
భారత క్రీడాకారిణి హిమ దాస్ ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 400 మీటర్ల పరుగులో ఫైనల్కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్ హీట్స్లో 18 ఏళ్ల హిమ 52.10 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ముందంజ వేసింది. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ జిస్నా మాథ్యూ మాత్రం విఫలమైంది. సెమీ ఫైనల్ హీట్లో ఆమె 53.86 సెకన్ల టైమింగ్తో ఐదో స్థానానికే పరిమితమైంది.