుసటి రోజే కోల్కతా నుంచి వియత్నాంకు భారత జట్టు పయనమవుతుంది. ఇదివరకే ఈ మ్యాచ్ కోసం 26 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్ను ప్రకటించారు. వియత్నాం బయలుదేరేముందు తుది 23 సభ్యుల జట్టును ఖరారు చేస్తారు. -
ప్రత్యర్థిని కొరికేశాడు
ప్రిస్టన్ (ఇంగ్లండ్): హోరాహోరీగా సాగుతున్న ఫుట్బాల్ మ్యాచ్లో ఒక ఆటగాడు తన ప్రత్యర్థి మెడ దగ్గర గట్టిగా కొరికేశాడు. అంతే ఇంగ్లండ్ ఫుట్బాల్ సంఘం (ఈఎఫ్ఏ) ఆగ్రహానికి గురయ్యాడు. నిషేధం, జరిమానా రెండు పడ్డాయి. ఇక వివరాల్లోకెళితే... ఇంగ్లండ్లో సెకండ్ డివిజన్ ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి. ప్రిస్టన్, బ్లాక్బర్న్ల మధ్య పోటాపోటీగా మ్యాచ్ జరుగుతోంది. ప్రిస్టన్ ఆటగాడు మిలుటిన్ ఉస్మాజిక్ ఉన్నపళంగా తనను నిలువరిస్తున్న బ్లాక్బర్న్ డిఫెండర్ ఒవెన్ బెక్ మెడ వెనుక కొరికేశాడు. ఇంత జరిగినా... రిఫరీకి చెప్పినా ఉస్మాజిక్కు మాత్రం రెడ్కార్డ్ చూపలేదు. బయటికి పంపలేదు. గత నెల 22న ఈ మ్యాచ్ జరుగగా... అప్పీల్ తదుపరి విచారణ అనంతరం తాజాగా ఈఎఫ్ఏ ఉస్మాజిక్పై ఎనిమిది మ్యాచ్ల నిషేధం విధించడంతో పాటు 15 వేల పౌండ్లు (రూ.16.80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇలా కొరకడంలో ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ స్వారెజ్ ఫుట్బాల్ అభిమానులకు చిరపరిచితుడు. 2013లో జరిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో బార్సిలోనా స్ట్రయికర్ స్వారెజ్... చెల్సియా డిఫెండర్ బ్రానిస్లావ్ ఇవానోవిచ్ను కొరకడంతో ఏకంగా 10 మ్యాచ్ల నిషేధం విధించారు. అయినా అతని బుద్ధి మారలేదు. ఆ మరుసటి ఏడాది బ్రెజిల్లో జరిగిన ఫుట్బాల్ ప్రపంచకప్ (2014)లో స్వారెజ్ ఇటలీ డిఫెండర్ జియోర్జియో చిలినిని కొరికాడు. దీంతో మళ్లీ నాలుగు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. -
ఇండియన్ సూపర్ లీగ్.. జంషెడ్పూర్ ఎఫ్సీ కీలక విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఎఫ్సీ కీలక విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో జంషెడ్పూర్ 3–2 గోల్స్ తేడాతో ముంబై సిటీ ఎఫ్సీని ఓడించింది. జంషెడ్పూర్ తరఫున 36వ నిమిషంలో జె.ముర్రే...44వ, 50వ నిమిషాల్లో జేవీ హెర్నాండెజ్ గోల్స్ నమోదు చేశారు. ముంబై ఆటగాళ్లలో ఎన్.కరేలిస్ 18వ నిమిషంలో, వాన్ నీఫ్ 77వ నిమిషంలో గోల్స్ సాధించారు.కోల్కతాలో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్, ఎఫ్సీ గోవా మధ్య జరిగిన మరో మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. మొహమ్మదాన్ తరఫున 66వ నిమిషంలో పెనాల్టీ ద్వారా ఎ.గోమెజ్ గోల్ కొట్టగా...గోవా ఆటగాళ్లలో ఎ.సాదికు (90+4) ఏకైక గోల్ సాధించాడు. కొచ్చిలో నేడు జరిగే మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ తలపడుతుంది. -
ఇటలీ మేటి ఫుట్బాలర్ స్కిలాచీ కన్నుమూత
రోమ్: ఇటలీ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ సాల్వటోర్ స్కిలాచీ(Salvatore Schillaci) బుధవారం కన్నుమూశాడు. 59 ఏళ్ల స్కిలాచీ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. స్వదేశంలో జరిగిన 1990 ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో స్కిలాచీ 6 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచి ‘గోల్డెన్ బూట్’ అవార్డు గెలిచాడు. అదే విధంగా..‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’కి ఇచ్చే ‘గోల్డెన్ బాల్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇటలీ మూడో స్థానం సాధించింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించిన జర్మనీ విజేతగా నిలిచింది. అయితే వ్యక్తిగత ప్రదర్శనతో ఇటలీ స్ట్రయికర్ స్కిలాచీ అభిమానుల్ని అలరించాడు.చదవండి: మాళవిక సంచలనం -
స్నేహితులతో వెకేషన్లో ధోని (ఫొటోలు)
-
పురోగతి కోసం ప్రక్షాళన!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అన్ని రకాలుగా అథమ స్థితికి చేరిందని, దీనిలో సమూల మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాడు, మాజీ కెపె్టన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఫుట్బాల్లో మన టీమ్ పరిస్థితి మరింత దిగజారడానికి ఏఐఎఫ్ఎఫ్ కారణమని అతను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ప్రణాళికల విషయంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లే ఇటీవల కాంటినెంటల్ కప్లో సిరియా చేతిలో ఓటమి ఎదురైందని... బలహీనమైన మారిషస్తో కూడా మ్యాచ్ గెలవలేకపోయామని భూటియా అన్నాడు. ‘భారత ఫుట్బాల్కు సంబంధించి గత కొంత కాలంగా ఎలాంటి మంచి పరిణామాలు జరగడం లేదు. నిలకడగా 100వ ర్యాంక్లో ఉంటూ వచ్చిన జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మన టీమ్కు సంబంధించి చర్చ అవసరం. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిలోనే సమస్య ఉంది. దానిని మార్చాల్సిందే. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతే కొత్త కార్యవర్గాన్ని వెంటనే ఎంచుకోవాలి’ అని భూటియా చెప్పాడు. ఏదో విజన్ 2046 అని కాగితాల్లో రాసుకుంటే కుదరదని, దాని కోసం పని చేయాల్సి ఉంటుందని అతను సూచించాడు. ‘గత రెండేళ్లుగా ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చి ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఫుట్బాల్కంటే కూడా సామాజిక అంశాలపై అంతా మాట్లాడటం చూసి ఆశ్చర్యమేసింది. ఫుట్బాల్ ఫెడరేషన్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా పని చేస్తే కుదరదు. ఫుట్బాల్ అభివృద్ధి, జట్టు విజయం అనేదే ప్రధాన బాధ్యత. నేను పదవుల కోసం పోరాడదల్చుకోలేదు. ఆటను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అంతా పని చేయాలి’ అని భూటియా వివరించాడు. -
‘డ్రా’తో మొదలైన ఐఎస్ఎల్
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ‘డ్రా’తో ప్రారంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్లు ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 2–2 గోల్స్తో సమంగా ముగిసింది. ముంబై సిటీ తరఫున థేర్ క్రూమ్ 90వ నిమిషంలో గోల్ సాధించాడు. మోహన్ బగాన్ తరఫున తిరి 70వ నిమిషంలో, ఆల్బర్టో రోడ్రిగ్వెజ్ 28వ నిమిషంలో గోల్స్ కొట్టారు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే 9వ నిమిషంలో తిరి సెల్ఫ్ గోల్ చేయడం తుది ఫలితం సమంగా ముగిసేందుకు కారణమైంది. సొంత మైదానంలో భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్య మోహన్ బగాన్ మ్యాచ్ ఆద్యంతం దూకుడు ప్రదర్శించినా... ఈ టీమ్ను నిలువరించడంలో ముంబై సఫలమైంది. ఐఎస్ఎల్లో భాగంగా నేడు రెండు వేర్వేరు వేదికల్లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. భువనేశ్వర్లో ఒడిషా ఎఫ్సీతో చెన్నైయిన్ ఎఫ్సీ... బెంగళూరులో ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీతో బెంగళూరు ఎఫ్సీ తలపడతాయి. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ సాకర్ దిగ్గజాల్లో ఒకరిగా ఎదిగిన ఈ పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్.. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన ఘనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మైదానంలోనే కాదు ఆఫ్ది ఫీల్డ్లో కూడా రికార్డులు కొల్లగొట్టడంలో రొనాల్డోకి మించిన వారే లేరు. ఇటీవలే తన కెరీర్లో 900 గోల్లను సాధించి చరిత్ర సృష్టించిన రొనాల్డో.. తాజాగా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.సోషల్ మీడియా కింగ్..రొనాల్డో తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. తద్వారా సోషల్మీడియాలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు.తాజాగా ఈ విషయాన్ని రొనాల్డోనే అభిమానులతో పంచుకున్నాడు. "మనం చరిత్ర సృష్టించాము. 1 బిలియన్(100 కోట్లు) ఫాలోవర్స్ను సంపాదించుకున్నాము. ఇది కేవలం సంఖ్యమాత్రమే కాదు. కోట్లాది మంది ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. మదీరా వీధుల్లో ఫుట్బాల్ ఆడే స్థాయి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడగలిగాను. నేను ఎల్లప్పుడూ నా కుటుంబం కోసం, మీ కోసమే ఆడాను. ఇప్పుడు ఏకంగా వంద కోట్ల మంది నా వెనక ఉన్నారు. నా కెరీర్లో నేను చవిచూసిన ఎత్తుపల్లాల్లో, నేను వేసే ప్రతీ అడుగులోనూ మీరున్నారు. అభిమానుల ఆదరాభిమానాలతోనే నా ఈ ప్రయాణం సాధ్యమైంది. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నన్ను సపోర్ట్ చేసి నా జీవితంలో భాగమైనందుకు అందరికి ధన్యవాదాలు. మనం ఇంకా చాలా సాధించాలి. మనమంతా కలిసి ముందుకు సాగుతాం అని ఎక్స్లో రొనాల్డో రాసుకొచ్చాడు. కాగా రొనాల్డో ఇటీవలే యువర్ క్రిస్టియానో" పేరుతో యూట్యూబ్ చానెల్ను ప్రారంభించగా.. 90 నిమిషాల వ్యవధిలోనే ఇది ఒక మిలియన్ సబ్స్క్రైబర్స్ను పొందాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్స్టాలో ఈ ఫుట్బాల్ స్టార్ను 63.9కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ‘ఎక్స్’లో 11.3 కోట్ల మంది, ఫేస్బుక్లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు... We’ve made history — 1 BILLION followers! This is more than just a number - it’s a testament to our shared passion, drive, and love for the game and beyond.From the streets of Madeira to the biggest stages in the world, I’ve always played for my family and for you, and now 1… pic.twitter.com/kZKo803rJo— Cristiano Ronaldo (@Cristiano) September 12, 2024 -
స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ కోచ్గా పని చేసిన ఐగర్ స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణ, అతనికి చెల్లించాల్సి వచ్చిన నష్టపరిహారంపై అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన తప్పులు, స్టిమాక్కు అనుకూలంగా ఉన్న నిబంధనపై సమాఖ్య సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ జరపాలని ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఎవరి కారణంగా స్టిమాక్కు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలుతుందని ఏజీఎంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.భారత జట్టు కోచ్గా ఐగర్ స్టిమాక్ పదవీకాలం 2023లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ దానిని జూన్ 2025 వరకు పునరుద్ధరించారు. అయితే స్టిమాక్ రెండోసారి కాంట్రాక్ట్పై సంతకం చేసినప్పుడు నిబంధనలు, షరతులు అతనికి అనుకూలంగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏఐఎఫ్ఎఫ్ కీలక పదవుల్లో పని చేసిన కొందరి పాత్ర ఉందని ఏజీఎంలో సభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జూన్లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో సులువైన ‘డ్రా’ ఉన్నా భారత జట్టు చెత్త ప్రదర్శనతో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. దాంతో వెంటనే స్టిమాక్ను కోచ్ పదవి నుంచి తొలగించారు.ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న స్టిమాక్ 9 లక్షల 20 వేల డాలర్లు (రూ. 7 కోట్ల 72 లక్షలు) నష్టపరిహారం కోరుతూ ఫిఫా ఫుట్బాల్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశాడు. మరో ఏడాది తన పదవీకాలం మిగిలి ఉన్నా తనను తీసేయడం నిబంధనలకు విరుద్ధమంటూ సవాల్ చేశాడు. చివరకు మధ్యవర్తిత్వం ద్వారా ఏఐఎఫ్ఎఫ్ సమస్యను పరిష్కరించుకుంది. స్టిమాక్కు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లు) నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించి గొడవను ముగించింది. ఈ అంశంపై ప్రస్తుతం ఏజీఎంలో చర్చ జరుగుతుంది.చదవండి: భారత ఫుట్బాలర్ అన్వర్ అలీపై నిషేధం -
#Football : హైదరాబాద్ లో ఫుట్బాల్ కిక్ మొదలైంది (ఫొటోలు)
-
‘ఆటలు’ కావాలి : అమ్మాయిల ‘గోల్’ ఇది! ఆసక్తికరమైన వీడియో
పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు29) సందర్భంగా క్రీడలు ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక వీడియోను పంచుకున్నారు. క్రీడలు మనల్ని మనుషులుగా చేస్తాయి అంటూ క్రీడల గొప్పతనాన్ని వివరించారు. ముఖ్యంగా బాలికావిద్య, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, రూపొందించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. చదువుతోపాటు ఈరోజు కొత్తగా నేర్చుకుందాం అటూ ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘నీళ్ల కుండను మోయడానికి కాదు బాలిక శిరస్సు ఉన్నది, భయపడి పరిగెత్తడానికి కాదు కాళ్లున్నది, కేవలం సేద్యం కోసం చిందించడానికి మాత్రమే కాదు ఈ స్వేదం ఉన్నది. గోల్ అంటే రోటీలు చేయడానికి మాత్రమే కాదు’’ అంటూ ఫుట్బాల్ గోల్ సాధిస్తారు బాలికల బృందం. ఫుట్ బాల్ క్రీడ ద్వారా బాలికల విద్య, అభివృద్ధిని గురించి వివరించడం అద్భుతంగా నిలిచింది.బాలికలు విద్య ద్వారా సాధికారత పొందే ప్రపంచాన్ని సృష్టించే దృక్పథంతో 1996లో ఆనంద్ మహీంద్రా కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ప్రాజెక్ట్ నన్హీ కాలీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. పలు విధాలుగా బాలికా వికాసం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. దాదాపు 7లక్షల మంది బాలికలకు సాయం అందించినట్టు నన్హీ కాలీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.There is a very, very simple reason why Sports is important:Because it makes us better human beings.#NationalSportsDay pic.twitter.com/3IhiQmpB66— anand mahindra (@anandmahindra) August 30, 2024 -
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్లో ఫుట్బాల్లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్లో గైనకాలజిస్ట్గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్బాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు మాజీ మేనేజర్ కన్నుమూత
ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు మాజీ మేనేజర్ స్వెన్ గొరాన్ ఎరిక్సన్ కన్నుమూశారు. కేన్సర్తో పోరాడుతున్న ఆయన 76 ఏళ్ల వయసులో మరణించారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఎరిక్సన్ మరణ వార్తను ధ్రువీకరిస్తూ అతడి కుటుంబం ప్రకటన విడుదల చేసింది.స్వీడన్కు చెందిన ఎరిక్సన్ తొలినాళ్లలో ఫుట్బాలర్గా రాణించారు. ఆ తర్వాత మేనేజర్గా మారిన ఆయన.. 1977- 2001 మధ్యకాలంలో స్వీడన్, పోర్చుగల్, ఇటలీ క్లబ్ టోర్నీల్లో ఓవరాల్గా 18 ట్రోఫీలు తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు.. ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టుకు మేనేజర్గా నియమితుడైన తొలి విదేశీయుడిగా అరుదైన ఘనత సాధించారు.యూరోపియన్ చాంపియన్షిప్స్, వరల్డ్ కప్ ఈవెంట్లలో ఎరిక్సన్.. ఇంగ్లండ్కు చెప్పుకోదగ్గ విజయాలు అందించారు. ఆయన హయాంలో 2002- 2006 మధ్య ఇంగ్లండ్ మూడుసార్లు వరుసగా వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇక వీటితో పాటు మేనేజర్గా ఎన్నో విజయాలు సాధించిన ఎరిక్సన్.. తాను కేన్సర్ బారిన పడినట్లు ఈ ఏడాది జనవరిలో వెల్లడించారు. మహా అయితే, ఒక్క ఏడాది పాటు బతుకుతానేమోనంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, టెర్మినల్ కేన్సర్తో పోరాటంలో ఓడి తాజాగా కన్నుమూశారు. కాగా ఎరిక్సన్ మృతి పట్ల ప్రిన్స్ విలియం సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.కాగా.. ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్లబ్ మేనేజర్గా ఉన్న వ్యక్తి.. జట్టు ఎంపిక మొదలు.. జట్టులో ఆటగాళ్ల పాత్ర, మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు రచించడం.. అదే విధంగా మ్యాచ్ సమయంలో ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా మార్గదర్శనం వంటివి చేస్తాడు. క్లబ్ ఆర్థిక వ్యవహరాల్లో నిర్ణయాలు తీసుకోవడం సహా క్లబ్ గెలిచినా.. ఓడినా జవాబుదారిగా ఉంటారు.చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? -
భారత్ను గెలిపించిన మునీరుల్
లలిత్పూర్ (నేపాల్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్ప్లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0 గోల్ తేడాతో భూటాన్ను ఓడించింది. భారత్ తరఫున మునీరుల్ మౌలా (37వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి అర్ధభాగంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్ చివరి వరకు దాన్ని కాపాడుకుంది. అయితే ఒత్తిడికి గురైన భూటాన్ ఆటగాళ్లు పదే పదే భారత ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిచ్చారు. దీంతో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ భూటాన్ ప్లేయర్కి రిఫరీ ‘రెడ్ కార్డు’ చూపి మైదానం నుంచి బయటకు పంపాడు. ఫలితంగా ఆట 67వ నిమిషం తర్వాత భారత్ కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతోనే ఆధిక్యాన్ని కాపాడుకోవం విశేషం. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో మాల్దీవులుతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లున్నాయి. -
ఫ్రాన్స్ మళ్లీ 40 ఏళ్ల తర్వాత..
ఒలింపిక్స్ ఫుట్బాల్ ఫైనల్లో ఫ్రాన్స్ రెండోసారి ఒలింపిక్ చాంపియన్గా నిలిచేందుకు ఫ్రాన్స్ పురుషుల ఫుట్బాల్ జట్టు విజయం దూరంలో నిలిచింది. స్వదేశంలో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్రాన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్తో ఈజిప్ట్ జట్టుపై విజయం సాధించి 1984 తర్వాత మళ్లీ ఒలింపిక్స్ క్రీడల్లో టైటిల్ పోరుకు అర్హత పొందింది.ఫ్రాన్స్ తరఫున మెటెటా జీన్ ఫిలిప్ (83వ, 99వ నిమిషాల్లో) రెండు గోల్స్తో మెరవగా... మైఖేల్ ఒలీస్ (108వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెర్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఫ్రాన్స్ ఫుట్బాల్ జట్టు ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 1900 పారిస్ క్రీడల్లో రన్నరప్గా నిలిచిన ఫ్రాన్స్ ఆ తర్వాత 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
హెజ్బొల్లా దాడిలో చిన్నారులు సహా... 12 మంది దుర్మరణం
టెల్అవీవ్: ఇజ్రాయెల్ ఆక్రమిత గొలాన్ హైట్స్ లోని ఫుట్బాల్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు, టీనేజర్లు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ల పనేనని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్లోని మిలటరీ ప్రాంతాలే లక్ష్యంగా తాము రాకెట్లను ప్రయోగించిన మాట వాస్తవమేనని హెజ్బొల్లా పేర్కొంది. అయితే, ఫుట్బాల్ మైదానంపై జరిగిన దాడికి బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది. -
అర్జెంటీనాకు షాక్
సెయింట్ ఎటిన్ (ఫ్రాన్స్): పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా శుక్రవారం మొదలు కావాల్సినా... ఫుట్బాల్, రగ్బీ సెవెన్స్ క్రీడాంశాల్లో బుధవారం పోటీలు ప్రారంభమయ్యాయి. పురుషుల ఫుట్బాల్ ఈవెంట్ సంచలనంతో ఆరంభమైంది. రెండుసార్లు స్వర్ణ పతక విజేత అర్జెంటీనా తొలి లీగ్ మ్యాచ్లో 1–2తో మొరాకో చేతిలో ఓడిపోయింది. ఇంజ్యూరీ టైమ్లో అర్జెంటీనా చేసిన గోల్ను ముందుగా రిఫరీ అనుమతించడంతో స్కోరు 2–2 తో సమమైంది. అయితే రిఫరీ నిర్ణయంతో ఆగ్రహించిన అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేశారు. దాంతో రెండు గంటలపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఆటను కొనసాగించారు. అర్జెంటీనా రెండో గోల్ను టీవీ రీప్లేలో పరిశీలించి ఆఫ్ సైడ్గా పరిగణించి గోల్ ఇవ్వలేదు. దాంతో మొరాకో 2–1తో గెలిచింది. -
యూరో ఛాంపియన్స్కు గ్రాండ్ వెల్కమ్.. జనసంద్రంలా మారిన మాడ్రిడ్ (ఫొటోలు)
-
‘యూరో’ చాంపియన్గా స్పెయిన్
యూరో ఫుట్బాల్ కప్-2024 ఛాంపియన్స్గా స్పెయిన్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి యూరో కప్ టైటిల్ను ముద్దాడింది. స్పెయిన్ విజయంలో మైకెల్ ఓయర్జాబల్ కీలక పాత్ర పోషించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్హాఫ్ నీవా నేనా అన్నట్లు సాగింది. ఇరు జట్లు కూడా తొలి ఆర్ధ భాగంలో ఒక్క గోల్కూడా సాధించలేకపోయాయి. ఫస్ట్హాప్ ముగిసే సమయానికి ఇరు జట్లు 0-0గా నిలిచాయి. ఆ తర్వాత సెకెండ్ హాఫ్లో 46వ నిమిషంలో నికో విలియమ్స్ అద్భుత గోల్తో స్పెయిన్ ఖాతా తెరిచాడు. ఇంగ్లండ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటకి గోల్ సాధించడంలో విఫలమైంది. ఈ క్రమంలో మ్యాచ్ 60 నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సెమీఫైనల్ హీరో వాట్కిన్స్ వచ్చాడు. అతడు వచ్చిన కూడా ఫలితం మాత్రం మారలేదు. ఇంగ్లీష్ జట్టు నిరాశలో కూరుకుపోయిన వేళ మిడ్ఫీల్డర్ కోల్ పామర్ 73వ నిమిషంలో సంచలన గోల్తో తమ జట్టుకు తొలి గోల్ను అందించాడు.దీంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. మళ్లీ ఇంగ్లండ్ కమ్బ్యాక్ ఇవ్వడంతో స్పెయిన్ కాస్త ఒత్తడికి గురైంది. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు.కానీ మ్యాచ్ 86వ నిమిషంలో ఓయర్జాబల్ సూపర్ గోల్తో స్పెయిన్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. స్పెయిన్కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🇪🇸 Spain are champions of Europe 🏆#EURO2024 pic.twitter.com/Ch0AF0iPWl— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
ఫుట్బాల్ జోష్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులను గంటల వ్యవధిలో రెండు ఆసక్తికర సమరాలు అలరించబోతున్నాయి. జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్ తలపడనున్నాయి. స్పెయిన్ గతంలో మూడు సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. మరో వైపు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగే కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనాను కొలంబియా ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా ఏకంగా 15 సార్లు టైటిల్ నెగ్గగా...కొలంబియా ఒక సారి ట్రోఫీని సొంతం చేసుకుంది. -
Euro Cup 2024: సెమీస్లో నెదర్లాండ్స్కు షాక్.. ఫైనల్లో ఇంగ్లండ్
యూరో కప్-2024 ఫైనల్లో ఇంగ్లండ్ అడుగుపెట్టింది. డార్ట్మండ్ వేదికగా జరిగిన నెదర్లాండ్స్తో జరిగిన రెండో సెమీఫైనల్లో 2-1 తేడాతో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు.. రెండో సారి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆఖరి నిమిషం గోల్ సాధించిన ఇంగ్లండ్ ప్లేయర్ ఓలీ వాట్కిన్స్.. తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.ఈ సెమీస్ పోరులో ఫస్ట్హాఫ్ తొలి 10 నిమిషాల్లో ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. తొలి ఆర్ధబాగం 7వ నిమిషంలో డచ్ మిడ్ ఫీల్డర్ క్జేవీ సైమన్స్ తమ జట్టుకు మొదటి గోల్ను అందించాడు. దీంతో ఆరంభంలోనే డచ్ జట్టు 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే కొద్దిసేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ గోల్తో స్కోర్ను సమం చేశాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలిచాయి.ఇక సెకెండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత ఇరు జట్లు కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాయి. డచ్ తరుపున డోనియెల్ మాలెన్ స్ధానంలో వుత్ వెఘోర్స్ట్ సబ్స్ట్యూట్గా రాగా.. మరోవైపు త్రీ లయన్స్ జట్టుకు కీరన్ ట్రిప్పియర్ స్థానంలో ల్యూక్ షా వచ్చాడు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆఖరి 20 నిమిషాలకు ముందు తమ జట్టులో మరో రెండు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్లు హ్యారీ కేన్, ఫిల్ ఫోడెన్లు బయటకు వెళ్లగా.. వారిస్ధానాల్లో ఒల్లీ వాట్కిన్స్ , కోల్ పామర్ మైదానంలో వచ్చారు. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషం(90వ మినిట్)లో సబ్స్ట్యూట్గా వచ్చిన వాట్కిన్స్ అద్భుతం చేశాడు. సంచలన గోల్తో వాట్కిన్స్ తన జట్టును రెండో సారి ఫైనల్కు చేర్చాడు. ఇక జూలై 15న జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో ఇంగ్లండ్ తలపడనుంది. -
COPA AMERICA CUP 2024: ఫైనల్లో అర్జెంటీనా.. సెమీస్లో కెనడాపై విజయం
కోపా అమెరికా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు.. కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ద భాగం 23వ నిమిషంలో అల్వరెజ్.. రెండో అర్ద భాగం 51వ నిమిషంలో మెస్సీ గోల్స్ సాధించారు. రేపు జరుగబోయే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జులై 15న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
EURO CUP 2024: సెమీస్లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్లో స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్ కోలో ముఆని గోల్ సాధించి ఫ్రాన్స్కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్ యమాల్, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్ యమాల్ యూరో కప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్గా రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు (జులై 11) జరుగనుంది. ఈ మ్యాచ్లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
సెమీస్ సమరం.. స్పెయిన్తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్ బెర్త్ ఎవరిదో?
‘యూరో’ కప్ ఫుట్బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్పెయిన్ ఫైనల్కు చేరుతుందా?అయితే ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. మరోవైపు , యువ మిడ్ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?ఇక సెమీస్కు ముందు ఫ్రాన్స్ టీమ్లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్లు లేవు. జట్టు మొత్తం క్లియర్గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది. కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది. -
EURO CUP 2024: ఉత్కంఠ పోరులో ఆస్ట్రియాపై విజయం.. క్వార్టర్ ఫైనల్లో తుర్కియే
యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్ బెర్త్లన్నీ ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, తుర్కియే జట్లు ఫైనల్ 8కి అర్హత సాధించాయి. ఇవాళ (జులై 3) జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఆస్ట్రియాపై తుర్కియే 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. Mert Günok's incredible 95th-minute save 🤯😱#EUROLastMinute | @Hublot pic.twitter.com/N2AImAbc7A— UEFA EURO 2024 (@EURO2024) July 2, 2024తుర్కియే తరఫున మెరి దెమిరల్ రెండు గోల్స్ చేయగా.. ఆస్ట్రియా తరఫున మైఖేల్ గ్రెగోరిచ్ గోల్ చేశాడు. చివరి నిమిషంలో తుర్కియే గోల్కీపర్ మెర్ట్ గునాక్ అద్భుతమైన స్టాప్తో మ్యాచ్ డ్రా కాకుండా చేశాడు. మరోవైపు, నిన్న జరిగిన మరో రౌండ్ ఆఫ్ 16 (ప్రీ క్వార్టర్ ఫైనల్స్) మ్యాచ్లో రొమేనియాపై నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది, క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నెదర్లాండ్స్ వర్సెస్ తుర్కియే (జులై 7) -
ఎనిమిదేళ్ల తర్వాత...
లాస్ వేగస్: కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నీలో ఈక్వెడార్ జట్టు ఎనిమిదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్‘బి’లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్లో ఈక్వెడార్ 3–1తో నెగ్గింది. 13వ నిమిషంలో జమైకా ప్లేయర్ కేసీ పాల్మెర్ సెల్ఫ్ గోల్తో ఈక్వెడార్ ఖాతా తెరిచింది. కెండ్రీ పెజ్ (45+4వ ని.లో) గోల్తో ఈక్వెడార్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 54వ నిమిషంలో ఆంటోనియో జమైకాకు తొలి గోల్ అందించాడు. అలాన్ మిండా (90+1వ ని.లో) గోల్తో ఈక్వెడార్ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్లో వెనిజులా 1–0తో మెక్సికోను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
క్రేజ్ కా బాప్.. లియోనెల్ మెస్సీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్
యూరో కప్ 2024లో దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ బోణీ కొట్టింది. గ్రూప్-ఎఫ్లో భాగంగా ఇవాళ (జూన్ 19) జరిగిన మ్యాచ్లో పోర్చుగల్.. చెక్ రిపబ్లిక్పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్ ప్రొవోద్) చెక్ రిపబ్లిక్, ఆతర్వాత పోర్చుగల్ (69వ నిమిషంలో, రాబిన్ హ్రనాక్) గోల్స్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది.చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డోచెక్ రిపబ్లిక్తో మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్, పోర్చుగల్ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్లు ఆడాడు.జార్జియాను చిత్తు చేసిన తుర్కియేగ్రూప్-ఎఫ్లో భాగంగా నిన్న జరిగిన మరో మ్యాచ్లో జార్జియాపై తుర్కియే 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తుర్కియే తరఫున మెర్ట్ ముల్దర్ (25వ నిమిషం), ఆర్దా గులెర్ (65వ నిమిషం), ముహమ్మెద్ కెరెమ్ (97వ నిమిషం) గోల్స్ చేయగా.. జార్జియా తరఫున జార్జెస్ 32వ నిమిషంలో గోల్ చేశాడు.ఇవాల్టి మ్యాచ్లు..క్రొయేషియా వర్సెస్ అల్బేనియా (గ్రూప్-బి)జర్మనీ వర్సెస్ హంగేరీ (గ్రూప్-ఏ) -
ఫుట్బాల్ దిగ్గజం కాంప్బెల్ కన్నుమూత..
ఫుట్బాల్ దిగ్గజం, అర్సెనల్ ఎఫ్సీ లెజెండ్ కెవిన్ కాంప్బెల్(54) కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంప్బెల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. విన్ కాంప్బెల్ మరణ వార్తను అర్సెనల్ ఎఫ్సీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది."మా క్లబ్ మాజీ స్ట్రైకర్ కెవిన్ కాంప్బెల్ అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అతడి మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. కెవిన్ని క్లబ్లో ప్రతీఒక్కరూ గౌరవించేవారు. ఆ కష్టసమయంలో కెవిన్ కుటంబసభ్యులకు ఆ దేవుడు అండగా నిలివాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంప్బెల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము" అని అర్సెనల్ ఎఫ్సీ ఎక్స్లో రాసుకొచ్చింది. ఫుట్బాల్ వరల్డ్లో కాంప్బెల్ తనకంటూ ఒక ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో ఆర్సెనల్ ఫుట్బాల్ క్లబ్తో తన కెరీర్ను ప్రారంభించిన కాంప్బెల్.. రెండు దశాబ్దాలకు పైగా ఫుట్బాల్ గేమ్లో కొనసాగారు. 1988లో ఆర్సెనల్ తరపున ఫుట్బాల్ ఆసోషియేషన్ యూత్ కప్ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా ప్రీమియర్ లీగ్లో అర్సెనల్ , నాటింగ్హామ్ ఫారెస్ట్ , ఎవర్టన్ , వెస్ట్ బ్రోమ్విచ్ అల్బియన్ జట్ల తరపున కూడా అర్సెనల్ ఆడాడు. కాంప్బెల్ తన కెరీర్లో ఓవరాల్గా 148 గోల్స్ చేశాడు. We are devastated to learn that our former striker Kevin Campbell has died after a short illness.Kevin was adored by everyone at the club. All of us are thinking of his friends and family at this difficult time.Rest in peace, Kevin ❤️ pic.twitter.com/Kiywyo7nTr— Arsenal (@Arsenal) June 15, 2024 -
రిఫరీ చెత్త నిర్ణయం.. భారత్ ఆశలు ఆవిరి
దోహా: ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భారత జట్టు మూడో రౌండ్కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మూడో రౌండ్కు చేరాలంటే భారత జట్టు ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సింది. కానీ భారత జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. మరోవైపు అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కువైట్ జట్టు 1–0తో గెలిచింది. దాంతో గ్రూప్ ‘ఎ’ నుంచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఖతర్... 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన కువైట్ మూడో రౌండ్కు అర్హత సాధించాయి. 5 పాయింట్లతో భారత్, అఫ్గానిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన గోల్స్ సగటుతో భారత్కు మూడో స్థానం, అఫ్గానిస్తాన్కు నాలుగో స్థానం లభించాయి. రిఫరీ చెత్త నిర్ణయం... ఖతర్తో మ్యాచ్లో భారత జట్టుకు 37వ నిమిషంలో లాలియన్జువాల్ చాంగ్టె గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 73 నిమిషాల వరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ దశలో రిఫరీ చెత్త నిర్ణయం కారణంగా ఖతర్ జట్టు ఖాతాలో గోల్ చేరి స్కోరు సమమైంది. 73వ నిమిషంలో యూసుఫ్ ఐమన్ కొట్టిన హెడర్ను భారత గోల్కీపర్, కెపె్టన్ గుర్ప్రీత్ సింగ్ నిలువరించాడు. ఆ తర్వాతి బంతి గోల్ లైన్ దాటి బయటకు వెళ్లింది. కానీ అక్కడే ఉన్న ఖతర్ ఆటగాడు హాష్మీ అల్ హుస్సేన్ బంతిని వెనక్కి పంపించగా, యూసుఫ్ ఆ బంతిని లక్ష్యానికి చేర్చాడు. రిఫరీ దీనిని గోల్గా ప్రకటించాడు. దాంతో భారత ఆటగాళ్లు నివ్వెరపోయి రివ్యూ చేయాలని రిఫరీని కోరినా ఆయన అంగీకరించకుండా గోల్ సరైనదేనని ప్రకటించాడు. టీవీ రీప్లేలో బంతి గోల్లైన్ దాటి బయటకు వెళ్లిందని స్పష్టంగా కనిపించినా భారత ఆటగాళ్ల మొరను రిఫరీ ఖాతరు చేయలేదు. ఈ సంఘటనతో భారత బృందం ఏకాగ్రత చెదిరింది. 85వ నిమిషంలో అహ్మద్ అల్రావి గోల్తో ఖతర్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లి చివరి నిమిషం వరకు దీనిని కాపాడుకొని విజయాన్ని అందుకుంది. -
Viral Video: కన్నీటి పర్యంతమైన క్రిస్టియానో రొనాల్డో
దిగ్గజ ఫుట్బాలర్, పోర్చుగల్ స్టార్, అల్ నసర్ క్లబ్ తురుపు ముక్క క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. కింగ్ కప్ ఫైనల్లో తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. సహచరులు ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా రొనాల్డో కన్నీళ్లు ఆగలేదు. మైదానంలో చాలా సేపు కూర్చుని బాధతో కృంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. రొనాల్డో బాధను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఆట పట్ల స్టార్ ఫుట్బాలర్కు ఉన్న కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించినా.. క్లబ్ తరఫున ఆడినా రొనాల్డో ప్యాషన్ ఒకే తీరులో ఉంటుందని కితాబునిస్తున్నారు.Nothing hurts a football fan more than seeing Ronaldo cry pic.twitter.com/YSMsZKBE9z— Trey (@UTDTrey) May 31, 2024కాగా, సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిన్న (మే 31) జరిగిన కింగ్ ఆఫ్ ఛాంపియన్ కప్ ఫైనల్లో రొనాల్డో ప్రాతినిథ్యం వహించిన అల్ నసర్ జట్టు.. చిరకాల ప్రత్యర్ది అల్ హిలాల్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత ఈ మ్యాచ్ (ఎక్స్ట్రా సమయం తర్వాత) 1-1తో టై కాగా.. పెనాల్టీ షూటౌట్లో అల్ హిలాల్.. 5-4 తేడాతో అల్ నసర్పై పైచేయి సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో అల్ హిలాల్ తరఫున అలెగ్జాండర్ మిత్రోవిచ్ (7వ నిమిషం).. ఆల్ నసర్ తరఫున అయ్మాన్ యాహ్యా (88వ నిమిషం) గోల్స్ చేశారు.ఇదిలా ఉంటే, అల్ హిలాల్ జట్టు ఇటీవల ముగిసిన సౌదీ ప్రో లీగ్లో కనీవినీ ఎరుగని ప్రదర్శనలు చేసి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఎడిషన్లో అల్ హిలాల్ రికార్డు స్థాయిలో 34 మ్యాచ్ల్లో 31 విజయాలు సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. క్లబ్ ఫుట్బాల్ చరిత్రలో ఏ జట్టు ఈ స్థాయి విజయాలు సాధించలేదు. ఈ లీగ్లో కూడా రొనాల్డో జట్టు అల్ నసర్ రన్నరప్తో సరిపెట్టకుంది. రొనాల్డో తదుపరి UEFA యూరో ఛాంపియన్షిప్ 2024లో పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో క్రిస్ తన జాతీయ జట్టైన పోర్చుగల్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. -
ఉజ్బెకిస్తాన్తో.. ఫుట్బాల్ మ్యాచ్లకు సౌమ్య!
తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ భారత మహిళల ఫుట్బాల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తాషె్కంట్ నగరంలో ఉజ్బెకిస్తాన్ జట్టుతో మే 31, జూన్ 4వ తేదీల్లో జరిగే రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో పోటీపడే భారత జట్టులో ఆమె ఎంపికైంది.30 మంది ప్రాబబుల్స్కు ఇటీవల రెండు వారాలపాటు హైదరాబాద్లోని శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టర్కీష్ కప్ టోరీ్నలో రన్నరప్గా నిలిచిన భారత జట్టులోనూ సౌమ్య సభ్యురాలిగా ఉంది.ఇవి చదవండి: నాలుగో ర్యాంక్లో జ్యోతి సురేఖ.. -
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
‘‘కఠిన శ్రమకోర్చే.. ఓ మంచి ఆటగాడిగా అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటా. చూడటానికి చక్కగా కనిపించే హార్డ్ వర్కర్ ఉండేవాడని నన్ను గుర్తుంచుకుంటే చాలు’’ అని భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి అన్నాడు. అదే తాను ఇక్కడ విడిచి వెళ్తున్న జ్ఞాపకంగా మిగిలిపోవాలని పేర్కొన్నాడు.కాగా భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. జూన్ 6న తన చివరి మ్యాచ్ ఆడబోతున్నానని 39 ఏళ్ల ఛెత్రి గురువారం ప్రకటించాడు.ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్లలో కొనసాగుతావచ్చే నెల 6న ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భాగంగా కువైట్తో జరిగే మ్యాచే తన కెరీర్లో చివరిదని ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.అయితే ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్లలో కొనసాగుతానని ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఫుట్బాలర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు (19 ఏళ్లు) భారత జట్టుకు సేవలందించాడు. ఢిల్లీకి చెందిన ఆర్మీ అధికారి కేబీ ఛెత్రి, సుశీల దంపతులకు 1984, ఆగస్టు 3న సికింద్రాబాద్ (తెలంగాణ)లో జన్మించిన ఛెత్రి భారత ఫుట్బాల్లో అసాధారణ ఫార్వర్డ్ ఆటగాడిగా ఎదిగాడు. తదనంతరం నాయకత్వ పటిమతో విజయవంతమైన సారథి అయ్యాడు. భారత ఫుట్బాల్ చరిత్రలో చురుకైన దిగ్గజంగా వెలుగొందుతున్నాడు. ఆరోజు ఏడుస్తూనే ఉంటాఇక తన రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సునిల్ ఛెత్రి.. ‘‘జూన్ 6న నేను రిటైర్ అవుతాను.. జూన్ 7 మొత్తం ఏడుస్తూనే ఉంటాను. జూన్ 8న కాస్త రిలాక్స్ అవుతాను. జూన్ 8 నుంచి బ్రేక్ తీసుకుని నా కుటుంబానికి సమయం కేటాయిస్తాను’’ అని తెలిపాడు.సునిల్ ఛెత్రి సాధించిన ఘనతలు 👉150 అంతర్జాతీయ మ్యాచ్లాడిన సునీల్ 94 గోల్స్ కొట్టాడు. భారత్ తరఫున టాప్ స్కోరర్ కాగా... ఓవరాల్గా ఫుట్బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో టాప్–3లో ఉన్నాడు. క్రిస్టియానో రోనాల్డో (128 గోల్స్; పోర్చుగల్), మెస్సీ (106 గోల్స్; అర్జెంటీనా) తర్వాతి స్థానం మన ఛెత్రిదే! 👉మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్ అంతర్జాతీయ టోర్నీ (2007, 2009, 2012) టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 👉దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్షిప్లో భారత్ మూడు (2011, 2015, 2021) టైటిల్ విజయాలకు కృషి చేశాడు. 👉2008లో ఏఎఫ్సీ చాలెంజ్ కప్ను గెలిపించిన ఛెత్రి, ఏడుసార్లు ‘ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. భారత్లోని ప్రముఖ ఫుట్బాల్ క్లబ్లైన ఈస్ట్ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్సీ, బెంగళూరు ఎఫ్సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా జట్లకు లీగ్ ట్రోఫీలు అందించాడు.‘అతనో ఫుట్బాల్ శిఖరం’ భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితరులంతా ఛెత్రి ఘనతల్ని కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా వారంతా అతనొక రియల్ లెజెండ్గా కితాబిచ్చారు. బీసీసీఐ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సైతం ఛెత్రి సేవలకు సెల్యూట్ చేశాయి.నాకు ముందే తెలుసుఛెత్రి రిటైర్మెంట్ గురించి తనకు ముందే తెలుసన్నాడు క్రికెటర్ విరాట్ కోహ్లి. అతడిని చూసి తాను గర్వపడుతున్నానని.. ఏదేమైనా బాగా ఆలోచించిన తర్వాత సునిల్ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. కాగా కోహ్లి, సునిల్ ఛెత్రి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.చదవండి: IPLలో రూ. 20 లక్షలు.. అక్కడ అత్యధిక ధర! నితీశ్ రెడ్డి రియాక్షన్ ఇదే -
Sunil Chhetri Love Story: ‘చిన్నపిల్లవి చదువుకో అని చెప్పాను.. కానీ నా మనసే వినలేదు’
భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు .. గురువారం (మే 16) ప్రకటన విడుదల చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి మొత్తంగా 150 మ్యాచ్లలో 94 గోల్స్ సాధించాడు. భారత ఫుట్బాల్ కెప్టెన్గానూ సునిల్ ఛెత్రి సేవలు అందించాడు.సునిల్ ఛెత్రి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అతడి లవ్స్టోరీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సునిల్ ఛెత్రి తన కోచ్, భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనం భట్టాచార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమ కథ గురించి సునిల్ ఛెత్రి గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆమెకు 15 ఏళ్లు. వాళ్ల నాన్న గురించి అందరితో గొప్పగా చెప్పేవారు.ఆమె వాళ్ల నాన్న దగ్గరి నుంచి నా నా నెంబర్ దొంగతనం చేసి.. నాకు మెసేజ్లు పంపేది. ‘నేను సోనం.. నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను’ అని సందేశాలు పంపించేది.నాకు మాత్రం అప్పటికి తనెవరో తెలియదు. అయితే, ఆమె మాట్లాడే విధానం నచ్చి ఓ రోజు తనను కలవాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే ఇంత చిన్నపిల్లా నాకు మెసేజ్లు పంపేది అనుకున్నా. ‘నువ్వింకా చిన్నదానివి. వెళ్లి బుద్ధిగా చదువుకో’ అని చెప్పి వెళ్లిపోయా.అయితే, తన మెసేజ్లకు రిప్లై ఇవ్వడం మాత్రం మానలేకపోయా. రెండున్నర నెలల తర్వాత మా కోచ్ ఫోన్ పనిచేయడం లేదని.. ప్రాబ్లం ఏమిటో చూడాలని నాకు ఇచ్చారు. అప్పుడు మా కోచ్ వాళ్ల కూతురి నంబర్, నాకు మెసేజ్లు చేసే అమ్మాయి నంబర్ ఒకేలా అనిపించింది.అప్పుడే నాకు అర్థమైంది తను మరెవరో కాదు మా కోచ్ కూతురేనని! వెంటనే సోనంకు కాల్ చేసి.. ఈ విషయం గురించి మీనాన్నకు తెలిస్తే నా కెరీర్ ముగిసిపోతుంది. ఇక చాలు అని చెప్పేశా.అప్పుడు సోనం నాకు సారీ చెప్పింది. అయితే, విధి రాత మరోలా ఉంది. తను నా మనసులో అలాగే ఉండిపోయింది. ఆమెతో మాట్లాడాలని, మెసేజ్ చేయాలని మా మనసు తహతహలాడేది. సీక్రెట్గా కలిసేవాళ్లం. నా బిజీ షెడ్యూల్ కారణంగా ఏడాదిలో రెండు మూడుసార్లు మాత్రమే నేరుగా కలిసేందుకు వీలయ్యేది.సినిమాకు వెళ్లి రెండు టికెట్లు కొని.. ఒకటి తనకోసం కౌంటర్ దగ్గరే వదిలేసి వెళ్తే తను వచ్చి తీసుకునేది. చాలా ఏళ్లపాటు అలాగే ప్రేమలో మునిగితేలాం.నా కెరీర్తో పాటు మా ప్రేమ కూడా ట్రాక్లో పడింది. సరైన వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.ఈ విషయం గురించి మా కోచ్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. కానీ ధైర్యం చాల్లేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ‘సర్.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా’ అని చెప్పాను. ఆయన వెంటనే అవునా.. సరే అంటూ వాష్రూంలోకి వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చి మాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు.ఆతర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి జరిగింది. 13 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. తనే నా ధైర్యం.సపోర్ట్ సిస్టం. ప్రతి అడుగులోనూ నా వెంటే ఉంటుంది. తను లేకుంటే నేను లేను. ఇప్పటికీ తను నాకు వీరాభిమానే!’’ అని సునిల్ ఛెత్రి తెలిపాడు. కాగా సునిల్- సోనం జంటకు 2023లో కుమారుడు జన్మించాడు. -
ఒకే ఒక్కడు.. పుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటన (ఫొటోలు)
-
Sunil Chhetri: భారత ఫుట్బాల్ దిగ్గజం కీలక ప్రకటన
భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తొమ్మిది నిమిషాల నిడివితో కూడిన వీడియో సందేశం ద్వారా గురువారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా కువైట్తో జూన్ 6న జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరిదని సునిల్ ఛెత్రి తెలిపాడు. ‘‘గత 19 ఏళ్ల కాలంలో విధి నిర్వహణ, ఒత్తిడి.. సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నెమరువేసుకుంటూనే వచ్చాను. దేశం కోసం నేను ఇన్ని మ్యాచ్లు ఆడతానని అస్సలు ఊహించలేదు. మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్తో ఆడే మ్యాచ్ నా చివరి మ్యాచ్ అవుతుంది’’ అని సునిల్ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.రొనాల్డో, మెస్సీ తర్వాత..1984, ఆగష్టు 3న సికింద్రాబాద్లో జన్మించిన సునిల్ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్ బగాన్ క్లబ్ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్ ఫుట్బాలర్గా కెరీర్ మొదలుపెట్టాడు.ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2005లో పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా జూన్ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్గా ఎదిగాడు.మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ఫుట్బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం. అందుకున్న పురస్కారాలు👉అర్జున అవార్డు👉పద్మశ్రీ👉ఖేల్రత్న👉ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు👉మూడుసార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు👉శాఫ్ చాంపియన్షిప్లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీచదవండి: Sunil Chhetri Life Story In Telugu: సికింద్రాబాద్లో పుట్టిన ఛెత్రీ.. కుటుంబ నేపథ్యం ఇదే! కెప్టెన్ ఫెంటాస్టిక్గా ఘనతలు -
చాంపియన్ ముంబై సిటీ
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ రెండో సారి విజేతగా నిలిచింది. దాదాపు 62 వేల సామర్థ్యం గల సాల్ట్లేక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 3–1 గోల్స్ తేడాతో మోహన్బగాన్ సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. ఆరంభంలో ఇరు జట్లూ జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్పైనే దృష్టి పెట్టాయి. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ సాధించిన గోల్తో ముందుగా మోహన్బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో 3 గోల్స్తో ముంబై చెలరేగింది. ముంబై తరఫున జార్జ్ పెరీరా డియాజ్ (53వ నిమిషం), బిపిన్ సింగ్ (81వ నిమిషం), జాకబ్ వోజస్ (90+7వ నిమిషం)లో గోల్స్ కొట్టారు. 2020–21 సీజన్లో ముంబై విజేతగా నిలిచిన మ్యాచ్లో కూడా ఇదే తరహాలో మోహన్బగాన్ 1–0తో ఆధిక్యంలో నిలిచినా...బిపిన్ సింగ్ సాధించిన గోల్తోనే ముంబై గెలిచింది. అదనపు సమయంలో మోహన్బగాన్కు స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా... ఫార్వర్డ్లు పూర్తిగా విఫలమయ్యారు. కొన్ని క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ముంబై మరో గోల్తో తిరుగులేని విజయా న్ని అందుకుంది. ముంబైకి చెందిన ఫుర్బా లచెన్పాకు ‘గోల్డెన్ గ్లవ్’, విక్రమ్ ప్రతాప్ సింగ్కు ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు, కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ దిమిత్రియోస్ దియామంతకూస్కు ‘గోల్డెన్ బూట్’ అవార్డులు దక్కగా, మోహన్ బగాన్ ఆటగాడు పెట్రాటోస్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’గా నిలిచాడు. -
సంచలన నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ వెనక్కు
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం రొమరియో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు. స్థానిక టోర్నీలో ఉనికి కోల్పోయిన తన క్లబ్కు (అమెరికా ఆఫ్ రియో డి జనైరో) ఊపు తెప్పించేందుకు తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇదే క్లబ్కు రొమారియో కుమారుడు రొమారిన్హో (30) కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఆసక్తికరం. బ్రెజిల్ బేస్డ్ ఫుట్బాల్ క్లబ్ అయిన అమెరికా ఆఫ్ రియో డి జనైరోకు రొమారియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 80, 90 దశకాల్లో స్టార్ స్ట్రయికర్గా పేరొందిన రొమారియో 15 ఏళ్ల కిందట (2008) ప్రొఫెషనల్ ఫుట్బాల్కు గుడ్బై చెప్పాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్గా పలు మార్లు ఎన్నికయ్యాడు. రొమారియో 1994 వరల్డ్కప్ విన్నింగ్ జట్టులో (బ్రెజిల్) కీలక సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం రొమారియో సెనేటర్గా ఉంటూనే తన క్లబ్ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని రొమారియో ఇన్స్టా ద్వారా వెల్లడించాడు. అమెరికా ఆఫ్ రియో డి జనైరో తరఫున ఆటగాడిగా బరిలోకి దిగేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే తాను ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని మాత్రం రొమారియో పేర్కొనలేదు. కాగా, బ్రెజిల్లో ప్రస్తుతం జరుగుతున్న రియో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో అమెరికా ఆఫ్ రియో డి జనైరో క్లబ్ తడబతుంది. గతమెంతో ఘనంగా ఉన్న ఈ క్లబ్ ప్రస్తుతం పేలవ ప్రదర్శనలకు పరిమితమై ఉనికి కోల్పోయింది. రియో క్లబ్లో ఉత్సాహం నింపి పూర్వవైభవం తెచ్చేందుకే రొమారియో తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ లీగ్ చాంపియన్షిప్ను హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు విజయంతో ముగించింది. శనివారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్సీ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున విలియమ్ అల్వెస్ ఒలివీరా (4వ ని.లో), గేబ్రియల్ రోసెన్బర్గ్ (16వ ని.లో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. షిల్లాంగ్ జట్టుకు ఫ్రాంగీ బువామ్ (46వ, 87వ ని.లో) రెండు గోల్స్ అందించాడు. 13 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్లో శ్రీనిధి జట్టు నిరీ్ణత 24 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. 14 మ్యాచ్ల్లో నెగ్గిన శ్రీనిధి జట్టు ఆరు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయి మొత్తం 48 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్లోనూ శ్రీనిధి జట్టు రెండో స్థానంలోనే నిలిచింది. 52 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్గా నిలిచిన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ ఇండియన్ సూపర్ లీగ్కు అర్హత సాధించింది. -
అమెరికన్ ఫుట్బాల్ దిగ్గజం ఓజే సింప్సన్ కన్నుమూత
లాస్ వేగస్: వివాదాస్పద అమెరికన్ ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు, హాలీవుడ్ నటుడు ఓజే సింప్సన్ కన్ను మూశాడు. 76 ఏళ్ల సింప్సన్ కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. 1969 నుంచి 1979 వరకు అమెరికాలోని విఖ్యాత నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో బఫెలో బిల్స్, శాన్ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ జట్లకు సింప్సన్ ప్రాతినిధ్యం వహించాడు. 1994 జూన్లో తన మాజీ భార్య నికోల్ బ్రౌన్, ఆమె స్నేహితుడు రొనాల్డ్ గోల్డ్మన్ల జంట హత్య కేసులో ప్రమేయం ఉందంటూ సింప్సన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 11 నెలల విచారణ తర్వాత సింప్సన్ నిర్దోíÙగా బయటపడ్డాడు. అయితే 2007లో సింప్సన్ లాస్ వేగస్లోని ఓ క్యాసినోలో మారణాయుధాలతో ప్రవేశించి దోపిడికి పాల్పడ్డారు. విచారణ అనంతరం 2008లో సింప్సన్కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించారు. తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించాక 2017లో సింప్సన్ పెరోల్పై విడుదలయ్యాడు. -
‘డ్రా’తో గట్టెక్కిన శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ
షిల్లాంగ్: ఐ–లీగ్ జాతీయ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. నెరోకా ఎఫ్సీతో గురువారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి జట్టు 1–1తో ‘డ్రా’ చేసుకుంది. నెరోకా తరఫున రోహిత్ (70వ ని.లో), శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టనెడా మునోజ్ (82వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 44 పాయింట్లతో రెండో స్థానంలో, మొహమ్మదాన్ స్పోర్టింగ్ 49 పాయింట్లో తొలి స్థానంలో ఉన్నాయి. శ్రీనిధి జట్టుకు టైటిల్ దక్కాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా ఓడిపోవాలి. -
భారత ఫుట్బాలర్కు జాక్పాట్
న్యూఢిల్లీ: భారత ఫుట్బాలర్ బిజయ్ ఛెత్రి జాక్పాట్ కొట్టాడు. లాటిన్ అమెరికా క్లబ్కు ఆడే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. తద్వారా ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫుట్బాలర్గా గుర్తింపు పొందనున్నాడు. మణిపూర్కు చెందిన 22 ఏళ్ల బిజయ్తో ఉరుగ్వేకు చెందిన కొలోన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఒప్పందం చేసుకుంది. ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని బిజయ్ 2016లో షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్లో చెన్నైయన్ ఎఫ్సీ తరఫున ఆడుతున్న బిజయ్ గతంలో ఇండియన్ యారోస్, చెన్నై సిటీ, రియల్ కశ్మీర్, శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ తరఫున బరిలోకి దిగాడు. -
Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి.. కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలిప్రొఫెషనల్ ఫిమేల్ ఫుట్బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్బాల్లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్లో ఆడాను. గోల్ కీపర్గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు.. నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! -
భారత్కు అఫ్గానిస్తాన్ షాక్
గువాహటి: ఫుట్బాల్లో భారత జట్టు దీనావస్థను చూపించే మరో ఉదాహరణ! ఆసియాలో అనామక జట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్తో నాలుగు రోజుల క్రితం జరిగిన మ్యాచ్లో ఒక్క గోల్ కూడా చేయకుండా ‘డ్రా’గా ముగించిన భారత్ ఆటతీరు ఈసారి మరింత దిగజారింది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లోనూ భారత్ కనీస ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. చివరకు 1–2 గోల్స్ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఆసియా క్వాలిఫయర్స్లో భారత జట్టు మూడో రౌండ్కు అర్హత సాధించే అవకాశాలకు పెద్ద దెబ్బ పడింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో నాలుగు మ్యాచ్ల తర్వాత భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. మన టీమ్ తర్వాతి మ్యాచ్లలో కువైట్ (జూన్ 6న కోల్కతాలో), ఆసియా చాంపియన్ ఖతర్ (జూన్ 11న దోహాలో) జట్లతో తలపడాల్సి ఉంది. అఫ్గాన్తోనే ఓడిన మన టీమ్ ఈ నాణ్యమైన టీమ్లపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేది సందేహమే. చివరిసారి 2013లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయిన భారత జట్టు ఈ మ్యాచ్లో ముందుగా గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లి కూడా ఆఖరికి మ్యాచ్ను ప్రత్యర్థికి అప్పగించింది. భారత్ తరఫున 38వ నిమిషంలో సునీల్ ఛెత్రి కెరీర్లో 94వ గోల్ నమోదు చేయగా... అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో రహ్మత్ అక్బరీ (70వ ని.లో), షరీఫ్ ముఖమ్మద్ (88వ ని.లో) గోల్స్ చేశారు. తన 150వ అంతర్జాతీయ మ్యాచ్లో ఛెత్రి గోల్ చేయడం విశేషమే అయినా... ఓటమి భారత్ను నిరాశకు గురి చేసింది. -
చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్.. తొలి ఇండియన్గా రికార్డు
గువాహటి: భారత ఫుట్బాల్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయిర్స్లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్ హోం మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్పోర్ట్స్ 18 చానెల్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 93 గోల్స్ చేశాడు. భారత్ తరఫున 150 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్ల మైలురాయిని తాకారు. -
ఒకరు 6 సెకన్లలో... మరొకరు 7 సెకన్లలో....
బ్రాటిస్లావా (స్లొవేకియా): అంతర్జాతీయ ఫుట్బాల్లో ఆదివారం అద్భుతం జరిగింది. వేర్వేరు వేదికల్లో జరిగిన రెండు అధికారిక ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో రెండు ఫాస్టెస్ట్ గోల్స్ నమోదయ్యాయి. బ్రాటిస్లావాలో స్లొవేకియాతో జరిగిన మ్యాచ్లో ఆ్రస్టియా 2–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఆట మొదలైన 6 సెకన్లకే ఆ్రస్టియా ప్లేయర్ క్రిస్టోఫ్ బామ్గార్ట్నర్ గోల్ చేశాడు. మిడ్ ఫీల్డ్ నుంచి క్షణాల్లో ముగ్గురు డిఫెండర్లను తప్పించుకొని ముందుకు దూసుకెళ్లిన క్రిస్టోఫ్ లాంగ్షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. మరోవైపు లియోన్లో ఫ్రాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో జర్మనీ జట్టు 2–0తో నెగ్గింది. ఈ మ్యాచ్లో ఆట మొదలైన 7 సెకన్లకే జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ విట్జ్ గోల్ చేశాడు. ఇన్నాళ్లూ అంతర్జాతీయ ఫుట్బాల్లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన రికార్డు లుకాస్ పొడోల్స్కీ పేరిట ఉంది. 2013లో ఈక్వెడార్తో జరిగిన మ్యాచ్లో పొడోల్స్కీ 9వ సెకనులో గోల్ సాధించాడు. పొడోల్స్కీ 11 ఏళ్ల రికార్డు ఒకేరోజు బద్దలు కావడం విశేషం. -
భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
అబా (సౌదీ అరేబియా): ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్లో బలహీన ప్రత్యర్థిపై గెలవాల్సిన మ్యాచ్లో భారత్ పేలవ ఆటతీరు కనబర్చి ‘డ్రా’గా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య గురువారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్... ఒక్క గోల్ అయినా నమోదు కాకుండా ‘డ్రా’ అయ్యింది. తొలి అర్ధ భాగంలో మన్వీర్ సింగ్ రెండు సార్లు గోల్స్ చేసేందుకు ప్రత్యర్థి గోల్పోస్ట్ వైపు దూసుకెళ్లాడు. కానీ గోల్ మాత్రం చేయలేకపోయాడు. రెండో అర్ధ భాగంలో విక్రమ్ ప్రతాప్ కూడా గోల్ కోసం విఫల యత్నాలు చేశాడు. మళ్లీ ఫినిషింగ్ లోపాలతో భారత్ ఖాతా తెరవలేకపోయింది. సులువైన ప్రత్యర్థి జట్టు డిఫెన్స్ను ఛేదించలేకపోవడంపై భారత కోచ్ ఐగర్ స్టిమాక్ అసహనం వ్యక్తం చేశారు. తాజా ‘డ్రా’తో భారత్ ఈ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్లాడిన భారత్ ఖాతాలో 4 పాయింట్లున్నాయి. 3 మ్యాచ్ల ద్వారా 9 పాయింట్లు సాధించిన ఖతర్ అగ్ర స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో ఖతర్ 3–0తో కువైట్పై గెలుపొందింది. -
విజయమే లక్ష్యంగా...
అభా (సౌదీ అరేబియా): ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నేడు అఫ్గానిస్తాన్తో భారత జట్టు తలపడనుంది. తటస్థ వేదిక సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 12:30 నుంచి జరుగుతుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు రెండు మ్యాచ్ లు ఆడింది. ఒక మ్యాచ్లో నెగ్గి, ఒక మ్యాచ్లో ఓడి మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో భారత జట్టుకు మరో విజయం లభిస్తే మూడో రౌండ్కు అర్హత పొందేందుకు తమ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. అఫ్గానిస్తాన్తో ముఖాముఖిగా 11 సార్లు తలపడ్డ భారత్ ఏడుసార్లు గెలిచింది. మూడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. -
శ్రీనిధి డెక్కన్ జట్టును గెలిపించిన ఒలివేరా
కొడుమన్ (కేరళ): ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో 12వ విజయం చేరింది. గోకులం కేరళ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 44వ నిమిషంలో నికోలా స్టొజనోవిచ్ గోల్తో గోకులం కేరళ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే శ్రీనిధి తరఫున విలియమ్ అల్వెస్ డి ఒలివేరా (47వ ని.లో, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నీలో శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. లీగ్ ‘టాపర్’ మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్తో గురువారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట మూడో నిమిషంలో డేవిడ్ కాస్టనెడా గోల్తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 84వ నిమిషంలో మొహమ్మద్ జాసిమ్ గోల్తో మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ స్కోరును సమం చేసింది. రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ 35 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... శ్రీనిధి డెక్కన్ జట్టు 33 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకర ప్రవర్తన.. రొనాల్డోపై నిషేధం
స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఇతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. వివరాల్లోకి వెళితే.. పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ అయిన రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అయిన అల్ నస్ర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్థానికంగా జరిగే ప్రో లీగ్లో భాగంగా అల్ నస్ర్.. రియాద్ క్లబ్ అయిన అల్ షబాబ్తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో.. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨 تصرف كارثي جديد من كريستيانو رونالدو ضد جمهور الشباب بعد نهاية اللقاء! 😳😳😳😳😳 pic.twitter.com/Tzt632I20p — نواف الآسيوي 🇸🇦 (@football_ll55) February 25, 2024 మెస్సీ అభిమానులను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరమైన సంజ్ఞలు చేశాడు. రొనాల్డో ప్రవర్తనను సీరియస్గా తీసుకున్న లీగ్ నిర్వహకులు అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. అలాగే జరిమానా కింద 20000 సౌదీ రియాల్స్ కట్టాల్సిందిగా ఆదేశించారు. రొనాల్డో వికృత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఉదంతంపై రొనాల్డో తాజాగా స్పందించాడు. యూరప్ దేశాల్లో ఇది కామనేనని సమర్ధించుకున్నాడు. కాగా, అల్ నస్ర్ క్లబ్ రెండున్నర సంవత్సరాల కాలానికి గాను రొనాల్డోతో రూ. 4400 కోట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్బాలర్కు జైలు శిక్ష.. భారీ జరిమానా
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్బాలర్కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్ కోర్టు. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుట్బాలర్ డానీ అల్వెస్కు (40) నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్ల జరిమానా విధించింది స్పెయిన్లోని బార్సిలోనా కోర్టు. 2022 డిసెంబర్ 31న అల్వెస్.. సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో (నైట్ క్లబ్లో) పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో అల్విస్ను ఈ ఏడాది జనవరి 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అతను రిమాండ్లోనే ఉన్నాడు. అల్విస్ బెయిల్ ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. తాను నిరపరాధినన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో అల్వెస్ భార్య స్టేట్మెంట్ను కూడా కోర్టు పట్టించుకోలేదు. అల్వెస్ ఫుట్బాల్ కెరీర్ విషయానికొస్తే.. 2006 నుంచి 2022 వరకు బ్రెజిల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అల్వెస్.. 126 మ్యాచ్లు ఆడి 8 గోల్స్ చేశాడు. అల్వెస్.. రైట్ బ్యాక్ స్థానంలో ఆడతాడు. ఇతను వివిధ సమయాల్లో బార్సిలోనా, పీఎస్జీ, జువెంటస్, సాపాలో క్లబ్ల తరఫున ఆడాడు. అల్వెస్.. 2022 ఫిఫా వరల్డ్కప్లో చివరిసారిగా బ్రెజిల్కు ప్రాతినిథ్యం వహించాడు. -
నింగిలో ఫుట్బాల్ గ్రౌండ్... ఆటగాళ్ల వీడియో వైరల్!
ప్రపంచంలోని పలు దేశాలు ఇతర దేశాల ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ విషయంలో చైనా ముందుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రపంచంలోని ఎవరికీ రాని ఆలోచనలు చైనా వారికి వస్తుంటాయి. అవి కార్యరూపం దాల్చినప్పుడు ప్రపంచాన్ని తనవైపునకు తప్పుకుంటాయి. తాజాగా చైనాలో మరో ఆకర్షణీయమైన ప్రాంతం ఏర్పాటయ్యింది. చైనా తాజాగా ఒక విచిత్రమైన ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించింది. దానిని చూసినవారంతా విస్తుపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటున్నారు. పైగా ఈ ఫుట్బాల్ గ్రౌండ్లో ఏమాత్రం భయం లేనివారే ఆడగలరంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫుట్బాల్ మైదానానం ఆకాశంలో తేలియాడుతూ కనిపిస్తుంది. ఈ మైదానం రెండు పర్వతాల మధ్య నున్న భాగంలో నెట్ సహాయంతో తయారు చేశారు. కొంతమంది ఆటగాళ్లు ఈ గ్రౌండ్లో ఉత్సాహంగా ఆడటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చైనాలోని జెజియాంగ్లో చిత్రీకరించారు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’లో @gunsnrosesgirl3 అనే పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ రెండు లక్షల 70 వేల మంది వీక్షించారు. వీడియో చూసిన ఒక యూజర్ ‘వావ్ వాట్ ఎ గేమ్’అని రాయగా మరొక యూజర్ ‘ఇలా ఆడే ధైర్యం నాకు లేదు’ అని రాశాడు. Playing football in the sky, Zhejiang China 📹mychinatrip pic.twitter.com/36ivYq1Fcu — Science girl (@gunsnrosesgirl3) February 21, 2024 -
ఫుట్బాల్ మైదానంలో విషాదం.. అందరూ చూస్తుండగానే కబలించిన మృత్యువు
ఫుట్బాల్ మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ ఆటగాడిని మృత్యువు కబలించింది. పిడుగుపాటుకు గురై ఓ ఫుట్బాలర్ మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని పశ్చిమ జావాలో జరిగింది. స్థానిక జట్ల మధ్య జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈ విషాదం సంభవించింది. This happened during a football match in Indonesia 🇮🇩 pic.twitter.com/JHdzafaUpV — Githii (@githii) February 11, 2024 మ్యాచ్ జరుగుతుండగా 35 ఏళ్ల ఫుట్బాలర్పై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా చురుగ్గా కదిలిన సహచరుడు ఒక్కసారిగా నిశ్రేష్ఠుడిగా మారడంతో ఆటగాళ్లలో దుఖం కట్టలు తెంచుకుంది. ఈ ఘటన చూసి ఆటగాళ్లతో పాటు మైదానంలో ఉన్నవారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఏడాదికాలంలో ఇండోనేషియాలో ఫుట్బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురికావడం ఇది రెండోసారి. గతంలో తూర్పు జావాలోని ఓ యువ ఫుట్బాలర్ ఇలాగే పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగుపాటు కారణంగా ఆ ఫుట్బాలర్కు గుండెపోటు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. క్రీడా మైదానాల్లో ఇలాంటి దుర్ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. 25 సంవత్సరాల క్రితం కాంగోలో ఓ ఫుట్బాల్ మ్యాచ్ జరగుతుండగా పిడుగుపడి జట్టు మొత్తం ప్రాణాలు కోల్పోయింది,. -
మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్
ఇద్దరు ఫుట్బాల్ దిగ్గజాలు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్ల మధ్య నిన్న ఫెండ్లీ మ్యాచ్ జరిగింది. రియాద్లో జరిగిన ఈ మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంటర్ మయామీ (అమెరికా), అల్ నస్ర్ (సౌదీ అరేబియా) జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో రొనాల్డో జట్టు అల్ నస్ర్.. మెస్సీ జట్టు ఇంటర్ మయామీపై 6-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. Messi at full time pic.twitter.com/zvsmiuJqir — Messi Media (@LeoMessiMedia) February 1, 2024 The reaction of Ronaldo and Messi after Al Nassr third goal. https://t.co/DAhcNfTd7Z — CristianoXtra (@CristianoXtra_) February 1, 2024 గాయం కారణంగా క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్ మొత్తంలో పాల్గొనలేదు. మెస్సీ మాత్రం కాసేపు అభిమానులను అలరించాడు. సమయ పరిమితి నిబంధన కారణంగా మెస్సీ గేమ్ చివర్లో కొద్ది నిమిషాలు మైదానంలో కనిపించాడు. రొనాల్డో, మెస్సీ ఆడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులు ఈ మ్యాచ్ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు. Puskas award 🏅 Goal of the year already🎖️ "Aymeric Laporte " 👑#InterMiami #AlNassr#Ronaldo #Messi #Goal pic.twitter.com/XFW1DJwd5p — Mehran Sofi (@sadistic3232) February 1, 2024 రొనాల్డో స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ను వీక్షించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రొనాల్డో, మెస్సీ ముఖాల్లోని హావభావాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమ ఆరాథ్య ఆటగాళ్లు మ్యాచ్ ఆడకపోయినా ఈ మ్యాచ్ను కొన్ని కోట్ల మంది తిలకించారు. ఈ మ్యాచ్లో అల్ నస్ర్ ఆటగాడు, బ్రెజిల్కు చెందిన టలిస్క హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. టెల్లెస్, ఆక్టేవియో, లాపోర్టే తలో గోల్ కొట్టారు. Turki Sheikh reminding Lionel Messi his team is losing 6-0 to Cristiano Ronaldo's Al-Nassr. Unbelievable reaction 🤯🤯🤯 #AlNassrvsInterMiamiCF pic.twitter.com/Zy3lw33piq — Farid Khan (@_FaridKhan) February 2, 2024 -
ఒక్క గోల్, ఒక్క పాయింట్ లేకుండానే ఓటమితో ముగించిన టీమిండియా
దోహా: ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సిరియాతో జరిగి న చివరిదైన మూడో లీగ్ మ్యాచ్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని టీమిండియా 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. సిరియా తరఫున ఆట 76వ నిమిషంలో ఒమర్ ఖిరిబిన్ ఏకైక గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండానే, ఒక్క విజయం కూడా లేకుండా ని్రష్కమించింది. తొలి మ్యాచ్లో భారత్ 0–2తో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్లో 0–3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా, ఐదు పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ ఈ గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి. -
మళ్లీ ఓడిన భారత్.. వరుసగా రెండో పరాజయం
ఆసియా కప్ పురుషుల ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్ మ్యాచ్లో సిరియాతో భారత్ ఆడుతుంది. -
‘ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్గా మెస్సీ.. రికార్డు స్థాయిలో మూడోసారి
అర్జెంటీనా సూపర్స్టార్ మెస్సీ 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్’గా నిలిచాడు. మెస్సీకి నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు 48 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినప్పటికీ కెప్టెన్ల ప్యానెల్ నుంచి ఎర్లింగ్ కంటే మెస్సీకే ఎక్కువ ఓట్లు రావడంతో ‘ఫిఫా’ మెస్సీనే ఎంపిక చేసింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయిలో మూడోసారి (2019, 2022, 2023) గెలుచుకున్నాడు. మెస్సీ గతేడాది బాలన్ డి ఓర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మెస్సీ ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న అనంతరం మరో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. రొనాల్డో 2023 ఫిఫా అత్యుత్తమ ప్లేయర్ అవార్డు రేసులో లేకపోవడం విశేషం. కాగా, లీగ్లతో బిజీగా ఉండటంతో మెస్సీ అవార్డు ప్రధానోత్సవ వేడుకకు హాజరుకాలేదు. -
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
దోహా (ఖతర్): ఆసియాన్ కప్ ఫుట్బాల్ టోర్నీని భారత జట్టు పరాజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆ్రస్టేలియా 2–0 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. ఆసీస్ తరఫున 50వ నిమిషంలో జాక్సన్ ఇరి్వన్, 73వ నిమిషంలో జోర్డాన్ బాస్ గోల్స్ సాధించారు. ఆసీస్ ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఆరంభంలోనే అజీజ్ బెహిచ్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్కు దూరంగా వెళ్లిపోగా, గుడ్విన్ ఇచ్చిన ఫ్రీ కిక్ను హెడర్తో గోల్ చేయడంలో డ్యూక్ విఫలమయ్యాడు. 16వ నిమిషంలో భారత్కు గోల్ చేసేందుకు మంచి అవకాశం లభించింది. నిఖిల్ పుజారి క్రాసింగ్ పాస్ అందించగా, కెపె్టన్ సునీల్ ఛెత్రి దానిని గోల్గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి అర్ధభాగంలో ఆసీస్ను నిలువరించడంలో భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సఫలమయ్యాడు. తమకు లభించిన 11 కార్నర్ కిక్లలో ఆసీస్ సఫలం కాలేదు. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే ఆ్రస్టేలియా పైచేయి సాధించింది. మార్టిన్ బాయెల్ కొట్టిన షాట్ను గుర్ప్రీత్ ఆపగలిగినా...అక్కడే ఉన్న ఇర్విన్ దానిని గోల్గా మలిచాడు. 69వ నిమిషంలో కూడా గోల్ చేసేందుకు చేరువైన భారత్ మళ్లీ విఫలమైంది. స్కోరు సమం చేసేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికే సుభాషిష్ బోస్ను తప్పించి ర్యాన్ మెక్గ్రీ బంతితో దూసుకెళ్లగా...పోస్ట్కు దగ్గరలోనే ఉన్న బాస్ దానిని అందుకొని సునాయాసంగా గోల్ సాధించాడు. తమ తర్వాతి మ్యాచ్లో గురువారం ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. -
నేటి నుంచి ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ
దోహా: ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో మొదలవుతుంది. 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో భారత్, సిరియా, ఉజ్బెకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లున్నాయి. నేడు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఖతర్తో లెబనాన్ తలపడుతుంది. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది చైనాలో జరగాల్సింది. అయితే కోవిడ్ కారణంగా చైనా ఆతిథ్యం నుంచి తప్పుకోగా ఖతర్కు ఈ టోర్నీని కేటాయించారు. -
రోజుల వ్యవధిలో ఇద్దరు ఫుట్బాల్ దిగ్గజాల కన్నుమూత
మ్యూనిక్: రోజుల వ్యవధిలో రెండు ఫుట్బాల్ దిగ్గజాలు నేలరాలాయి. శనివారం బ్రెజిల్ మాజీ ఆటగాడు, నాలుగు సార్లు వరల్డ్కప్ విన్నర్ మారియో జగల్లో (92) తుది శ్వాస విడువగా.. ఆదివారం జర్మనీ ఫుట్బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్బాయెర్ కన్నుమూశారు. 78 ఏళ్ల ఈ జర్మన్ మాజీ కెప్టెన్ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. జర్మనీ ఫుట్బాల్లో బెకెన్బాయెర్ శిఖరం. డిఫెండర్ పొజిషన్లో ఆడే ఆయన తొలుత కెప్టెన్గా తదనంతరం కోచ్గా విజయవంతమై జర్మనీకి రెండు ప్రపంచకప్ టైటిళ్లను అందించారు. పశ్చిమ జర్మనీ కెప్టెన్గా 1974లో ప్రపంచకప్ టైటిల్ను అందించిన ఆయన 1990 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన జర్మనీకి కోచ్గానూ వ్యవహరించారు. -
ఫుట్బాల్ దిగ్గజం కన్నుమూత
ఫుట్బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు మారియో జగల్లో (92) తుది శ్వాస్ విడిచారు. వయసు పైబడటంతో పాటు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో మారియో కన్నుమూశారు. నాలుగు సార్లు వరల్డ్కప్ విన్నర్ అయిన మారియో.. మునుపటి తరం మేటి ఆటగాళ్లలో చివరివాడు. మారియో మరణవార్త తెలిసి ఫుట్బాల్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మారియో అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. మారియో బ్రెజిల్ ఫుట్బాలర్గానే కాకుండా ఆ జట్టుకు కోచ్గా కూడా సేవలందించాడు. మరో ఫుట్బాల్ దిగ్గజం పీలే సమకాలీకుడైన మారియో.. పీలేతో కలిసి 1958, 1962 ప్రపంచకప్లు గెలిచాడు. 1970లో వరల్డ్కప్ గెలిచిన బ్రెజిల్ జట్టుకు మారియో మేనేజర్గా పని చేశాడు. ఆ జట్టుకు పీలే కెప్టెన్గా వ్యవహరించాడు. అలాగే 1994 వరల్డ్కప్ విన్నింగ్ జట్టుకు మారియో కో ఆర్డినేటర్గా పని చేశాడు. 2002లో వరల్డ్కప్ విన్నింగ్ జట్టుకు మారియో అడ్వైజర్గా వ్యవహరించాడు. బ్రెజిల్ ప్రపంచకప్ గెలిచిన ప్రతి సందర్భంలో మారియో ఆ బృందంలో ఏదో ఒక రకంగా భాగమై ఉన్నాడు. -
మెస్సీని ఓడించి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కోహ్లి
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కైవసం చేసుకున్నాడు. ప్యూబిటీ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఇన్స్టాగ్రామ్ పేజీలలో (35 మిలియన్ల ఫాలోవర్స్) ఒకటి. ఈ అవార్డు కోసం హోరాహోరీగా సాగిన పోరులో కోహ్లి.. ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని 78-22 శాతం ఓట్లతో ఓడించాడు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కోహ్లి క్రేజ్ ముందు అతను నిలబడలేకపోయాడు. It's Kohli vs Messi in the final voting for the "Athlete of the year" award in one of the biggest sports pages on Instagram - Pubity Sport. pic.twitter.com/gcyLSPbywA — Johns. (@CricCrazyJohns) December 30, 2023 ప్రపంచం మొత్తం మెస్సీ మేనియా నడుస్తున్నప్పటికీ క్రికెట్ అభిమానులు మాత్రం ఏకపక్షంగా కోహ్లికి ఓట్లు వేసి గెలిపించారు. ఈ అవార్డు కోసం కోహ్లి, మెస్సీతో పాటు నోవాక్ జకోవిచ్, పాట్ కమిన్స్, లెబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలాండ్, క్రిస్టియానో రొనాల్డో, మాక్స్ వెర్స్టాపెన్, మైఖేల్ జోర్డాన్ తదితరులు పోటీపడ్డారు. కాగా, 2023లో వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల మధ్య ఈ పోటీని నిర్వహించగా.. ఫైనల్ రౌండ్ పోరు కోహ్లి, మెస్సీ మధ్య సాగింది. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించి పలు ప్రపంచ రికార్డులు కొల్లగొట్టగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్ వర్షం కురిపించడంతో పాటు తన జట్టుకు పలు అపురూపమైన విజయాలు అందించాడు. -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, కోహ్లి
క్రీడారంగానికి సంబంధించిన ఓ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఇద్దరు దిగ్గజాలు పోటీపడుతున్నారు. ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం క్రికెట్ GOAT విరాట్ కోహ్లి.. ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీతో అమీతుమీకి సిద్దమయ్యాడు. ఈ అవార్డు కోసం కోహ్లి-మెస్సీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఇద్దరూ ఈ ఏడాది తమతమ క్రీడా విభాగాల్లో అత్యుత్తమంగా రాణించి అవార్డు రేసులో నిలిచారు. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్ వర్షం కురిపించాడు. Virat Kohli Vs Lionel Messi Final for 'Pubity Athlete of the Year' award. pic.twitter.com/w4zm4MJmt3— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2023 ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం కోహ్లీ, మెస్సీతో పాటు వివిధ క్రీడలకు చెందిన వందల మంది స్టార్ క్రీడాకారులు పోటీ పడగా.. చివరిగా రేసులో ఈ ఇద్దరే మిగిలారు. మెస్సీ, కోహ్లితో పాటు ఈ అవార్డు కోసం మరో దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో, బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ, బాస్కెట్బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ పోటీపడ్డారు. త్వరలో మెస్సీ, కోహ్లిలలో ఒకరిని ఓటింగ్ ద్వారా విజేతగా ప్రకటిస్తారు. -
క్రికెట్కు విరామం.. ఫుట్బాల్ ఆడిన సంజూ శాంసన్
టీమిండియా వికెట్కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ క్రికెట్కు పాక్షికంగా విరామం పలికినట్లున్నాడు. నిత్యం ఏదో ఒక క్రికెట్ టోర్నీతో బిజీగా ఉండే సంజూ.. తాజాగా తన సొంత రాష్ట్రమైన కేరళలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ కనిపించాడు. సెవెన్స్ టోర్నీలో భాగంగా ఓ స్థానిక జట్టుకు సంజూ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్తో పాటు ఫుట్బాల్లోనూ ప్రావీణ్యం కలిగిన ఈ డాషింగ్ క్రికెటర్.. ప్రొఫెషనల్ ఫుట్బాలర్లా గేమ్ ఆడుతూ ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియో పాతదని కొందరు.. ఇటీవలే ఆడినదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సంజూ అభిమానులు అతని ఫుట్బాల్ టాలెంట్ను చూసి ముగ్దులవుతున్నారు. Sanju Samson playing football in a sevens tournament. pic.twitter.com/3c3X7zXMvS — Johns. (@CricCrazyJohns) December 30, 2023 ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సంజూ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో ఓ సెంచరీ బాదాడు. పార్ల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సంజూ 114 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. సంజూకు ఏ ఫార్మాట్లో అయినా (అంతర్జాతీయ స్థాయి) ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్లో సంజూ పేరిట మూడు శతకాలు ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సంజూ సెంచరీతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్దీప్ సింగ్ (4/30) విజృంభించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందగా.. నిర్ణయాత్మకమైన మూడో వన్డే భారత్ గెలుపొంది 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఇదే పర్యటనలో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. ప్రస్తుతం రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నడుస్తుంది. ఇటీవల ముగిసిన తొలి టెస్ట్లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా రెండో టెస్ట్ జరుగనుంది. -
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్బాలర్కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్బాల్ టీంలో కలకలం..183 కోట్లు కాజేసిన భారతీయుడు!
అమెరికాలో భారత సంతతికి చెందిన ఉద్యోగి చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటు పడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మాజీ ఫుట్బాల్ టీమ్ ఉద్యోగి అమిత్ పటేల్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తాను ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన యూఎస్ ఫుట్బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు. జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్బాట్ టీంలో జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్బాల్ టీంలో అమిత్ పటేల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. జాగ్వార్స్ టీం యాజమాన్యం ఆటగాళ్లు వినియోగించుకునేందుకు వర్చువల్ క్రెడిట్కార్డ్ ప్రోగ్రామ్(వీసీసీ)ని అందుబాటులోకి తెచ్చింది. ఈప్రోగ్రాం ద్వారా ఫుట్బాల్ ఆటగాళ్లు వాళ్లకు కావాల్సిన ఫుడ్, ప్రయాణ ఖర్చులు ఇతర అవసరాల్ని తీర్చుకోవచ్చు. ఆ బాధ్యత అమిత్ పటేల్కి అప్పగించింది. అయితే, ఎంతో నమ్మకంతో ఉంటాడకున్న అమిత్ తన దుర్బుద్దిని చూపించుకున్నాడు. మోసం ఎలా చేసేవాడంటే వీసీసీలో ఆటగాళ్లకు ఖర్చు పెట్టే మొత్తంలో క్యాటరింగ్, ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ ఛార్జీలు ఇలా అన్నీ ఫేక్ రిసిఫ్ట్లు క్రియేట్ చేశాడు. అకౌంట్స్ను మ్యాన్యువల్గా ఎంట్రీ చేసే ఫేక్ రిసిఫ్ట్లను సబ్మిట్ చేసేవాడు. అలా 2018 నుంచి 2023 అమిత్ చేసిన మోసాలకు అంతేలేకుండా పోయింది. చివరకు రూ.183 కోట్లను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు..ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇక ఈ రూ.183 కోట్లను ఆన్లైన్ బెట్టింగ్, ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్లో భారీ విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు, టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్ను కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’
శ్రీనగర్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు రెండో ‘డ్రా’ నమోదు చేసింది. రియల్ కశ్మీర్ ఎఫ్సీ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. రెండు జట్లకు గోల్ చేసే అవకాశాలు లభించినా ఫినిషింగ్ లోపంతో సాధ్యపడలేదు. 13 జట్ల మధ్య జరుగుతున్న ఐ–లీగ్లో ఇప్పటి వరకు శ్రీనిధి జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడింది. ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి, మరో రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని ఓవరాల్గా 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈనెల 11న జరిగే తదుపరి మ్యాచ్లో ఢిల్లీ ఎఫ్సీతో హైదరాబాద్లో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
భారత్ సత్తాకు సవాల్
భువనేశ్వర్: సొంతగడ్డపై సమష్టి ఆటతీరుతో రాణించి ఆసియా చాంపియన్ ఖతర్ జట్టును నిలువరించాలని భారత పురుషుల ఫుట్బాల్ జట్టు పట్టుదలతో ఉంది. ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ రెండో రౌండ్లో భాగంగా నేడు కళింగ స్టేడియంలో ఖతర్ జట్టుతో భారత్ తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఖతర్ 61వ స్థానంలో, భారత్ 102వ స్థానంలో ఉన్నాయి. ర్యాంక్ పరంగానూ, ప్రావీణ్యం పరంగానూ తమకంటే మెరుగ్గా ఉన్న ఖతర్ జట్టును నిలువరించాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీని విజయంతో ప్రారంభించింది. కువైట్తో ఈనెల 16న జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0తో గెలిచింది. మరోవైపు ఖతర్ జట్టు తొలి లీగ్ మ్యాచ్లో 8–1తో అఫ్గానిస్తాన్పై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ భారతజట్టు సత్తాకు సవాల్గా నిలువనుంది. ఇప్పటి వరకు భారత్, ఖతర్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. 1996లో ఖతర్తో జరిగిన తొలి మ్యాచ్లో 0–6తో ఓడిన టీమిండియా, 2019లో రెండో మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. 2021లో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 0–1తో ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఇంటా బయటా పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మొత్తం ఆరు మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం టాప్–2లో నిలిచిన రెండు జట్లు ప్రపంచకప్ మూడో రౌండ్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
డేవిడ్ బెక్హాంకు అంబానీ అదిరిపోయే ట్రీట్..!
-
ఫుట్బాల్ను తాకిన క్రికెట్ ఫీవర్.. భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్కు విశిష్ట అతిథులు
క్రికెట్ ఫీవర్ యూనివర్సల్ గేమ్ ఫుట్బాల్ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్,న్యూజిలాండ్ వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్హమ్తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్, చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, తలైవా రజినీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. బెక్హమ్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ స్టైలిష్ ఫుట్బాలర్, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్హమ్కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్బాల్కు వీడ్కోలు పలికాక పలు క్లబ్లకు కోచ్గా సేవలందించిన బెక్హమ్.. ప్రస్తుతం ఇంటర్ మయామీ ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్గా ఉన్నాడు. ఆల్టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. #WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai. "I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX— ANI (@ANI) November 14, 2023 -
ఫుట్బాల్ ఇలా కూడా ఆడొచ్చా? ఎప్పుడూ చూడలేదే!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆట ఫుట్బాల్. ఈ ఆటలో క్రీడాకారులు మైదానంలో చిరుతల్లా పరిగెత్తుతూఅద్భుతమైన గోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. నియమిత సమయంలో ఏ జట్టు అయితే ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్లను విజేతలుగా నిర్ణయిస్తారు. ఇదంతా.. ఇప్పటివరకు మనకు తెలిసిన ఫుట్బాల్ గేమ్. కానీ ఇప్పుడు ఓ వెరైటీ ఫుట్బాల్ గేమ్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.. సాధారణంగా ఫుట్బాల్ ఆడాలంటే జట్టుకు 11మంది సభ్యులు ఉంటారు. కానీ ఈ వెరైటీ ఫుట్బాల్లో మాత్రం కేవలం ఇద్దరి మధ్యే పోటీ ఉంటుంది. ఇక వీళ్లకు వందల అడుగుల విస్తీర్ణం ఉన్న మైదానం కూడా అవసరం లేదు. కేవలం రెండు టేబుల్స్ పట్టేంత స్థలం ఉంటే చాలు. అయితే ఫుట్బాల్ గేమ్ మాదిరిగా వీళ్లు కూడా బంతిని చేతితో తాకకుండా కాలితో తమ ప్రత్యర్థి సెట్లోకి ఎవరైతే ఎక్కువ సార్లు బంతిని వేస్తారో వాళ్లే విజేతలుగా పరిగణించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.దీంతో.. ఫుట్బాల్ను ఇలా కూడా ఆడతారా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గ్లాస్ ఫుట్బాల్ని ఎప్పుడూ చూడలేదు. భలే వెరైటీగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. Legend game pic.twitter.com/gLC6jzFJ3R — Enezator (@Enezator) November 3, 2023 -
Lionel Mess: ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ నెగ్గిన మెస్సీ.. (ఫొటోలు)
-
రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ
దిగ్గజ ఫుట్బాలర్, ఇంటర్ మయామీ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ (36) మరోసారి ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నాడు. 2023 సంవత్సరానికి గాను మెస్సీని ఈ అవార్డు వరించింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయి ఎనిమిదోసారి కైవసం చేసుకోవడం విశేషం. మెస్సీ తర్వాత ఈ అవార్డును అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో (5) దక్కించుకున్నాడు. The moment when 🐐 was announced as the #BallonDor winner. - Lionel Messi, the icon!pic.twitter.com/QNZOmBgeMe — Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2023 2009లో తొలిసారి బాలన్ డి'ఓర్ సొంతం చేసుకున్న లియో.. 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023 సంవత్సరాల్లో ఈ అవార్డును చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ కోసం నార్వే ఆటగాడు, మాంచెస్టర్ సిటీ స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ మెస్సీతో పోటీపడ్డాడు. అయినా అవార్డు దిగ్గజ ఫుట్బాలర్నే వరించింది. పారిస్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మరో దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్ మెస్సీకి అవార్డు అందించాడు. కాగా, లియో గతేడాది అర్జెంటీనాకు వరల్డ్కప్ అందించిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఎయిటనా బొన్మాటి.. మహిళల విభాగంలో బాలన్ డి'ఓర్ అవార్డును స్పెయిన్ ఫుట్బాలర్, బార్సిలోనా సెంట్రల్ మిడ్ ఫీల్డర్ ఎయిటనా బొన్మాటి దక్కించుకుంది. ఎయిటనా ఈ అవార్డుకు తొలిసారి ఎంపికైంది. ఎయిటనా 2023 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యురాలు. -
ఫుట్బాల్కూ ప్రాధాన్యత
యలమంచిలి(అనకాపల్లి రూరల్) : క్రికెట్తో పాటు రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకూ సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఆదివారం యలమంచిలి–విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన ఫుట్బాల్ క్రీడాకారులను గుర్తించి, వారికి మంచి తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫుట్బాల్కు మన దేశంలో ఆదరణ తక్కువగా ఉందని, దీనిని పెంచడానికి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోందని తెలిపారు. భవిష్యత్లో రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారుచేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో యలమంచిలి, విశాఖ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న శ్రీధర్ రెండు జట్ల మధ్య నిర్వహించిన ఎగ్జిబిషన్ మ్యాచ్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ రాజే‹Ù, కోనసీమ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలాద్రి, ఎన్ఐఎస్ చీఫ్ కోచ్ ఎం.శేషుమోహన్, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ ఎస్జీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంగ్లండ్ ఫుట్బాల్ లెజెండ్ కన్నుమూత
మాంచెస్టర్ యునైటెడ్ లెజెండ్ , ఇంగ్లండ్ ఫుట్ బాల్ దిగ్గజం సర్ బాబీ చార్ల్టన్(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆశింగ్టనన్లోని తన సృగృహంలో శనివారం తుదిశ్వాస విడిచారు. 1966లో జరిగిన ఫుట్బాల్ ప్రపంపకప్ను ఇంగ్లండ్ సొంతం చేసుకోవడంలో చార్ల్టన్ది కీలక పాత్ర. వెస్ట్ జర్మనీతో జరిగిన ఫైనల్లో ఆయన అద్బుతమైన గోల్స్ సాధించి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. తన కెరీర్లో రెడ్ డెవిల్స్ తరపున 758 మ్యాచ్లు చార్ల్టన్.. 249 గోల్స్ సాధించాడు. అదే విధంగా 1968లో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున యూరోపియన్ కప్ను కూడా గెలుచుకున్నాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కూడా నివాళులర్పించింది . -
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
యంగ్ హీరో తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా... స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు "రామాచారి" అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ కూడా త్వరలో మొదలు కానుంది. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని "కిక్ స్టార్ట్" అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్... "డ్యూడ్" చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ - మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం అందిస్తున్నాడు. -
అడ్డంకులను దూరంగా తన్ని,30 ఏళ్లుగా ఆడపిల్లల కోసం కష్టపడుతూ..
మణిపూర్ ఒక మంచి వార్తను వినిపించింది. ఆ రాష్ట్రానికి చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్ తీసిన ‘ఆండ్రో డ్రీమ్స్’ ముంబైలో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీగా ఎంపికైంది. మణిపూర్లోని మారుమూల గ్రామం ‘ఆండ్రో’లో ఆడపిల్లల ఫుట్బాల్ క్లబ్ను 30 ఏళ్లుగా పరిస్థితులకు ఎదురీది నడుపుతున్న ‘లైబి’ అనే మహిళ పోరాటాన్ని ఈ డాక్యుమెంటరీ రికార్డు చేసింది. ఆడపిల్లల క్రీడా స్వేచ్ఛను ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగనివ్వాలనే సందేశం ఇచ్చే ఈ డాక్యుమెంటరీ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతోంది. అంతా చేసి ఎనిమిది వేల మంది జనాభా మించని ఊరు ఆండ్రో. మణిపూర్ తూర్పు ఇంఫాల్ జిల్లాలో మారుమూల ఉంటుంది అది. అక్కడి ఆడపిల్లలు ఫుట్బాల్ ఆడితే ఏంటి... ఆడకపోతే ఏంటి? కాని 60 ఏళ్ల లైబి మాత్రం– ఆడాల్సిందే అంటోంది. ఆమె గత ముప్పై ఏళ్లుగా ‘ఆండ్రో మహిళా మండల్ అసోసియేషన్– ఫుట్బాల్ క్లబ్’ (అమ్మ– ఎఫ్సీ) నడుపుతోంది. ఈ క్లబ్కు నిధులు లేవు. బిల్డింగ్ లేదు. ఊళ్లో ప్రోత్సాహం లేదూ, ఏమీ లేదు. కాని లైబి మాత్రం అంతా తానై క్లబ్ను నడుపుతోంది. ఈ మధ్యే ఆమె ఒక పూరి పాక నిర్మించి దానినే క్లబ్ బిల్డింగ్గా ప్రారంభించుకుంది. ‘అమ్మాయిలు కేవలం వంటకు, ఇంటి పనికి అంకితమై పోకూడదు. చదువుకోవాలి. ఆడాలి. ధైర్యంగా భవిష్యత్తును నిర్మించుకోవాలి. మా ప్రాంతంలో పురుషులదే సర్వాధికారం. ఇంటి పెద్ద, తెగ పెద్ద ఎంత చెప్తే అంత. వారి దృష్టిలో ఆడవాళ్ల గురించి చింతించాల్సింది ఏమీ ఉండదు. అమ్మాయిలు ఆడతామన్నా ఒప్పుకోరు. నా పోరాటం వల్లే ఇవాళ మా ఊరి నుంచి జాతీయ స్థాయిలో అమ్మాయిలు ఫుట్బాల్ ఆడుతున్నారు’ అంటుంది లైబి. ఈమె పోరాటం ప్రపంచానికి చెప్పదగ్గది అనిపించింది మణిపూర్కే చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్కు. అలా తయారైన డాక్యుమెంటరీనే ‘ఆండ్రో డ్రీమ్స్’. ఇద్దరి కథ ప్రస్తుతం ముంబైలో ‘జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో ‘ఆండ్రో డ్రీమ్స్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఇప్పటికే కేరళ, కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్కు ఎంపికైన ఈ డాక్యుమెంటరీ ముంబైలో విమర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘దీనికి కారణం ఆండ్రోలో అమ్మ క్లబ్ను నడుపుతున్న లైబి పోరాటాన్ని, ఆ క్లబ్లో గొప్ప ఫుట్బాల్ ప్లేయర్గా ఉంటూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనుకునే నిర్మల అనే అమ్మాయి ఆకాంక్షలని నేను చూపించడమే. ఒక రకంగా చాదస్త వ్యవస్థతో రెండు తరాల స్త్రీల పోరాటం ఈ డాక్యుమెంటరీ’ అని తెలిపింది మీనా లాంగ్జామ్. మణిపూర్ వెలుతురు నిజానికి మే 3వ తేదీ నుంచి మణిపూర్ వేరే కారణాల రీత్యా వార్తల్లో ఉంది. కాని మణిపూర్ను అభిమానించేవారికి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ సాధిస్తున్న విజయాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘నా డాక్యుమెంటరీ విజయం మా ప్రాంతంలో గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టే ఉత్సాహాన్ని ఇస్తే అంతే చాలు’ అంది మీనా లాంగ్జామ్. మణిపూర్ యూనివర్సిటీలో కల్చరల్ స్టడీస్లో ప్రొఫెసర్గా ఉన్న మీనా పాఠాలు చెప్పడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీస్తుంది. 2015లో ఆమె మణిపూర్లో ఫస్ట్ మహిళా ఆటోడ్రైవర్గా ఉన్న లైబీ ఓయినమ్ మీద డాక్యుమెంటరీ తీస్తే దానికి చాలా పేరొచ్చింది. ఆ తర్వాత ‘అచౌబీ ఇన్ లవ్’ పేరుతో పోలో ఆటకు అనువైన స్థానిక జాతి అశ్వాలపై డాక్యుమెంటరీ తీస్తే దానికీ పేరొచ్చింది. ఇప్పుడు ‘ఆండ్రో డ్రీమ్స్’ మణిపూర్ ఘనతను చాటుతోంది. బాలికలు, యువతులు క్రీడల్లో ఎంతో రాణిస్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు ఉండనే ఉంటాయి. అలాంటి ప్రతి చోట అమ్మాయిలను ప్రోత్సహించే లైబి లాంటి యోధురాళ్లు, వారి గెలుపు గాధలను లోకానికి తెలిపే మీనా లాంటి వాళ్లు ఉండాలని కోరుకుందాం. -
స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!
న్యూఢిల్లీ: ముంబైలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్లో బాలీవుడ్ లవబుల్ కపుల్ సందడి చేశారు. బ్రహ్మాస్త్ర జంట అలియా భట్, రణబీర్ కపూర్ తళుక్కున మెరిసారు. అదీ ISLని నిర్వహించే ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీతో కలిసి ఆదివారం సందడి చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ముంబై సిటీ FC vs కేరళ బ్లాస్టర్ ఫుట్బాల్ మ్యాచ్కు బాలీవుడ్ తారలతో పాటు, నీతా అంబానీ ,అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలియా, రణబీర్ జంటను నీతా ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై సిటీ FC సహ-యజమాని ఏ దిల్ హై ముష్కిల్ హీరో రణబీర్ తన జట్టుకు మద్దతుగా స్పోర్ట్స్ ఈవెంట్లో, ఇనీషియల్స్తో పాటు వెనుక ఎనిమిది నంబర్ ప్రింట్ చేసిన బ్లాక్ జెర్సీలో బ్యూటిఫుల్గా ఫ్యాన్స్ను అలరించాడు. బ్లాక్ కార్గో-స్టైల్ ప్యాంటు,మ్యాచింగ్ బ్లాక్ క్యాప్ను ధరించగా, ప్లస్ వన్ బ్లూ జెర్సీలో అలియా చేతులు పట్టుకుని స్టేడియంలోకి ప్రవేసించారు. అక్కడ ఫ్యాన్స్తో, సెల్పీలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో ఒలింపిక్ అధ్యక్షురాలు నీతి అంబానీతో కలిసి పోజులివ్వడం విశేషంగా నిలిచింది. రణబీర్, అలియా జంట క్రీడాభిమాన్లు. గత నెలలో న్యూయార్క్లో విహారయాత్ర చేస్తున్నప్పుడు, ఈ జంట యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే . కాగా అంబానీ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు గత నెలలో, అలియా, బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి హాజరయ్యారు. అయితే ఈ వేడుకుకు భర్త రణ్బీర్ ఈవెంట్కు మిస్సయ్యాడు. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే నేషనల్ అవార్డు విన్నర్ అలియాస్వయంగా నిర్మిస్తున్న జిగ్రా అనే యాక్షన్ చిత్రంలోనూ నటిస్తూ, నిర్మిస్తోంది. రణవీర్ సింగ్తో కలిసి బైజు బావ్రా అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ యానిమల్ కోసం సిద్ధమవుతున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. -
‘శాఫ్’ అండర్–19 ఫుట్బాల్ విజేత భారత్
ఖట్మండూ (నేపాల్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–19 ఫుట్బాల్ చాంపియన్షిప్ను భారత జట్టు గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 3–0 గోల్స్ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ‘శాఫ్’ చాంపియన్షిప్లో భారత్ విజేతగా నిలవడం ఇదే ఎనిమిదో సారి కావడం విశేషం. భారత్ తరఫున మంగ్లెన్తంగ్ కిప్జెన్ రెండు గోల్స్ (64వ నిమిషం, 85వ నిమిషం) సాధించగా, గ్వాగమ్సర్ గోయరీ (90+5వ నిమిషం) మరో గోల్ కొట్టాడు. -
ఫుట్బాల్కు అత్యంత ఆదరణ కల్పిస్తాం..!
అనంతపురం: రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకు అత్యంత ఆదరణ కల్పిస్తామని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అనంతపురం నగర శివారులోని అనంత క్రీడా గ్రామం (ఆర్డీటీ స్టేడియం)లో మంగళవారం ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలుర జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్–2023 పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మన గ్రామీణ ప్రాంతాలకు సరిపోయే క్రీడ ఫుట్బాల్ అని, ఇందులో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకనుంచి క్రికెట్తో పాటు ఫుట్బాల్ కూడా ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకమైన క్రీడగా ఉండాలని భావిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఫైనల్కు చేరితే మ్యాచ్ను వీక్షించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్దరెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎం.గౌతమి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ, శాప్ బోర్డు డైరెక్టర్ డానియల్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్, సిక్కిం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రాగా ముగిసింది. -
Asian Games 2023: బంగ్లాదేశ్పై భారత్ విజయం.. నాకౌట్ ఆశలు సజీవం
చైనాలోని హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 పురుషుల ఫుట్బాల్ ఈవెంట్లో భారత్ బోణీ కొట్టింది. రౌండ్ ఆఫ్ 16కు (నాకౌట్) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్పై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ 85వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్లో గోల్ కొట్టి భారత్ను గెలిపించాడు. తొలి మ్యాచ్లో ఆతిథ్య చైనా చేతిలో 1-5 గోల్స్ తేడాతో ఓడి, నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శక్తివంచన లేకుండా పోరాడి బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో చైనా, మయన్మార్లతో సమానంగా 3 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 24న మయన్మార్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే భారత్ నేరుగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది. రౌండ్ ఆఫ్ 16కు ఎలా..? ఏషియన్ గేమ్స్ పురుషుల ఫుట్బాల్లో భారత్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఈ పోటీల్లో గ్రూప్కు నాలుగు జట్ల చొప్పున మొత్తం 6 గ్రూప్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్లో టాప్-2లో ఉన్న జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచే మరో నాలుగు అత్యుత్తమ జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరతాయి. భారత్ అవకాశాలు ఎలా..? గ్రూప్-ఏలో చైనా, మయన్మార్ జట్లు ఇప్పటివరకు ఆడిన ఒక్కో మ్యాచ్లో విజయం సాధించి, తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్లో చైనా చేతిలో ఓడి, రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచిన భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ తదుపరి మయన్మార్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే, గ్రూప్లో రెండో స్థానానికి ఎగబాకి నేరుగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది. -
చైనా చేతిలో చిత్తుగా...
హాంగ్జూ (చైనా): ఆసియా క్రీడల కోసం ఫుట్బాల్ జట్టునే పంపడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన...నేరుగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ కోచ్ లేఖ...చివరకు గ్రీన్ సిగ్నల్...అత్యుత్తమ ఆటగాళ్లను ఇవ్వలేమంటూ ఐఎస్ఎల్ జట్ల కొర్రీలు...ఆఖరి నిమిషంలో తృతీయ శ్రేణి జట్టు ఎంపిక...కనీసం టీమ్ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు కూడా రాసుకోలేని స్థితి... ఇన్ని అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు భారత ఫుట్బాల్ జట్టు సోమవారం సాయంత్రం చైనా గడ్డపై అడుగు పెట్టింది. కనీసం ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ లేదు...16 గంటల్లోనే మ్యాచ్ బరిలోకి...సబ్స్టిట్యూట్లుగా దించేందుకు తగినంత మంది కూడా బెంచీపై లేరు... చివరకు ఊహించినట్లుగానే ప్రతికూల ఫలితం వచ్చింది. తొలి పోరులో ఆతిథ్య చైనా చేతుల్లో చిత్తుగా ఓడి నిరాశను మిగిల్చింది. అధికారికంగా ఆసియా క్రీడలు ఈ నెల 23నుంచి ప్రారంభం అవుతున్నా...కొన్ని ఈవెంట్లు ముందే మొదలైపోయాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో చైనా 5–1 గోల్స్ తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 1–1తో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా...రెండో అర్ధభాగంతో నాలుగు గోల్స్తో చైనా చెలరేగింది. చైనా తరఫున జియావో టియాని (17వ నిమిషం), డీ వీజన్ (51వ నిమిషం), టావో కియాగ్లాంగ్ (72వ నిమిషం, 75వ నిమిషం), హావో ఫాంగ్ (90+2వ నిమిషం)లో గోల్స్ సాధించారు. భారత్ తరఫున ఏకైక గోల్ను కనోలీ ప్రవీణ్ రాహుల్ (45+1వ నిమిషం) నమోదు చేశాడు. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య తీవ్ర అంతరం కనిపించింది. 86 నిమిషాలు మైదానంలో ఉన్నా కెప్టెన్ సునీల్ ఛెత్రి ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు. జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు మొత్తం 90 నిమిషాలు ఫీల్డ్ ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. భారత్ ఈ గ్రూప్నుంచి ముందంజ వేయాలంటే తర్వాతి మ్యాచ్లలో బంగ్లాదేశ్, మయన్మార్లపై తప్పనిసరిగా గెలవాలి. కంబోడియాను ఓడించి... వాలీబాల్లో మాత్రం భారత్ గెలుపుతో శుభారంభం చేసింది. ఈ పోరులో భారత్ 3–0 (25–14, 25–13, 25–19) తేడాతో తమకంటే బాగా తక్కువ ర్యాంక్ గల కంబోడియాను ఓడించింది. గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్లో రేపు అత్యంత పటిష్టమైన కొరియాను భారత్ ఎదుర్కోనుంది. -
పీలే రికార్డును బద్దలు కొట్టిన నెమార్
సావోపావ్లో: బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నెమార్ కొత్త రికార్డు సృష్టించాడు. బొలీవియాతో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో నెమార్ నమోదు చేసిన గోల్ అతని కెరీర్లో 78వది. దాంతో ఫుట్బాల్ ఆల్టైమ్ గ్రేట్, దిగ్గజ క్రీడాకారుడు పీలే పేరిట ఉన్న 77 గోల్స్ రికార్డు బద్దలైంది. చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా! -
ఈనెల 21 నుంచి ఐఎస్ఎల్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2023–2024 సీజన్కు ఈ నెల 21న తెర లేవనుంది. కొచ్చిలో కేరళ బ్లాస్టర్స్, బెంగళూరు ఎఫ్సీ జట్ల మధ్య మ్యాచ్తో ఐఎస్ఎల్ పదో సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ 29 వరకు తొలి అర్ధభాగం మ్యాచ్లను నిర్వహిస్తారు. మొత్తం 12 జట్లు బరిలో ఉన్నాయి. అయితే ఆసియా క్రీడలు జరిగే సమయంలోనే ఈ లీగ్ జరుగుతుండగా... ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న 22 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో ఐఎస్ఎల్లోని 10 క్లబ్లకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఆసియా క్రీడల కోసం తమ ఆటగాళ్లను విడుదల చేసేందుకు కొన్ని క్లబ్లు విముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిసింది. ఆసియా క్రీడలు సెపె్టంబర్ 23న మొదలవుతున్నా... ఫుట్బాల్ మ్యాచ్లు మాత్రం సెప్టెంబర్ 19 నుంచి జరుగుతాయి. భారత్ తమ గ్రూప్ లీగ్ మ్యాచ్లను సెప్టెంబర్ 19న చైనాతో, 21న బంగ్లాదేశ్తో, 24న మయన్మార్తో ఆడుతుంది. -
CPL 2023: క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ ప్రయోగం.. తొలి బాధితుడిగా..!
క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ జారీ చేయబడింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్కు అంపైర్ రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో రెడ్ కార్డ్ కారణంగా మైదానం వీడిన తొలి క్రికెటర్గా సునీల్ నరైన్ చరిత్రపుటల్లోకెక్కాడు. Red Card in cricket. So apparently, captain gets to pick who they have to send out of the field. Dhoni might have a lot of options if this comes in IPL.pic.twitter.com/gycU62MmAF — Silly Point (@FarziCricketer) August 28, 2023 స్లో ఓవర్రేట్ కారణంగా జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానం వీడాల్సి ఉండటంతో, అప్పటికే తన కోటా ఓవర్లు పూర్తి చేసుకున్న సునీల్ నరైన్ పేరును ట్రిన్బాగో నైట్రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ప్రతిపాదించగా.. ఫీల్డ్ అంపైర్ నరైన్కు రెడ్ కార్డ్ చూపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్లోనే తొలిసారి క్రికెట్లో ఈ రెడ్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. ఫుట్బాల్లో ఈ రెడ్ కార్డ్ విధానాన్ని మనం తరుచూ చూస్తుంటాం. అయితే క్రికెట్లో మాత్రం ఇదే తొలిసారి. ఫుట్బాల్లో ఓ ఆటగాడు కఠినమైన ఫౌల్కు పాల్పడినప్పుడు రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే క్రికెట్లో ఫుట్బాల్లోలా కాకుండా స్లో ఓవర్ రేట్కు పెనాల్టీగా ఈ రెడ్ కార్డ్ను ఇష్యూ చేస్తారు. ఓ ఇన్నింగ్స్లో 3 సార్లు నిర్ధేశిత సమయంలో ఓవర్ను పూర్తి చేయకపోతే, రెడ్ కార్డ్ను జారీ చేస్తారు. తొలిసారి నిర్ధేశిత సమయంలో ఓవర్ను పూర్తి చేయకపోతే ఓ ఫీల్డర్ను (ఐదో ఫీల్డర్), రెండో సారి అదే రిపీటైతే మరో ఫీల్డర్ను (ఆరో ఫీల్డర్) 20 యార్డ్స్ సర్కిల్లోకి తీసుకరావాల్సి ఉంటుంది. ఇక ఇదే మూడోసారి రిపీటైతే మాత్రం జట్టులోకి ఓ ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. నిన్నటి మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ 17, 18, 19వ ఓవర్లను కోటా సమయంలో పూర్తి చేయకపోవడంతో అంపైర్ ఆ జట్టులోని ఓ ఫీల్డర్ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో నైట్రైడర్స్ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్ కొనసాగించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్పై ట్రిన్బాగో నైట్రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. 179 పరుగుల లక్ష్యఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. -
బలవంతపు ముద్దుకు తగిన మూల్యం.. ఫెడరేషన్ చీఫ్పై సస్పెన్షన్ వేటు
స్పెయిన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ తమ దేశ స్టార్ క్రీడాకారిణి జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఫిఫా పేర్కొంది. సస్పెన్షన్తో పాటు రుబియాలెస్పై క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్తో పాటు అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఓ మహిళలను అయిష్టంగా చుంబించడం సమర్ధనీయం కాదని స్పానిష్ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఉదంతం స్పెయిన్లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ రంగంలోకి దిగారు. రుబియాలెస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రుబియాలెస్పై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిఫా జోక్యం చేసుకుని రుబిమాలెస్పై తూలెసస్పెన్షన్ వేటు వేసింది. -
ఫుట్బాల్ క్రీడాకారిణికి ముద్దు పెట్టిన ఫెడరేషన్ చీఫ్.. స్పెయిన్లో రచ్చ రచ్చ
2023 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ను స్పెయిన్ తొలిసారిగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్ట్ 20న జరిగిన ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ దేశ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సొంత క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు స్పెయిన్లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా లూయిస్.. స్వదేశీ స్టార్ ఫుట్బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని వల్గర్గా బిహేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో స్పెయిన్లో నిరసనలు హోరెత్తాయి. దీంతో లూయిస్ ఓ మెట్టుకిందికి దిగొచ్చి సదరు క్రీడాకారిణిలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అయినా స్పెయిన్లో నిరసనలు శాంతించలేదు. ఔ లూయిస్ ఉద్దేశపూర్వకంగా తప్పుచేసి, సారీ చెబితే సరిపోతుందా అంటూ నిరసనకారులు స్వరాలను పెంచారు. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జోక్యం చేసుకున్నారు. లూయిస్ నామమాత్రం సారీ చెబితే సరిపోదని నిరసనకారులతో స్వరం కలిపారు. ముద్దు వివాదంపై లూయిస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఫెడరేషన్ అధ్యక్షుడిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని చేతులు దులుపుకున్నాడు. దీంతో క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రంగంలోకి దిగింది. స్పెయిన్ ప్రభుత్వం కాని సాకర్ కౌన్సిల్ కాని లూయిస్పై చర్యలు తీసుకోకపోతే తాను చర్యలకు ఉపక్రమిస్తానని కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి స్పెయిన్లో ముద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతుంది. -
Foot Ball World Cup: జగజ్జేతగా స్పెయిన్.. ఫైనల్లో ఇంగ్లండ్పై విజయం
ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్-2023 టోర్నీలో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా నిలిచింది. మ్యాచ్ 29వ నిమిషంలో ఓల్గా క్యార్మోనా అద్భుతమైన గోల్ చేసి స్పెయిన్ను గెలిపించింది. ఈ మ్యాచ్లో హాట్ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ స్థాయి మేర రాణించలేక ఓటమిపాలైంది. ప్రపంచకప్ ఫైనల్కు తొలిసారి అర్హత సాధించిన స్పెయిన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్కు కూడా ఇదే తొలి ఫైనల్ కావడం విశేషం. కెప్టెన్ ఓల్గా క్యార్మోనా సెమీఫైనల్లో, ఫైనల్ మ్యాచ్ల్లో ఒక్కో గోల్ చేసి స్పెయిన్ను గెలిపించింది. సెమీఫైనల్లో చేసిన గోలే ఓల్గా క్యార్మోనాకు అంతర్జాతీయ కెరీర్లో తొలి గోల్ కావడం విశేషం. -
కొనసాగుతున్న మెస్సీ మేనియా.. కళ్లు చెదిరే గోల్ చేసిన ఫుట్బాల్ దిగ్గజం
పీఎస్జీని వీడి డేవిడ్ బెక్హమ్ ఇంటర్ మయామీ క్లబ్లో చేరిన ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. ఈ అమెరికన్ క్లబ్ తరఫున తన గోల్స్ పరంపరను కొనసాగిస్తున్నాడు. లీగ్స్ కప్లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్తో జరిగిన మ్యాచ్లో మెస్సీ ఓ కళ్లు చెదిరే గోల్తో మెరిశాడు. What can't he do?! 🐐 Make it NINE goals in six games for Leo Messi. pic.twitter.com/HLf3zBFTmV — Major League Soccer (@MLS) August 15, 2023 మ్యాచ్ 20వ నిమిషంలో పెనాల్టీ ఏరియా బయట 36 గజాల దూరం నుంచి మెస్సీ చేసిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్లో మయామీ ఆటగాళ్లు మార్టినెజ్, జోర్డీ అల్బా, డేవిడ్ రూయిజ్ కూడా గోల్స్ చేసినప్పటికీ.. మెస్సీ చేసిన గోలే మ్యాచ్ మొత్తానికి హైలైట్గా నిలిచింది. మెస్సీ కెరీర్లో ఇది సెకండ్ లాంగెస్ట్ గోల్ కావడం విశేషం. ఈ గోల్తో మెస్సీ ఇంటర్ మియామీ తరఫున తన గోల్స్ సంఖ్యను 9కి పెంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. మెస్సీ, మార్టినెజ్, జోర్డీ, రూయిజ్ గోల్స్ చేయడంతో మయామీ.. ఫిలడెల్ఫియాపై 4-1 గోల్స్ తేడాతో గెలుపొంది, లీగ్స్ కప్ ఫైనల్స్కు చేరింది. ఫిలడెల్ఫియా తరఫున అలెజాండ్రో బెడోయా ఏకైక గోల్ చేశాడు. కాగా, మెస్సీ ఇంటర్ మయామీ తరఫున బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్లోనూ గోల్ చేశాడు. మాయమీ తరఫున ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన మెస్సీ మొత్తం 9 గోల్స్ చేశాడు. తద్వారా మయామీ తరఫున ఆరు మ్యాచ్ల తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. మెస్సీకి ముందు గొంజాలో హిగ్వేన్ (29), లియోనార్డో కంపానా (16) ఉన్నారు. -
ఫుట్బాల్ దిగ్గజం హబీబ్ ఇకలేరు.. చిరస్మరణీయ క్షణాలు అవే!
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఫుట్బాల్ ఆటగాడు, 70వ దశకంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మొహమ్మద్ హబీబ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. హైదరాబాద్కు చెందిన హబీబ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 18 ఏళ్ల పాటు అక్కడే 1970లో మరో హైదరాబాదీ సయ్యద్ నయీముద్దీన్ నాయకత్వంలో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో హబీబ్ కీలక సభ్యుడు. అయితే హబీబ్ కెరీర్ అత్యుత్తమ దశ కోల్కతాలోనే గడిచింది. 1966నుంచి 1984 వరకు దాదాపు 18 ఏళ్లు పాటు ఆయన అక్కడ ప్రధాన ఆటగాడిగా కొనసాగడం విశేషం. చిరస్మరణీయ క్షణం అదే మిడ్ఫీల్డర్గా మూడు ప్రఖ్యాత క్లబ్లు మోహన్బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్టింగ్లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. హబీబ్ కెరీర్లో చిరస్మరణీయ క్షణం 1977లో వచ్చింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్లో హబీబ్ మోహన్బగాన్ తరఫున బరిలోకి దిగగా...ప్రత్యర్థి టీమ్ కాస్మోస్ క్లబ్లో ఆల్టైమ్ గ్రేట్ ఆటగాళ్లు పీలే, కార్లోస్ ఆల్బర్టో ఉన్నారు. నాడు పీలే ప్రత్యేక అభినందనలు మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగియగా, ఇందులో హబీబ్ కూడా ఒక గోల్ చేశారు. మ్యాచ్ అనంతరం పీలే ప్రత్యేకంగా హబీబ్ను పిలిచి ఆయన ఆటను ప్రశంసించడం విశేషం. ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్ మూడు వేర్వేరు ఫైనల్ మ్యాచ్లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ హబీబ్ రికార్డు నిలిచి ఉంది. జాతీయ ఫుట్బాల్ టోర్నీ ‘సంతోష్ ట్రోఫీ’ని ఏకైక సారి ఆంధ్రప్రదేశ్ జట్టు 1966లో గెలుచుకుంది. పదేళ్ల పాటు భారత జట్టుకు ఆడి నాడు ఏపీ తరఫున చెలరేగిన హబీబ్...ఫైనల్లో బెంగాల్నే ఓడించడం ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. పదేళ్ల పాటు (1965–75) భారత జట్టు తరఫున ఆడిన హబీబ్ను కేంద్ర ప్రభుత్వం 1980లో ‘అర్జున’ పురస్కారంతో గౌరవించింది. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత టాటా ఫుట్బాల్ అకాడమీకి, భారత్ ఫుట్బాల్ సంఘానికి చెందిన అకాడమీకి కూడా కోచ్గా వ్యవహరించారు. చదవండి: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికా సిరీస్ నుంచి కెప్టెన్ ఔట్..! -
రొనాల్డో ఖాతాలో మరో ట్రోఫీ
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండేళ్ల తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్లో మరో ట్రోఫీని అందుకున్నాడు. తొలిసారి ఆసియాకు చెందిన అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా) తరఫున బరిలోకి దిగిన రొనాల్డో తన జట్టును అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్లో విజేతగా నిలిపాడు. అల్ హిలాల్ క్లబ్తో జరిగిన ఫైనల్లో రొనాల్డో కెప్టెన్సీ లోని అల్ నాసర్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. రొనాల్డో రెండు గోల్స్ (74వ, 98వ ని.లో) చేశాడు. -
బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు
ఫుట్బాల్ మ్యాచ్లో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం. కోపంతో గొడవలు జరిగిన సమయంలో ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ తనకు తెలియకుండా జరిగిన పొరపాటు వల్ల ప్రత్యర్థి ఆటగాడికి ఎంత నష్టం జరిగిందనేది ఈ వార్త తెలియజేస్తుంది. విషయంలోకి వెళితే.. కోపా లిబెర్టడోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా బ్రెజిల్ ఫ్లుమినెన్స్,అర్జెంటినోస్ జూనియర్స్ తలపడ్డాయి. మ్యాచ్లో ఇరుజట్లు చెరొక గోల్ కొట్టడంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. కాగా ఆట 56వ నిమిషంలో బ్రెజిల్ ఫ్లుమినెన్స్ ఆటగాడు మార్సెలో బంతిని తన్నబోయి అనుకోకుండా ప్రత్యర్థి డిఫెండర్ లుసియానో సాంచెజ్ ఎడమ కాలు గట్టిగా తొక్కాడు. మార్సెలో బంతిని తన్నబోయే సమయంలోనే లుసియానో అతని వైపు దూసుకురావడం.. కాలు అడ్డుపెట్టడం జరిగిపోయాయి. దీంతో లుసియానో ఒక్కసారిగా కుప్పకూలిపోయి నొప్పితో విలవిలలాడాడు. ఊహించని సంఘటనతో మార్సెలో షాక్ తిన్నాడు. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. లూసియానోను పరీక్షించిన వైద్యులు కాలు విరిగిపోయినట్టు గుర్తించారు. అతను కోలుకునేందుకు 8 నెలల నుంచి 12 నెలలు పట్టనుందని సమాచారం. బాధ భరించలేక ఏడుస్తునే మైదానం వీడిన లూసియానోను చూసి మార్సెలో కంటతడి పెట్టుకున్నాడు. ''నేను ఈరోజు మైదానంలో నేను చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. సహచర ఫుట్బాలర్ను కావాలని గాయపరచలేదు. లుసియానో సాంచెజ్.. నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా'' అని మార్సెలో ట్విటర్లో పేర్కొన్నాడు. మార్సెలో పోస్ట్పై అర్జెంటీనా క్లబ్ స్పందిస్తూ.. ''మనం ప్రత్యర్థులం.. శత్రువులం కాదు'' అని కామెంట్ చేసింది. Dios mio https://t.co/LO8ezSX3Oe pic.twitter.com/V9a24dYGBu — Usuarios siendo domados (@sindicatodedom4) August 1, 2023 చదవండి: 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్లో భారీ కోత -
ఎట్టకేలకు గోల్.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ రికార్డు రొనాల్డో పేరిటే ఉంది. ఇప్పటివరకు రొనాల్డో 838 గోల్స్ సాధించాడు. కొంతకాలంగా గోల్స్ కొట్టడంలో విఫలమవుతున్న రొనాల్డో తాజాగా మంగళవారం హెడర్ గోల్తో మెరిశాడు. అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అల్-నసర్, యూఎస్ మోనాస్టిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అల్-నసర్ 4-1 తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఆట 74వ నిమిషంలో రొనాల్డో సూపర్ హెడర్ గోల్తో మెరిశాడు. రొనాల్డో గోల్ కొట్టడానికి 8 నిమిషాల ముందు ప్రత్యర్థి జట్టు ఒక గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేసింది. అయితే రొనాల్డో 74వ నిమిషంలో హెడర్ గోల్తో తన జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ఫుట్బాల్లో అత్యధిక హెడర్ గోల్స్ కొట్టిన జాబితాలో జర్మనీ దిగ్గజం గెర్డ్ ముల్లర్ను అధిగమించాడు. ఇప్పటివరకు ముల్లర్తో కలిసి 144 హెడర్ గోల్స్తో సంయుక్తంగా ఉన్న రొనాల్డో తాజా గోల్(145 హెడర్)తో ముల్లర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు తన కెరీర్లో 839వ గోల్ సాధించి అత్యధిక గోల్స్ విషయంలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 22 SEASONS IN A ROW CRISTIANO RONALDO IS ETERNAL 🍷🐐pic.twitter.com/mEPwV62rhn — aurora (@cr7stianos) July 31, 2023 Ronaldooooooo pic.twitter.com/rab2wPkZAQ — AlNassr FC (@AlNassrFC_EN) July 31, 2023 చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' -
'అవతలికి పో'.. కెమెరామన్పై రొనాల్డో అసహనం
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కెమెరామన్పై అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శుక్రవారం మొదలైన అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా అల్-నసర్, అల్-సాహబ్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రొనాల్డో గోల్ చేయడంలో విఫలమయ్యాడు. మ్యాచ్లో కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో 0-0తో పేలవ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగిసిందిన్న బాధలో ఉన్న రొనాల్డో డగౌట్ వైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనకాలే కెమెరామన్ అతన్ని అనుసరించాడు. రొనాల్డో ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుండడం చిరాకు తెప్పించింది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కొన్ని నీళ్లు తాగిన రొనాల్డో ఆ తర్వాత కొన్ని నీళ్లను కెమెరామన్వైపు చల్లుతూ.. ''అవతలికి పో'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో కెమెరామన్ సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో తన ట్విటర్లో ఒక పోస్టు షేర్ చేశాడు. ''గ్రూప్ స్టేజీలో మొదటి గేమ్ చాలా టఫ్గా అనిపించింది.. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. మేం పోరాడుతాం'' అంటూ కామెంట్ జత చేశాడు. 🎥 | مغادرة كريستيانو رونالدو قائد فريق #النصر أرضية الملعب بعد المواجهة "غير راض"، ويطلب من المصور إبعاد الكاميرا عنه. #كأس_الملك_سلمان_للاندية pic.twitter.com/4R2xoB7la7 — الشرق الأوسط - رياضة (@aawsat_spt) July 28, 2023 చదవండి: ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! ఆసియా కప్ తర్వాత జట్టు నుంచి అవుట్ -
మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె!
ఫ్రాన్స్ ఫుట్బాల్ స్టార్ కైలియన్ ఎంబాపె ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ క్లబ్కు) ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబాపె కాంట్రాక్ట్ ఈ సీజన్ అనంతరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎంబాపె ఏ క్లబ్లో చేరనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక సౌదీ క్లబ్ అల్ హిలాల్ ఎంబాపెకు ఏడాది కాంట్రాక్ట్ కోసం భారీగా ఆఫర్ చేసింది. అతనికి ఏకంగా 33.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.2700 కోట్లు) చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఈ డీల్ ఫైనల్ చేయడానికి అల్ హిలాల్ అధికారులు మంగళవారం పారిస్కు వెళ్లారు. అయితే ఎంబాపె మాత్రం సంతకం కాదు కదా.. కనీసం వాళ్లను కలవడానికి కూడా ఇష్టపడలేదు. తనకు అల్ హిలాల్ క్లబ్లో చేరే ఆసక్తి లేదని తేల్చిచెప్పాడు. వాస్తవానికి పీఎస్జీతో ఒప్పందం ముగిసిన తర్వాత ఎంబాపె కొంతకాలం ఫ్రీగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఎంబాపె రియల్ మాడ్రిడ్ క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఫ్రీ ట్రాన్స్ఫర్ లో అతడు రియల్ మాడ్రిడ్ టీమ్ లోకి వెళ్తే 10 కోట్ల యూరోలు (సుమారు రూ.900 కోట్లు) సైనింగ్ ఆన్ ఫీగా లభిస్తాయి. ఒకవేళ పీఎస్జీతోనే కొనసాగాలని భావిస్తే సెప్టెంబర్ లో అతనికి బోనస్ గా 8 కోట్ల యూరోలు (సుమారు రూ.727 కోట్లు) వస్తాయి. మొదట ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడని పీఎస్జీ క్లబ్ పదేళ్ల కాలానికి గానూ దాదాపు రూ.10వేల కోట్లు ఆఫర్ చేసింది. కానీ ఎంబాపె ఆ ఆఫర్ను తిరస్కరించడంతో పీఎస్జీ ఎంబాపెను ఇప్పుడే వదిలేసుకొని అతనిపై కాస్త డబ్బు సంపాదించాలని చూస్తోంది. ఏడాది కాలంలో కాంట్రాక్ట్ ముగిసన తర్వాత ఫ్రీగా వదిలేయడం కంటే.. ఇదే బెటరని ఆ క్లబ్ భావిస్తోంది. ట్రాన్స్ఫర్ ఫీజుపై ప్రస్తుతానికి పీఎస్జీ, అల్ హిలాల్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. నిజానికి అల్ హిలాల్ టీమ్ గతంలో లియోనెల్ మెస్సీ కోసం గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఇంటర్ మియామీ క్లబ్ రికార్డు ధరకు మెస్సీని కొనుగోలు చేసింది. దీంతో పీఎస్జీ తరపునే ఆడుతున్న ఫ్రాన్స్ స్టార్ ఎంబాపెను అయినా దక్కించుకోవాలని ఆరాటపడింది. కానీ తాజాగా ఎంబాపె ఆఫర్ను తిరస్కరించడంతో అల్ హిలాల్ క్లబ్కు నిరాశే మిగిలింది. ఇక ఫ్రాన్స్ సూపర్స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చదవండి: #KylianMbappe: 'పదేళ్ల కాలానికి తొమ్మిది వేల కోట్లు చెల్లిస్తాం'.. ఎంబాపె తిరస్కరణ క్యాచ్ విషయంలో నమ్మకం కోల్పోయిన వేళ.. గొడవకు దారి -
ఆసియా క్రీడలకు భారత ఫుట్బాల్ జట్లు
ఆసియాలో టాప్–8లో లేకపోయినా భారత పురుషుల, మహిళల ఫుట్బాల్ జట్లను ఆసియా క్రీడలకు పంపించాలని కేంద్ర క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో ఆయా జట్లలో ముగ్గురు మినహా మిగతా సభ్యులు అండర్–23 ఆటగాళ్లే ఉండాలి. సీనియర్ ఆటగాళ్ల హోదాలో కెప్టెన్ సునీల్ ఛెత్రి, గోల్కీపర్ గుర్ప్రీత్, డిఫెండర్ సందీప్ జింగాన్ ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. మరోవైపు భారత మహిళల సాఫ్ట్బాల్, పురుషుల వాటర్పోలో, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్ 5్ఠ5 జట్లను ఆసియా క్రీడలకు పంపించకూడదని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయం తీసుకుంది. -
మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన మెస్సీ అదనపు సమయంలో వచ్చిన ఫ్రీకిక్ను గోల్గా మలిచి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఇది మరువకముందే మరోసారి ఇంటర్ మియామి క్లబ్ తరపున అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) అట్లాంటా యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో ఇంటర్ మియామి క్లబ్ 4-0తో ఘన విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో సింగిల్ గోల్తో మెరిసిన మెస్సీ ఈసారి మాత్రం డబుల్ గోల్స్తో పాటు ఒక అసిస్ట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆట ఎనిమిదో నిమిషంలో సెర్జియో బస్క్వెట్స్ నుంచి పాస్ అందుకున్న మెస్సీ బంతిని గోల్పోస్ట్లోకి తరలించి ఇంటర్ మియామి క్లబ్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 22వ నిమిషంలో మరో గోల్తో మెరిసిన మెస్సీ మ్యాచ్లో రెండో గోల్ నమోదు చేశాడు. ఇక ఆట 53వ నిమిషంలో రాబర్ట్ టేలర్కు మెస్సీ అసిస్ట్ అందించగా.. అది గోల్గా వెళ్లడంతో ఇంటర్ మియామి 3-0తో భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఇక 84వ నిమిషంలో క్రిస్టోఫర్ మెక్వే గోల్ కొట్టడంతో 4-0తో ఇంటర్ మియామి స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ చివర్లో 12 నిమిషాలు ఉందనగా ఇంటర్ మియామి క్లబ్ మెస్సీని వెనక్కి పిలిచింది. మొత్తం గేమ్ ఆడించడానికి రిస్క్ తీసుకోలేమని తెలిపింది. దీంతో మెస్సీ మైదానం నుంచి వెళ్లిపోయే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. అయితే కేవలం మెస్సీ ఆటను చూడడానికే తాము వచ్చామని.. అతను ఆడకపోతే మేం ఇక్కడ ఉండడం వ్యర్థమంటూ.. మెస్సీ మైదానం వీడగానే చాలా మంది అభిమానులు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది గమనించిన మెస్సీ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ను ఉద్దేశించి.. ''నాకోసం మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.. కానీ ఇలా మ్యాచ్ మధ్యలో మీరు వెళ్లిపోవడం నాకు నచ్చలేదు.. ఇలాంటివి వద్దు.. మీ అభిమానానికి థాంక్స్'' అంటూ పేర్కొన్నాడు. من مغادرة الجماهير بعد خروج الأسطورة ميسي🏟️ pic.twitter.com/RdW11m84Iu — Messi Xtra (@M30Xtra) July 26, 2023 That Busquets > Messi link up play 😍 Lionel Messi makes it two goals in two gamespic.twitter.com/MYRNwukH0N — 101 Great Goals (@101greatgoals) July 25, 2023 LIONEL MESSI WITH HIS SECOND GOAL OF THE MATCH FOR INTER MIAMI! Via MLS.pic.twitter.com/itYUdcED4h — Roy Nemer (@RoyNemer) July 26, 2023 చదవండి: FIFA World Cup: ప్రపంచకప్లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. Asian Games 2023: హర్మన్పై వేటు.. ఆసియా గేమ్స్లో జట్టును నడిపించేది ఎవరు? -
లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్
సీనియర్ కామెంటేటర్, న్యూ-కాసిల్(New-Castle) మాజీ గోల్కీపర్ షకా హిస్లాప్ లైవ్ కామెంట్రీ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. సోమవారం కాలిఫోర్నియాలో రియల్ మాండ్రిడ్, ఏసీ మిలన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హోస్ట్ డాన్ థామస్తో కలిసి షకా హిస్లాప్ కామెంట్రీ చేశాడు. అప్పటిదాకా నవ్వుతూ కామెంట్రీ చేసిన హిస్లాప్ మొహం ఒక్కసారిగా మారిపోయింది. సహచర కామెంటేటర్ థామస్తో మాట్లాడుతూనే అతనిపై ఒరుగుతూ కింద పడిపోయాడు. షాక్ తిన్న థామస్ సహాయం కోసం అరుస్తూ సిబ్బందిని అలర్ట్ చేశాడు. వెంటనే సహాయక సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిస్లాప్ పరిస్థితి ఫర్వాలేదని వైద్యులు తెలిపారు. అయితే ఇలా జరగడానికి కారణమేంటో తెలియడంలేదని, కొన్ని పరీక్షలు చేసిన తర్వాత వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు. బహుశా కాలిఫోర్నియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయి ఉండొచ్చని సహచరులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 54 ఏళ్ల షకా హిస్లాప్ ఫుట్బాల్ కెరీర్ ముగిసిన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ESPN FC Commentator Shaka Hislop collapsed on live TV before the Real Madrid vs. AC Milan friendly. He is now in stable condition. No further reports on medical condition or reason for collapse reported at this time. pic.twitter.com/2lxRfxfFWM — DiedSuddenly (@DiedSuddenly_) July 24, 2023 చదవండి: Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే -
'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే
అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 75 గజాల దూరం నుంచి బంతిని గోల్పోస్ట్లోకి తరలించిన మెస్సీ అరంగేట్రం మ్యాచ్లో ఫ్రీకిక్ను గోల్గా మలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాదు అదనపు సమయంలో ఇంటర్ మియామి క్లబ్కు గోల్ అందించి 2-1 తేడాతో గెలవడంలో కీలకపాత్ర వహించాడు. కాగా మెస్సీకి ఇది 808వ గోల్ కావడం విశేషం. ఇక ఆల్టైమ్ గ్రెటెస్ట్ ప్లేయర్లను G.O.A.Tగా అభివర్ణిస్తుంటారు. ఈ సందర్భంగా మెస్సీపై అభిమానంతో GOAT అనే పదాన్ని చిప్స్(తినేవి) తయారు చేసే లేస్(Lays Chips) కంపెనీ మెస్సీ గోల్ను వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసింది. మెస్సీ తన కెరీర్లో 808వ గోల్ చేసిన తర్వాత అవే 808 మేకలతో మెస్సీ రూపం వచ్చేలో ఓ అద్భుతమైన ఫొటోను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న 808 మేకలతో మెస్సీ రూపాన్ని క్రియేట్ చేసింది. మెస్సీకి ట్రిబ్యూట్ అందిస్తూనే లేస్ తన చిప్స్ యాడ్ను రూపొందించింది. ఇందులో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)కు అర్థం వచ్చేలా.. మేకలతో ట్రిబ్యూట్ ఇవ్వడం విశేషం. ఈ వీడియోలో 808 మేకలను సరిగ్గా మెస్సీ ముఖం వచ్చేలా నిల్చోబెట్టారు. పైన యాంగిల్ నుంచి చూస్తే మెస్సీ ముఖం స్పష్టంగా కనిస్తోంది. +1 🐐 for the 808th goal for the G.O.A.T #Messi #GoatsForGoals pic.twitter.com/LUviACWR4p — LAY'S (@LAYS) July 22, 2023 చదవండి: Cricketer Minnu Mani: భారత క్రికెటర్కు అరుదైన గౌరవం.. కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. -
Lionel Messi: మెస్సీనా మజాకా..గోల్స్ కొట్టడంలో నీ తర్వాతే ఎవరైనా (ఫొటోలు)
-
ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు
న్యూఢిల్లీ: ఐదేళ్ల విరామం తర్వాత భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్లో టాప్-100లో చోటు దక్కించుకుంది. క్రితంసారి ర్యాంక్లను ప్రకటించినపుడు సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత ఫుట్బాల్ జట్టు సరిగ్గా 100వ ర్యాంక్లో నిలిచింది. ఇటీవల దక్షిణాసియా చాంపియన్షిప్లో టైటిల్ నిలబెట్టుకోవడంతో భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 99వ ర్యాంక్లో నిలిచింది. 1996లో భారత జట్టు అత్యుత్తమంగా 94 ర్యాంక్ను దక్కించుకుంది. 2018 తర్వాత భారత్కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్లో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆసియా ర్యాంకింగ్స్లో జపాన్ (ప్రపంచ 20వ ర్యాంక్) టాప్లో ఉంది. ᴡᴇ ᴍᴀʀᴄʜ ᴏɴ 💪🏽💙 🇮🇳 climbed up to 9️⃣9️⃣ in the latest official @FIFAcom world ranking 👏🏽🤩#BlueTigers 🐯 #IndianFootball ⚽️ pic.twitter.com/wLMe4WjQuA — Indian Football Team (@IndianFootball) July 20, 2023 చదవండి: బ్రిజ్భూషణ్కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు? -
సీజన్కు రూ.492 కోట్ల చొప్పున.. మియామి క్లబ్కు మెస్సీ
ఫోర్ట్ లాడెర్డేల్ (ఫ్లోరిడా): అర్జెంటీనా ఫుట్బాల్ సూపర్స్టార్ లయోనల్ మెస్సీ కొత్త గూటికి చేరాడు. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ‘ఇంటర్ మయామి’ జట్టుతో ఆడేందుకు సోమవారం ఇక్కడికి వచ్చాడు. ఈ క్లబ్కు చెందిన స్టేడియంలో అతను ‘10 నంబర్ జెర్సీ’తో ప్రవేశించగానే క్లబ్ సహ యజమాని, ఇంగ్లండ్ సాకర్ స్టార్, మాజీ కెప్టెన్ బెక్హామ్ ఆలింగనం చేసుకొని అభిమానుల హర్షధ్వానాల మధ్య స్వాగతం పలికాడు. 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఇంటర్ మయామితో ఆడేందుకు మెస్సీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. View this post on Instagram A post shared by ESPN FC (@espnfc) చదవండి: Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆడనివ్వండి -
బ్యాడ్మింటన్ ప్లేయర్ను పెళ్లాడిన భారత ఫుట్బాల్ స్టార్.. ఫొటోలు వైరల్
Sahal Abdul Samad Married Reza Farhat: భారత ఫుట్బాల్ స్టార్ సాహల్ అబ్దుల్ సమద్ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కేరళ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రెజా ఫర్హత్ను పెళ్లిచేసుకున్నాడు. గతేడాది జూలైలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట గురువారం నిఖా చేసుకుంది. కేరళలోని కన్నూర్లో వీరి వివాహ వేడుక జరిగింది. సమద్ సహచర ఆటగాళ్లు, ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్ ప్లేయర్లు పెళ్లికి హాజరయ్యారు. సచిన్ సురేశ్, రాహుల్ కేపీ తదితరులు సమద్- రెజా వివాహ వేడుకలో సందడి చేశారు. కాగా 26 ఏళ్ల సమద్ భారత ఫుట్బాల్ జట్టులో కీలక సభ్యుడు. మిడ్ఫీల్డర్ అయిన సమద్.. 2017లో కేరళ బ్లాస్టర్స్కు తొలిసారి ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 92 మ్యాచ్లలో భాగమై 10 గోల్స్ సాధించాడు. భారత్ తరఫున 30 మ్యాచ్లు ఆడి మూడు గోల్స్ చేశాడు. ఇటీవల SAFF Championship గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. ఇక ఆటగాళ్ల బదిలీల క్రమంలో సమద్ కేరళ బ్లాస్టర్స్ను వీడి మోహన్ బగన్ సూపర్ జెయింట్కు ఆడనున్నాడు. అతడి కోసం ఈ ఫ్రాంఛైజీ ఏకంగా రికార్డు స్థాయిలో 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. సమద్ భార్య రెజా కేరళ తరఫున పలు బ్యాడ్మింటన్ ఈవెంట్లలో పాల్గొంది. ఈ క్రీడా జంట నిఖాకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే -
ఈ వయసులో బంతిని తన్నడం అంటే మాటలా?
మామూలుగా అంతర్జాతీయ ఫుట్బాల్లో 35 ఏండ్ల వయసులో కెరీర్కు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ, జపాన్ వెటరన్ ప్లేయర్ కజుయోషి మియుర విషయంలో మాత్రం మరోలా ఉంది. 56 ఏండ్ల వయసులోనూ యువకులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతూ.. రిటైర్మెంట్ కావడానికి నిరాకరిస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచ ఫుట్బాల్లో ఎక్కువ వయసు ఉన్న ఏకైక ప్లేయర్గా మియుర కొనసాగుతున్నాడు. పోర్చుగల్కు చెందిన లిగా-2తో కలిసి మరో సీజన్కు కాంట్రాక్టు పొందిన మియురాను అందరూ ముద్దుగా ‘కింగ్ కాజు’ అని పిలుచుకుంటారు. సరిగ్గా 37 ఏండ్ల క్రితం తన ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టిన మియుర.. జపాన్ తరఫున అత్యధిక కాలం కొనసాగాడు. అంతర్జాతీయ స్థాయిలో జపాన్కు 89 మ్యాచ్లాడిన ఈ వెటరన్ సాకర్ ప్లేయర్ 55 గోల్స్ చేశాడు. 1992లో ఏఎఫ్సీ ఆసియా కప్ గెలిచిన జపాన్ జట్టులో మియుర సభ్యుడు కావడం విశేషం. 23 ఏండ్ల క్రితం జపాన్ జాతీయ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న మియూర.. పోర్చుగల్ క్లబ్కు సేవలందిస్తున్నాడు. చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' #TNPL2023: టీఎన్పీఎల్ విజేత లైకా కోవై కింగ్స్.. వరుసగా రెండోసారి -
ఓ హైదరాబాదీ విద్యార్థి ఫుట్బాల్ ప్రేమకథ!
అభిమానం హద్దుల్ని చెరిపేస్తుంది. ఆట మీద, ఆటగాడి మీద ప్రేమ ఎన్ని వందల, వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించేలా చేస్తుంది. హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఎస్.ఎన్. కార్తికేయ పాడి అందుకు తాజా ఉదాహరణ. పందొమ్మిది ఏళ్ళ ఈ కుర్రాడు తన అభిమాన ఫుట్బాల్ ఆటగాడైన ప్రసిద్ధ అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ను కలిసేందుకు కష్టపడి కలకత్తా దాకా ప్రయాణించారు. ఈ జూలై మొదటివారంలో భారత సందర్శనకు వచ్చిన ఆ ప్రపంచ ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాణ్ణి అతి కష్టం మీద స్వయంగా కలిసి, తన అభిమానాన్ని చాటుకున్నారు. కొద్ది నెలల క్రితమే అర్జెంటీనా జట్టు గెలిచినప్పుడు ‘2022 ప్రపంచ కప్ (ఫిఫా -2022)’ నిర్వాహకులు అందించిన నమూనా ట్రోఫీ చేత ధరించిన తన ఆరాధ్య ఆటగాడితో కలసి ఫోటో దిగారు. మార్టినెజ్ పై మనోడికి అంత పిచ్చి ప్రేమకు కారణం లేకపోలేదు. 1986లో డీగో మ్యారడోనా సారథ్యంలో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అర్జెంటీనా జట్టు మళ్ళీ గత ఏడాదే ప్రపంచ కప్లో విజేతగా విజయపతాకాన్ని రెపరెపలాడించింది. ఈ తాజా విజయంలో గోల్కీపర్ ఎమిలియానో మార్టినెజ్ కీలక పాత్ర పోషించారు. మెస్సీ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ళు అర్జెంటీనాకు ఉన్నప్పటికీ... ఫ్రాన్స్ జట్టుతో ఈ ఫిఫా-2022 ఫైనల్ మ్యాచ్ 3 – 3 గోల్స్తో సమం అయింది. మార్టినెజ్ది కీలక పాత్ర విజేతను నిశ్చయించే పెనాల్టీ షూటౌట్లో గోల్కీపర్ మార్టినెజ్ ప్రతిభా నైపుణ్యాలు అర్జెంటీనాకు కలిసొచ్చాయి. ఫ్రాన్స్ పెనాల్టీ కిక్ను నిలువరించి, 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టును విజేతగా నిలపడంలో ముఖ్యుడు మార్టినెజ్. అంతకు ముందు 2021 కోపా కప్ సెమీ ఫైనల్లో సైతం మూడు పెనాల్టీ కార్నర్లను నిలువరించి, అర్జెంటీనా జట్టు ఫైనల్కు చేరి, కప్పు సాధించేలా చేయడంలోనూ మార్టినెజ్ కీలకం. అందుకే, ఆయన ఆటతీరును అభిమానులు మరవలేరు. అంతటి దిగ్గజ ఆటగాడు మన దేశానికి వస్తున్నారని తెలుసుకున్న టీనేజ్ స్టూడెంట్ కార్తికేయ పాడి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని శ్రమించారు. ప్రముఖ మోహన్ బగాన్ క్లబ్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్టినెజ్ గత వారం కలకత్తా వచ్చారు. అంతగా ప్రచారం లేని ఈ కార్యక్రమం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కార్తికేయ ఎలాగైనా తన ఫేవరెట్ ప్లేయర్ను కలవాలనుకున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, కలకత్తా వెళ్ళారు. ఎలాగోలా అక్కడ తన ఆరాధ్యదైవాన్ని చేరుకోగలిగారు. ఫుట్బాల్ ప్రేమికుడూ, స్వయంగా స్కూలు, కాలేజీ స్థాయిలో సోకర్ ఆటగాడూ అయిన కార్తికేయ తన అభిమాన జట్టు గోల్ కీపర్ను ఆయన హోటల్ విడిదిలో ప్రత్యేకంగా కలిసే అదృష్టం దక్కించుకున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి ఖతార్లో జరిగిన ఫిఫా-2022 ప్రపంచ కప్ తర్వాత విశ్వవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, అభిమానుల్ని సంపాదించుకున్న మార్టినెజ్ తన కోసం ఓ తెలుగు విద్యార్థి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన వివరాలు విని, ముగ్ధుడయ్యారు. వీరాభిమాని కార్తికేయ కోరికను మన్నించి ఫోటో దిగడమే కాక, తమ అర్జెంటీనా జట్టు జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆరాధ్య దైవమైన అర్జెంటీనా ఆటగాడిని కలసి, మాట్లాడి, ఫోటో, అరుదైన జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకొని, హైదరాబాద్కు తిరిగొచ్చిన కార్తికేయ పాడి ఆనందానికి అవధులు లేవు. “ఫుట్ బాల్ దిగ్గజాల్లో ఒకరైన మార్టినెజ్ను స్వయంగా కలసి, మాట్లాడడం ఏ ఫుట్బాల్ ప్రేమికుడికైనా ఓ కల. అలా నా కల నిజమైన క్షణమిది. ఈ మధురానుభూతిని మాటల్లో వర్ణించలేను” అని ఈ టీనేజ్ విద్యార్థి ఉద్వేగంగా చెప్పారు. సంగీతం, ఆటలు ఈ తెలుగు కుర్రాడు హైదరాబాద్ శివార్లలోని డాక్టర్ బీవీ రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ) నర్సాపూర్ క్యాంపస్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి చదువుతో పాటు సంగీతం, ఆటల పట్ల అమితమైన ఆసక్తి. స్వయంగా ఫుట్బాల్ ఆడడంతో పాటు లండన్లోని రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో పాశ్చాత్య సంగీత గానంలోనూ, అలాగే పియానో వాదనలోనూ 5వ గ్రేడ్ ఉత్తీర్ణుడయ్యారు. “శ్రమిస్తే ఏ స్థాయికైనా ఎదగవచ్చనడానికి మార్టినెజ్ ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన స్ఫూర్తితో, రాబోయే రోజుల్లో అటు సంగీతం, ఇటు ఆటలు కొనసాగిస్తూనే, చదువులో మంచి మార్కులు సాధించి, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి. మా అమ్మానాన్న, తమ్ముడు గర్వపడేలా చేయాలనేది నా లక్ష్యం” అన్నారు నవతరానికి ప్రతినిధి అయిన కార్తికేయ. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కార్తికేయ తండ్రి రవి పాడి సైతం తెలుగునాట మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, ఎంతో శ్రమించి ఇండియన్ రైల్వే సర్వీసులో ఉన్నతాధికారిగా ఎదిగారు. సంగీత, సాహిత్య, సినీ ప్రేమికుడిగా, అరుదైన సినిమా గ్రామ్ఫోన్ రికార్డులు, పోస్టల్ స్టాంపులు, ప్రత్యేక కవర్ల సేకర్తగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. -రెంటాల జయదేవ -
నిలబడడమే ఆమెకు శాపం.. సంబంధం లేని గొడవ ప్రాణం తీసింది
ఫుట్బాల్ మ్యాచ్ విషాదాన్ని నింపింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక మహిళా అభిమాని అక్కడ జరిగే గొడవతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికి ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ విషాదకర ఘటన బ్రెజిల్లోని సావో పాలోలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శనివారం బ్రెజిలియన్ ఫుట్బాల్ క్లబ్స్ అయిన పాల్మీరాస్, రైవల్స్ ఫ్లెమింగోల మధ్య అలియాంజ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు పాల్మీరాస్కు మద్దతుగా గాబ్రిలా అనెల్లి హాజరైంది. కాగా అలియాంజ్ పార్క్ స్టేడియం బయట ఉన్న పాల్మీరాస్ ఫ్యాన్ జోన్కు దగ్గర్లో నిలబడడమే గాబ్రిలా చేసిన పాపం. ఏదో విషయమై ఇరుజట్ల మధ్య అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి రైవల్స్ ఫ్లెమింగో ఫ్యాన్స్ రాళ్లు, గ్లాస్ బాటిల్స్తో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక గ్లాస్ బాటిల్ గాబ్రిలా దిశవైపుగా దూసుకొచ్చింది. ఆ గ్లాస్ బాటిల్ నేరుగా గాబ్రిలా మెడ నరాన్ని కట్ చేసుకుంటూ వెళ్లింది. దీంతో అపస్మారక స్థితిలో అక్కడికక్కడే కుప్పకూలింది గాబ్రిలా. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు. కాగా రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆసుపత్రిలో మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక గాబ్రిలా మరణాన్ని ఆమె సోదరుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం అందరిని కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రిలా మృతికి కారణమైన రైవల్స్ ఫ్లెమింగో అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన చర్య ఒకరి ప్రాణం తీస్తుందని ఊహించలేదని.. బాధితురాలి కుటుంబసభ్యులను క్షమాపణ కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాల్మీరాస్ క్లబ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అభిమాని మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక గొడవ పడిన అభిమానులను వేరు చేయడానికి పెప్పర్ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ మాత్రం 1-1తో డ్రాగా ముగిసింది. చదవండి: WI Vs IND: జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్ను కూడా వదలడం లేదు! -
39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్
అండర్-21 యూరోపియన్ చాంపియన్షిప్ విజేతగా ఇంగ్లండ్ అవతరించింది. 1984 తర్వాత ఇంగ్లండ్ మళ్లీ చాంపియన్గా నిలవడం ఇదే. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్పెయిన్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్ తరపున వచ్చిన ఏకైక గోల్ కర్టిస్ జోన్స్ ఆట 45+4వ నిమిషం(అదనపు)లో గోల్ అందించాడు. ఇక రెండో అర్థభాగంలో స్పెయిన్ అదే పనిగా గోల్ పోస్టులపై దాడులు చేసింది. అయితే ఇంగ్లండ్ గోల్కీపర్ జేమ్స్ ట్రాఫర్డ్ రెండుసార్లు స్పెయిన్ పెనాల్టీ కిక్లు గోల్ చేయకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో టోర్నీలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ యూరో అండర్-21 విజేతగా నిలవడం విశేషం. 🏴 Trafford at the death! 😱#LastMinuteMoments | #U21EURO | @Hublot pic.twitter.com/YJNCJBJyV5 — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 England's crowning moment 🏆🎉#U21EURO pic.twitter.com/DnsTcDdihc — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్.. ఆ సిరీస్కు ముహూర్తం ఖరారు! -
ఇంగ్లండ్ స్టార్కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా!
ఫుట్బాల్లో జెర్సీ నెంబర్-7 అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుత తరంలో ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్స్లో రొనాల్డో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. కాగా ఫుట్బాల్ జెర్సీ నెంబర్ 10కు ఎంత క్రేజ్ ఉందో.. ఏడో నెంబర్కు కూడా అంతే. రొనాల్డో కంటే ముందు ఇంగ్లండ్ ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్హమ్ మాత్రమే ఏడు నెంబర్ జెర్సీ ధరించాడు. తాజాగా బుధవారం చెల్సియా క్లబ్ ఫుట్బాల్ స్టార్ మాసన్ మౌంట్ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కు సంతకం చేశాడు. అతని ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఏకంగా 55 మిలియన్ పౌండ్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 577 కోట్ల పైమాటే). కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడయిన మాసన్ మౌంట్కు రొనాల్డో జెర్సీ నెంబర్ (7)ను మాంచెస్టర్ యునైటెడ్ గిఫ్ట్గా అందించింది. ఇకపై మాసన్ మౌంట్ మాంచెస్టర్ క్లబ్ తరపున ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ఇక మాసన్ మౌంట్ చెల్సియాతో తన సీనియర్ ఫుట్బాల్ క్లబ్ కెరీర్ను ప్రారంభించాడు. 2017-19 మధ్య విటెస్సే, డెర్బీ కౌంటీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం చెల్సియాకు తిరిగి వచ్చిన మాసన్ మౌంట్ నిలకడైన ఆటతీరుతో స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయంగా ఇంగ్లండ్ తరపున UEFA ఛాంపియన్స్ లీగ్ , UEFA సూపర్ కప్ ,2021లో FIFA ప్రపంచకప్లో ప్రాతినిధ్యం వహించాడు. 2020–21, 2021–22 సీజన్లలో మాసన్ మౌంట్ చెల్సియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. It's time to write a new chapter. #️⃣7️⃣ Mount 🔴#MUFC — Manchester United (@ManUtd) July 5, 2023 చదవండి: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా #SlapKabaddi: పాకిస్తాన్ను షేక్ చేస్తున్న 'స్లాప్' కబడ్డీ.. వీడియో వైరల్ -
SAFF ఫుట్బాల్ ఛాంపియన్ భారత్.. 9వ సారి టైటిల్ కైవసం (ఫోటోలు)
-
Football: ఫైనల్లో భారత్.. పెనాల్టీ షూటౌట్లో లెబనాన్పై గెలుపు
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ (శాఫ్)లో భారత జట్టు తొమ్మిదో టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 4–2తో లెబనాన్ జట్టును ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో కువైట్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో కువైట్ 1–0తో బంగ్లాదేశ్పై గెలిచింది. లెబనాన్తో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున వరుసగా సునీల్ ఛెత్రి, అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్ గోల్స్ చేశారు. లెబనాన్ తరఫున మాతూక్ తొలి షాట్ను భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. ఆ తర్వాత వాలిద్, సాదిక్ గోల్స్ చేయగా... బదర్ కొట్టిన నాలుగో షాట్ బయటకు వెళ్లడంతో భారత విజయం ఖరారైంది. గతంలో భారత్ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లలో విజేతగా నిలిచింది. -
'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా'
ఫ్రెంచ్ ఫుట్బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2020లో 24 ఏళ్ల యువతిని సెంట్ ఆండ్రూలోని తన మాన్షన్లోని లాకర్ రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంజమిన్ మెండీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఈ కేసు పలు దఫాలుగా చెస్టర్టౌన్ కోర్టులో విచారణకు వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. సదరు బాధితురాలు బెంజమిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేప్ను కోర్టుకు సమర్పించింది. ఆ టేప్లో బెంజమిన్ బాధితురాలితో.. '' ఇది కొత్త కాదు.. నేను 10 వేలమంది మహిళలతో శృంగారలో పాల్గొన్నాను'' అని చెప్పాడు. ఇదే విషయమై జడ్జి బెంజమిన్ను ప్రశ్నించాడు. ''24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని.. అంతకముందు 29 ఏళ్ల మహిళ నాపై దాడి చేసేందుకు యత్నిస్తే ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాను. తాను మరో 10వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు'' మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నాడు. ఈ సమయంలో బెంజమిన్ మెండీ మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. అనంతరం నిజానిజాలు తేల్చేందుకు ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో ఏర్పాటైన జ్యూరీని వీలైనంత త్వరగా వివరాలు సేకరించి రిపోర్టు అందించాలని ట్రయల్ జడ్డి ఆదేశించారు. 2018 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు 2017 నుంచి 2019 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2018లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీతో ఒప్పందం చేసుకున్నాడు. కాగా బెంజమిన్ తన సరదాల కోసం ఎంతో మంది మహిళలను లోబర్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం -
అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్బాలర్
మెక్సికో చెందిన మహిళా ఫుట్బాలర్ నిక్కోల్ తేజ తన అభిమానుల కోసం ఎవరు చేయని సాహసం చేసింది. అభిమానుల డిమాండ్ మేరకు ఆమె అశ్లీల వెబ్సైట్ అయిన ఓన్లీ ఫ్యాన్స్(OnlyFans)లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని నిక్కోల్ తేజ తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ''అభిమానుల డిమాండ్ మేరకు ఓన్లీఫ్యాన్స్లో జాయిన్ అయ్యాను..ఇదే ముఖ్య కారణం.. నా పిక్స్ చూసేయండి'' అంటూ పేర్కొంది. ఇక నిక్కోల్ తేజ ఫోటోలను ఓన్లీఫ్యాన్స్లో చూడాలనుకుంటే 17.50 డాలర్లతో సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తన అందంతో కట్టిపడేసే నిక్కోల్ తేజకు ఇన్స్టాగ్రామ్లో 358,000 ఫాలోవర్స్ ఉన్నారు. కాగా సియాటెల్లో పుట్టిన ఆమె మెక్సికోలో స్థిరపడింది. చిన్న వయసులోనే ఫుట్బాల్లోకి అడుగుపెట్టిన నిక్కోల్ తేజ మెక్సికోకు చెందిన పలు ఫుట్బాల్ క్లబ్స్లో ఆడింది. ప్రస్తుతం టోర్నియో క్లాసురా క్లబ్కు ఆడుతున్న ఆమె ర్యాంకింగ్స్లో ఆఖరి స్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో కేవలం రెండు గోల్స్ మాత్రమే కొట్టింది. చెత్త ప్రదర్శన కారణంగా టోర్నియో క్లబ్ ఈ జనవరిలో నిక్కోల్ తేజతో కాంట్రాక్ట్ను టర్మినేట్ చేసుకుంది. ఓన్లీఫ్యాన్స్(OnlyFans).. చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే ఓన్లీఫ్యాన్స్ అనేది సబ్స్క్రిప్షన్ బేస్డ్ కంటెంట్ ప్లాట్ఫామ్గా ఉంది. 2016లో ఇది ప్రారంభమైంది. అభిమానులు తమకిష్టమైన సెలబ్రిటీల అశ్లీల ఫోటోలను డబ్బులు కట్టి ఈ వెబ్సైట్లో చూసే అవకాశం ఉంటుంది. గతంలో ఈ వెబ్సైట్లో అశ్లీలత అధికంగా ఉండేది. అయితే ఓన్లీఫ్యాన్స్ ప్లాట్ఫార్మ్లో ముందు నుంచి సబ్స్క్రిప్షన్కు డబ్బులు కట్టాల్సి ఉండడంతో ఇది లీగ్ల్ వెబ్సైట్గానే కొనసాగింది. మధ్యలో కొంతమంది అశ్లీలత మరీ ఎక్కువగా ఉందని ఆందోళన చేయడంతో ఆగస్టు 2021లో ఓన్లీఫ్యాన్స్లో ఇకపై అశ్లీలత ఫోటోలు, వీడియోలు షేర్ చేసే అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. తీవ్ర వ్యతిరేఖత రావడంతో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Nikkole Teja (@nikkoleteja_) View this post on Instagram A post shared by Nikkole Teja (@nikkoleteja_) చదవండి: #SteveSmith: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన బాల్గర్ల్గా బ్రిటన్ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్ -
నేనూ ఫుట్ బాల్ ఆడుతా
-
గొడవపడ్డ భారత్, నేపాల్ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా!
శాఫ్ 2023 చాంపియన్షిప్లో భాగంగా శనివారం భారత్, నేపాల్ మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. మొన్న పాక్తో మ్యాచ్ సమయంలోనూ గొడవ జరిగిన సంగతి తెలిసిందే. విషయంలోకి వెళితే.. ఆట 64వ నిమిషంలో ఇండియాకు చెందిన రాహుల్ బెకె, నేపాల్ మిడ్ ఫీల్డర్ బిమల్ గాత్రి మగర్లు హెడర్ షాట్ కోసం ప్రయత్నించారు. ఇద్దరు ఒకేసారి హెడర్కు ప్రయత్నించడంతో మగర్ను తాకి రాహుల్ నేలపై పడిపోయాడు. ఆ వెంటనే కోపంతో పైకి లేచిన రాహుల్ మగర్ను తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరు ఎక్కడా తగ్గకపోవడంతో గొడవ చిలికి చిలికి వానగాలిలా మారిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒక నేపాల్ ఆటగాడు భారత్ ఆటగాడిని కాలర్ పట్టి కింద పడేశాడు. ఇక కొట్టుకుంటారేమో అన్న తరుణంలో సునీల్ ఛెత్రి మగర్ను దూరంగా తీసుకుపోయాడు. ఈ క్రమంలో మగర్ ఛెత్రీవైపు చూస్తూ తప్పందా అతనిదే అంటూ అరిచాడు. సునీల్ మాత్రం 'ప్లీజ్ కామ్డౌన్' అని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సునీల్ ఛెత్రీ సేన నేపాల్పై 2-0తేడాతో విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించింది. స్వదేశంలో భారత్కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. మ్యాచ్లో 61వ నిమిషంలో సునీల్ ఛెత్రి భారత్కు తొలిగోల్ అందించగా.. నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో మరో గోల్ అందించాడు. ఆ తర్వాత భారత డిఫెండర్లు నేపాల్ ఆటగాళ్లను కట్టడి చేయడంతో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. Crazy Fight among Players during India vs Nepal football match. This Aggressive Indian team is looking more dangerous. I'm liking it ❤️🔥❤️🔥pic.twitter.com/UjNnIKIm5t — Mukesh Chaudhary (@MukeshG0dara) June 24, 2023 Another fight, and now it's between India and Nepal🤣🤣#INDNEP #SAFFChampionship pic.twitter.com/ieGbQ1aV3F — BumbleBee 軸 (@itsMK_02) June 24, 2023 చదవండి: సెమీస్కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి -
సెమీస్కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి
బెంగళూరు: ‘శాఫ్’ చాంపియన్షిప్లో భారత ఫుట్బాల్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘ఎ’లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో సునీల్ ఛెత్రి సేన 2–0 గోల్స్తో నేపాల్పై ఘన విజయం సాధించింది. శ్రీ కంఠీరవ స్టేడియంలో భారత జోరుకు ఎదురే లేకుండా పోయింది. తొలి అర్ధ భాగంలో నేపాల్ రక్షణ శ్రేణి చురుగ్గా ఉండటంతో గోల్ చేయలేకపోయిన భారత్ ద్వితీయార్ధంలోనే ఆ రెండు గోల్స్ చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి 61వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో గోల్ చేశాడు. మరోవైపు భారత డిఫెండర్లు నేపాల్ ఫార్వర్డ్ను ఎక్కడికక్కడ కట్టడి చేసి వారి దాడుల్ని సమర్థంగా అడ్డుకుంది. భారత ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా ఐదు షాట్లు కొడితే... నేపాల్ ఒక షాట్కే పరిమితమైంది. మ్యాచ్లో ఎక్కువసేపు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకొన్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటల్ని సాగనివ్వలేదు. తాజా విజయంతో సొంతగడ్డపై భారత్ అజేయమైన రికార్డు 12 మ్యాచ్లకు చేరింది. 2019లో సెప్టెంబర్ 5న ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఓడిన భారత్ తర్వాత స్వదేశంలో ఏ జట్టు చేతిలోనూ ఓడిపోలేదు. అంతకుముందు ఇదే గ్రూపులో కువైట్ 2–0తో పాకిస్తాన్ను చిత్తు చేయడంతో కువైట్ కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 27న కువైట్తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్తో గ్రూప్లో అగ్ర స్థానంలో నిలిచేది ఎవరో తేలుతుంది. నేపాల్, పాకిస్తాన్లు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. It's that m̶a̶n̶ legend once again!@chetrisunil11#SAFFChampionship pic.twitter.com/wx1eSk4Y5E— FanCode (@FanCode) June 24, 2023 2️⃣ goals in quick succession 🤩 India are through to the #SAFFChampionship2023 Semifinal 👏🏽💙#NEPIND ⚔️ #IndianFootball ⚽️ #BlueTigers 🐯 pic.twitter.com/ByzfjsKSZY— Indian Football Team (@IndianFootball) June 24, 2023 చదవండి: #CheteshwarPujara: 'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్ పోస్ట్ -
లియోకి ఎందుకంత క్రేజ్?
-
#LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా..
5 అడుగుల 9 అంగుళాలు.. మొహంపై చెరగని చిరునవ్వు.. 18 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు.. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్బాల్ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.. ఈ తరంలో ఫుట్బాల్లో క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడుతున్న అతను ఒక మెట్టుపైనే ఉన్నాడు.అతనే అర్జెంటీనా గ్రేట్ లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ.. ఫుట్బాల్ కెరీర్లో చూడాల్సినవన్నీ చూశాడు. పసిఫిక్ దేశాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. ఇక ఇంతకాలం వెలితిగా ఉన్న ఫిఫా వరల్డ్కప్ను కూడా గతేడాది ఒడిసిపట్టాడు. వరల్డ్కప్ సాధించిన తర్వాత ఆటకు గుడ్బై చెప్తాడని అంతా భావించారు. కానీ మెస్సీ అలా చేయలేదు. తనలో శక్తి ఉన్నంతవరకు ఆడతానని.. ఇక ఆడలేను అన్నప్పుడు రిటైర్ అవుతానని మెస్సీ స్వయంగా పేర్కొన్నాడు. ఆల్టైమ్ గ్రేట్గా అభివర్ణిస్తున్న లియోనల్ మెస్సీ ఇవాళ(జూన్ 24న) 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి కెరీర్లో ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగిన శిఖరంలా కనిపించే మెస్సీకి గుండె లోతుల్లోనుంచి చెబుతున్న ఒక్క మాట.. Happy Birthday Lionel Messi.. విచిత్రమైన డెబ్యూ.. ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్గా. అయితే తొలి మ్యాచ్లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి రెడ్కార్డ్ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది. అంతుచిక్కని వ్యాధి.. మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్టైమ్ గ్రేట్గా గుర్తింపు.. 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరపున 175 మ్యాచ్ల్లో 103 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా.. ఫుట్బాల్ ప్రపంచంలో రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో ఎక్కువగా బార్సిలోనా క్లబ్కు ఆడిన మెస్సీ 778 మ్యాచ్ల్లో 672 గోల్స్.. పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ తరపున 75 మ్యాచ్ల్లో 32 గోల్స్.. ఓవరాల్గా అంతర్జాతీయ, ప్రైవేటు ఫుట్బాల్ క్లబ్స్ కలిపి 1028 మ్యాచ్లాడి 807 గోల్స్తో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. Happy Birthday Thalaivaaa😘🐐❤️#LeoMessi #Messi𓃵 #Messi #LionelMessi #HappyBirthdayMessi pic.twitter.com/NY7CR1WQrD — Chikadhee 🇦🇷 ™ (@Chickadhi) June 23, 2023 Happy 36th birthday GOAT 🐐#LionelAndresMessi. Happy Birthday Leo 🦁 Hoping for another Ballon d'Or in October. 🤗🤗#Messi #Leo #Messi36 #Messi𓃵 #MessiBirthday #LionelMessi pic.twitter.com/pSwzXxD0Hs — Fukkard (@Fukkard) June 24, 2023 #GOAT𓃵 #Messi𓃵 📸🙌🏻🐐🎂 pic.twitter.com/chrslX3wvd — sameer ᴩᴀᴛʜᴀɴ 👑🦁 (@sameerp07528955) June 24, 2023 -
హ్యాట్రిక్ గోల్స్తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి
భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి 90 గోల్స్ చేశాడు. ఇక టాప్–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–123 గోల్స్), అలీ దాయి (ఇరాన్–109 గోల్స్), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్) ఉన్నారు.2005లో జూన్ 12న భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్ ఛెత్రి తొలి గోల్ కూడా పాకిస్తాన్ జట్టుపైనే రావడం విశేషం. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు. 1952 తర్వాత భారత ఫుట్బాల్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్లో నేపాల్తో భారత్ ఆడుతుంది. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 A perfectly placed Penalty by Sunil Chhetri and he gets his hattrick😍😍 pic.twitter.com/i2knCtsiH8 — Shanu 🇦🇷 (@secureboy23) June 21, 2023 -
పాక్పై భారత్ ఘన విజయం.. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్ల గొడవ
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు.శనివారం తమ తదుపరి మ్యాచ్లో నేపాల్తో భారత్ ఆడుతుంది. మ్యాచ్ మధ్యలో భారత్-పాక్ ఆటగాళ్ల గొడవ.. పాకిస్తాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ మొరటుగా వ్యవహరించడంతో ఆయనకు మ్యాచ్ రిఫరీ ప్రజ్వల్ ఛెత్రి రెడ్ కార్డు చూపించి మైదానం బయటకు పంపించారు. భారత జట్టు రెండో గోల్ చేసిన తర్వాత పాక్ ప్లేయర్ అబ్దుల్లా ఇక్బాల్ త్రో ఇన్ చేయడానికి సిద్ధంకాగా స్టిమాక్ అబ్దుల్లా నుంచి బంతిని లాక్కున్నారు. స్టిమాక్ చర్యకు పాక్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. రిఫరీ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు స్టిమాక్కు రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించి మ్యాచ్ను కొనసాగించారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో కువైట్ జట్టు 3–1తో నేపాల్ జట్టును ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో లెబనాన్తో బంగ్లాదేశ్; మాల్దీవులుతో భూటాన్ తలపడతాయి. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 -
మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది
లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. అతను ఒక మ్యాచ్ ఆడితే కోట్లలో వీక్షిస్తారు. అలాంటి మెస్సీ మన దేశానికి వచ్చి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతానంటే భారత్ వద్దనడం ఆశ్చర్యం కలిగించింది. అర్జెంటీనా ప్రస్తుతం ఫుటబాల్లో చాంపియన్ అన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో మెస్సీ సేన ఫ్రాన్స్పై ఫూటౌట్లో 4-2తో విజయం సాధించి మూడోసారి వరల్డ్కప్ గెలుచుకుంది. అన్నీ తానై నడిపించిన మెస్సీ అర్జెంటీనాకు కప్ అందించి 36 సంవత్సరాల నిరీక్షణకు తెరదించాడు. ఇలాంటి మేటి చాంపియన్ టీమ్ వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడతామంటే ఫుట్బాల్ అభివృద్ధి కోరే ఏ దేశమైనా ఎగిరి గంతేస్తుంది. ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తుంది. కానీ జనాభాలో చైనాను మించిన భారత్ మాత్రం తమ ఫుట్బాల్ అబిమానులకు నిరాశ కలిగించే నిర్ణయంతో అర్జెంటీనా వస్తనంటే వద్దన్నది. అర్జెంటీనా జట్టు అయినా.. ఆ జట్టు ఆటగాళ్లయినా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్. అలాంటి జట్టు అప్పియరెన్స్ ఫీజుగా 50 లక్షల డాలర్లు(రూ.40 కోట్లు) ఇస్తే చాలు అందుబాటులో ఉన్న జూన్ 12 నుంచి 20వ తేదీల్లో భారత్ వేదికపై ఒక మ్యాచ్ ఆడి వెళతామంది. కానీ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(AIFF) అంత మొత్తం ఇవ్వలేం అనేసరికి మెస్సీ టీమ్ జూన్ 15న బీజింగ్లో ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. మనకంటే చిన్నదేశం ఇండోనేషియా వాళ్లు అడిగినంత ఫీజులో ఏ లోటు లేకుండా చెల్లించి జకార్తాలో 19న అర్జెంటీనాతో మ్యాచ్ ఆడి తమ కోరికను నెరవేర్చుకుంది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న మన భారత్ మాత్రం రూ. 40 కోట్లు ఇచ్చుకోలేక అర్జెంటీనాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించడం విస్మయం కలిగించే అంశం. చదవండి: #LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ -
టీవీకి సరిగ్గా సరిపోయే ఆట!
ఫుట్బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోవడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం అవసరమౌతుంది. అందుకే అవి స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. అదే టెన్నిస్లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజయోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి తోడు, టెన్నిస్లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. నేను క్రీడాకారుడిని కాదు. నిజం చెబు తున్నా, స్క్వాష్ తప్ప నేను ఏనాడూ ఏ ఆటా ఆడింది లేదు. క్రికెట్ అయితే నాకు ఒక దుర్భరమైన ధారావాహికలా తోస్తుంది. ఫుట్బాల్ మరీ అంత సాగతీతగా ఉండదు కనుక కొంచెం నయం అనుకుంటాను. ఎప్పుడైనా మర్యాద కోసం తప్ప ఆటల్ని నేను కనీసం చూడనైనా చూడను. కానీ టెన్నిస్... ఆహా! టెన్నిస్. అది నాకు మిగతా ఆటల్లా కాదు. మొత్తంగా అది వేరే కథ. నొవాక్ జొకోవిచ్ మొన్న నేను ఫ్రెంచి ఓపెన్ ఫైనల్స్లో నొవాక్ జొకోవిచ్ను చూసినప్పుడు టెన్నిస్ అన్నది టెలివిజన్ కోసం తయారైన ఆట అని గ్రహించాను. ఫుట్బాల్, క్రికెట్ అలా కాదు. బహుశా అందుకేనేమో ఎప్పుడో గాని గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ని నేను చేజార్చుకోను. ఇతర ఆటల వరల్డ్ కప్పులు ఏమైపోయినా నాకు పట్టదు. టెన్నిస్లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజ యోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. సంకల్ప బలం, స్థయిర్య క్షీణత వంటి అంతర్గత గుణాల విషయంలో కూడా ఇది నిజం. కెమెరా ఆ గుణాలను వెలికి తీస్తుంది. దానికి తోడు, టెన్నిస్లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. ప్రతి విసురూ ఆట ఊపునుంచి వీక్షకుల చూపును తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. టెన్నిస్లా ఫుట్బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. అందువల్ల జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం మీకు అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు బంతిని నియంత్రణలోకి తీసుకున్న ఆట గాడి మదిలోని వ్యూహాన్ని దృశ్యమానం చేయగలరు. అయితే ఒక ఆటగాడి మీద దృష్టిని నిలపడం అన్నది ఆటలోని తక్కిన భాగాన్నంతా కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఏ ఆటగాడు ఏ స్థానంలో ఉన్నదీ ఒకేసారి చూడా లంటే మైదానం మీకు తగినంత దూరంగా ఉండాలి. ఆ దూరం ఆట గాళ్లందర్నీ కనిపించేలా చేస్తుంది. అందుకే ఫుట్బాల్, క్రికెట్లు స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. మానవ నేత్రం ఒక్క సారింపుతో అన్నిటినీ చూడగలదు. టీవీ కెమెరా అలా చూడలేదు. అనేక కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఏదైనా ఒక కెమెరాలో వచ్చిన పేలవమైన దృశ్యాన్ని కూడా అవి ఏవీ భర్తీ చేయలేవు. టెన్నిస్లో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ను తిలకిస్తున్నట్లయితే దూరం నుంచి క్రీడా మైదానం సంతృప్తికరమైన వీక్షణను ఇవ్వదు. ఒక వేళ మీరు పక్కల నుంచి చూస్తున్నట్లయితే మీ మెడ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి మళ్లీ ఎడమకు మళ్లుతూ ఉంటుంది. బంతిని ఏ మాత్రం నేలను తాకనివ్వని పోటాపోటీ షాట్ల సుదీర్ఘమైన నిడివి కూడా మీకు అలసటను కలిగించవచ్చు. అదే టీవీలోనైతే రెండు మైదానాలు సమంగా కళ్ల ముందర ఉంటాయి. మీ మెడకు అసౌకర్యం కలుగదు. ఎందుకంటే మీరు స్క్రీన్కు ఎదురుగా కూర్చొని చూస్తుంటారు. బహుశా ఈ సదుపాయం వల్లనే దశాబ్దాలుగా నేను కొందరు టెన్నిస్ క్రీడాకారులను పిచ్చిగా అభిమానిస్తుండవచ్చు. వాళ్లు ఆడుతున్న ప్పుడు ఉత్కంఠగా చూస్తుంటాను. వాళ్లు గెలిచి తీరాలని ఆశ పడ తాను. ఓడిపోతే కలత చెందుతాను. వాళ్ల విజయాలను, వైఫల్యాలను నావిగా మనసులోకి తీసుకుంటాను. ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం 70 లలో బార్న్ బోర్గ్, మార్టినా నవ్రతిలోవాలతో మొదలైంది. వారి స్థానాన్ని 2000–2009 మధ్య రోజర్ ఫెదరర్ ఆక్రమించాడు. ప్రస్తుతం నొవాక్ జొకోవిచ్. 1980లో బోర్గ్ సాధించిన ఐదవ వింబుల్డన్ విజయాన్ని నేనెప్ప టికీ మర్చిపోలేను. నాలుగో సెట్లో అతడి ప్రత్యర్థి జాన్ మెకెన్రో అతడికి ఏడు చాంపియన్షిప్ పాయింట్లను దక్కకుండా చేశాడు. అది అతడి ఆత్మను ఛిన్నాభిన్నం చేస్తుందని వ్యాఖ్యాతలు విశ్వసించారు. విజయానికి చేరువై కూడా విఫలం చెందిన విషయాన్ని మర్చి పోయి ముందుకు సాగిపోవడం సాధ్యం అయ్యే పని కాదు. అయితే ఆ వ్యాఖ్యాతల అంచనా తలకిందులైంది. ఆ ఆటలో దృఢనిశ్చయంతో తలపడిన బోర్గ్ తన మోకాళ్లపై కూలబడటానికి ముందు ఐదో సెట్లో 8–6 తేడాతో విజయం సాధించాడు. అతడు చూపేది ఆ ఒక్క భావో ద్వేగమే. గెలిచిన ప్రతిసారీ అతడు అలాగే చేస్తాడు. అతడి వ్యక్తిత్వానికి సూచనప్రాయమైన సంకేతం ఇంకొకటి! టోర్నమెంటు జరుగుతున్నంత కాలం గడ్డం తీసేయకపోవడం! 1979లో సిమ్లాలో ఉండగా మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేను బోర్గ్ ఆడుతున్న వింబుల్డన్ ఫైనల్ చూస్తు న్నాను. పాకిస్తాన్ టీవీ దానిని ప్రసారం చేస్తోంది. ఐదో సెట్ చివరిలో ఆనాటి అత్యంత భయానక సర్వర్లలో ఒకరైన రాస్కో టానాతో పోరాడుతున్న బోర్గ్కు మూడు చాంపియన్ షిప్ పాయింట్లు చేతిలో ఉండగా పాకిస్తాన్ టీవీ చానల్ అకస్మాత్తుగా వార్తల ప్రసారంలోకి మళ్లింది. ఆ తర్వాత బోర్గ్ విజయం సాధించాడని తెలుసుకోడానికి ముందు అరగంట పాటు నేను తీరని వేదనతో టీవీ ముందు వేచి ఉన్నాను. ఆ నిర్దాక్షిణ్యమైన పీటీవీ, బులెటిన్లోకి ఆ వార్తను చేర్చడం సరికాదని భావించినట్లుంది. ఇప్పుడు మళ్లీ నాలుగు వారాల తర్వాత వింబుల్డన్ నన్ను టీవీ తెర ముందుకు తీసుకురానుందా? మొన్నటితో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ 24వ టైటిల్ను కూడా కోరుకుంటాడు. అందులో సందేహం లేదు. కానీ అది అతడికి ఎంత ముఖ్యమో నాకూ అంత ముఖ్యమా? 1981లో బోర్గ్ను ఓడించినందుకు నేను మెకెన్రోని ద్వేషించాను. ఎస్.డబ్ల్యూ18 మైదానంలో జొకోవిచ్ ఓడిపోతే నా ప్రతి స్పందన ఇప్పుడూ అలాగే ఉండబోతుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
#LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్
అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ మంచి దూకుడు మీద ఉన్నాడు. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్ గెలిచినప్పటి నుంచి మెస్సీలో ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. పైగ రోజురోజుకు మెస్సీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. అతని జోరు.. ఫిట్నెస్ చూస్తుంటే మరో ఫిఫా వరల్డ్కప్ ఆడేలా కనపిస్తున్నాడు. తాజాగా గురువారం బీజింగ్ వేదికగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్లో మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. ఆట మొదలైన నిమిషం 19 సెకన్ల వ్యవధిలోనే మెస్సీ అర్జెంటీనాకు గోల్ అందించాడు. మెస్సీ కెరీర్లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక గత ఏడు మ్యాచ్ల్లో అర్జెంటీనా తరపున మెస్సీకి ఇది ఏడో గోల్ కాగా.. ఓవరాల్గా ఈ ఏడాది 13 మ్యాచ్ల్లో 17 గోల్స్ చేసిన మెస్సీ.. 5 అసిస్ట్లు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అర్జెంటీనా ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే మెస్సీ గోల్ అందించగా.. ఆట 68వ నిమిషంలో జెర్మన్ పెజెల్లా జట్టుకు రెండో గోల్ అందించాడు. Leo Messi. After one minute. Of course ☄️ (via @CBSSportsGolazo)pic.twitter.com/r5UknzrZvB — B/R Football (@brfootball) June 15, 2023 చదవండి: ఐపీఎల్ బంధం ముగిసే.. మేజర్ లీగ్ క్రికెట్లో మొదలు -
దిష్టిబొమ్మ దహనం.. ఐదు లక్షల జరిమానా; రెండేళ్ల నిషేధం
బ్రెజిల్ స్టార్, రియల్ మాడ్రిడ్ ఫుట్బాలర్ వినిషియస్ జూనియర్కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్పానిష్ లీగ్లో భాగంగా మే21న జరిగిన మ్యాచ్లో వినిషియస్కు వ్యతిరేకంగా కొంతమంది అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ''Go Back To Your Country'' అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనపై స్పెయిన్ యాంటీ వయొలెన్స్ కమీషన్ సీరియస్ అయింది. లైవ్ మ్యాచ్ సమయంలో ఒక సాకర్ ప్లేయర్పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు దిష్టిబొమ్మ దహనం చేసినందుకు 60,001 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. ఐదు లక్షల జరిమానా, రెండేళ్ల నిషేధం విధించింది. నల్లజాతీయుడైన వినిషియస్ జూనియర్ కు ఈ వివక్ష కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం బ్రెజిల్ నుంచి స్పెయిన్కు వచ్చినప్పటి నుంచి అతను జాతి వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ మధ్య మ్యాచ్లోనూ జూనియర్ వినిషియస్ వివక్షకు గురయ్యాడు. స్పానిష్ క్లబ్ అయిన వెలెన్సియా నినాదాలు చేసిన ముగ్గురు అభిమానులకు జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది స్టేడియంలోకి అడుగుపెట్టకుండా నిషేధించింది. అయితే తాజాగా ఏడుగురు అభిమానులు జూనియర్ వినిషయస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అతని కళ్ల ముందే దిష్టిబొమ్మను తగలబెట్టడం ఎంతో బాధించింది. Ya que los que deberían no te explican qué es y qué puede hacer @LaLiga en los casos de racismo, hemos intentado explicártelo nosotros, pero no te has presentado a ninguna de las dos fechas acordadas que tú mismo solicitaste. Antes de criticar e injuriar a @LaLiga, es necesario… https://t.co/pLCIx1b6hS pic.twitter.com/eHvdd3vJcb — Javier Tebas Medrano (@Tebasjavier) May 21, 2023 Vinicius Jr ALL GOALS AND ASSISTS so far this season, let me know if i missed anything.pic.twitter.com/QY3IMI6ygW — Druchk (@andruchk) May 28, 2023 చదవండి: వివాదంలో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ యష్ దయాల్ -
లాస్ట్ మ్యాచ్ ఆడేసిన మెస్సీ
స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG) క్లబ్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఈ మ్యాచ్లో పీఎస్జీ.. క్లెర్మాంట్ క్లబ్ చేతిలో 2-3 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. మెస్సీతో పాటు సెర్గియో రామోస్కు కూడా పీఎస్జీ తరఫున ఇదే చివరి మ్యాచ్. తొలి అర్ధ భాగంలో పీఎస్జీ తరఫున రామోస్, ఎంబపె చెరో గోల్ సాధించగా.. క్లెర్మాంట్ తరఫున జోహన్ గస్టీన్, మెహ్ది జెఫ్ఫానే గోల్స్ చేశారు. అనంతరం సెకెండ్ హాఫ్లో (63వ నిమిషం) గ్రెజాన్ కై గోల్ చేసి క్లెర్మాంట్కు ఆధిక్యాన్ని అందించాడు. ఇదే లీడ్ చివరి వరకు కొనసాగడంతో క్లెర్మాంట్.. పీఎస్జీపై విజయం సాధించింది. సెకెండ్ హాఫ్లో మెస్సీకి రెండు గోల్స్ చేసే అవకాశం (ఫ్రీ కిక్) వచ్చినా, అవి వర్కౌట్ కాలేదు. మొత్తంగా ప్రస్తుత తరంలో ఫుట్బాల్ దిగ్గజాలుగా చెప్పుకునే మెస్సీ, రామోస్ ఓటమితో పీఎస్జీకి వీడ్కోలు పలికారు. కాగా, మెస్సీ.. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్తో కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అల్ హిలాల్ ప్రకటిస్తుందని తెలుస్తోంది. మెస్సీ సహచరుడు, పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో సైతం సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. చదవండి: జొకోవిచ్ రికార్డు -
'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!'
ఫుట్బాల్ హెడ్బట్స్ షాట్ ఆడడం కామన్. ఈ క్రమంలో గాయాలు కావడం సహజం. కానీ ఉద్దేశపూర్వకంగా ఆటగాళ్లను గాయపరిచేలా హెడ్బట్స్ షాట్ కొడితే మాత్రం తప్పు కిందే లెక్క. తాజాగా మహిళల ఫుట్బాల్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏఎఫ్ఏ మహిళల సాకర్ టోర్నమెంట్లో భాగంగా రేసింగ్, ఎల్ పొర్వినిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో ఎల్ పొర్వినిర్ ఆధిపత్యం చూపిస్తుంది. ఇది తట్టుకోని రేసింగ్ ఢిపెండర్ మారియా బెలెన్ తర్బోడా ఎదురుగా వస్తున్న లుడ్మిలా రమ్రెజ్ ముఖాన్ని తన తలతో ఒక్క గుద్దు గుద్దింది. దీంతో రమ్రెజ్ కిందపడిపోయింది. ఆమె నుదుటి చిట్లి రక్తం కారింది. ఇది గమనించిన రిఫరీ పరిగెత్తుకొచ్చి ఏదో పొరపాటులో జరిగిందేమో అనుకొని ఎల్లో కార్డ్ చూపించింది. ఇదే సమయంలో రమ్రెజ్ మొహం రక్తంతో నిండిపోయింది. ఇది గమనించిన రిఫరీ ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్ తలను పగులగొట్టినందుకు గాను మారియా బెలెన్కు రెడ్కార్డ్ చూపించింది. ఇది సహించని మారియా కాసేపు వాగ్వాదానికి దిగింది. రిఫరీ తన రెడ్కార్డ్కే కట్టుబడి ఉండడంతో చేసేదేం లేక మైదానాన్ని వీడింది. ఆ తర్వాత ఎల్ పొర్వినిర్కు వచ్చిన పెనాల్టీ కిక్ను సద్వినియోగం చేసుకొని గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే గాక మ్యాచ్ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ''ఇది కచ్చితంగా కావాలని చేయలేదు.. మనసులో ఏదో పెట్టుకొనే ఈ పని చేసినట్లుంది'' అని కామెంట్ చేశారు. ¡UFFFF, TREMENDO CHOQUE! 💥 Por este cabezazo a destiempo sobre Ludmila Ramírez fue expulsada María Belén Taborda. 🟨 En primera instancia, la árbitra Estefanía Pinto amonestó, pero luego rectificó su sanción.🟥 Con 10 Racing ante El Porvenir.#FUTBOLenDEPORTV | @YPFoficial pic.twitter.com/rd15TdGQnO — DEPORTV (@canaldeportv) May 23, 2023 ¡SE GRITA EN GERLI! ⚽️ Apareció Karina 'Chicho' Merlo con un potente tiro libre para adelantar a @elporvenirfem 1-0 sobre Racing. #FUTBOLenDEPORTV | @YPFoficial pic.twitter.com/vIqe9i9kTN — DEPORTV (@canaldeportv) May 23, 2023 చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ ఫుట్బాల్ స్టేడియంస్
-
13 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ లీగ్ ఫైనల్కు చేరిన ఇంటర్ మిలాన్
ఏ మాత్రం అంచనాలు లేకుండా ఛాంపియన్స్ లీగ్ బరిలోకి దిగిన ఇంటర్ మిలన్.. 13 ఏళ్ల తర్వాత తొలిసారి లీగ్ ఫైనల్కు చేరింది. అండర్ డాగ్స్గా బరిలో దిగిన ఈ జట్టు.. సెమీస్లో ఏసీ మిలన్ను 3-0 తేడాతో (మొత్తంగా) ఓడించింది. సెకెండ్ లెగ్ (మ్యాచ్)లో సబ్స్టిట్యూట్ రొమేలు లుకాకు అందించిన పాస్ను వినియోగించుకున్న లౌటరో మార్టినెజ్ అద్భుతమైన గోల్తో తన జట్టుకు ఫైనల్కు చేర్చాడు. అంతకుముందు ఇంటర్ మిలాన్ తొలి లెగ్లో 2-0 గోల్స్తో ఆధిక్యం సాధించింది. ఈ గెలుపుతో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్కు చేరిన ఇంటర్ మిలాన్.. వచ్చే నెల (జూన్ )10న ఇస్తాంబుల్లో జరిగే ఫైనల్లో రియల్ మాడ్రిడ్ లేదా మాంచెస్టర్ సిటీతో తలపడనుంది. నగర ప్రత్యర్థులతో జరిగిన రెండు మ్యాచ్ల్లో (సెమీస్) జట్టు ప్రదర్శించిన సమన్వయాన్ని ఇంటర్ మిలాన్ కెప్టెన్ మార్టినెజ్ ప్రశంసించాడు. చదవండి: చరిత్ర తిరగరాసిన జకోవిచ్ -
నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్లో వూల్విచ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్లోనే ఉందామే. దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం. (చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..) -
సమస్యల వలయంలో దారుల్ షిఫా ఫుట్ బాల్ గ్రౌండ్