Athletics
-
ఆసియా రికార్డు నమోదు చేసిన గుల్వీర్.. ప్రపంచ అథ్లెటిక్స్కు అర్హత
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల ఇండోర్ రేసులో ఆసియా రికార్డు నెలకొల్పుతూ... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు అర్హత సాధించాడు. అమెరికా బోస్టన్లో జరిగిన ఇండోర్ ఈవెంట్లో గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచాడు. తద్వారా 5000 మీటర్ల ఇండోర్ రేసును 13 నిమిషాల లోపు పూర్తిచేసిన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ అర్హత మార్క్ (13 నిమిషాల 1 సెకన్)ను దాటాడు. ‘నా ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా . ఓవరాల్గా టైమింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెడుతున్నా. ఈ క్రమంలో ఇండోర్లో ఆసియా రికార్డు టైమింగ్ నమోదు చేయడం గర్వంగా ఉంది. నేరుగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు అర్హత సాధించడంతో సంతృప్తిగా ఉన్నా’ అని గుల్వీర్ పేర్కొన్నాడు. 5000 మీటర్ల ఔట్డోర్ రేసులోనూ జాతీయ రికార్డు (13 నిమిషాల 11.82 సెకన్లు) గుల్వీర్ సింగ్ పేరిటే ఉంది. -
జాతీయ రికార్డు బద్దలు కొట్టిన యువ అథ్లెట్
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) బోస్టన్లో జరిగిన ఇన్విటేషనల్ టోర్నీలో జాతీయ రికార్డు నెలకొల్పాడు. 3000 మీటర్ల ఇండోర్ రేసులో గుల్వీర్ సింగ్ 7 నిమిషాల 38.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తద్వారా 16 ఏళ్ల క్రితం సురేందర్ సింగ్ (7:49.47) నెలకొల్పిన రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల 10,000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... సీజన్ ఆరంభంలోనే రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు.‘సీజన్ తొలి ఇండోర్ టోర్నీలోనే మంచి ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉంది. దీంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ స్ఫూర్తితో ఔట్ డోర్ ఈవెంట్లలోనూ సత్తా చాటుతా’ అని 26 ఏళ్ల గుల్వీర్ పేర్కొన్నాడు.ఇదే టోర్నీలో పాల్గొన్న భారత మరో రన్నర్ రాహుల్ 8 నిమిషాల 8.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ప్రస్తుతం గుల్వీర్ పేరిటే 5000 మీటర్లు, 10,000 మీటర్ల జాతీయ రికార్డులు ఉన్నాయి. 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేసిన గుల్వీర్... 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 14.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో భారత మిడిల్, లాంగ్ డిస్టాన్స్ రన్నర్లు ప్రస్తుతం అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. -
జ్యోతి ‘డబుల్’ ధమాకా
డెహ్రాడూన్: భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో మరోసారి ‘పసిడి’ ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 200 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 23.35 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. తెలంగాణ అమ్మాయి నిత్య (23.76 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఆదివారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో వరుసగా మూడోసారి జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. జిమ్నాస్టిక్స్లో భాగమైన మహిళల ట్రాంపోలిన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన షేక్ యాసీన్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్లో కాకినాడ జిల్లాకు చెందిన షేక్ యాసీన్ తన విన్యాసాలతో మెరిపించి 39.790 పాయింట్లతో విజేతగా నిలిచింది. 2022 గుజరాత్ జాతీయ క్రీడల్లో యాసీన్ రజతం నెగ్గింది. నందిని నిలకడగా... ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) ఈవెంట్లో తెలంగాణకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి అగసార నందిని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రెండు రోజులపాటు జరిగిన ఈ ఈవెంట్లో నందిని మొత్తం 5601 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది మే 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించింది. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ (44.767 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు మహిళల నెట్బాల్ ఫాస్ట్–5 ఈవెంట్లో తెలంగాణ జట్టుకు రజత పతకం లభించింది. ఫైనల్లో తెలంగాణ జట్టు 20–23తో హరియాణా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ నెట్బాల్ జట్టు తరఫున నట్టి అఖిల, సయ్యదా మస్రతున్నీసా, జంగా సుప్లవి రాజ్, యరువా యషశ్రీ, సాయిప్రియ, కొమర రిషిక, అలోనా, తరుణ, అంజలి, యదనవేణి దీప్తి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 17వ స్థానంలో... తెలంగాణ 14పతకాలతో (2 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యాలు) 27వ స్థానంలో ఉన్నాయి. -
నడిపించేది నాన్న
కల నిజం అయ్యేది కష్టంతోనే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆఫ్రీన్ కుటుంబానికి కలలు కనేంత వెసులుబాటు లేకపొవచ్చు. అయినా సరే.... ఆ తండ్రి కల కన్నాడు. ఆయన కూతురు కల కన్నది. ఆ కల సాకారం అయింది. ఖమ్మంకు చెందిన షేక్ ఆఫ్రీన్ జాతీయ స్థాయిలో అథ్లెట్గా రాణిస్తోంది....‘ఇది వేరే ప్రపంచం’ అనుకున్నారు అక్కాచెల్లెళ్లు సమ్రీన్, ఆఫ్రీన్. ఆ ప్రపంచం పేరు....స్టేడియం. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొందరు రన్నింగ్ చేస్తున్నారు. కొందరు జంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు క్రికెట్ ఆడుతున్నారు. కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. వారి ఒంటికి పట్టిన చెమటల మాట ఎలా ఉన్నా...అందరి కళ్లల్లోనూ అంతులేని ఉత్సాహం పొంగిపొర్లుతుంది.ఆ ఉత్సాహమే పద్నాలుగు సంవత్సరాల ఆఫ్రీన్ను ఆ స్టేడియంకు దగ్గర చేసింది. ‘పప్పా... మేము నీతో పాటు రోజూ స్టేడియంకు వస్తాం’ అని అడిగారు. ఆఫ్రీన్ తండ్రి రహీమ్ హోంగార్డ్. స్పోర్స్›్టపర్సన్ కూడా. రోజూ తప్పకుండా స్టేడియంకు వచ్చి ఎక్సర్సైజ్లు చేయడం ఆయన దినచర్యలో భాగం. కుమార్తె విన్నపాన్ని విన్న రహీమ్... ‘అలాగే’ అన్నాడు. దీనికి ముందు ‘ఇక్కడికి వచ్చి ఏంచేస్తారు?’ అన్నాడు నవ్వుతూ. ‘మీలాగే ఎక్సర్సైజ్లు చేస్తాం’ అన్నారు సీరియస్గా.‘వీరిది ఒకటి రెండు రోజుల ఉత్సాహం. ఆ తరువాత అంతా మామూలే!’ అనుకున్నాడు రహీమ్. కానీ, అతడి అంచనా తప్పయింది. రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం నుంచి ఆటల వరకు ఆఫ్రీన్కు స్టేడియం ప్రాణం అయింది. స్టేడియంకు రాని రోజూ అంటూ ఉండేది కాదు. ‘ఎప్పుడూ స్టేడియంలోనే కనిపిస్తావు. ఎప్పుడు చదువుకుంటావు!’ అని అడిగే వాళ్లు కొందరు.‘స్టేడియంలో కూడా చదువుకుంటూనే ఉన్నాను’ అని ఆఫ్రీన్ అన్నదో లేదు తెలియదుగానీ స్టేడియంలో తాను ఆటల ప్రపంచాన్ని చదువుతోంది. కట్ చేస్తే... షేక్ అఫ్రీన్ ప్రస్తుతం ఖమ్మంలోని ‘కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్’లో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు అథ్లెటిక్స్లోనూ రాణిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పొటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. ఎంతో మంది పేదింటి అమ్మాయిలకు రోల్మోడల్గా నిలుస్తోంది. మొదట్లో కుమార్తెల ఉత్సాహానికి సంతోషపడిపొయిన రహీం ఆ ఇద్దరికి పరుగు పందెం నిర్వహించాడు. రన్నింగ్లో వారి ప్రతిభను చూసి ‘ఈ వజ్రాలకు సానబెట్టాల్సిందే’ అనుకున్నాడు. అదే సమయంలో కోచ్ గౌస్.... ‘ఆఫ్రీన్కు శిక్షణ ఇస్తే మంచి అథ్లెట్ అవుతుంది’ అన్నాడు. అతడి నోటి వాక్కు ఫలించింది. ఆఫ్రీన్ తో పాటు సమ్రీన్ కూడా అథ్లెటిక్స్లో రాణించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో పాల్గొంది. ఆఫ్రీన్ ట్రాక్ రికార్డ్2016లో మహబూబ్నగర్లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 600 మీటర్ల పరుగులో మూడో స్థానం, 2017లో హైదరాబాద్లో జరిగిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటిస్థానం, 400 మీటర్లలో రెండోస్థానంలో నిలిచింది. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)2022లో జరిగిన తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 300 మీటర్ల పరుగులో ద్వితీయస్థానం, లాంగ్జంప్లో ద్వితీయస్థానం సాధించింది. 2023లో వరంగల్లో నిర్వహించిన సౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్జంప్లో 5వ స్థానంలో నిలిచింది. 2023లో కరీంనగర్లో జరిగిన తెలంగాణ సౌత్జోన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్ జంప్లో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 19 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించినసౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో మిడిల్రిలేలో 3వ స్థానం సాధించింది.ఇంకా ఎన్నో సాధించాలి...సాధిస్తానుపొటీల్లో పాల్గొనేటప్పుడు ఆటపైనే ధ్యాస ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించను. మా నాన్న కూడా అదే చెబుతారు. నీ వంతుగా శ్రమిస్తే ఓడిపొయినా ఫర్వాలేదని ధైర్యం చెబుతారు. నేను పొటీల్లో రాణించడానికి నాన్న, అమ్మ కష్టపడుతున్నారు. అమ్మ జమీలా అసలు చదువుకోలేదు. నేను అథ్లెటిక్స్లో పాల్గొన్న వీడియోలు చూస్తూ నన్ను అభినందిస్తోంది. దేశం తరుపున పొటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలనేదే లక్ష్యం. – షేక్ ఆఫ్రీన్– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మంఫొటోలు: రాధారపు రాజు -
‘డైమండ్’ మెరుపులకు ‘సై’
బ్రసెల్స్ (బెల్జియం): అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్కు రంగం సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అగ్రశ్రేణి అథ్లెట్లంతా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ పతకాలతో మెరిసిన ఆటగాళ్లంతా మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నారు. పోటీ పడేందుకు ఈ ఏడాది మొత్తం 14 డైమండ్ లీగ్ సిరీస్లు అందుబాటులో ఉండగా... తాము ఎంచుకున్న సిరీస్లలో పాల్గొనడం ద్వారా సాధించిన పాయింట్లతో ఆటగాళ్లు ఫైనల్కు అర్హత సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు కలిపి మొత్తం 32 అంశాల్లో పతకాలు గెలిచేందుకు అవకాశం ఉంది. పోల్వాల్ట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్), అమెరికా స్ప్రింటర్ ష కారీ రిచర్డ్సన్, స్టార్ హర్డ్లర్ సిడ్నీ మెక్లాలిన్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఫెయిత్ కిపైగాన్ లాంటి టాప్ ప్లేయర్లు ఫైనల్లో బరిలోకి దిగుతున్నారు. లెట్సిల్ టె»ొగో (బోట్స్వానా), ర్యాన్ క్రూజర్, యరస్లొవా మహుచుక్ తదితరులు కూడా తుది సమరంలో పోటీ పడుతున్నారు.ఓవరాల్గా 18 మంది ఒలింపిక్ విజేతలు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటం విశేషం. 50 వేల సామర్థ్యం గల కింగ్ బౌదిన్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ విజేతగా నిలిచిన వారికి డైమండ్ లీగ్ ట్రోఫీతో 30 వేల డాలర్ల ప్రైజ్మనీ, వచ్చే ఏడాది జపాన్లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది. అగ్రశ్రేణి అథ్లెట్ల ఆటతో రెండు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మరింత వినోదం ఖాయం. నేడు సాబ్లే... రేపు నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్లో భారత్ నుంచి ఇద్దరు అథ్లెట్స్ పోటీ పడుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో జాతీయ రికార్డు సాధించిన అవినాశ్ సాబ్లే ఈ పోటీల్లో బరిలో నిలిచాడు. నేటి రాత్రి 12.30 గంటలకు అతని ఈవెంట్ మొదలవుతుంది. ఈ ఏడాది పారిస్, సిలేసియాలలో జరిగిన సిరీస్లలో పాల్గొన్న సాబ్లే మొత్తం 3 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 12 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది. అయితే తనకంటే మెరుగైన స్థానంలో నిలిచిన నలుగురు అథ్లెట్లు తప్పుకోవడంతో సాబ్లేకు చాన్స్ లభించింది. మరోవైపు భారత దిగ్గజ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్కు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. దోహా, లుసాన్ సిరీస్లలో పాల్గొన్న అతను మొత్తం 14 పాయింట్లు సాధించి ఓవరాల్గా నాలుగో స్థానం సాధించాడు. గత ఏడాది డైమండ్ లీగ్లో చోప్రా రన్నరప్గా నిలిచాడు. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి నీరజ్ చోప్రా ఈవెంట్ జరుగుతుంది. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)లో జరిగిన 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్లో నీరజ్ చోప్రా విజేతగా... యూజీన్ (అమెరికా)లో జరిగిన 2023 డైమండ్ లీగ్ ఫైనల్స్లో నీరజ్ రన్నరప్గా నిలిచాడు. -
‘టోక్యో’ను దాటేసి...
ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. 2020 టోక్యో కీడల్లో ఓవరాల్గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. బుధవారం పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా... ఆ తర్వాత జావెలిన్ త్రోలో ఇలాగే అజీత్ సింగ్, సుందర్ సింగ్ లకు వరుసగా రజత, కాంస్యాలు లభించాయి. దీంతో మన బృందం టోక్యో ప్రదర్శనను దాటగా... షాట్పుట్లో సచిన్ సాధించిన రజతంతో, ఆర్చరీలో హర్విందర్ సింగ్ గెలిచిన స్వర్ణంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా మూడో పారాలింపిక్స్లోనూ పతకం గెలిచిన తమిళనాడు ప్లేయర్ తంగవేలు ప్రదర్శన ఈ క్రీడల్లో హైలైట్గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్లో భారత్కు అథ్లెటిక్స్ క్రీడాంశంలో పతకాల పంట పండింది. ఇప్పటికే జట్టుకు ఇందులో 11 మెడల్స్ లభించాయి. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పోడియంపై నిలిచారు. 1.88 మీటర్ల ఎత్తుకు జంప్ చేసిన శరద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈ ఈవెంట్లోనే కాంస్యం దక్కింది. అతను 1.85 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. మరో భారత ప్లేయర్ శైలేష్ కుమార్కు నాలుగో స్థానం (1.85 మీటర్లు) దక్కింది. ఇద్దరి స్కోర్లూ సమానంగానే ఉన్నా... తక్కువసార్లు విఫలమైన తంగవేలుకు పతకం ఖరారైంది. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో భారత అథ్లెట్ అజీత్ సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ జావెలిన్ను 65.62 మీటర్ల దూరం విసిరాడు. అతని తర్వాత మూడో స్థానంలో నిలిచి సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నాడు. సుందర్ విసిరిన జావెలిన్ 64.96 మీటర్లు వెళ్లింది. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు. హర్విందర్ ‘పసిడి’ గురి పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హర్విందర్ 6–0తో (28–24, 28–27, 29–25) లుకాస్ సిస్జెక్ (పోలాండ్)పై గెలుపొందాడు. 2020 టోక్యో పారాలింపిక్స్లో హరి్వందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. సత్తా చాటిన సచిన్... పురుషుల షాట్పుట్ ఎఫ్46 ఈవెంట్లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్లో ప్రపంచ చాంపియన్ అయిన సచిన్ తన రెండో ప్రయత్నంలో ఇనుప గుండును అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే జరిగిన ప్రమాదం తర్వాత నుంచి సచిన్ ఎడమచేయి పని చేయలేదు. పలు శస్త్రచికిత్సల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. 2015లో ఆటల్లోకి ప్రవేశించి ముందుగా జావెలిన్లో ప్రయత్నం చేసిన అతను ఆ తర్వాత షాట్పుట్కు మారాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన సచిన్ ప్రస్తుతం పలు విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. మరోవైపు టేబుల్ టెన్నిస్లో భవీనాబెన్ పటేల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. టోక్యోలో రజతం సాధించిన భవీనా ఈసారి క్వార్టర్స్లో 12–14, 9–11, 11–8, 6–11 స్కోరుతో యింగ్ జూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్లో 50 మీటర్ల మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ (ఎస్హెచ్1)లో భారత ఆటగాళ్లు నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేల్వాల్ క్వాలిఫయింగ్లోనే విఫలమైన ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. -
కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా... మా దీప్తి ’బంగారం’!
పారాలింపిక్స్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సోమవారం ఏకంగా ఎనిమిది పతకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా... మంగళవారం కాంస్యం రూపంలో ఒక పతకం లభించింది. మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 రేసులో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజి కాంస్య పతకం సాధించింది. ప్రపంచ పారా చాంపియన్, పారా ఆసియా గేమ్స్ చాంపియన్ హోదాలో తొలిసారి పారాలింపిక్స్లో అడుగుపెట్టిన దీప్తి మూడో స్థానాన్ని సంపాదించింది. దీప్తి కాంస్యంతో పారిస్ పారాలింపిక్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరుకుంది. మరిన్ని మెడల్ ఈవెంట్స్లో మన క్రీడాకారులు పోటీపడాల్సి ఉండటంతో ఈసారి భారత్ పతకాల సంఖ్య 20 దాటే అవకాశముంది. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్లో భారత్ 19 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారిస్: పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో 16వ పతకం చేరింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 కేటగిరి ఫైనల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజి కాంస్య పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో 20 ఏళ్ల దీప్తి 55.82 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. యూలియా షులియర్ (ఉక్రెయిన్; 55.16 సెకన్లు) స్వర్ణం సంపాదించగా... టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ (55.23 సెకన్ల) రజత పతకాన్ని గెల్చుకుంది. ఈ ఏడాది మేలో జపాన్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకం నెగ్గిన దీప్తి అదే ప్రదర్శనను ‘పారిస్’లో పునరావృతం చేయలేకపోయింది. ఒకవేళ ఇదే టైమింగ్ను దీప్తి ‘పారిస్’లో నమోదు చేసి ఉంటే ఆమెకు స్వర్ణ పతకం లభించేది. ఫైనల్ రేసు ఆరంభంలో చివరి వరకు రెండో స్థానంలో ఉన్న దీప్తి ఆఖరి పది మీటర్లలో వెనుకబడిపోయి మూడో స్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి జరిగిన హీట్స్లో 54.96 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ చివరి పది మీటర్లలో వేగంగా పరుగెత్తి దీప్తిని దాటేసి రజత పతకాన్ని ఖరారు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన మహిళల బ్యాడ్మింటన్ ఎస్హెచ్6 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి నిత్యశ్రీ శివన్ కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక మ్యాచ్లో నిత్యశ్రీ 21–14, 21–6తో రీనా మార్లిన్ (ఇండోనేసియా)పై గెలిచింది. మహిళల షాట్పుట్ ఎఫ్34 కేటగిరీలో భారత అథ్లెట్ భాగ్యశ్రీ జాధవ్ ఇనుప గుండును 7.28 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అవనికి ఐదో స్థానం తన పారాలింపిక్స్ కెరీర్లో మూడో పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్హెచ్1 ఈవెంట్ ఫైనల్లో 22 ఏళ్ల అవని ఐదో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని 420.6 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్లో అవని 1159 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. ముగిసిన పూజ పోరు మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్ పూజ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో పూజ 4–6 (28–23, 25–24, 27–28, 24–27, 24–27)తో వు చున్యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండు సెట్లు గెలిచిన పూజ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో సెట్లో స్కోరును సమం చేసినా పూజ సెమీఫైనల్కు చేరుకునేది. కానీ పూజ తడబడి మూడు సెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో పూజ 6–0 (27–24, 26–22, 272–6)తో యాగ్ముర్ (టరీ్క)పై నెగ్గింది.కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా...పారా అథ్లెటిక్స్లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న క్రీడాకారులు ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా లోని కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఇబ్బంది పెడుతుండగా... మరోవైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా గ్రామంలో హేళన చేసేవారు. ఇలాంటి తరుణంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ టోర్నీలో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన స్నేహితుడి ద్వారా రమేశ్కు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో ట్రెయినింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో దీప్తికి శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి దీప్తికి ఆర్థికంగా సహకారం అందించారు. కెరీర్ ఆరంభంలో దీప్తి అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్షిప్లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆర్థిక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ స్వర్ణ ప్రదర్శనతో ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఈ ఏడాది మే నెలలో జపాన్లో జరిగిన ప్రపంచ పారా చాంపియన్షిప్లో దీప్తి 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించి పారాలింపిక్స్లో మెడల్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ పతకం సాధించింది. -
‘ఆరు’లో అదరగొట్టి...
సరిగ్గా రెండు వారాల క్రితం భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిశాడు. ఆరు ప్రయత్నాల్లో ఐదుసార్లు అతను ఫౌల్ అయినా ఒక్క మంచి త్రో అతనికి ‘పారిస్’లో రెండో స్థానాన్ని అందించింది. ఇప్పుడు వేదిక మారింది. సమరం ఒలింపిక్స్ నుంచి డైమండ్ లీగ్కు మారింది... కానీ అగ్రస్థానంలో నిలవాలనే ఒత్తిడి అతనిలో తగ్గినట్లు కనిపించలేదు... ఫలితంగా అదే తడబాటు. తొలి ఐదు ప్రయత్నాల్లో ఆశించిన దూరం జావెలిన్ వెళ్లలేదు... కానీ ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో నీరజ్ తన స్థాయిని ప్రదర్శించాడు. ఒక్క త్రోతో రెండో స్థానానికి దూసుకెళ్లి మీట్ను ముగించాడు. లుసాన్ (స్విట్జర్లాండ్): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లుసాన్ మీట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మీట్లో నీరజ్ జావెలిన్ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన కాగా... మొత్తం కెరీర్ లో రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. రెండేళ్ల క్రితం స్టాక్హోమ్లో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో జావెలిన్ను నీరజ్ 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఈ ఈవెంట్లో 90.61 మీటర్ల దూరంతో ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) మొదటి స్థానంలో నిలవగా... జూలియన్ వెబర్ (జర్మనీ; 87.08 మీటర్లు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకున్న పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ ఈ మీట్లో పాల్గొనలేదు. పారిస్ ఒలింపిక్స్లో 89.45 మీటర్ల దూరంతో నీరజ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న అతను ఒకదశలో డైమండ్ లీగ్ నుంచి తప్పుకోవాలని భావించినా... చివరకు బరిలోకి దిగాడు. ఇప్పుడు పక్షం రోజుల తేడాతో కాస్త మెరుగైన ప్రదర్శన అతడి నుంచి వచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాల్లో అతని త్రో ఒక్కటీ కనీసం 85 మీటర్లు కూడా వెళ్లలేదు. నీరజ్ వరుసగా 82.10 మీటర్లు... 83.21 మీటర్లు... 83.13 మీటర్లు... 82.34 మీటర్లు మాత్రమే జావెలిన్ను విసరగలిగాడు. వీటి తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే ఐదో ప్రయత్నం అతడిని మూడో స్థానానికి తీసుకెళ్లింది. ఇందులో జావెలిన్ 85.58 మీటర్లు వెళ్లింది.ఆఖరి ప్రయత్నంలో అండర్సన్ ఏకంగా 90.61 మీటర్లతో కొత్త మీట్ రికార్డు నెలకొల్పి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. అనంతరం నీరజ్ తన శక్తిని మొత్తం ఉపయోగించి విసిరిన ఆరో అస్త్రం ఎట్టకేలకు సానుకూల ఫలితాన్ని అందించింది. 89.49 మీటర్లతో అతనికి రెండో స్థానం దక్కింది. అయితే చాలా కాలంగా నీరజ్ ఆశిస్తున్న 90 మీటర్ల మైలురాయిని మాత్రం అతను మరోసారి అందుకోలేకపోయాడు! ఫైనల్కు అర్హత సాధించినట్లేనా! తాజా ఈవెంట్లో రెండో స్థానంలో నిలవడంతో నీరజ్కు 7 పాయింట్లు దక్కాయి. దోహా డైమండ్ లీగ్లో కూడా రెండో స్థానం సాధించడం ద్వారా వచి్చన 7 పాయింట్లు కలిపి ప్రస్తుతం నీరజ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్గా ప్రస్తుతం వెబర్తో సమానంగా అతను మూడో స్థానంలో ఉన్నాడు. అండర్సన్ (21), జాకబ్ వలెచ్ (16) తొలి రెండు స్థానాలతో ఇప్పటికే ఫైనల్కు అర్హత సాధించారు. ఫైనల్కు మొత్తం ఆరుగురు అర్హత పొందుతారు. సెపె్టంబర్ 5న జ్యూరిచ్లో జరిగే చివరి మీట్లోనూ నీరజ్ పాల్గొనబోతున్నాడు. అక్కడా రాణిస్తే అతను ఫైనల్కు అర్హత సాధించడం లాంఛనమే కానుంది. బ్రసెల్స్లో సెప్టెంబర్ 14 నుంచి ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఈవెంట్ ఆరంభంలో కొంత నిరాశ కలిగింది. అయితే ఫలితం తర్వాత చూస్తే నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ముఖ్యంగా చివరి ప్రయత్నంలో నా కెరీర్లో రెండో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగాను. సరిగ్గా మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత నేను కోలుకోగలగడం, పోరాటస్ఫూర్తి కనబర్చడం ఆనందాన్నిచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాలు 80–83 మీటర్ల మధ్యే ఉన్నా ఆఖరి రెండు త్రోలలో నా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాను. ఈ స్థాయి పోటీల్లో మానసికంగా కూడా దృఢంగా ఉండి చివరి వరకు పోరాడటం ముఖ్యం. అండర్సన్ 90 మీటర్ల త్రో విసిరాక నాపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా దానిని దాటాలని అనుకున్నా. అయితే నా మిత్రుడైన కెన్యా ప్లేయర్ జూలియస్ యెగో నా వద్దకు వచ్చి తగిన సలహా ఇచ్చాడు. ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎక్కువ దూరం విసరగలవు అని చెబుతూ నా ఆందోళనను తగ్గించాడు. దాంతో ఒత్తిడి లేకుండా జావెలిన్ను విసరగలిగాను. –నీరజ్ చోప్రా -
ఏడు నుంచి ఆరుకు...48 నుంచి 71కి..!
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్ల సన్నాహాలు మొదలయ్యాయి. సాధారణంగా ఉండే నాలుగేళ్లతో పోలిస్తే ఒక ఏడాది తక్కువ సమయం ఉండటంతో అన్ని క్రీడల్లోనూ పారిస్ లక్ష్యంగానే హడావిడి కనిపించింది. అధికారులు, ప్రభుత్వం కూడా రెండంకెల పతకాలు ఖాయమంటూ నమ్మకం పెట్టుకున్నాయి. అందుకు తగినట్లుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. అథ్లెట్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా ఒలింపిక్స్ సన్నద్ధత కోసమే 16 క్రీడాంశాల్లో సౌకర్యాల కల్పన, విదేశాల్లో ప్రత్యేక శిక్షణ, పోటీల్లో పాల్గొనేందుకు రూ. 470 కోట్లు ఖర్చు కూడా చేసింది. 117 మందితో మన బృందం బరిలోకి దిగింది. అద్భుతాల గురించి కాకపోయినా ఎక్కువ మంది కచ్చితంగా బాగా ఆడతారనే అంచనాలు, ఆశలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. కానీ ఒక్కో రోజు కరుగుతున్న కొద్దీ పరిస్థితి మారిపోతూ వచ్చింది. పతకం కోసం ఎంతో ఎదురు చూడాల్సిన స్థితి. చివరకు ఒక రజతం, ఐదు కాంస్యాలతో మన టీమ్ ముగించింది. గత ఒలింపిక్స్తో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గడమే కాదు... స్వర్ణం కూడా లేకపోవడంతో పతకాల పట్టికలో కూడా భారత్ చాలా దిగువకు పడిపోయింది. –సాక్షి క్రీడా విభాగంపారిస్: అథ్లెటిక్స్లో భారత మహిళల 4్ఠ400 రిలే జట్టు పారిస్ ఒలింపిక్స్లో 3 నిమిషాల 32.51 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది... ఇదే ఈవెంట్లో 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో భారత బృందం టైమింగ్ 3 నిమిషాల 32.49 సెకన్లు మాత్రమే! అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా మన జట్టు టైమింగ్ మెరుగుకాకపోగా, అంతకంటే పేలవంగా రిలే టీమ్ ముగించింది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, విదేశాల్లో శిక్షణ, మంచి డైట్ వంటివి మాత్రమే ఫలితాన్ని ఇవ్వలేవనే దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే అథ్లెటిక్స్లో మన ఆటగాళ్ల విషయంలో పెద్దగా అంచనాలు లేవు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేమూ ఉన్నామని గుర్తు చేసే కనీస స్థాయి ప్రదర్శన కూడా రాలేదు. మొత్తం 29 మంది అథ్లెట్లు పాల్గొంటే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కడే తన స్థాయిని ప్రదర్శించాడు. భారత ప్రదర్శన విషయంలో ఈ ఒక్క క్రీడాంశాన్నే విమర్శించడానికి లేదు. ఓవరాల్గా కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రదర్శనను దాటలేకపోగా, అది పునరావృతం కూడా కాలేదు. ప్రతీ ఒలింపిక్స్ తర్వాత జరిగే సమీక్ష తరహాలోనే ఈసారి కూడా దాదాపు అవే కారణాలు. మన ప్రమాణాలు బాగా పెరిగాయని చెప్పుకోవడమే తప్ప అసలైన సమయంలో పోటీకి దిగినప్పుడు ఇంకా మనం చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నామని తేలిపోయింది. చాలా మంది భారత ఆటగాళ్లకు ఒలింపిక్స్లో పాల్గొనడమే ఒక ఘనతగా కనిపిస్తోంది తప్ప అంతకు మించి ముందుకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. 20 కిలోమీటర్ల రేస్వాక్లో 43 మంది పాల్గొంటే 41వ స్థానంలో నిలిచిన ప్రియాంక గోస్వామి గేమ్స్ విలేజ్ గదిలో సరదాగా ‘రీల్స్’ చేస్తున్న వీడియో చూస్తే ఆమె తన ఆట పట్ల ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది.తాము అడిగిన కోచ్లు, ఫిజియోలు... తాము కోరిన చోట శిక్షణ... ఇలా ఒక్కటేమిటి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచింది. అయినా మెడల్స్ విషయంలో మన రాత మారలేదంటే లోపం ఆటగాళ్లలోనే ఉన్నట్లు అర్థం. తమకు సౌకర్యాలు లేవనే మాట ఇకపై ఆటగాళ్ల నుంచి రాకూడదని... ప్లేయర్లు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ చేసిన వ్యాఖ్య ఈ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లందరికీ వర్తిస్తుంది. పతకవీరులు... టోక్యోలో 19 ఏళ్ల టీనేజర్గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపర్చిన షూటర్ మనూ భాకర్ ఈసారి నాటి తప్పులను సరిదిద్దుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ విభాగాల్లో రెండు కాంస్యాలు గెలిచి తనను తాను నిరూపించుకుంది. మిక్స్డ్లో ఆమె భాగస్వామిగా సరబ్జోత్ సింగ్ కూడా కాంస్యాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రైఫిల్ త్రీ పొజిషన్స్లో అనూహ్యంగా స్వప్నిల్ కుసాలే మూడో స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో మూడో కాంస్యం చేరింది.భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరట కాగా... యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా కంచు మోత మోగించి తానేంటో చూపించాడు. అయితే పట్టికలో భారత్ స్థానాన్ని పైకి చేర్చగల స్వర్ణం మాత్రం మనకు రాలేదు. ‘టోక్యో’ పసిడితో సత్తా చాటిన నీరజ్ చోప్రా గత మూడేళ్ల ప్రదర్శనను చూస్తే ఈసారి గోల్డ్ ఖాయమనిపించింది.అయితే దురదృష్టవశాత్తూ అది చేజారినా... రజతంతో కాస్త మెరుగైన పతకం మన ఖాతాలో చేరింది. వరుసగా రెండు ఒలింపిక్స్లలో మెడల్స్ గెలిచిన అరుదైన జాబితాలో నీరజ్ చేరగా... ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలతో మనూ భాకర్ తన కీర్తిని పెంచుకుంది. అంచనా తప్పారు... టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాతి నుంచి ప్రదర్శన, తాజా ఫామ్, ఆటగాళ్ల స్థాయిని బట్టి చూసుకుంటే కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు విఫలం కాగా... కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోనే పరాజయంపాలయ్యారు. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, వరల్డ్ రికార్డు ఉన్న షూటర్ సిఫ్ట్ కౌర్ సామ్రా కనీసం పతకానికి చేరువగా కూడా రాలేకపోవడం గమనార్హం. బాక్సింగ్లో నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ కూడా అంచనా తప్పగా... గత ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడింది. ఇక ఆర్చరీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. నాలుగో ఒలింపిక్స్లో కూడా దీపిక కుమారి ఉత్త చేతులతోనే తిరిగొచ్చింది. ఇక టేబుల్ టెన్నిస్, జూడో, స్విమ్మింగ్, రోయింగ్, సెయిలింగ్, గోల్ఫ్, ఈక్వె్రస్టియన్లు మనం పతకాలు ఆశించే క్రీడలు కావు. టెన్నిస్లో రోహన్ బోపన్న తన ఏటీపీ టోర్నీల స్థాయి ఆట ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు. నాలుగో స్థానాలతో సరి... విజయం సాధించిన వాడినే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. రెండో స్థానానికి కూడా విలువుండదు... స్పోర్ట్స్లో మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేటప్పుడు చాలా మంది తరచుగా వాడే మాట ఇది. కానీ మన భారతీయులు ఇప్పుడు నాలుగో స్థానాన్ని చూసి కూడా అయ్యో... కొద్దిలో చేజారిందే అనుకుంటున్నాం. ఇది ఏదో ఆత్మ సంతృప్తి కోసమే తప్ప ఒలింపిక్స్లో నాలుగో స్థానానికి ఎలాంటి విలువ లేదు. అదృష్టం కలిసొస్తే మరో ఆరు పతకాలు మన ఖాతాలో చేరేవేమో కానీ అలాంటి వాటికి ఆటల్లో చోటు లేదు. మనూ భాకర్, అర్జున్ బబూతా, మహేశ్వరి–అనంత్జీత్ జోడీ (షూటింగ్), మీరాబాయి చాను (వెయిట్లిఫ్టింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్–అంకిత జోడీ (ఆర్చరీ) అసలు సమయంలో తమ ఆట స్థాయిని పెంచలేకపోయారు. చివరగా... గెలుపు కూడా ఓటమిగా మారిన వైనం వినేశ్ ఫొగాట్ విషయంలో జరిగింది. ఫైనల్ చేరిన తర్వాత వచ్చిన పతకం బరువు ఎక్కువై చేజారడం వినేశ్కే కాదు భారతీయులందరికీ వేదన కలిగించింది. -
Paris Olympics 2024: చిన్న దేశాలు... పెద్ద విజయాలు
మహిళల 100 మీటర్ల పరుగులో సెయింట్ లూసియాకు చెందిన అల్ఫ్రెడ్ జూలియన్ 10.72 సెకన్లలో లక్ష్యానికి చేరి స్వర్ణం గెలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో డొమెనికాకు చెందిన లెఫాండ్ థియా 15.02 మీటర్ల దూరం దూకి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. సెయింట్ లూసియా జనాభా 1,80,000 కాగా.. డొమెనికా జనాభా 73 వేలు మాత్రమే. కరీబియన్ దీవుల్లోని అతి చిన్న దేశాలు విశ్వక్రీడల్లో సత్తా చాటుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఒలింపిక్స్ చరిత్రలో పసిడి గెలిచిన అతి తక్కువ జనాభా గల దేశంగా డొమినికా రికార్డుల్లోకెక్కింది. ఇవే కాకుండా.. పట్టుమని 10 లక్షల జనాభా కూడా లేని పదికి పైగా దేశాలు ఒలింపిక్స్లో చక్కటి ప్రదర్శన కనబరిచాయి. –సాక్షి క్రీడా విభాగం ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు పతకాలు సాధించాయి. వాటిలో జనాభా పరంగా స్వర్ణం గెలిచిన అతిచిన్న దేశంగా డొమెనికా నిలిచింది. విశ్వక్రీడల్లో ఆ దేశానికి ఇదే తొలి పతకం కావడం మరో విశేషం. ఇప్పటి వరకు తమ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు లేకున్నా... ఈ మెడల్ అనంతరం డొమినికాను ప్రపంచ చాంపియన్గా అందరూ గుర్తిస్తారని... ఆ దేశానికి తొలి పతకం అందించిన ట్రిపుల్ జంపర్ లెఫాండ్ థియా ఆశాభావం వ్యక్తం చేసింది. భిన్న భౌగోళిక పరిస్థితులు ఉండే డొమెనికాలో... క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యం అంతంత మాత్రమే. అలాంటి చోటు నుంచి ‘పారిస్’ క్రీడలకు నలుగురు అథ్లెట్లు అర్హత సాధించగా అందులో లెఫాండ్ థియా సాధించిన బంగారు పతకం... ఆ దేశానికి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ నుంచి డొమెనికా విశ్వక్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 28 ఏళ్ల తర్వాత ఆ దేశానికి మొదటి పతకం దక్కింది. ఈ ఏడాది ప్రపంచ ఇండోర్ చాంపియన్íÙప్లో పతకం నెగ్గి ఆశలు రేపిన లెఫాండ్... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో 15.02 మీటర్ల దూరం లంఘించి పసిడి పతకం కైవసం చేసుకుంది. ‘ఇప్పుడు మేం కూడా ప్రపంచ చాంపియన్లమే. డొమెనికాకు ఒలింపిక్స్లో తొలి పతకం. అది కూడా పసిడి. చాలా గొప్పగా అనిపిస్తోంది. ఈ ఫలితంతో మా దేశంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం పెరిగింది. మా దేశ జనాభా సుమారు 73 వేలు. దేశానికి తొలి స్వర్ణం అందించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. దేశం తరఫున ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్గా నిలవడం... అందులోనూ పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. చిన్న దేశం అంటే... పరిమిత వనరులు ఉంటాయనుకుంటారు. అయితే సంఖ్య కన్నా నాణ్యత ముఖ్యం అని నా ఉద్దేశం. ఈ విజయాన్ని దేశమంతా ఆస్వాదిస్తుంది. డొమెనికా స్టేడియంలో అథ్లెటిక్స్ కోసం మెరుగైన ట్రాక్ కూడా లేదు. ఇప్పుడు ఈ పతకం వల్ల దేశంలో క్రీడా మౌలిక వసతులు మెరుగు పడతాయని ఆశిస్తున్నా. భవిష్యత్తు తరాలు క్రీడలను కెరీర్గా ఎంచుకునేందుకు నా వంతు కృషి చేస్తా’ అని పతకం గెలిచిన అనంతరం లెఫాండ్ వివరించింది. జూలియన్ కథే వేరు... పారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం, 200 మీటర్లలో రజతం నెగ్గిన సెయింట్ లూసియా అథ్లెట్ జూలియన్ అ్రల్ఫెడ్ కథే వేరు! అమెరికా అథ్లెట్లు షకారీ రిచర్డ్సన్, జెఫెర్సన్ మెలీస్సాలతో పోటీపడి అగ్రస్థానం దక్కించుకున్న జూలియన్... ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. ప్రాక్టీస్ చేసేందుకు షూస్ కాదు కదా... కనీసం చెప్పులు కూడా లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జూలియన్... చిన్నతనంలో ఎక్కువగా స్కూల్ యూనిఫామ్లోనే పరుగు పెట్టేది. రన్నింగ్ కోసం ప్రత్యేక దుస్తులు కొనే స్థోమత లేని జూలియన్... చిన్నప్పటి నుంచే పరుగును ప్రేమించింది. ఒలింపిక్స్లో దేశానికి పతకం అందించాలని ఊహ తెలిసినప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్న జూలియన్... పారిస్లో తన కల సాకారం చేసుకుంది. ‘ఇది నాకు, నా దేశానికి ఎంతో విలువైంది. యావత్ దేశం సంబరాలు జరుపుకోవడం ఖాయం. చిన్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా పరుగులు తీసే దాన్ని. కనీస వసతులు లేకుండానే ఈ స్థాయికి వచ్చా. ఈ ప్రదర్శన అనంతరం మా దేశంలో స్టేడియం నిర్మాణం జరుగుతుందనుకుంటున్నా. యువత క్రీడలను కెరీర్గా ఎంచుకోవడం పెరుగుతుందని భావిస్తున్నా. దేశానికి అంబాసిడర్ అనే భావన కలుగుతోంది. ప్రపంచంలో చాలా మందికి సెయింట్ లూసియా గురించి తెలిసి ఉండకపోవచ్చు. అదెక్కడ ఉంది అని నన్ను ఎంతో మంది అడిగారు. కాని ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కాబట్టి... ప్రజలు సెయింట్ లూసియా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. దేశం కోసం పరుగెత్తడాన్ని గౌరవంగా భావిస్తా. ఇంటికి వెళ్లాక ప్రజలతో కలిసి సంబరాలు చేసుకుంటా’అని జూలియన్ చెప్పింది.వీరిద్దరే కాదు... 1,25,000 జనాభా ఉన్న గ్రెనెడా అథ్లెట్లు ‘పారిస్’ క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించగా... 2,82,000 జనాభా ఉన్న బార్బడోస్ ఒక పతకం నెగ్గింది. ఇక సుమారు 4 లక్షల జనాభా గల బహామస్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటి వరకు 8 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 16 పతకాలు గెలిచింది. -
అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు
పారిస్: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో ఆసక్తికర ఈవెంట్లలో ఒకటైన పురుషుల 200 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్ అవతరించాడు. బోట్స్వానాకు చెందిన లెట్సిల్ టెబోగో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల టెబోగో 19.46 సెకన్లలో పరుగు పూర్తి చేశాడు. టోక్యోలో రజతం సాధించిన బెడ్నారెక్ (అమెరికా; 19.62 సెకన్లు) ఈసారి కూడా రజతంతో సరి పెట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగు విజేత అయిన మరో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్కు (19.70 సెకన్లు) కాంస్యం దక్కింది. గత ఒలింపిక్స్లోనూ లైల్స్కు కాంస్యమే లభించింది. కోవిడ్తో బాధపడుతూనే బరిలోకి దిగిన లైల్స్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయాడు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికాకు పొరుగున బోట్స్వానా ఉంది. 26 లక్షల జనాభా కలిగిన ఈ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం కావడం విశేషం. గత ఏడాది బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్లో టెబోగో 100 మీటర్లలో రజతం, 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. అతని కెరీర్ ఎదుగుదలలో తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. అయితే అతను ఒలింపిక్ సన్నాహాల్లో ఉన్న సమయంలో 44 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించింది.తన చేతి వేలి గోర్లపై తల్లి పేరు రాసుకొని అతను రేస్లో పాల్గొన్నాడు. పరుగు పూర్తి కాగానే జాతీయ పతాకాన్ని ఒంటిపై కప్పుకున్న టెబోగో భుజాలపై తన రెండు షూస్ వేసుకొని భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అందులో ఒక షూను తీసి అతను కెమెరాకు చూపించాడు. దానిపై అతని తల్లి పేరు, పుట్టిన తేదీ రాసి ఉన్నాయి. ప్రేక్షక సమూహంలో ఉన్న అతని చెల్లెలు కూడా అన్న ప్రదర్శనకు జేజేలు పలకింది. ‘నేను ఒలింపిక్ పతకం గెలవాలని ఆమె ఎంతో కోరుకుంది’ అని టెబోగో చెప్పాడు. మరోవైపు టెబోగో విజయంతో బోట్స్వానా దేశంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయంపై ప్రజలంతా సంబరాలు చేసుకోవాలంటూ దేశాధ్యక్షుడు మాగ్వీట్సీ మసీసీ శుక్రవారం ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించడం విశేషం. -
Olympics: జ్యోతికి మళ్లీ నిరాశ.. సెమీస్ చేరకుండానే..
ప్యారిస్ ఒలింపిక్స్-2024 అథ్లెటిక్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్లోనూ ఆకట్టుకోలేకపోయింది.ఫలితంగా జ్యోతి సెమీస్ ఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డు నెలకొల్పింది.వెనుకంజలో గోల్ఫర్లు ప్యారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు. అంతిమ్పై నిషేధం.. ఖండించిన ఐఓఏభారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై మూడేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన అంతిమ్ తొలి రౌండ్ బౌట్లోనే టర్కీ రెజ్లర్ యెట్గిల్ జెనెప్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) 19 ఏళ్ల అంతిమ్పై కఠిన నిర్ణయం తీసుకునే చాన్స్ కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే అంతిమ్పై నిషేధం విధించినట్లు వస్తున్న వార్తలను గురువారం ఐఓఏ ఖండించింది. -
పారుల్... రెండో‘సారీ’
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో మనవాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే మహిళల 5000 మీటర్ల పరుగులో నిరాశ పరిచిన పారుల్ చౌధరీ 3000 మీటర్ల స్టీపుల్చేజ్లోనూ హీట్స్లోనే వెనుదిరిగింది. ఆదివారం జరిగిన పోటీల్లో పారుల్ 9 నిమిషాల 23.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్స్లో 9వ స్థానంలో నిలిచింది.ఒక్కో హీట్లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత సాధించారు. గమ్యాన్ని చేరేందుకు తన అత్యుత్తమ టైమింగ్ (9 నిమిషాల 15.31 సెకన్లు) కంటే ఎక్కువ సమయం తీసుకున్న పారుల్ ఓవరాల్గా 21వ స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది ఆసియా క్రీడల్లో పారుల్ 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో రజతం, 5000 మీటర్లలో స్వర్ణం సాధించింది. అయితే తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొన్న పారుల్ నిరాశపరిచింది. ఇక పురుషుల లాంగ్జంప్లో జెస్విన్ అల్డ్రిన్ గ్రూప్ ‘బి’లో 13వ స్థానంలో నిలిచాడు. 7.61 మీటర్ల దూరం లంఘించిన జెస్విన్ మొత్తంగా 26వ స్థానంతో ‘పారిస్’ క్రీడల నుంచి ని్రష్కమించాడు. ఈ విభాగంలో 8.15 మీటర్లు దాటిన అథ్లెట్లు ఫైనల్కు అర్హత సంపాదించారు. -
10 వేల మీటర్ల రేసులో చెప్తెగాయ్కు స్వర్ణం
పారిస్: అథ్లెటిక్స్ పురుషుల 10,000 మీటర్ల రేసులో ఉగాండా రన్నర్ జోషువా చెప్తెగాయ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్లో జోషువా 26 నిమిషాల 43.14 సెకన్లలో అందరికంటే వేగంగా 10,000 మీటర్లను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేయడంతోపాటు ‘పారిస్’ గేమ్స్లో ఉగాండాకు తొలి పసిడి పతకాన్ని అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కెనెనిసా బెకెలె (ఇథియోపియా; 27ని:01.17 సెకన్లు) నెలకొల్పిన రికార్డును జోషువా ‘పారిస్’లో సవరించాడు. టోక్యో ఒలింపిక్స్లో రజతం నెగ్గిన జోషువా గత మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచాడు. 2020 వాలెన్సియా మీట్లో చెప్తెగాయ్ 10,000 మీటర్లను 26 నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి తన పేరిట ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఈ ప్రపంచ రికార్డు చెప్తెగాయ్ పేరిటే ఉంది. -
Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో భారత్కు వరుసగా రెండో రోజు నిరాశ తప్పలేదు. మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌధరీ, అంకిత దయాని హీట్స్లోనే వెనుదిరిగారు. భారత్ నుంచి రెండు ఈవెంట్లలో విశ్వక్రీడలకు అర్హత సాధించిన పారుల్ చౌధరీ.. శుక్రవారం జరిగిన రెండో హీట్లో 15 నిమిషాల 10.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 14వ స్థానంతో సరిపెట్టుకుంది.తొలి హీట్లో పోటీపడిన భారత మరో రన్నర్ అంకిత దయాని 20వ స్థానంలో నిలిచింది. అంకిత 16 నిమిషాల 19.38 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. ఒక్కో హీట్ నుంచి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్కు అర్హత సాధించారు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్: దీపికా కుమారి ్ఠ మిచెల్లి క్రాపెన్ (జర్మనీ) (మధ్యాహ్నం గం. 1:52 నుంచి), భజన్ కౌర్ ్ఠ దినంద చోరునిసా (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 2:05 నుంచి) షూటింగ్ మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ రౌండ్: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). మహిళల 25 మీటర్ల పిస్టల్ (పతక పోరు): మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి) బాక్సింగ్ పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్: నిశాంత్ మార్కో వెర్డె (మెక్సికో) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి) సెయిలింగ్పురుషుల డింగీ రేసులు: విష్ణు (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ రేసులు: నేత్ర కుమానన్ (సాయంత్రం గం. 5:55 నుంచి) -
వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తింపుపై సీఎం హర్షం
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్కు వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి గుర్తింపు రావడంపై సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మారథాన్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చ, తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ చైర్మన్ స్టాన్లీ జోన్స్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ కమిటీ మెంబర్ రామ్ కటికనేని సీఎం రేవంత్రెడ్డిని సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆగస్టు 24న జరగనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన మద్దతు ఇస్తామని, మారథాన్లో పాల్గొనే వారందరికీ సీఎం 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.ఇవి చదవండి: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు! -
నడకలో నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజు భారత్కు నిరాశ తప్పలేదు. 20 కిలోమీటర్ల రేస్ వాక్లో మన అథ్లెట్లు ఆకట్టుకోలేకపోయారు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 1 గంటా 39 నిమిషాల 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 41వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించి ఆశలు రేపిన ప్రియాంక... ‘పారిస్’ క్రీడల్లో అదే ప్రదర్శన కనబర్చలేకపోయింది. 28 ఏళ్ల ప్రియాంక తన అత్యుత్తమ ప్రదర్శన (1 గంట 28 నిమిషాల 45 సెకన్లు) కంటే 11 నిమిషాలు వెనుకబడింది. పురుషుల విభాగంలో వికాస్ సింగ్ 30వ స్థానంతో, పరమ్జీత్ సింగ్ 37వ స్థానంతో రేసును ముగించారు. మరో వాకర్ అ„Š దీప్ అనారోగ్యం కారణంగా రేసు పూర్తి చేయలేకపోయాడు. -
నీరజ్ చోప్రా పైనే భారత్ ఆశలు
పారిస్: విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురుచూసే అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు నేడు తెర లేవనుంది. ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు దాటినా.. అసలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్ ఈవెంట్ నేటి నుంచి జరుగుతుంది. భారత అభిమానుల విషయానికొస్తే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే అందరి దృష్టి ఉంది. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో భారత అథ్లెటిక్స్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్ మరోసారి అదే స్థాయి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతుండగా.. భారత్ నుంచి మొత్తం 29 మంది అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ‘టోక్యో’ క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అదే నిలకడ కొనసాగిస్తూ వస్తున్న నీరజ్ వరుసగా రెండో స్వర్ణం నెగ్గాలని తహతహలాడుతున్నాడు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్త్రో క్వాలిఫికేషన్ రౌండ్... రెండు రోజుల తర్వాత 8న ఫైనల్ జరగనుంది. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. రేస్ వాక్తో మొదలు.. అథ్లెటిక్స్లో భాగంగా తొలి రోజు మహిళల, పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి పురుషుల విభాగంలో అ„Š దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్జీత్ సింగ్ బిష్త్ పోటీలో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి ప్రియాంక గోస్వామి బరిలోకి దిగనుంది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాశ్ సాబ్లేపై భారీ అంచనాలు ఉండగా... 4–400 మీటర్ల పురుషుల ఈవెంట్లో మన జట్టు పతక ఆశలు రేపుతోంది. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్లో అవినాశ్ జాతీయ రికార్డు బద్దలు కొట్టి 8 నిమిషాల 9.91 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంలో నిలిచాడు. హర్డిల్స్లో జ్యోతి...రిలేలో జ్యోతిక శ్రీ ఇక ఒలింపిక్స్ చరిత్రలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పాల్గొంటున్న తొలి భారత అథ్లెట్గా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ గుర్తింపు పొందనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలే జట్టులో కీలక సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్తో పాటు 5000 మీటర్ల పరుగులో పాల్గొంటున్న పారుల్ చౌదరి, మహిళల జావెలిన్త్రోలో అన్ను రాణి, పురుషుల షాట్పుట్లో తజిందర్ పాల్సింగ్ తూర్, ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావేల్, అబూబాకర్ నుంచి కూడా మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు. కొత్తగా రెపిచాజ్ రౌండ్.. రెజ్లింగ్, రోయింగ్ మాదిరిగానే ఈసారి నుంచి ఒలింపిక్స్ అథ్లెటిక్స్లోనూ రెపిచాజ్ విభాగాన్ని ప్రవేశ పెట్టనున్నారు. 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల పరుగు వరకు వ్యక్తిగత విభాగాల్లో దీన్ని అమలు చేయనున్నారు. హర్డిల్స్కు కూడా ఇది వర్తించనుంది. గతంలో హీట్స్లో అగ్రస్థానంలో నిలిచిన అథ్లెట్లతో పాటు వేగవంతమైన టైమింగ్ నమోదు చేసుకున్న అథ్లెట్లు సెమీఫైనల్కు చేరేవారు. తాజా రెపిచాజ్ రౌండ్తో హీట్స్లో ముందు నిలిచిన వారు మాత్రమే సెమీస్కు అర్హత సాధిస్తారు. మిగిలిన వాళ్లందరూ రెపిచాజ్ రౌండ్లో పాల్గొంటారు. అందులో సత్తా చాటితే సెమీఫైనల్కు చేరేందుకు రెండో అవకాశం దక్కనుంది. అసలేంటీ రెపిచాజ్ఫ్రెంచ్ భాషలో రెపిచాజ్.. అంటే రెండో అవకాశం అని అర్థం. నిజంగానే ఇది అథ్లెట్లకు సెకండ్ చాన్స్ వంటిదే. ‘పారిస్’ క్రీడల ద్వారా అథ్లెటిక్స్లో ఈ రౌండ్ను మొదటిసారి ప్రవేశ పెట్టనున్నారు. గతంలో మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రెజ్లింగ్ క్రీడల్లో మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు రన్నింగ్, హర్డిల్స్లో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు దీన్ని అమలు చేయనున్నారు. దీంతో తొలి హీట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయిన వారికి సెమీఫైనల్ చేరడానికి మరో అవకాశం దక్కనుంది.3000 మీటర్ల స్టీపుల్చేజ్, 5000 మీటర్ల పరుగులో రెపిచాజ్ రౌండ్ను అనుమతించడం లేదు. ఈ ఈవెంట్లలో పాల్గొన్న అథ్లెట్లు తేరుకునేందుకు మరింత సమయం అవసరమవనుండటంతో.. 1500 మీటర్ల వరకే దీన్ని పరిమితం చేశారు. ఇక పురుషుల, మహిళల 10,000 మీటర్లు, మారథాన్స్లో కేవలం ఫైనల్ మాత్రమే నిర్వహించనున్నారు. మహిళల 4 X400 మీటర్ల రిలే దండి జ్యోతిక శ్రీతొలి రౌండ్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం 2:10 నుంచి ఫైనల్: ఆగస్టు 11 అర్ధరాత్రి గం. 12.44 నుంచి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ జ్యోతి యర్రాజీతొలి రౌండ్: ఆగస్టు 7 మధ్యాహ్నం గం. 1:45 నుంచి రెపిచాజ్ రౌండ్: ఆగస్టు 8 మధ్యాహ్నం గం. 2:05 నుంచి సెమీఫైనల్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం. 3:35 నుంచి ఫైనల్: రాత్రి గం. 11:05 నుంచిజావెలిన్ త్రో షెడ్యూల్ నీరజ్ చోప్రా,కిషోర్ జేనా క్వాలిఫయింగ్: ఆగస్టు 6 మధ్యాహ్నం గం. 1:50 నుంచి ఫైనల్: ఆగస్టు 8 రాత్రి గం. 11:55 నుంచి -
విజయోస్తు!.. పారిస్ ఒలింపిక్స్కు భారత్ బలగం సిద్ధం
గత మూడేళ్లుగా భారత క్రీడాకారులు ఏ లక్ష్యంతోనైతే సాధన చేస్తున్నారో... ఆ ప్రయత్నాలను పతకాల రూపంలో మార్చేందుకు సమయం ఆసన్నమైంది. విశ్వ క్రీడా సంరంభం పారిస్ ఒలింపిక్స్కు రంగంసిద్ధమైంది. శుక్రవారం జరిగే ప్రారం¿ోత్సవం తర్వాత పారిస్ ఒలింపిక్స్ క్రీడలు అధికారికంగా మొదలవుతాయి. అయితే ఫుట్బాల్, రగ్బీ సెవెన్స్ పోటీలు మాత్రం బుధవారమే ఆరంభమయ్యాయి. భారత్ విషయానికొస్తే నేడు ఆర్చరీలో పురుషుల, మహిళల వ్యక్తిగత రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్తో మనోళ్ల సమరానికి తెర లేస్తుంది. ర్యాంకింగ్ రౌండ్లో ఆయా ఆర్చర్లు సాధించిన పాయింట్లు, ర్యాంక్ ఆధారంగానే ఆర్చరీ ప్రధాన పోటీల ‘డ్రా’ను ఖరారు చేస్తారు. కరోనా మహహ్మరి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్ ఒక ఏడాది వాయిదాపడి 2021లో జరగ్గా... భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 127 మంది బరిలోకి దిగారు. 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 7 పతకాలు నెగ్గి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్ పతకాల పట్టికలో 48వ ర్యాంక్లో నిలిచింది. మూడేళ్లు ముగిశాయి. మళ్లీ పారిస్ వేదికగా ఒలింపిక్స్ వచ్చాయి. ఈసారి భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో మొత్తం 117 మంది పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా 29 మంది అర్హత సాధించగా... షూటింగ్లో 21 మంది తమ గురికి పదును పెట్టనున్నారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులపై ఏకంగా రూ. 470 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి భారత క్రీడాకారులు ‘టోక్యో’ ప్రదర్శను అధిగమించి ‘పారిస్’ను చిరస్మరణీయంగా చేసుకోవాలని, పతకాల పంట పండించి స్వదేశానికి తిరిగి రావాలని ఆశిస్తూ... ఆల్ ద బెస్ట్! అథ్లెటిక్స్ (29) పురుషుల విభాగం (18): నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), కిశోర్ జేనా (జావెలిన్ త్రో), అ„Š దీప్ సింగ్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), పరమ్జీత్ సింగ్ బిష్త్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), తజీందర్ పాల్ (షాట్పుట్), అబ్దుల్లా అబూబాకర్ (ట్రిపుల్ జంప్), ప్రవీణ్ చిత్రావెల్ (ట్రిపుల్ జంప్), అజ్మల్ (4్ఠ400 మీటర్ల రిలే), అనస్ (4్ఠ400 మీటర్ల రిలే), అమోజ్ జేకబ్ (4్ఠ400 మీటర్ల రిలే), సంతోష్ తమిళరాసన్ (4్ఠ400 మీటర్ల రిలే), రాజేశ్ రమేశ్ (4్ఠ400 మీటర్ల రిలే), మిజో చాకో కురియన్ (4్ఠ400 మీటర్ల రిలే), జెస్విన్ ఆ్రల్డిన్ (లాంగ్జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్, సూరజ్ పన్వర్ (మారథాన్ మిక్స్డ్ రేస్ వాక్, వికాశ్ సింగ్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), మహిళల విభాగం (11): జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్; ఆంధ్రప్రదేశ్), పారుల్ చౌధరీ (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్, 5000 మీటర్లు), అన్నురాణి (జావెలిన్ త్రో), విత్యా రాంరాజ్ (4్ఠ400 మీటర్ల రిలే), పూవమ్మ రాజు (4x400 మీటర్ల రిలే), దండి జ్యోతిక శ్రీ (4x400 మీటర్ల రిలే; ఆంధ్రప్రదేశ్), శుభా వెంకటేశన్ (4x400 మీటర్ల రిలే), కిరణ్ పహల్ (400 మీటర్లు, 4x400 మీటర్ల రిలే), ప్రాచి (4x400 మీటర్ల రిలే), అంకిత ధ్యాని (5000 మీటర్లు), ప్రియాంక గోస్వామి (20 కిలోమీటర్ల రేస్ వాక్, మిక్స్డ్ మారథాన్). షెడ్యూల్: ఆగస్టు 1 నుంచి 11 వరకుషూటింగ్ (21)పురుషుల విభాగం (10): సరబ్జోత్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్), అర్జున్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్), అర్జున్ బబూటా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్), సందీప్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్), ఐశ్వర్య ప్రతాప్ తోమర్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), స్వప్నిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), విజయ్వీర్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), అనంత్ జీత్ (స్కీట్, స్కీట్ మిక్స్డ్ టీమ్), పృథ్వీరాజ్ (ట్రాప్). మహిళల విభాగం (11): మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్), ఇలవేనిల్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్), సిఫ్ట్ కౌర్ సమ్రా (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), అంజుమ్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), రిథమ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్), ఇషా సింగ్ (25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్; తెలంగాణ), రమిత (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మిక్స్డ్ టీమ్), శ్రేయసి సింగ్ (ట్రాప్), రైజా ధిల్లాన్ (స్కీట్ల్), రాజేశ్వరి (ట్రాప్), మహేశ్వరి (స్కీట్, స్కీట్ మిక్స్డ్ టీమ్). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు హాకీ (16) పురుషుల విభాగం (16): శ్రీజేశ్, హర్మన్ప్రీత్æ, మన్ప్రీత్, హార్దిక్, జర్మన్ప్రీత్, షంషేర్, మన్దీప్, గుర్జంత్, సుఖ్జీత్, కృష్ణ బహదూర్, జుగ్రాజ్, అమిత్ రోహిదాస్, సుమిత్ , వివేక్ ప్రసాద్, అభిõÙక్ , లలిత్, రాజ్కుమార్, సంజయ్, నీలకంఠ శర్మ . షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు టేబుల్ టెన్నిస్ (8)మహిళల విభాగం (4): ఆకుల శ్రీజ (సింగిల్స్, టీమ్; తెలంగాణ), మనిక బత్రా (సింగిల్స్, టీమ్), అర్చన (టీమ్), ఐహిక (టీమ్). పురుషుల విభాగం (4): శరత్ కమల్ (సింగిల్స్, టీమ్), హరీ్మత్ (సింగిల్స్, టీమ్), మానవ్ (టీమ్), సత్యన్ (టీమ్). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు బ్యాడ్మింటన్ (7)పురుషుల విభాగం (4): సాతి్వక్ సాయిరాజ్ (డబుల్స్; ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (డబుల్స్), ప్రణయ్ (సింగిల్స్), లక్ష్య సేన్ (సింగిల్స్). మహిళల విభాగం (3): పీవీ సింధు (సింగిల్స్), అశ్విని పొన్నప్ప (డబుల్స్), తనీషా (డబుల్స్). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు ఆర్చరీ (6)పురుషుల విభాగం (3): బొమ్మదేవర ధీరజ్ (సింగిల్స్, టీమ్, మిక్స్డ్ టీమ్; ఆంధ్రప్రదేశ్), తరుణ్దీప్ (టీమ్), ప్రవీణ్ (టీమ్). మహిళల విభాగం (3): దీపిక (టీమ్), అంకిత (టీమ్), భజన్ (సింగిల్స్, టీమ్, మిక్స్డ్ టీమ్). షెడ్యూల్: జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకుబాక్సింగ్ (6)పురుషుల విభాగం (2): నిశాంత్ దేవ్ (71 కేజీలు), అమిత్ (51 కేజీలు). మహిళల విభాగం (4): నిఖత్ జరీన్ (50 కేజీలు; తెలంగాణ), లవ్లీనా (75 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు రెజ్లింగ్ (6)పురుషుల విభాగం (1): అమన్ (57 కేజీలు). మహిళల విభాగం (5): వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అంతిమ్ (53 కేజీలు), అన్షు (57 కేజీలు), నిషా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు). షెడ్యూల్: ఆగస్టు 5 నుంచి 11 వరకు స్విమ్మింగ్ (2)పురుషుల విభాగం (1): శ్రీహరి నటరాజ్ (100 మీటర్ల బ్యాక్స్ట్రోక్). మహిళల విభాగం (1): ధీనిధి (200 మీటర్ల ఫ్రీస్టయిల్) షెడ్యూల్: జూలై 28 నుంచి 30 వరకు సెయిలింగ్ (2) పురుషుల విభాగం (1): విష్ణు శరవణన్ (ఐఎల్సీఏ–7). మహిళల విభాగం (1): నేత్రా కుమనన్ (ఐఎల్సీఏ–6). షెడ్యూల్: జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఈక్వె్రస్టియన్ (1)పురుషుల విభాగం (1): అనూశ్ అగర్వల్లా (డ్రెసాజ్). షెడ్యూల్: ఆగస్టు 4 ూడో (1)మహిళల విభాగం (1): తులికా మాన్ (ప్లస్ 78 కేజీలు). షెడ్యూల్: ఆగస్టు 2రోయింగ్ (1)పురుషుల విభాగం (1): బల్రాజ్ (సింగిల్ స్కల్స్). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకుటెన్నిస్ (3)పురుషుల విభాగం (3): రోహన్ బోపన్న (డబుల్స్), శ్రీరామ్ బాలాజీ (డబుల్స్), సుమిత్ నగాల్ (సింగిల్స్) షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకుగోల్ఫ్ (4)పురుషుల విభాగం (2): శుభాంకర్, గగన్ జీత్ . మహిళల విభాగం (2): అదితి, దీక్షా . షెడ్యూల్: ఆగస్టు 1 నుంచి 10 వరకువెయిట్లిఫ్టింగ్ (1) మహిళల విభాగం (1): మీరాబాయి చాను (49 కేజీలు). షెడ్యూల్: ఆగస్టు 7 -
వీళ్ల ఆటను చూడాల్సిందే!
జీవితంలో ఒక్కసారి ఒలింపిక్స్లో పోటీపడితేనే తమ జీవితాశయం నెరవేరినట్లు చాలా మంది క్రీడాకారులు భావిస్తారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కొందరు జాతీయ హీరోలుగా ఎదుగుతారు. ఒలింపిక్స్ పేరును ఎప్పుడు ప్రస్తావించినా తమ పేరును కూడా స్మరించుకునే విధంగా చరిత్రకెక్కుతారు. తమ అది్వతీయమైన ప్రదర్శనతో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తారు. ఒలింపిక్స్లో పోటీపడటాన్ని... పతకాలను సాధించడాన్ని... ప్రపంచ రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. మరో రెండు రోజుల్లో మొదలయ్యే పారిస్ ఒలింపిక్స్లోనూ పలు క్రీడాంశాల్లో దిగ్గజాలు మరోసారి తమ విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అందులో కొందరి గురించి క్లుప్తంగా... –సాక్షి క్రీడా విభాగంసిమోన్ బైల్స్ (జిమ్నాస్టిక్స్) మెరుపు తీగలా కదులుతూ... అలవోకగా పతకాలు గెలుస్తూ... ప్రపంచ జిమ్నాస్టిక్స్లో తనదైన ముద్ర వేసింది అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్. 27 ఏళ్ల బైల్స్ వరుసగా మూడో ఒలింపిక్స్లో బరిలోకి దిగనుంది. 4 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న బైల్స్ ఇప్పటి వరకు ఒలింపిక్స్లో 4 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్íÙప్లో 23 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు కైవసం చేసుకుంది. ‘పారిస్’లో బైల్స్ మరో పతకం నెగ్గితే ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన అమెరికన్ జిమ్నాస్ట్గా రికార్డు నెలకొల్పుతుంది. బైల్స్ ఐదు పతకాలు గెలిస్తే... ఒలింపిక్స్ చరిత్రలోనే 12 పతకాలతో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్లలో లారిసా లాతినినా (రష్యా; 18 పతకాలు) తర్వాత రెండో స్థానానికి చేరుకుంటుంది. మిజైన్ లోపెజ్ నునెజ్ (రెజ్లింగ్) గ్రీకో రోమన్ స్టయిల్లో ఎదురులేని దిగ్గజ రెజ్లర్. క్యూబాకు చెందిన 41 ఏళ్ల నునెజ్ వరుసగా ఆరో ఒలింపిక్స్లో పోటీపడుతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు ఒలింపిక్స్లలో స్వర్ణ పతకాలను సాధించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న నునెజ్ పురుషుల గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో మరోసారి టైటిల్ ఫేవరెట్గా ఉన్నాడు. 2004 ఏథెన్స్లో 120 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన నునెజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్లలో 120 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్లలో 130 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలను గెల్చుకున్నాడు. పారిస్ గేమ్స్లోనూ నునెజ్ పతకం సాధిస్తే... ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఐదు స్వర్ణాలు లేదా ఐదు పతకాలు నెగ్గిన ఏకైక రెజ్లర్గా ఘనత వహిస్తాడు. ఎలూడ్ కిప్చోగి (అథ్లెటిక్స్) లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్లో ఆఫ్రికా అథ్లెట్లకు తిరుగులేదు. పారిస్ ఒలింపిక్స్లో కెన్యాకు చెందిన 39 ఏళ్ల ఎలూడ్ కిప్చోగి గతంలో మారథాన్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఐదోసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న కిప్చోగి 2004 ఏథెన్స్ గేమ్స్లో 5000 మీటర్లలో కాంస్యం, 2008 బీజింగ్ గేమ్స్లో 5000 మీటర్లలో రజతం సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్కు అర్హత పొందలేకపోయిన కిప్చోగి ఆ తర్వాత మారథాన్ (42.195 కిలోమీటర్లు) వైపు మళ్లాడు. 2016 రియో ఒలింపిక్స్లో, 2020 టోక్యో ఒలింపిక్స్లో కిప్చోగి విజేతగా నిలిచి రెండు స్వర్ణాలు సాధించాడు. ఈ క్రమంలో అబెబె బికిలా (ఇథియోపియా), వాల్దెమర్ (జర్మనీ) తర్వాత ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో రెండు స్వర్ణాలు నెగ్గిన మూడో అథ్లెట్గా నిలిచాడు. పారిస్లోనూ కిప్చోగి పతకం లేదా స్వర్ణం నెగ్గితే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్గా చరిత్ర సృష్టిస్తాడు. లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్బాల్) ఒలింపిక్స్లో బాస్కెట్బాల్ను 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రీడాంశంలో అమెరికాయే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 1980 మాస్కో ఒలింపిక్స్ను బహిష్కరించిన అమెరికా జట్టు ఇప్పటి వరకు బాస్కెట్బాల్లో 16 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన అమెరికా ఆ తర్వాత వరుసగా నాలుగు ఒలింపిక్స్లలో స్వర్ణాలు సాధించింది. మరో స్వర్ణమే లక్ష్యంగా అమెరికా పారిస్ గేమ్స్లో అడుగు పెడుతుంది. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ చరిత్రలో టాప్ స్కోరర్గా ఉన్న లెబ్రాన్ జేమ్స్ నాలుగోసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో ఆడుతున్న లెబ్రాన్ జేమ్స్ తన సహజశైలిలో ఆడితే ఈసారీ అమెరికాకు ఎదురుండదు. టెడ్డీ రైనర్ (జూడో) పురుషుల జూడో క్రీడాంశంలో 12 సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఫ్రాన్స్ దిగ్గజం టెడ్డీ రైనర్ సొంతగడ్డపై రికార్డుపై గురి పెట్టాడు. వరుసగా ఐదోసారి ఒలింపిక్స్లో పోటీపడుతున్న 35 ఏళ్ల టెడ్డీ రైనర్ ఒలింపిక్స్లో 3 స్వర్ణాలు, 2 కాంస్యాలు సాధించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న టెడ్డీ పారిస్ ఒలింపిక్స్లో మిక్స్డ్ టీమ్తోపాటు హెవీ వెయిట్ విభాగంలో బరిలోకి దిగుతాడు. ఈ రెండు విభాగాల్లోనూ టెడ్డీ స్వర్ణాలు సాధిస్తే ఫ్రాన్స్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా ఐదు స్వర్ణాలు గెలిచిన ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఫ్రాన్స్ ఫెన్సర్లు లూసియన్ గాడిన్, క్రిస్టియన్ డోరియోలా గతంలో ఒలింపిక్స్లో నాలుగు స్వర్ణాల చొప్పున సాధించారు. బైల్స్, లెబ్రాన్ జేమ్స్, కెప్చోగి, టెడ్డీ రైనర్, నునెజ్లే కాకుండా పోల్వాల్టర్ డుప్లాంటిస్ (స్వీడన్), టేబుల్ టెన్నిస్లో మా లాంగ్ (చైనా), స్విమ్మింగ్లో సెలెబ్ డ్రెసెల్ (అమెరికా), కేటీ లెడెకీ (అమెరికా) కూడా పారిస్ ఒలింపిక్స్లో కొత్త చరిత్రను లిఖించే దారిలో ఉన్నారు. వారందరికీ ఆల్ ద బెస్ట్! -
నాన్నకు మెడల్ గిఫ్ట్ గా ఇవ్వాలని..
అమ్మాయి అని వెనకడుగు వేయలేదు. తండ్రి కల నెరవేర్చాలనే తపనతో 11 ఏళ్లుగా కఠోర శ్రమ చేసింది. రన్నింగ్ ట్రాక్లో చీతాలా పరుగు పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించింది. ఇప్పుడు ఒలింపిక్స్ పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది దండి జ్యోతిక శ్రీ. ఉమెన్స్ 400 మీటర్ల రిలే జట్టులో భారత్ తరఫున పోటీ పడటానికి పారిస్ పయనమైంది. తను పుట్టిన తణుకు ప్రాంతానికి ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు సిద్ధమైంది. తణుకు అర్బన్: అథ్లెటిక్స్లో రాణించి అందరి మన్ననలు పొందుతున్న దండి జ్యోతికశ్రీ ఈ నెల 26 నుంచి పారిస్లో జరగనున్న ఒలింపిక్స్లో భారతదేశం తరఫున పోటీ పడుతోంది. ఆగస్టు తొమ్మిదిన జరిగే మహిళల 400 మీటర్ల రిలేలో జ్యోతికశ్రీ సత్తా చాటనుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన జ్యోతికశ్రీ అసామాన్య ప్రతిభతో ఒలింపిక్స్ వరకూ ఎదగడం ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. తమ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఒలింపిక్స్ వరకూ వెళ్లడంతో తణుకు ప్రాంతంలోని ప్రజల ఆనందానికి అవధుల్లేవు. ఒలింపిక్స్లో మెడల్ సాధించి రాష్ట్రానికే కాకుండా దేశానికి పేరు తీసుకువస్తుందని వారంతా ఆకాంక్షిస్తున్నారు. ఇక ఒలింపిక్స్కు ఎంపికైన వెంటనే ఆమెకు రాష్ట్రం నలుమూలల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి. ప్రస్థానమిలా.. బాడీ బిల్డర్గా రాణించాలనుకున్న జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు కోరిక అప్పట్లో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నెరవేరలేదు. తనకు కుమారుడు జన్మిస్తే మిస్టర్ ఇండియాగా తీర్చి దిద్దాలని అనుకున్నారు. అయితే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమార్తె కీర్తి సత్యశ్రీ చదువు పట్ల ఆసక్తి చూపగా.. చిన్న కుమార్తె జ్యోతికశ్రీ చదువు పట్ల మక్కువ చూపిస్తూనే తండ్రి కోరిక మేరకు పాఠశాల స్థాయిలోనే అథ్లెట్గా మారింది. 13 సంవత్సరాల వయసులో తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది.అక్కడ కీర్తిశ్రీ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ కట్లపర్తి సీతారామయ్య తరీ్ఫదులో రాటుదేలింది. స్థానిక మాంటిస్సోరీ స్కూలులో 10వ తరగతి పూర్తిచేసేలోగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు సాధించింది. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతూ అప్పటి ఆంధ్ర చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ కోచింగ్లో అండర్–18 జాతీయ చాంపియన్íÙప్ పోటీల్లో పాల్గొంది. కెన్యాలో నిర్వహించిన యూత్ వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్íÙప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2020లో హైదరాబాద్లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ కోచింగ్లో బ్యాంకాక్, కెన్యాల్లో జరిగిన పోటీలతో పాటు భారతదేశ పలు ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటి పలు స్వర్ణ, రజత పతకాలు సాధించింది. 2022లో ఇండియన్ క్యాంప్లో తర్ఫీదు పొందేలా అర్హత సాధించింది. తాజాగా 2024 మే నెలలో బహమాస్లో నిర్వహించిన వరల్డ్ ఉమెన్స్ రిలేలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా ఒలింపిక్స్కి అర్హత సాధించి యావత్ దేశాన్ని తన వైపు చూసేలా చేసింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 34 మెడల్స్ సాధించగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 50 వరకు మెడల్స్ సాధించింది.నాన్న కోసమే నా పరుగు.. నాన్న కల నెరవేర్చేందుకే నా పరుగు మొదలుపెట్టాను. ఒక కొడుకు ఉంటే తనను క్రీడాకారుడిగా తీర్చిదిద్దేవాడిని అనే నాన్న మాటలు నాలో పట్టుదలను పెంచాయి. దీంతో అథ్లెట్గా ఎదగాలనే దృఢ నిశ్చయంతో సాధన చేశాను. నాన్నతో పాటు మా అమ్మ, అక్క ఇచ్చిన సహకారం, కోచ్లు అందించిన అత్యున్నతమైన సూచనలు, సలహాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాను. ఈ క్రమంలో ఎప్పటికైనా ఒలింపిక్స్కి అర్హత సాధించాలనే సంకల్పంతో ప్రయత్నించాను. భారతదేశం తరఫున ఒలింపిక్స్కు అర్హత సాధించాననే ప్రకటన నాకు చాలా సంతోషాన్నిచ్చి0ది. ఒలింపిక్స్లో పతకం సాధించి నాన్నకు గిఫ్ట్గా ఇవ్వాలని సిద్ధమవుతున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ నా కల నెరవేరింది.. నేను సాధించలేకపోయిన గుర్తింపును నా కుమార్తె సాధించాలనే కృషి, పట్టుదల నాలో పెరిగింది. జ్యోతికశ్రీకి ఐఏఎస్, ఐపీఎస్ వైపు వెళ్లాలని చిన్ననాటి నుంచి ఆశ పడింది. నాకు ఇష్టమైన క్రీడారంగంలోకి వచ్చి నా కోరిక నెరవేర్చేందుకు పట్టుదలతో కృషి చేసింది. దేశం మెచ్చే క్రీడాకారిణిలా తనను తీర్చిదిద్దే క్రమంలో నాకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా నేనెప్పుడూ బెదరలేదు. ఆర్థిక సమస్యలను జయిస్తూ ముందుకు వెళ్లాను. నా కుమార్తె ప్రపంచంతో పోటీపడే స్థాయికి వెళ్లడం ద్వారా నేను కన్న కలలు నిజమయ్యాయి. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే తృప్తి ఇంకేం కావాలి. – దండి శ్రీనివాసరావు, జ్యోతికశ్రీ తండ్రి -
విశ్వ క్రీడలకు భారత్ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది.క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడాకారుల జాబితాలో షాట్ పుట్టర్ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం.అభా పేరు మాయంవరల్డ్ ర్యాంకింగ్ కోటాలో ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో వరల్డ్ అథ్లెటిక్స్ , ఒలింపిక్ పార్టిసిపెంట్స్ లిస్టు నుంచి అభా పేరు మాయమైంది. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.కాగా ప్యారిస్ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళా, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్లో 21 మంది ఉండగా.. హాకీ జట్టులో 19 మంది పేర్లు ఉన్నాయి.ఇక టేబుల్ టెన్నిస్ విభాగంలో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్లో ఏడుగురు, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్ విభాగాల్లో ఆరుగురు చొప్పున, నలుగురు గోల్ఫ్ క్రీడాకారులు, ముగ్గురు టెన్నిస్ ప్లేయర్లు, సెయిలింగ్, స్విమ్మింగ్ నుంచి ఇద్దరు చొప్పున..నాటి పసిడి ప్రత్యేకంఅదే విధంగా.. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్ , వెయిట్లిఫ్టింగ్ విభాగం నుంచి ఒక్కొక్కరు భారత్ తరఫున విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. అత్యధికంగా ఏడు పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పసిడి పతకం అత్యంత గొప్ప జ్ఞాపకం.చదవండి: Paris Olympics:ఆంధ్రా టు పారిస్.. ఆడుదాం ఒలింపిక్స్ -
ప్రవీణ్కు నిరాశ
గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రావెల్ తన అత్యుత్తమ ప్రదర్శన కూడా నమోదు చేయలేకపోయాడు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో 22 ఏళ్ల ప్రవీణ్ 16.45 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు. ఫాబ్రిస్ జాంగో (బుర్కినఫాసో; 17.53 మీటర్లు) స్వర్ణం, యాసిర్ మొహమ్మద్ ట్రికీ (అల్జీరియా; 17.35 మీటర్లు), టియాగో పెరీరా (పోర్చుగల్; 17.08 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. 17.37 మీటర్లతో తన పేరిట ఉన్న జాతీయ రికార్డు ప్రదర్శనను ప్రవీణ్ గ్లాస్గోలో పునరావృతం చేసి ఉంటే అతని ఖాతాలో రజత పతకం చేరేది. గత ఏడాది ఆసియా క్రీడల్లో ప్రవీణ్ (17.68 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
టెహ్రాన్ (ఇరాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్ను 8.12 సెకన్లలో పూర్తి చేసి జ్యోతి మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టడం విశేషం. ఈ ఈవెంట్ హీట్స్ను 8.22 సెకన్లతో అగ్రస్థానంతో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అసుకా టెరెడా (జపాన్ – 8.21సె.), లుయి లై యు (హాంకాంగ్ – 8.21 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి భువనేశ్వర్లోని రిలయన్స్ ఫౌండేషన్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందుతోంది. ఈ చాంపియన్షిప్లో శనివారం మరో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల షాట్పుట్లో తజీందర్పాల్ సింగ్ తూర్ పసిడి గెలుచుకున్నాడు. తన రెండో ప్రయత్నంలో అతను గుండును 19.71 మీటర్లు విసిరి అగ్ర స్థానం సాధించాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో హర్మిలన్ బైన్స్ కనకం మోగించింది. రేస్ను హర్మిలన్ 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది -
అంతర్జాతీయ వుషు ‘ఉత్తమ క్రీడాకారిణి’గా రోషిబినా దేవి
భారత సీనియర్ వుషు క్రీడాకారిణి నరోమ్ రోషిబినా దేవికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికి ఈ మణిపూర్ అమ్మాయి ‘సాండా’ కేటగిరీలో ‘అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణి’ పురస్కారం గెల్చుకుంది. పబ్లిక్ ఓటింగ్లో రోషిబినాకు అత్యధికంగా 93,545 ఓట్లు లభించాయని అంతర్జాతీయ వుషు సమాఖ్య తెలిపింది. 2023 జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున’ అవార్డు గెల్చుకున్న 23 ఏళ్ల రోషిబినా 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022 ఆసియా క్రీడల్లో రజతం సాధించింది. -
ఈ రాంబాబు కథ స్పూర్తిదాయకం.. దినసరి కూలీ నుంచి ఏషియన్ గేమ్స్ పతాకధారిగా..!
హాంగ్ఝౌ వేదికగా జరిగిన 2023 ఏషియన్ గేమ్స్లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్ విభాగంలో మెజార్టీ శాతం పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఈసారి పతకాలు సాధించిన వారిలో చాలామంది దిగువ మధ్యతరగతి, నిరుపేద క్రీడాకారులు ఉన్నారు. ఇందులో ఓ అథ్లెట్ కథ ఎంతో సూర్తిదాయకంగా ఉంది. ఉత్తర్ప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామ్ బాబు దినసరి కూలీ పనులు చేసుకుంటూ ఏషియన్ గేమ్స్ 35కిమీ రేస్ వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మంజూ రాణితో కలిసి కాంస్య పతకం సాధించాడు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని రామ్ బాబు తన అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమయ్యే డబ్బు సమీకరించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినసరి కూలీగా పనులు చేశాడు. కూలీ పనుల్లో భాగంగా తన తండ్రితో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఈ పని చేసినందుకు రామ్ బాబుకు రోజుకు 300 కూలీ లభించేది. Daily wage worker to Asian Games Medallist. Unstoppable courage & determination. Please give me his contact number @thebetterindia I’d like to support his family by giving them any tractor or pickup truck of ours they want. pic.twitter.com/ivbI9pzf5F — anand mahindra (@anandmahindra) October 14, 2023 ఈ డబ్బులో రామ్ బాబు సగం ఇంటికి ఇచ్చి, మిగతా సగం తన ట్రైనింగ్కు వినియోగించుకునే వాడు. రామ్ బాబు తల్లితండ్రి కూడా దినసరి కూలీలే కావడంతో రామ్ బాబు తన శిక్షణ కోసం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడ రామ్ బాబు ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు ఎదిగాడు. ఇతను పడ్డ కష్టాలు క్రీడల్లో రాణించాలనుకున్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఏషియన్ గేమ్స్లో పతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన రామ్ బాబు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పేదరికం అడ్డురాదని రుజువు చేశాడు. అతి సాధారణ రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల్లో అపురూపమైన ఘనత సాధించడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకుని అందరిలో స్ఫూర్తి నింపాడు. తాజాగా ఈ రన్నింగ్ రామ్ బాబు కథ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రను కదిలించింది. రామ్ బాబు కథ తెలిసి ఆనంద్ మహీంద్ర చలించిపోయాడు. అతని పట్టుదలను సలాం కొట్టాడు. నీ మొక్కవోని ధైర్యం ముందు పతకం చిన్నబోయిందని అన్నాడు. రామ్ బాబు ఆర్ధిక కష్టాలు తెలిసి అతన్ని ఆదుకుంటానని ప్రామిస్ చేశాడు. అతని కుటుంబానికి ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించి ఆదుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. Follow the Sakshi TV channel on WhatsApp: -
Asian Games 2023: పతకాల శతకం
కోరినది నెరవేరింది. అనుకున్నట్టే... ఆశించినట్టే... ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్లో 655 మంది సభ్యుల భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు గెలిచింది. మునుపు 2018లో జకార్తా ఏషియన్ గేమ్స్లో సాధించిన 70 పతకాల రికార్డును తిరగరాసింది. ఆసియా క్రీడల పతకాల వేటలో మూడంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే ప్రప్రథమం. శతాధిక పతకాల సాధనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్ర శ్రేణి క్రీడాదేశంగా మనం కూడా స్థానం సంపాదించడం గర్వకారణం. ఈ క్రమంలో అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ళ కథలు స్ఫూర్తిదాయకం. ఈ క్రీడోత్సవాల్లో 201 స్వర్ణాలతో సహా మొత్తం 383 పతకాలతో తిరుగులేని ప్రథమ స్థానంలో చైనా నిలిచింది. 188 మెడల్స్తో జపాన్, 190తో దక్షిణ కొరియా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో–2020 వేసవి ఒలింపిక్స్ లోనూ చైనా, జపాన్లు ఇలాగే పతకాల సాధనలో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నాయి. ప్రపంచస్థాయి ఒలింపిక్స్లోనే అంతటి విజయాలు నమోదు చేసుకున్న ఆ దేశాలు ఇప్పుడు ఆసియా క్రీడోత్సవాల్లోనూ ఇలా ఆధిక్యం కనబరచడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఒలింపిక్స్ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్, తీరా ఏషియాడ్లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి, నాలుగో ర్యాంకులోకి రావడం గణనీయమైన సాధన. మొత్తం 107 పతకాల్లో అత్యధిక పతకాలు (6 స్వర్ణాలతో సహా 29) మనకు అథ్లెటిక్స్లోనే వచ్చాయి. ఆపైన అత్యధికంగా షూటింగ్లో (22 మెడల్స్), ఆర్చరీలో (9), అలాగే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లో మనవాళ్ళు ప్రపంచ శ్రేణి ప్రతిభ కనబరిచారు. హాంగ్జౌలోని ఈ తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశానికి మరో విశేషం ఉంది. ఈ క్రీడల పోరులో సాంప్రదాయికంగా తనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్ లాంటి వాటిల్లోనే కాదు... అనేక ఇతర అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి భారత్ పతకాలు సాధించింది. పట్టున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూనే, ఆటల్లోని ఆసియా అగ్రరాజ్యాలను ఢీ కొని, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రపంచ శ్రేణి ఆటల్లోనూ పతకాలు గెలుచుకుంది. ఇది గమనార్హం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆదివారం ముగిసిన ఈ ఆసియా క్రీడా సంబరంలో మన ఆటగాళ్ళ విజయగీతిక భారత క్రీడారంగంలో అత్యంత కీలక ఘట్టం. కేవలం పతకాల గెలుపు లోనే కాక, క్రీడాజగతిలో మన వర్తమాన, భవిష్యత్ పయనానికీ ఇది స్పష్టమైన సూచిక. క్రీడాంగణంలోనూ మన దేశం వేగంగా దూసుకుపోతూ, రకరకాల ఆటల్లో విశ్వవిజేతల సరసన నిలవాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్న తీరుకు ఇది నిలువుటద్దం. 2018 నాటి ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్ ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకిందంటే, దాని వెనుక ఎందరు క్రీడాకారుల కఠోరశ్రమ, దృఢసంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు ఆటలకు అందించిన ప్రోత్సాహమూ మరువలేనిది. ఆతిథ్యదేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల పాలైంది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఆటగాళ్ళకు తన వీసా విధానంతో అడ్డం కొట్టి, డ్రాగన్ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్ త్రో సహా కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు భారత ఆటగాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడమూ వివాదాస్పదమైంది. తొండి ఆటతో బీజింగ్ తన కుత్సితాన్ని బయటపెట్టుకున్నా, స్థానిక ప్రేక్షకులు ఎకసెక్కాలాడుతున్నా భారత ఆటగాళ్ళ బృందం సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చింది. ఆ విషయం విస్మరించలేం. అందుకే కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా, కొందరు క్రీడాతారలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆటతీరులో నిలకడ చూపలేక పోయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో భారత ప్రదర్శనను అభినందించి తీరాలి. వచ్చే ఏటి ప్యారిస్ ఒలింపిక్స్కు దీన్ని ఉత్ప్రేరకంగా చూడాలి. మునుపటితో పోలిస్తే, క్రీడాజగత్తులో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం సంతో షకర పరిణామం. అలాగని సాధించినదానితో సంతృప్తి పడిపోతేనే ఇబ్బంది. ఇప్పటికీ జనాభాలో, అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనుకబడి ఉన్నాం. అది మర్చిపోరాదు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో పాటు క్రీడావ్యవస్థలోని సవాలక్ష రాజకీయాలు, పెత్తందారీ విధానాలు, క్రీడా సంఘాలను సొంత జాగీర్లుగా మార్చుకున్న నేతలు – గూండాలు మన ఆటకు నేటికీ అవరోధాలు. మహిళా రెజ్లర్లతో దీర్ఘకాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలూ ఉన్నా ఏమీ చేయని స్వార్థ పాలకుల దేశం మనది. అలాంటి చీకాకులు, చిక్కులు లేకుంటే మన ఆటగాళ్ళు, మరీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందుల్లోనూ పతకాల పంట పండిస్తున్న పడతులు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో! ఏషియాడ్లో మనం గెల్చిన 28 స్వర్ణాల్లో 12 మాత్రమే ఒలింపిక్స్ క్రీడాంశాలనేది గుర్తు చేసుకుంటే చేయాల్సిన కృషి, సాధించాల్సిన పురోగతి అవగతమవుతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంతంలోని రైతు కొడుకు, ముంబయ్లో కూరలమ్మే వాళ్ళ కూతురు లాంటి మన ఏషియాడ్ పతకాల వీరుల విజయగాథలెన్నో ఆ లక్ష్యం దిశగా మనకిప్పుడు ఆశాదీపాలు! -
భళా భారత్...
పతకాల్లో తొలిసారి ‘సెంచరీ’ దాటాలనే లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడా బృందం ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈ క్రీడలు ముగియడానికి మరో నాలుగు రోజులు ఉండగా... ఇప్పటికే భారత్ ఖాతాలో 81 పతకాలు చేరాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. పోటీల 11వ రోజు భారత్ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 12 పతకాలు సొంతం చేసుకుంది. మారథాన్ రేసుతో నేడు అథ్లెటిక్స్ ఈవెంట్స్కు తెరపడనున్న నేపథ్యంలో... ఆర్చరీ, క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, స్క్వా‹ష్, బ్రిడ్జ్, చెస్ క్రీడాంశాల్లో భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. హాంగ్జౌ: భారత అథ్లెటిక్స్ ‘పోస్టర్ బాయ్’ నీరజ్ చోప్రా ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిశాడు. సహచరుడు కిశోర్ కుమార్ జేనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో నీరజ్ చోప్రా నుంచి ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది. బుధవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలోకి వెళ్లాయి. డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కిశోర్ కుమార్ జేనా జావెలిన్ను తన మూడోప్రయత్నంలో 86.77 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి వచ్చాడు. అయితే నీరజ్ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 88.88 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ త్రో నమోదు చేశాడు. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కిశోర్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందినా నీరజ్ దూరాన్ని దాటలేకపోయాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో కిశోర్ ఫౌల్ చేసి పాల్గొన్న తొలి ఆసియా క్రీడల్లోనే రజత పతకం గెలిచి సంబరపడ్డాడు. మరోవైపు ఈ ప్రదర్శనతో నీరజ్ వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన రెండో జావెలిన్ త్రోయర్గా గుర్తింపు పొందాడు. గతంలో పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ నవాజ్ (1951, 1954) ఈ ఘనత సాధించాడు. రజత పతకం నెగ్గిన ఒడిశా ప్లేయర్ కిశోర్ కుమార్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. ఒక కోటీ 50 లక్షలు నజరానా ప్రకటించారు. 61 ఏళ్ల తర్వాత రిలేలో స్వర్ణం పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్లో మొహమ్మద్ అనస్, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3ని:01.58 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ విభాగంలో 61 ఏళ్ల తర్వాత భారత్కు మళ్లీ పసిడి పతకాన్ని అందించింది. 1962 ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్, మఖన్ సింగ్, దల్జీత్ సింగ్, జగదీశ్ సింగ్ బృందం చివరిసారి 4్ఠ400 మీటర్ల రిలేలో భారత్కు బంగారు పతకాన్ని అందించింది. మరోవైపు ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశ్, ప్రాచీ, విత్యా రామ్రాజ్లతో కూడిన భారత మహిళల జట్టు 4్ఠ400 మీటర్ల రిలేలో రజత పతకంతో (3ని:27.85 సెకన్లు) సరిపెట్టుకుంది. పురుషుల 5000 మీటర్ల విభాగంలో అవినాశ్ సాబ్లే (13ని:21.09 సెకన్లు) రజత పతకం గెలిచాడు. మహిళల 800 మీటర్ల ఫైనల్ రేసును భారత అథ్లెట్ హర్మిలన్ బైన్స్ 2ని:03.75 సెకన్లలో పూర్తి చేసి రజత పతకంకైవసం చేసుకుంది. 35 కిలోమీటర్ల నడక మిక్స్డ్ విభాగంలో మంజు రాణి, రాంబాబు జోడీ భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. సురేఖ–ఓజస్ జోడీకి స్వర్ణం ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ దేవ్తలే (భారత్) జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలిచింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. మరోవైపు బ్రిడ్జ్ క్రీడాంశంలో పురుషుల టీమ్ విభాగంలో భారత జట్టు ఫైనల్కు చేరి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకోగా... చెస్లో భారత పురుషుల, మహిళల జట్లు రెండో స్థానంలో కొనసాగుతూ పతకాల రేసులో ఉన్నాయి. -
Asian Games 2023: భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. ఆల్టైమ్ రికార్డు
ఏషియన్ గేమ్స్ 2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్ (ముహమ్మద్ అనాస్ యహియా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్) 4X400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 81కి (18 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. ఇవాళ ఉదయమే పతకాల సంఖ్య విషయంలో గత రికార్డును (2018 జకార్తా గేమ్స్లో 70 పతకాలు) అధిగమించిన భారత్.. నీరజ్, ఫురుషుల రిలే టీమ్ స్వర్ణాలతో ఏషియన్ గేమ్స్ ఆల్టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ క్రీడల్లో స్వర్ణాల విషయంలో భారత్ గత రికార్డు 16గా ఉండింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ అత్యధికంగా 16 పతకాలు సాధించింది. తాజా క్రీడల్లో భారత్ స్వర్ణాల విషయంలో ఆల్టైమ్ రికార్డు (18) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ ఇదే జోరును కొనసాగిస్తే 100కు పైగా పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, మెన్స్ రిలే టీమ్ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్యను 81కి పెంచుకుని, పతాకల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 316 పతకాలతో (171 గోల్డ్, 94 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 147 మెడల్స్తో (37, 51, 59) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 148 పతకాలతో (33, 45, 70) మూడో స్థానంలో ఉన్నాయి. -
Asian Games 2023: భారత్ ఖాతాలో 15వ స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. 5000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో ఇవాళ (అక్టోబర్ 3) పారుల్ చౌదరీ స్వర్ణం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 69కి (15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు) చేరింది. నిన్న 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో సిల్వర్ మెడల్ సాధించిన పారుల్ గంటల వ్యవధిలో తన స్వర్ణ కలను నెరవేర్చుకుంది. ఈ పతకంతో పారుల్ చౌదరీ స్వర్ణం నెగ్గిన మూడో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా నిలిచింది. Hangzhou Asian Games: India's Parul Chaudhary wins gold medal in Women's 5000-metre racePhoto source: Athletics Federation of India (AFI) pic.twitter.com/oxyHWYM2qN— ANI (@ANI) October 3, 2023 5000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో తొలుత వెనుకపడిన పారుల్, ఆతర్వాత అనూహ్యంగ పుంజుకుని 15:14.75 సెకెన్లలో రేసును ముగించింది. ఈ ఈవెంట్లో జపాన్ అథ్లెట్ రిరికా హిరోనాకాకు (15:15.34) రజత పతకం లభించగా.. కజకిస్తాన్ అథ్లెట్ కరోలిన్ కిప్కిరుయ్కు (15:23.12) కాంస్యం దక్కింది. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ అంకిత (15:33.03) ఐదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, 69 పతకాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 292 పతకాలతో (159 గోల్డ్, 87 సిల్వర్, 46 బ్రాంజ్) చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 129 పతకాలతో (33, 46, 50) జపాన్ రెండో స్థానంలో, 138 పతకాలతో (32, 42, 64) జపాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. -
Asian Games 2023: పదిహేను పతకాలతో పండుగ
ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.... ఏకంగా 15 పతకాలతో పండుగ చేసుకున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా తొమ్మిది పతకాలు రాగా... షూటింగ్లో మూడు పతకాలు... బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్లో ఒక్కో పతకం లభించాయి. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రీడాకారులు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రజతం, తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కాంస్యం... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యం... తెలంగాణ షూటర్ కైనన్ చెనాయ్ స్వర్ణం, కాంస్యంతో మెరిపించారు. రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ సభ్యులుగా ఉన్నారు. ఎనిమిదో రోజు పోటీలు ముగిశాక భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలను అందుకున్నారు. అటు సీనియర్లు, ఇటు జూనియర్లు కూడా సత్తా చాటడంతో భారత్ ఖాతాలో ఆదివారం ఒక్క అథ్లెటిక్స్లోనే 9 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రేసు విషయంలో కాస్త వివాదం రేగినా... చివరకు రజతంతో కథ సుఖాంతమైంది. తెలంగాణకు చెందిన అగసార నందిని కూడా ఏషియాడ్ పతకాల జాబితాలో తన పేరును లిఖించుకుంది. సత్తా చాటిన సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాశ్ సాబ్లే కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల విభాగంలో గతంలో ఏ భారత అథ్లెట్కూ సాధ్యంకాని రీతిలో స్వర్ణ పతకంతో మెరిసాడు. 8 నిమిషాల 19.50 సెకన్లలో ఈవెంట్ను పూర్తి చేసిన సాబ్లే మొదటి స్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల సాబ్లే ఈ క్రమంలో కొత్త ఆసియా క్రీడల రికార్డును నమోదు చేశాడు. 2018 జకార్తా క్రీడల్లో హొస్సీన్ కేహని (ఇరాన్: 8 నిమిషాల 22.79 సెకన్లు) పేరిట ఉన్న ఘనతను అతను సవరించాడు. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ మహిళల విభాగంలో మాత్రం భారత్ నుంచి 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. తజీందర్ తడాఖా పురుషుల షాట్పుట్లో తజీందర్పాల్ సింగ్ తూర్ సత్తా చాటడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 2018 జకార్తా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న అతను ఈసారి తన మెడల్ను నిలబెట్టుకున్నాడు. ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరిన తజీందర్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అతను ఫౌల్ చేసినా మూడో ప్రయత్నంలో 19.51 మీటర్ల దూరం గుండు వెళ్లింది. తర్వాతి ప్రయత్నంలో దానిని 20.06 మీటర్లతో అతను మెరుగుపర్చుకున్నాడు. ఐదో ప్రయత్నం కూడా ఫౌల్ అయినా... ఆఖరి ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడిని ఖాయం చేసుకున్నాడు. పర్దుమన్ సింగ్, జోగీందర్ సింగ్, బహదూర్ సింగ్ చౌహాన్ తర్వాత వరుసగా రెండు ఆసియా క్రీడల్లో షాట్పుట్ ఈవెంట్లో స్వర్ణం సా ధించిన నాలుగో భారత అథ్లెట్గా తజీందర్ నిలిచాడు. సిల్వర్ జంప్ పురుషుల లాంగ్జంప్లో భారత ఆటగాడు మురళీ శ్రీశంకర్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆగస్టులో బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజతం సాధించిన మురళీ ఇక్కడ ఆసియా క్రీడల్లోనూ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 8.19 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచాడు. జియాన్ వాంగ్ (చైనా–8.22 మీ.), యుహావో షి (చైనా–8.10 మీ.) స్వర్ణ, కాంస్యాలు సాధించారు. వహ్వా హర్మిలన్ 1998 జనవరి... పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి అయిన మాధురి సింగ్ మూడు నెలల గర్భిణి. అయితే క్రీడాకారుల కోటాలో ఉద్యోగం పొందిన ఆమె సంస్థ నిబంధనలు, ఆదేశాల ప్రకారం తన ప్రధాన ఈవెంట్ 800 మీటర్ల నుంచి 1500 మీటర్లకు మారి పరుగెత్తాల్సి వచ్చింది. 1500 మీటర్ల ట్రయల్లో పాల్గొని ఉద్యోగం కాపాడుకున్న మాధురికి ఆరు నెలల తర్వాత పాప పుట్టింది. ఆ అమ్మాయే హర్మిలన్ బైన్స్. నాలుగేళ్ల తర్వాత 2002 ఆసియా క్రీడల్లో మాధురి 800 మీటర్ల పరుగులోనే పాల్గొని రజత పతకం సాధించింది. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత ఆమె కూతురు ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసింది... అదీ 1500 మీటర్ల ఈవెంట్లో కావడం యాదృచ్చికం! ఆదివారం జరిగిన 1500 మీటర్ల పరుగును హర్మిలన్ 4 నిమిషాల 12.74 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. అజయ్కు రజతం, జాన్సన్కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో కూడా భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్ కుమార్ సరోజ్, కేరళ అథ్లెట్ జిన్సన్ జాన్సన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 3 నిమిషాల 38.94 సెకన్లలో అజయ్ రేసు పూర్తి చేయగా, 3 నిమిషాల 39.74 సెకన్లలో లక్ష్యం చేరాడు. ఈ ఈవెంట్లో ఖతర్కు చెందిన మొహమ్మద్ అల్గర్ని (3 నిమిషాల 38.38 సెకన్లు)కు స్వర్ణం దక్కింది. సీనియర్ సీమ జోరు మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిసింది. 2014లో స్వర్ణం, 2018లో కాంస్యం గెలిచిన సీమ ఈసారి కూడా కాంస్య పతకాన్ని తన మెడలో వేసుకుంది. 40 ఏళ్ల సీమ డిస్కస్ను 58.62 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో కామన్వెల్త్ క్రీడల్లోనూ 3 రజతాలు, 1 కాంస్యం నెగ్గిన సీమ ఇవి తనకు ఆఖరి ఆసియా క్రీడలని ప్రకటించింది. ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది. -
ఏషియన్ గేమ్స్లో హైడ్రామా.. రజతంతో సరిపెట్టుకున్న ఆంధ్ర అమ్మాయి
ఏషియన్ గేమ్స్ 2023లో ఇవాళ (అక్టోబర్ 1) హైడ్రామా చోటు చేసుకుంది. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్లో చైనా అథ్లెట్ వు యన్ని నిర్ణీత సమయానికంటే ముందే పరుగు ప్రారంభించి రెండో స్థానంలో నిలిచినప్పటికీ డిస్క్వాలిఫై అయ్యింది. తద్వారా ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీకి రజత పతకం దక్కింది. ఈ పోటీలో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన యర్రాజీ చైనా అథ్లెట్ చేసిన తప్పిదం కారణంగా లయ తప్పి రజతంతో సరిపెట్టుకుంది. చైనా అథ్లెట్ రేస్ ప్రారంభానికి ముందే పరుగు ప్రారంభించగా.. ఆమె పక్కనే ఉన్న జ్యోతి యార్రాజీ సైతం రేస్ అధికారికంగా ప్రారంభమైందని అనుకుని పరుగు మొదలుపెట్టింది. రేస్ పూర్తయిన అనంతరం అంపైర్లు పలు మార్లు రేస్ ఫుటేజ్లను పరిశీలించి, చైనా అథ్లెట్ను అనర్హురాలిగా ప్రకటించారు. ఈ విషయంలో జ్యోతి యర్రాజీ ఉద్దశపూర్వకంగా ఎలాంటి తప్పిదం చేయలేదని నిర్ధారించుకుని ఆమెకు రజతం ప్రకటించారు నిర్వహకులు. ఏదిఏమైనప్పటికీ చైనా అథ్లెట్ చేసిన తప్పిదం కారణంగా మన విశాఖ అమ్మాయి ఏషియన్ గేమ్స్లో స్వర్ణం గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. యర్రాజీ సాధించిన పతకంతో ఏషియన్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 52కు (13 స్వర్ణాలు, 20 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. -
పసిడి టెన్నిస్ శభాష్ స్క్వాష్...
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల మోత కొనసాగుతోంది. శనివారం కూడా నాలుగు వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 5 పతకాలు చేరాయి. స్క్వాష్ టీమ్ విభాగంలో, టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో మన ఆటగాళ్లు పసిడి పంట పండించారు. షూటింగ్లో సాంప్రదాయం కొనసాగిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో రజతం మనకు దక్కింది. ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత అథ్లెట్లు 10 వేల మీటర్ల పరుగులో రజత, కాంస్యాలు అందించారు. వీటికి తోడు మహిళల టేబుల్ టెన్నిస్లో ప్రపంచ చాంపియన్ చైనాకు షాక్ ఇచ్చి మన ప్యాడ్లర్లు సంచలనం సృష్టించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత బృందం తొలిసారి ఫైనల్ చేరింది. ఎప్పటిలాగే హాకీ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా అదనపు ఆనందాన్ని అందించింది. పాకిస్తాన్ను పడగొట్టి... ఎనిమిదేళ్ల తర్వాత స్క్వాష్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 2–1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం సాధించింది. లీగ్ దశలో పాక్ చేతిలో ఓడిన సౌరవ్ ఘోషాల్ బృందం అసలు సమయంలో సత్తా చాటింది. పోరు 1–1తో సమంగా నిలిచిన తర్వాత భారత్ను గెలిపించాల్సిన బాధ్యత యువ ఆటగాడు అభయ్ సింగ్పై పడింది. లీగ్ దశలో తనపై విజయం సాధించిన నూర్ జమాన్తో అభయ్ తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఐదు గేమ్ల పోరులో చివరకు అభయ్ 11–7, 9–11, 8–11, 11–9, 12–10తో జమాన్ను ఓడించాడు. నాలుగో గేమ్లో ఒక దశలో జమాన్ 9–7లో ఆధిక్యం నిలవగా, ఐదో గేమ్లోనూ అతను 10–8తో విజయానికి చేరువయ్యాడు. కానీ అద్భుత పోరాటపటిమ కనబర్చిన అభయ్ రెండు సందర్భాల్లోనూ సత్తా చాటి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. చివరి పాయింట్ తర్వాత భారత జట్టు సభ్యులు భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నారు. అంతకు ముందు తొలి మ్యాచ్లో పాక్ ఆటగాడు ఇక్బాల్ నసీర్ 11–8, 11–2, 11–3తో మహేశ్ మంగావ్కర్పై ఘన విజయం సాధించాడు. అయితే ఆరో సారి ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రెండో మ్యాచ్లో 11–5, 11–1, 11–3తో ముహమ్మద్ ఆసిమ్ ఖాన్ను చిత్తు చేసి స్కోరును సమం చేశాడు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత్ 2018 పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌఆసియా క్రీడలు ‘సిల్వర్’ సరబ్జోత్ – దివ్య భారత షూటర్ సరబ్జోత్ సింగ్ శనివారం తన 22వ పుట్టిన రోజున మరో ఆసియా క్రీడల పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మిక్సడ్ టీమ్ ఈవెంట్లో అతనికి రజతం దక్కింది. మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ – దివ్య టీఎస్ జోడి రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ జోడి జాంగ్ బోవెన్ – జియాంగ్ రాంగ్జిన్ 16–14 తేడాతో సరబ్జోత్ – దివ్యలను ఓడించింది. గురువారమే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన సరబ్జోత్ మరోసారి పసిడిపై గురి పెట్టినా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. దివ్యకు ఇది రెండో రజతం. తాజా ప్రదర్శన తర్వాత ఈ ఆసియా క్రీడల షూటింగ్లో భారత్ పతకాలు సంఖ్య 19కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. సత్తా చాటిన కార్తీక్, గుల్విర్ 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగులో భారత్కు చెందిన గులాబ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐదు ఆసియా క్రీడలు జరిగినా ఈ లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్లో మనకు మెడల్ దక్కలేదు. కానీ శనివారం ఆ లోటు తీరింది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. రజత, కాంస్యాలు రెండూ మన అథ్లెట్లే గెలవడం విశేషం. కార్తీక్ కుమార్కు రజతం దక్కగా, గుల్విర్ సింగ్ కాంస్యం సాధించాడు. కార్తీక్ కుమార్ 28 నిమిషాల 15.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. 28 నిమిషాల 17.21 సెకన్ల టైమింగ్తో గుల్వీర్ మూడో స్థానం సాధించాడు. వీరిద్దరికీ ఈ టైమింగ్లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు కావడం గమనార్హం. ఈ ఈవెంట్లో బహ్రెయిన్కు చెందిన బిర్హాను యమతావ్ (28 నిమిషాల 13.62 సెకన్లు) స్వర్ణపతకం గెలుచుకున్నాడు. మెరిసిన బోపన్న–రుతుజ ద్వయం ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్ను భారత్ రెండు పతకాలతో ముగించింది. శుక్రవారం భారత్కు పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం దక్కగా...శనివారం మన జట్టు ఖాతాలో పసిడి పతకం చేరింది. మిక్స్డ్ డబుల్స్లో భారత జోడి రోహన్ బోపన్న – రుతుజ భోస్లే ద్వయం ఈ ఘనత సాధించారు. పోటాపోటీగా సాగిన ఫైనల్లో బోపన్న – రుతుజ 2–6, 6–3, 10–4 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ హవో – షువో లియాంగ్పై విజయం సాధించారు. భారత్ స్వీయ తప్పిదాలతో భారత్ తొలి సెట్ కోల్పోయినా...ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శనతో మ్యాచ్ను నిలబెట్టుకుంది. రుతుజ పేలవ సర్వీస్తో పాటు లియాంగ్ చక్కటి రిటర్న్లతో తైపీ 5–1తో దూసుకుపోయింది. ఏడో గేమ్లో బోపన్న ఎంత ప్రయత్ని0చినా లాభం లేకపోయింది. అయితే రెండో సెట్లో రుతుజ ఆట మెరుగవడంతో పరిస్థితి మారిపోయింది. బోపన్న సర్వీస్తో సెట్ మన ఖాతాలో చేరగా...మూడో సెట్ సూపర్ టైబ్రేక్కు చేరింది. ఇక్కడా భారత జోడి చక్కటి ఆటతో ముందుగా 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆపై దానిని నిలబెట్టుకుంది. బోపన్నకు ఇది రెండో ఆసియా క్రీడల స్వర్ణం కాగా, రుదుజకు మొదటిది. -
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి భగవతి భవానికి కాంస్యం
చెంగ్డూ (చైనా): ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో బుధవారం భారత్కు రెండు పతకాలు లభించాయి. షూటింగ్లో ఇలవేనిల్ వలారివరన్–దివ్యాంశ్ సింగ్ పన్వర్ జోడీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రజతం సాధించారు. అథ్లెటిక్స్లో మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన భగవతి భవాని యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ ద్వయం 13–17తో యు జాంగ్–బుహాన్ సాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక లాంగ్జంప్ ఫైనల్లో విజయవాడకు చెందిన భవాని యాదవ్ 6.32 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
అదిగో మన పి.టి.ఉష
జూలై 13, గురువారం. బ్యాంకాక్లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 100 మీటర్ల హర్డిల్స్ పోటీ. ట్రాక్ మీద జ్యోతి యర్రాజీ చిరుతలా సిద్ధంగా ఉంది. కాని ఆ రోజు వాతావరణం ఆమె పక్షాన లేదు. వాన పడటం వల్ల ట్రాక్ తడిగా ఉంది. 100 మీటర్ల హర్డిల్స్ను జాతీయ స్థాయిలో 12.82 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సాధించి ఉంది జ్యోతి. ఇప్పుడు అంతకన్నా తక్కువ సమయంలో పూర్తి చేస్తే మరో రికార్డు స్థాపించవచ్చు. పోటీ మొదలైంది. అందరూ వాయువేగంతో కదిలారు. వింటి నుంచి సంధించిన బాణంలా జ్యోతి దూసుకుపోతోంది. హర్డిల్స్ మీదుగా లంఘిస్తూ గాలిలో పక్షిలా సాగుతోంది. కాని 6వ హర్డిల్కు వచ్చేసరికి తడి వల్ల కొద్దిగా రిథమ్ తప్పింది. వెంటనే సర్దుకుని పోటీని 13.09 సెకన్లలో పూర్తి చేసి మొదటిస్థానంలో నిలిచింది. 50 ఏళ్లుగా సాగుతున్న ఆసియా అథ్లెటిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో తొలి స్వర్ణపతకం సాధించిన ఘనమైన రికార్డు ఇప్పుడు జ్యోతి వశమైంది. బుడాపెస్ట్లో జరగనున్న ప్రపంచ చాంపియన్షిప్లో ఎంపికైంది. అక్కడ ప్రతిభ చూపి ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై కావడం కోసం ఇదే 100 మీటర్ల హర్డిల్స్ను 12.77 సెకన్లలో పూర్తి చేయగలిగితే చాలు ఆ పోటీల్లో పాల్గొని ఒలింపిక్స్ విజేతగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే క్రీడాభిమానులు ఆమెపై ఆశలు పెట్టుకున్నారు. ఆమెను హర్షధ్వానాలతో ప్రోత్సహిస్తున్నారు. సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోతి యర్రాజీ విశాఖ పోర్ట్ స్కూల్లో చదువుకుంది. ఆటలు తెలిసిన కుటుంబం కాదు. తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్. తల్లి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయాగా పని చేసేది. వారిరువురికీ కుమార్తెను చదివించడమే ఎక్కువ. స్పోర్ట్స్లో ప్రవేశపెట్టడం కష్టం. కాని జ్యోతి డ్రిల్ పీరియడ్లో తోటి పిల్లలతో పరుగెత్తేది. పాఠశాలకు చేరువలోనే విశాఖ పోర్ట్ స్టేడియం ఉండటంతో అక్కడ సీనియర్ అథ్లెట్ల ప్రాక్టీస్ను పరిశీలించడం దినచర్యగా చేసుకుంది.తొలుత సబ్ జూనియర్ స్థాయిలో అంతర పాఠశాలల అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనేది. 2015 రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి పతకం సాధించడంతో తోటి అథ్లెట్ల సలహాతో హైదరాబాద్లోని స్పోర్ట్స్ హాస్టల్లో కోచ్ రమేష్ వద్ద శిక్షణ పొందింది. ఆమె ఆర్థిక స్థితి చూసి ఊరు వెళ్లాలంటే రమేషే డబ్బు ఇచ్చేవారు. అలాగే ఆమె సీనియర్ కర్నాటపు సౌజన్య (అప్పట్లో సికింద్రాబాద్–లింగంపల్లి రూట్ టి.సిగా పని చేసేది) కూడా ఆర్థికంగా సాయం చేసేది. జూనియర్ స్థాయి వరకే అక్కడ సదుపాయం ఉండటంతో సీనియర్స్ స్థాయిలో గుంటూరులోని అథ్లెటిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి వచ్చింది. విదేశీ కోచ్ల ప్రోత్సాహం దక్కడంతో నేషనల్స్ మెడల్ సాధించగలిగినా సెంటర్ కొనసాగకపోవడంతో అన్వేషణ తిరిగి మొదలైంది. మలుపుతిప్పిన భువనేశ్వర్ అయితే జ్యోతి ప్రతిభ జాతీయ స్థాయిలో తెలియడం వల్ల 2019లో రిలయన్స్ ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్లో నడిచే అథ్లెటిక్స్ హై–పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. 5.9 అడుగుల ఎత్తు, పొడుగు కాళ్లు ఉన్న జ్యోతికి వంద మీటర్ల పరుగుతో పాటు హర్డిల్స్లో కూడా శిక్షణనివ్వడం మొదలు పెట్టాడు ఇంగ్లండ్ నుంచి వచ్చిన కోచ్ జేమ్స్ హిల్లర్. దాంతో కర్ణాటకలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్–యూనివర్శిటీ అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల హర్డిల్స్ను 13.03 సెకన్లతో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది జ్యోతి. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో మరో స్వర్ణం వచ్చింది. 2022 సెప్టెంబర్లో గుజరాత్లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకన్లతో రికార్డు స్థాపించింది. ఇప్పుడు బ్యాంకాక్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ‘ఫాస్టెస్ట్ ఆసియన్ ఉమెన్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ హర్డిల్స్’ రికార్డు స్థాపించింది. ఆమెకు జాతీయ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలియచేశారు. – డాక్టర్ మాడిమి సూర్యప్రకాశరావు, సాక్షి విశాఖ స్పోర్ట్స్ -
పారిస్ ఒలంపిక్స్కు శ్రీశంకర్ అర్హత
బ్యాంకాక్: భారత స్టార్ లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్లో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ (2024)కు అర్హత సాధించాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఈ ఘనత సాధింన తొలి భారత ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో శనివారం జరిగిన పురుషుల లాంగ్జంప్ ఈవెంట్లో అతను రజత పతకం సాధించాడు. 24 ఏళ్ల భారత అథ్లెట్ 8.37 మీటర్ల దూరం దుమికి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన అతని కెరీర్లోనే రెండో ఉత్తమ ప్రదర్శన కాగా... పారిస్ ఈవెంట్ క్వాలిఫికేషన్ మార్క్ (8.27 మీటర్లు)ను అధిగమించాడు. శ్రీశంకర్కు ఇది రెండో ఒలింపిక్స్ కాగా... గత టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధింన అతను క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు. ఈ లాంగ్జంప్లో యు తంగ్ లిన్ (8.40 మీ.; చైనీస్ తైపీ) స్వరం గెలుపొందాడు. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో రాజేశ్ రమేశ్, అమోజ్ జాకబ్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్లతో కూడిన భారత బృందం పసిడి పతకంతో మెరిసింది. ఈ రిలే జట్టు పోటీని 3 నిమిషాల 14.70 సెకన్లలో పూర్తిచేసి కొత్త జాతీయ రికార్డును నిలకొల్పింది. గతంలో 2019 ప్రపంచ చాంపియన్షిప్లో నమోదు చేసిన 3ని.15.77 సె. రికార్డును తిరగరాసింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో మూడో స్థానంలో నిలిచిన సంతోష్ కుమార్ (49.09 సె.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. పురుషుల హైజంప్లో సర్వేశ్ కుశారే 2.26 మీ. ఎత్తు వరకు జంప్ చేసి రజతం గెలిచాడు. మహిళల హెప్టాథ్లాన్లో స్వప్న బర్మన్ 5840 పాయింట్లతో రజతం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ 200 మీటర్ల స్ప్రింట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆమె 23.29 సె. టైమింగ్తో ఫైనల్స్కు అర్హత పొందింది. శనివారం నాటి పోటీల్లో భారత్ ఒక పసిడి, మూడు రజతాలు, ఒక కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్గా ఈ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో 14 (6 స్వరాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు) పతకాలున్నాయి. చదవండి Wimbledon: మహిళల సింగిల్స్లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర -
జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా తెలుగమ్మాయి
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం గతంలో ఏ భారతీయ అథ్లెట్కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ తన తడాఖా చూపించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకంతో మెరిసింది. ఈ క్రమంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్షిప్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్కు అర్హత పొందింది. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్... పురుషుల ట్రిపుల్ జంప్లో అబ్దుల్లా అబూబాకర్ పసిడి పతకాలు నెగ్గారు. బ్యాంకాక్: గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీట్లలో నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందింది. 12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్షిప్లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్షిప్లో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలిపారు. ♦ పురుషుల 1500 మీటర్ల ఫైనల్ రేసును అజయ్ కుమార్ సరోజ్ 3ని:41.51 సెకన్ల లో ముగించి బంగారు పతకాన్ని సాధించా డు. ఈ పోటీల్లో అజయ్కిది మూడో పతకం. 2017లో స్వర్ణం, 2019లో రజతం గెలిచాడు. ♦ పురుషుల ట్రిపుల్ జంప్లో కేరళ అథ్లెట్ అబ్దుల్లా అబూబాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గిన అబూబాకర్ ఆసియా చాంపియన్షిప్లో 16.92 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. ♦ పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఢిల్లీకి చెందిన తేజస్విన్ 7,527 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్ కోసం తీవ్రంగా శ్రమించా. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ఆసియా చాంపియన్షిప్లో నా అత్యుత్తమ సమయాన్ని నమోదు చేస్తానని ఆశించా. అయితే రేసు మొదలయ్యే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డా. ఐదో హర్డిల్లో ఆధిక్యం అందుకోగా, ఆరో హర్డిల్ను కూడా అలవోకగా అధిగమించాను. అయితే ఏడో హర్డిల్ దాటే సమయంలో కాస్త తడబడటంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయా. జపాన్ అథ్లెట్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావించా. పతకాల గురించి ఆలోచించకుండా సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. పలు టోర్నీలలో నేను క్రమం తప్పకుండా 13 సెకన్లలోపు సమయాన్ని నమోదు చేశా. భవిష్యత్లో నా సమయాన్ని మరింత మెరుగుపర్చుకొని మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది. –జ్యోతి యర్రాజీ -
భారత అథ్లెట్లకు మూడు పతకాలు
యెచోన్ (కొరియా): ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తొలిరోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. మహిళల 400 మీటర్ల విభాగంలో రెజోనా మలిక్ హీనా, పురుషుల డిస్కస్ త్రోలో భరత్ప్రీత్ సింగ్ బంగారు పతకాలు సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో అంతిమా పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 16 ఏళ్ల రెజోనా 53.31 సెకన్లలో లక్ష్యానికి చేరింది. భరత్ప్రీత్ డిస్్కను 55.66 మీటర్ల దూరం విసిరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఇక అంతిమ పాల్ 17 నిమిషాల 17.11 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. అరువు ‘పోల్’తో... పోల్ వాల్ట్ ఈవెంట్లో భారత ఆటగాడు దేవ్ కుమార్ మీనాకు నిరాశ ఎదురైంది. ఎయిరిండియా నిర్వాకంతో అరువుతెచ్చిన ‘పోల్’ (పొడవాటి కర్ర)తో పోటీపడాల్సి రావడంతో అతను మూడు ప్రయత్నాల్లోనూ 4.50 మీటర్ల ఎత్తును అందుకోలేకపోయాడు. 18 ఏళ్ల దేవ్ రోజూ ప్రాక్టీసు చేసుకునే పోల్ను ఎయిరిండియా సిబ్బంది సాంకేతిక కారణాలతో అనుమతించలేదు. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్వాహకులకు సమాచారమిచ్చి పోల్ను సమకూర్చాల్సిందిగా కోరింది. -
అంతర్జాతీయ వేదికపై స్వర్ణంతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
కుర్ప్ఫాల్జ్ గాలా ఈవెంట్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మెరిసింది. జర్మనీలో జరిగిన ఈ మీట్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా నిలిచింది. జ్యోతి 12.84 సెకన్లలో గమ్యానికి చేరి తన కెరీర్లో రెండో అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో జ్యోతికిదే తొలి అంతర్జాతీయ పతకం. గత ఏడాది జ్యోతి 12.82 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. -
95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్లో అద్భుతాలు
ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్లో అద్భుతాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా..మెడల్స్ కొట్టాలన్న ఆమె ఆకాంక్ష మరింత ఎక్కువైంది. తాజాగా పోలాండ్లోని టొరున్లో జరిగిన తొమ్మిదో వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్షిప్(World Master Athletics Indoor Championship)లో సత్తా చాటింది. 60 మీటర్ల రన్నింగ్, షాట్పుట్, డిస్క్త్రో ఈవెంట్స్లో భగవానీ దేవి డాగర్ స్వర్ణ పతకాలు సాధించింది.ఈ బామ్మ గతేడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్షిప్లో మెడల్స్ సాధించింది. 2022లో ఒక గోల్డ్, రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. హర్యానాలోని ఖేడ్కా గ్రామానికి చెందిన భగవానీ దేవి డాగర్కు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. 30 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయింది. ఆ తర్వాత రెండో వివాహం చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. అప్పటికే తన నాలుగేళ్ల కూతురు, కడుపులో పెరుగుతున్న మరో బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత అనారోగ్యం తన ఎనిమిదేళ్ల కూతురిని బలి తీసుకుంది. అయితే తాను ధైర్యం కోల్పోకుండా కూలీ, వ్యవసాయ పనులు చేసి కొడుకును పెంచి పెద్ద చేసింది. ఆమె కొడుక్కి ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో క్లర్క్గా ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైంది. కొడుక్కి పెళ్లి చేసిన అనంతరం అథ్లెటిక్స్పై దృష్టి సారించింది. అక్కడి నుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వచ్చిన ఆమె 80 ఏళ్ల వయసులో తొలిసారి 100 మీటర్ల రన్నింగ్లో పాల్గొంది. అక్కడినుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాజాగా 95 ఏళ్ల వయసులో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇక భగవానీ దేవి పెద్ద మనుమడు వికాస్ డాగర్ పారా అథ్లెట్గా రాణిస్తున్నాడు. ఇప్పటికే అథ్లెటిక్స్లో ఎన్నో పతకాలు సాధించిన వికాస్ డాగర్ ఖేల్రత్న అవార్డు గెలుచుకున్నాడు. India's 95-year-old Bhagwani Devi Dagar won 3 gold medals in the 9th World Master Athletics Indoor Championship 2023 at Toruń, Poland. She clinched the medals in 60-meter running, shotput and discus throw. pic.twitter.com/CaR6pj1PRW — ANI (@ANI) March 29, 2023 🙏🙏🙏🙏🙏 https://t.co/IUdldckOOc — ATHLETE BHAGWANI DEVI DAGAR (@BhagwaniDevi94) March 6, 2023 చదవండి: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్గా వచ్చిందా? 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా? -
400 మీ. పరుగుపందెంలో చరిత్ర.. 31 ఏళ్ల రికార్డు బద్దలు
ఇండోర్ అథ్లెటిక్స్ 400మీ. పరుగుపందెంలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. నెదర్లాండ్స్కు చెందిన ఫెమ్కె బోల్ డచ్ ఇండోర్ చాంపియన్షిప్లో గమ్యాన్ని 49.26 సెకండ్లలో చేరుకుని నూతన రికార్డును సృష్టించింది. 1982లో చెక్ అథ్లెట్ జర్మిల అక్రతొచిలోవ నెలకొల్పిన 49.59సె. రికార్డును బోల్ చెరిపేసింది. 22 ఏళ్ల బోల్ విజయంపై హర్షం వ్యక్తంచేస్తూ ఇక్కడ హాజరైన ప్రేక్షకుల ప్రోత్సాహంతో రికార్డును సాధించగలిగానని తెలిపింది. ప్రేక్షకుల హర్షధ్వానాలతో తాను రికార్డును నెలకొల్పినట్లు తెలిసిందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఔట్డోర్లో జర్మనీ అథ్లెట్ మారిట కోచ్ 1985లో నెలకొల్పిన 47.60సె. రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు. ¡Boom! Femke Bol, récord mundial de 400 en pista cubierta. 49.26 en Apeldoorn (Países Bajos) y borra el tope de Kratochvilova. 49.26 Femke Bol (2023) 49.59 Kratochvilova (1982) 49.68 Nazarova (2004) 49.76 Kocembova (1984)pic.twitter.com/RhuWkuBwcE — juanma bellón (@juanmacorre) February 19, 2023 -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్లో 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
సత్తా చాటిన ఆంధ్రా అథ్లెట్లు
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల మూడో జాతీయ క్రీడా పోటీల్లో సోమవారం ఆంధ్రా విద్యార్థులు అథ్లెటిక్స్లో సత్తా చాటారు. విజయవాడ లయోలా కాలేజీ, గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ మైదానాలలో గిరిజన బాలల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. రన్నింగ్, బాడ్మింటన్, కబడ్డీ, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రెండవ రోజు క్రీడల్లో ఆంధ్రాతోపాటు తెలంగాణ క్రీడాకారులు రాణించారు. ముఖ్యంగా మెడల్స్ జాబితాలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇప్పటివరకు తెలంగాణ క్రీడాకారులు వివిధ విభాగాల్లో 27 పతకాలు కైవసం చేసుకున్నారు. వీటిలో 14 స్వర్ణం, 4 రజతం, 9 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 11 పతకాలు దక్కించుకుంది. వీటిలో 2 స్వర్ణాలు, 5 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్ మెడల్స్ జాబితాలో గుజరాత్ 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్కు 6 స్వర్ణం, 3 రజతం, 11 కాంస్య పతకాలున్నాయి. నాగార్జున మైదానంలో.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగిన అథ్లెటిక్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్–19 బాలికల ట్రిపుల్ జంప్లో 9.90 మీటర్లతో రాష్ట్రానికి చెందిన డి.శ్రీజ మొదటి స్థానంలో నిలిచింది. ఇక 9.55 మీటర్లతో తెలంగాణకు చెందిన బొంత స్నేహ రెండో స్థానం, 9.30 మీటర్లతో మూడో స్థానంలో ఏపీకి చెందిన శ్రీవల్లి నిలిచింది. అండర్–14 బాలుర విభాగంలో డిస్కస్ త్రోలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 29.79 మీటర్లతో మొదటి స్థానాన్ని మన రాష్ట్రానికి చెందిన బోయ మహేంద్ర దక్కించుకోగా.. 25.99 మీటర్లతో రెండో స్థానంలో ఏపీకి చెందిన వి.సుశాంత్రెడ్డి, 24.53 మీటర్లతో ఉత్తరాఖండ్కు చెందిన రాజేశ్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. అండర్–19 హై జంప్ బాలుర కేటగిరీలో 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన ఎం.రంజిత్ మొదటి స్థానం, 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన హెచ్.దీపక్ కుమార్ రెండో స్థానం, 1.61 మీటర్లతో పశ్చిమ బెంగాల్కు చెందిన కె.అనిష్ మూడో స్థానం దక్కించుకున్నారు. అండర్–19 800 మీటర్ల రన్నింగ్ బాలుర విభాగంలో ఛత్తీస్గఢ్కు చెందిన అరుణ్ కొవచి 2.05.90 సమయంలో లక్ష్యం చేరి తొలి స్థానంలోను, 2.08.80 సమయంలో లక్ష్యం చేరి ఆంధ్రప్రదేశ్కు చెందిన రంజిత్ కుమార్ రెండో స్థానంలోను, 2.12.30 సమయంలో లక్ష్యం చేరి జార్ఖండ్కు చెందిన అలోక్ మూడో స్థానంలో నిలిచారు. లయోలా క్రీడా మైదానంలో.. విజయవాడ లయోలా క్రీడా మైదానంలో తైక్వాండో అండర్–14 పోటీలు ఆద్యంతం ఉత్సహభరితంగా సాగాయి. 21:23 వెయిట్ బాలుర కేటగిరీ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్కు చెందిన చౌదరి స్మిత్కుమార్పై మధ్యప్రదేశ్కు చెందిన నర్సింగ్ టెకం విజయం సాధించారు. 23:25 వెయిట్ ఫైనల్ మ్యాచ్లో మహారాష్ట్రకు చెందిన రితేష్రాజు వడావ్పై మధ్యప్రదేశ్కు చెందిన హర్ష మేరవి విజయం సాధించారు. బాడ్మింటన్ అండర్–19 కేటగిరీ 52–56 కేజీలలో హిమాచల్ప్రదేశ్పై ఆంధ్రప్రదేశ్ గెలుపొందింది. అండర్–19 కేటగిరీ 57–60 కేజీల విభాగంలో మధ్యప్రదేశ్పై ఆంధ్రప్రదేశ్ గెలుపొందింది. హాకీ బాలుర 7వ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్–కర్ణాటక మ్యాచ్లో 1–0 తేడాతో ఆంధ్రప్రదేశ్ గెలిచింది. జూడో (బాలికలు) అండర్–14 కేటగిరీ ఫ్రీస్టయిల్ 39, 42, 46 విభాగాల్లో జరిగిన మ్యాచ్ల్లో ఆంధ్రప్రదేశ్ బాలికలు విజయం సాధించారు. వాలీబాల్ పోటీల్లోనూ హిమాచల్ప్రదేశ్పై ఏపీ జట్టు విజయకేతనం ఎగురవేసింది. -
పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అథ్లెట్స్ కమిషన్కు ఎన్నిక
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్కు ఎన్నికైంది. ఈ కమిషన్లో పది మంది క్రీడాకారులుంటారు. ఇందులో ఐదుసార్లు ప్రపంచ మహిళా బాక్సింగ్ విజేత మేరీకోమ్, వింటర్ ఒలింపియన్ శివ కేశవన్, మీరాబాయి చాను (వెయిట్లిఫ్టింగ్), గగన్ నారంగ్ (షూటింగ్), వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), రాణి రాంపాల్ (మహిళా హాకీ), భవాని దేవి (ఫెన్సింగ్), భజరంగ్ లాల్ (రోయింగ్), ఓం కర్హన (షాట్పుట్)లు ఉన్నారు. లింగ వివక్షకు తావులేకుండా ఐదుగురు చొప్పున మహిళా, పురుష ప్లేయర్లకు ఐఓఏ కమిషన్లో సమ ప్రాధాన్యత ఇచ్చారు. పది మంది సభ్యులకు గాను సరిపడా నామినేషన్లు వేయడంతో వాళ్లంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐఓఏ వెల్లడించింది. కొత్త ఐఓఏ నియమావళి ప్రకారం ఈ కమిషన్ నుంచి ఇద్దరు సభ్యులు (పురుషుడు, మహిళ) ఐఓఏకు సంబంధించిన వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. ఐఓఏలోని సభ్యులకు ఉన్న ఓటింగ్ హక్కులు కమిషన్లోని ఇద్దరు సభ్యులకు ఉంటాయని ఐఓఏ వర్గాలు వెల్లడించాయి. -
చరిత్ర సృష్టించిన చిన్నారి అథ్లెట్.. విన్యాసాలు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు
36వ జాతీయ క్రీడల్లో గుజరాత్కు చెందిన 10 ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ అనే క్రీడాంశంలో శౌర్యజిత్ కాంస్య పతకం సాధించి.. జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రీడాంశంలో విశేష ప్రతిభ కనబర్చిన శౌర్యజిత్.. అందరినీ మంత్రముగ్దుల్ని చేశాడు. శౌర్యజిత్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నారి విన్యాసాలు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, గుజరాతీ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్కు ఇటీవలే జాతీయ క్రీడల్లో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. 10-year-old Shauryajit Khaire from Gujarat wins Bronze Medal 🥉 in Mallakhamb(Individual Pole); Becomes the youngest Medalist at the #36thNationalGames #Mallakhamb #NationalGames2022 #Shauryajit @Media_SAI @ianuragthakur pic.twitter.com/Oa1OUHeRAj— All India Radio News (@airnewsalerts) October 10, 2022 -
Commonwealth Games 2022: కనకాభిషేకం
బ్రిటిష్ గడ్డపై భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ గీతం మారుమోగింది. కామన్వెల్త్ గేమ్స్లో ఆదివారం భారత క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు పసిడి పతకాలు సాధించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్లో మనోళ్లు బంగారంలాంటి ప్రదర్శన చేయగా... బ్యాడ్మింటన్లో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లి మూడు స్వర్ణ పతకాల రేసులో నిలిచారు. మహిళల హాకీలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పతకం సొంతం చేసుకోగా... టేబుల్ టెన్నిస్లో ఆచంట శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట పురుషుల డబుల్స్లో రజతం పతకంతో మెరిసింది. బర్మింగ్హామ్: పంచ్ పంచ్కూ పతకం తెచ్చి కామనెŠవ్ల్త్ గేమ్స్లో ఆదివారం భారత బాక్సర్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్ పంఘాల్ స్వర్ణ పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్ జరీన్ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్నాల్ (నార్తర్న్ ఐర్లాండ్)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్ రెస్టాన్ (ఇంగ్లండ్)పై... అమిత్ 5–0తో డిఫెండింగ్ చాంపియన్ కియరాన్ మెక్డొనాల్డ్ (ఇంగ్లండ్)పై గెలుపొందారు. తాజా విజయంతో 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో కియరాన్ చేతిలో ఎదురైన ఓటమికి అమిత్ బదులు తీర్చుకున్నాడు. కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్ హుక్, రైట్ హుక్ పంచ్లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్ ప్రత్యర్థి తనపై పంచ్లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్ను కనబరిచింది. ఈ గేమ్స్లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్ నాలుగు బౌట్లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో నిఖత్ పంచ్ల ధాటికి రిఫరీ బౌట్ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్ 5–0తో గెలుపొందింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ రోహిత్ టొకాస్ 2–3తో స్టీఫెన్ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్ (భారత్) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్ ఒరీ (ఇంగ్లండ్)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు. -
అంచనాలకు మించి రాణిస్తున్న భారత అథ్లెట్లు.. రేస్ వాక్లో మరో పతకం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే ఓ స్వర్ణం (పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఎల్దోస్ పాల్), 4 రజతాలు (మెన్స్ లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్, మహిళల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్ఛేజ్లో అవినాష్సాబ్లే, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్), ఓ కాంస్యం (పురుషుల హై జంప్లో తేజస్విన్ శంకర్) సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో పతకం చేజిక్కించుకున్నారు. పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్ ఫైనల్స్లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్యం గెలిచాడు. ఈ రేస్ని 38:49.21 నిమిషాల్లో ముగించిన సందీప్.. మూడో స్థానంలో నిలువగా, కెనడాకు చెందిన ఎవాన్ డన్ఫీ (38:36.37 నిమిషాల్లో) స్వర్ణం, ఆస్ట్రేలియాకు చెందిన డెక్లాన్ టింగే (38:42.33 నిమిషాల్లో) రజతం సాధించారు. ఈ ఎడిషన్లో రేస్ వాక్లో భారత్కి ఇది రెండో మెడల్. మహిళల 10 కిలో మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సాధించింది. సందీప్ బ్రాంజ్తో ప్రస్తుత క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత పతకాల సంఖ్య 7కు, ఓవరాల్గా భారత పతకాల సంఖ్య 46కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 18 కాంస్యాలు) చేరింది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్ పతకాల సంఖ్య ఆరుకు (3 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు)చేరింది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్, ట్రిపుల్ జంప్లో ఎల్దోస్ పాల్ పసిడి పతకాలు సాధించగా.. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్ రజతం, మహిళల హాకీలో కాంస్యం, తాజాగా సందీప్ కుమార్ పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్లో కాంస్యం గెలిచారు. చదవండి: చరిత్ర సృష్టంచిన భారత అథ్లెట్లు.. ట్రిపుల్ జంప్లో స్వర్ణం, రజతం మనవే -
చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లు.. ట్రిపుల్ జంప్లో స్వర్ణం, రజతం మనవే
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే 3 రజతాలు (మెన్స్ లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్, మహిళల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్ఛేజ్లో అవినాష్సాబ్లే), ఓ కాంస్యం (పురుషుల హై జంప్లో తేజస్విన్ శంకర్) సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో రెండు పతకాలు చేజిక్కించుకున్నారు. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఎల్దోస్ పాల్ స్వర్ణం (మూడో ప్రయత్నంలో 17.03 మీటర్లు), ఇదే ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్ రజత పతకం (ఐదో ప్రయత్నంలో 17.02 మీటర్లు) సాధించి కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. వీరిద్దరు ఒకే ఈవెంట్లో గోల్డ్, సిల్వర్ సాధించడంతో భారత్ కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. గతంలో ఈ క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో ఒకే ఈవెంట్లో భారత్ ఎన్నడూ స్వర్ణం, రజతం సాధించింది లేదు. ఇదే ఈవెంట్లో భారత్ కాంస్యం గెలిచే అవకాశాన్ని కూడా తృటిలో చేజార్చుకుంది. ప్రవీన్ చిత్రవేళ్ (16.89మీ, నాలుగో స్థానం) 0.03 మీటర్ల మార్జిన్తో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. బెర్ముడాకు చెందిన జా-నై పెరిన్చీఫ్ 16.92 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం సాధించాడు. ఎల్దోస్ పాల్ స్వర్ణం (కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఆరో స్వర్ణం), అబ్దుల్లా రజతంతో ప్రస్తుత క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరగా, ఓవరాల్గా భారత పతకాల సంఖ్య 45కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు) చేరింది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్ వరుసగా స్వర్ణ పతకాలు సాధిస్తుంది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పతకాలు సాధించారు. తాజాగా ట్రిపుల్ జంప్లో ఎల్దోస్ పాల్ కూడా స్వర్ణం సాధించడంతో ఇవాళ భారత్ ఖాతాలో చేరిన స్వర్ణాల సంఖ్య మూడుకు చేరింది. ఇక ఇదే రోజు భారత్ మరో పతకం కూడా సాధించింది. మహిళల హాకీలో భారత్.. న్యూజిలాండ్పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. చదవండి: మరో పసిడి పంచ్.. బాక్సింగ్లో భారత్కు రెండో స్వర్ణం -
WAC 2022: నిరాశ పరిచిన సబ్లే.. 11వ స్థానంతో ముగించి...
World Athletics Championship 2022: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. అమెరికాలోని ఒరెగాన్లో జరిగిన ఫైనల్ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్షిప్లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. The pride of Morocco! Olympic champion Soufiane El Bakkali 🇲🇦 runs 8:25.13 to claim world gold and confirms his 3000m steeplechase dominance 💪#WorldAthleticsChamps pic.twitter.com/Ym2CVrdv1B — World Athletics (@WorldAthletics) July 19, 2022 -
నితిన్కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్– 20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇస్లావత్ నితిన్ నాయక్ రెండు పతకాలు సాధించాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో నితిన్ నాయక్ పురుషుల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం, 200 మీటర్ల విభాగంలో రజత పతకం గెల్చుకున్నాడు. కోచ్ నేనావత్ వినోద్ వద్ద శిక్షణ పొందుతున్న నితిన్ నాయక్ 100 మీటర్లను 10.9 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 200 మీటర్ల రేసును నితిన్ 22.4 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో నితిన్ వచ్చే నెల 2 నుంచి 4 వరకు గుజరాత్లో జరగనున్న జాతీయ అండర్–20 ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టులోకి ఎంపికయ్యాడు. -
ప్రపంచ అథ్లెటిక్స్ డే.. ఎలా మొదలైదంటే!
మానవ మనుగడ మొదలైందే అథ్లెట్గా అంటే అతిశయోక్తి కాదు. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం ప్రారంభించాడు. మెరుగైన జీవనం కోసం పరుగెత్తాడు. ఆహార అన్వేషణలో భాగంగా విసిరాడు.. దుమికాడు. ఇవన్నీ మనిషి జీవన గమనాన్ని ఊహించలేని స్థితికి చేర్చాయి. నడవడం, పరుగెత్తడం, దుమకడం, విసరడం అనేవి అథ్లెటిక్ ట్రాక్, ఫీల్డ్ అంశాలైనా.. ప్రతి క్రీడలోనూ ప్రాథమిక అంశాలు. క్రీడాకారుడి(అథ్లెట్)గా ఎదిగేందుకు శిక్షణలో శారీరక బలం, చురుకుదనం, నైపుణ్యం ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి అథ్లెట్గా పిల్లలు, యువతలో ఫిట్నెస్ ప్రాముఖ్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఏటా మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం జరుపుకుంటారు. అథ్లెటిక్ ఫర్ ఏ బెటర్ వరల్డ్.. మనిషి ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగానే ఉంటుంది అనే నానుడిని నిజం చేయాలని 1996లో తొలిసారిగా ప్రపంచ అథ్లెటిక్స్ డే ను అంతర్జాతీయ అథ్లెటిక్ అమెచ్యూర్ సమాఖ్య ప్రారంభించింది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా సర్వమానవాళి ఆరోగ్యంగా ఉండాలనేది ఈ డే ప్రధాన లక్ష్యం. అథ్లెటిక్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేది ఐఏఏఎఫ్ ప్రధాన నినాదం. (క్లిక్: భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?) యువత, క్రీడ, పర్యావరణం ఏ దేశానికైనా యువతే ప్రధాన వనరు. అలాంటి యువత ఆరోగ్యం, ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దేదే క్రీడ. ఏ క్రీడలోనైనా ప్రావీణ్యం సాధించడానికైన మౌలికంగా అవసరమయ్యే శక్తి, సామర్థ్యాలకు పర్యావరణ పరిరక్షణ తోడైతే ఆ దేశ ఖ్యాతి ఇనుమడిస్తుంది. పురాతన ఒలింపిక్ క్రీడల్లో అగ్రభాగం జంప్, జావెలిన్, డిస్కస్లతో పాటు పరుగుదే. బాక్సింగ్, రథాల పోటీలతో పాటు మల్లయుద్ధం ఉండేవి. ప్రపంచ క్రీడా వేదికైన ఆధునిక ఒలింపిక్స్లో పతకం సాధించడం ప్రతి క్రీడాకారుడి కల. ఒలింపిక్స్లో సైతం అత్యధిక పతకాలు(48 బంగారు పతకాలు) అథ్లెటిక్స్లోనే అందిస్తారు. -
పరుగుల చిరుత.. శిక్షకుడిగా సత్తా చాటి..
నేలకొండపల్లి: అతనిలో చిరుతలోని వేగం ఉంది. పరుగు మొదలు పెడితే గమ్యం చేరే దాక విశ్రమించడు. పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సుర్దేపల్లి గ్రామానికి చెందిన తోళ్ల స్థాయి. అతనికి చిన్న తనం నుంచే పరుగు పందేలు అంటే ఆసక్తి. దమ్మపేట గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశం పొంది రాధాకృష్ణ వద్ద అథ్లెటిక్స్లో శిక్షణ పొందారు. యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కర్ణాటక ఆధ్వర్యంలో 2016లో నిర్వహించిన అఖిలభారత విశ్వ విద్యాలయం తరపున క్రాస్ కంట్రీ 12 కిలో మీటర్ల పరుగు పందెంలో కాకతీయ విశ్వవిద్యాలయము తరుపున పాల్గొన్నారు. కాకినాడలో నిర్వహించిన సౌత్ జోన్ పోటీలో పాల్గొని సత్తా చూపారు. అలాగే జాతీయ క్రీడా సంస్థలు నిర్వహించిన పోటీలో పాల్గొని బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. శిక్షకుడిగా సత్తా చాటి.. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న సాయి అథ్లెటిక్స్ కోచ్ గా గుర్తింపు పొందారు . పటియాల నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్స్ శిక్షకుడిగా ట్రైనింగ్ తీసుకున్నారు. దోమలగూడా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయ కాలేజీ నుంచే డిప్లమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ లో శిక్షణ పొందారు. ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ టెక్నికల్ అఫీషియల్స్ 2019 లో చోటు సాధించారు. గ్రామస్థాయి యువతకు శారీరక దృఢత్వం క్రీడాస్ఫూర్తిని అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.వేసవి శిబిరాలు నిర్వహిస్తూ. ప్రతి ఏటా వేసవికాలంలో జిల్లాలోని విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా శిక్షణ ఇచ్చారు. శిబిరాలను నిర్వహిస్తున్నారు. పాల్గొన్న యువతకు అథ్లెటిక్స్ లో శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. జుంప్స్ అండ్ త్రోస్ విభాగంలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. పలుమార్లు 2కే, 3కే రన్లు నిర్వహించారు. ప్రతిభావంతులను తయారు చేయడమే లక్ష్యం గ్రామస్థాయిలో చాలామంది క్రీడాకారులు ఉంటారు. వారికి సరైన అవకాశాలు లేక , శిక్షణ లేక ఎందరో క్రీడాకారులు మరుగున పడుతుంటారు.పాఠశాల స్థాయి నుంచి క్రీడా శక్తిని పెంపొందించి ప్రతిభావంతులైన క్రీడాకారుల ను తయారు చేయడమే నా లక్ష్యం. -తోళ్ల సాయి, అథ్లెటిక్స్ కోచ్ -
పతకాల వేటకు విరామం
టోక్యో: వరుసగా మూడు రోజులపాటు టోక్యో పారాలింపిక్స్లో పతకాల పంట పండించిన భారత దివ్యాంగ క్రీడాకారులు బుధవారం నిరాశపరిచారు. షూటింగ్, అథ్లెటిక్స్లో మెడల్ ఈవెంట్స్లో పోటీపడిన భారత అథ్లెట్స్ పతకాలు నెగ్గలేకపోయారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్హెచ్–1 విభాగం క్వాలిఫయింగ్లో పోటీపడిన అవనీ లేఖరా 629.7 పాయింట్లు స్కోరు చేసి 27వ స్థానంలో నిలిచింది. భారత్కే చెందిన ఇతర షూటర్లు సిద్ధార్థ బాబు 625.5 పాయింట్లతో 40వ స్థానంలో... దీపక్ కుమార్ 624.9 పాయింట్లతో 43వ స్థానంలో నిలిచారు. సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని స్వర్ణం గెలిచి పారాలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అథ్లెటిక్స్లో పురుషుల ఎఫ్–51 డిస్కస్/క్లబ్ త్రో విభాగంలో పోటీపడిన భారత క్రీడాకారులు అమిత్ కుమార్, ధరమ్బీర్ నిరాశపరిచారు. అమిత్ డిస్క్ను 27.27 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో, ధరమ్బీర్ డిస్క్ను 25.59 మీటర్ల దూరం విసిరి ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్ ఎస్బీ–7 ఈవెంట్ ఫైనల్లో పోటీపడిన భారత స్విమ్మర్ సుయశ్ జాదవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈత కొట్టి డిస్క్వాలిఫై అయ్యాడు. బ్రెస్ట్స్ట్రోక్ ఈవెంట్ రేసు మొదలుపెట్టాక మలుపు వద్ద ఒక్కసారి మాత్రమే బటర్ఫ్లయ్ కిక్ చేయాలి. కానీ సుయశ్ ఒకటికంటే ఎక్కువసార్లు చేయడంతో అతడిపై అనర్హత వేటు వేశారు. బుధవారం పోటీలు ముగిశాక భారత్ 10 పతకాలతో 34వ స్థానంలో ఉంది. -
నిశాద్ సూపర్ జంప్...
పురుషుల అథ్లెటిక్స్ హైజంప్లో 21 ఏళ్ల నిశాద్ కుమార్ భారత్కు రజత పతకాన్ని అందించాడు. టి–47 విభాగంలో నిశాద్ 2.06 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఆసియా రికార్డు కూడా నెలకొల్పాడు. డాలస్ వైజ్ (అమెరికా) కూడా 2.06 మీటర్ల ఎత్తుకు ఎగరడంతో అతనికి కూడా రజతం లభించింది. రోడెరిక్ టౌన్సెండ్ (అమెరికా) 2.15 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. చేయి లేకపోతేనేం... మన దైనందిన పనులు చక్కబెట్టేదే కుడి చేయి. అలాంటి చేతినే కోల్పోతే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎంత కష్టమైనా, ఓ చేయి లేకపోయినా పతకం గెలవడం నిజంగా విశేషమే కదా! హిమాచల్ ప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల నిశాద్ కుమార్ అదేపని చేశాడు. నిశాద్ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఉనా జిల్లాలోని అంబ్ గ్రామంలో సాగుబడే వారి జీవనాధారం. 8 ఏళ్ల వయసులో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన నిశాద్ గడ్డికోసే యంత్రంలో గడ్డిని కత్తిరిస్తుండగా కుడి చేయి తెగిపడింది. అప్పుడు విలవిల్లాడిన ఆ బాలుడు రెండేళ్లకే క్రీడాశిక్షణపై దృష్టిపెట్టాడు. స్కూల్ గ్రౌండ్లో హైజంప్లో ప్రాక్టీస్ చేసేవాడు. జాతీయ స్కూల్ గేమ్స్లో ఏకంగా సాధారణ అథ్లెట్లతో పోటీపడి పదో స్థానంలో నిలిచాడు. పాఠశాల విద్య అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పంచ్కులాలోని దేవిలాల్ స్టేడియంలో హైజంప్లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడే నిశాద్ పారాథ్లెట్గా ఎదిగాడు. 2019లో తొలి సారి దుబాయ్లో పోటీపడ్డాడు. అక్కడ జరిగిన ఫజార్ పారాథ్లెటిక్స్ గ్రాండ్ప్రిలో అతను టి47 కేటగిరీ హైజంప్లో 1.92 మీటర్లు జంప్ చేసి విజేతగా నిలిచాడు. అనంతరం అక్కడే జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో 1.94 మీటర్ల జంప్తో కాంస్యం సాధించాడు. దీంతోనే టోక్యో పారాలింపిక్స్ కోటా దక్కింది. గత ఏడాది కాలంగా రెండుసార్లు కోవిడ్ బారిన పడినా కూడా ప్రాక్టీస్ను అలక్ష్యం చేయలేదు. నాలుగు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అనుభవంతో తాజాగా దివ్యాంగుల విశ్వక్రీడల్లో రజత పతకం గెలిచాడు. -
ఇక పద... పారాలింపిక్స్కు!
న్యూఢిల్లీ: నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్ను చిరస్మరణీయం చేసుకున్న భారత్ అదే వేదికపై మళ్లీ పతకాల వేటకు వెళ్లింది. పారాలింపిక్స్లో పాల్గొనేందుకు 54 మంది సభ్యులతో కూడిన భారత జట్టు గురువారం అక్కడికి బయల్దేరింది. టోక్యోలోనే ఈ నెల 24 నుంచి దివ్యాంగ విశ్వక్రీడలు జరుగనున్నాయి. భారత ఆటగాళ్లు పోటీ పడే ఈవెంట్లు 27న మొదలవుతాయి. ముందుగా ఆర్చరీ పోటీలు జరుగుతాయి. పారాలింపిక్ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్–46 జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (టి–63 హైజంప్), ప్రపంచ చాంపియన్ సందీప్ చౌదరి (ఎఫ్–64 జావెలిన్ త్రో) ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. దేవేంద్ర మూడో స్వర్ణంపై కన్నేశాడు. తను ఇదివరకే ఏథెన్స్(2004), రియో (2016) పారాలింపిక్స్లో బంగారు పతకాలు నెగ్గాడు. గత పారాలింపిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది. మన జట్టు దిగ్విజయంగా పతకాలతో తిరిగి రావాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత పారాలింపిక్ సంఘం అధికారులు గురువారం జరిగిన ‘వర్చువల్ సెండాఫ్’ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగనంపారు. -
అతను మనోడు కాడు.. అథ్లెటిక్స్లో నీరజ్దే తొలి స్వర్ణం
టోక్యో: 1900 పారిస్ ఒలింపిక్స్లో బ్రిటీష్–ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్లో 2 రజత పతకాలు (200 మీ.పరుగు, 200 మీ.హర్డిల్స్) సాధించాడు. అయితే పేరుకు భారత్కు ప్రాతినిధ్యం వహించాడని చెబుతున్నా, నాటి బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో, స్వాతంత్య్రానికి 47 ఏళ్ల ముందు సాధించిన ఈ విజయానికి భారతీయత ఆపాదించడంలో అర్థం లేదు. అందుకే నీరజ్ సాధించిన స్వర్ణమే అథ్లెటిక్స్లో మన దేశానికి దక్కిన మొదటి పతకంగా భావించాలి. నిజానికి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) 2005లో ప్రచురించిన అధికారిక ట్రాక్ అండ్ ఫీల్డ్ గణాంకాల్లో గ్రేట్ బ్రిటన్ తరఫునే ప్రిచర్డ్ పాల్గొన్నట్లుగా పేర్కొంది. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మాత్రం తమ ఒలింపిక్ పతకాల జాబితాలో ప్రిచర్డ్ ప్రదర్శనను భారత్ ఖాతాలోనే ఉంచింది! -
ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటికీ తీరని లోటు.. కమల్ప్రీత్ తీర్చేనా!
అంతా సవ్యంగా సాగితే... ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటివరకు భారత్కు లోటుగా ఉన్న అథ్లెటిక్స్ పతకం ఈరోజు లభించే అవకాశముంది. మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి కమల్ప్రీత్ కౌర్ నేడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పంజాబ్కు చెందిన 25 ఏళ్ల కమల్ప్రీత్ క్వాలిఫయింగ్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా పతకంపై ఆశలు చిగురించాయి. క్వాలిఫయింగ్లోని తన గ్రూప్ ‘బి’లోనే కాకుండా ఓవరాల్గా కూడా కమల్ప్రీత్ రెండో స్థానంలో నిలువడంతో ఆమెపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం నేటి ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడతారు. ఒక్కొక్కరికి డిస్క్ను విసిరేందుకు మూడు అవకాశాలు ఇస్తారు. డిస్క్ను ఎక్కువ దూరం విసిరిన ముగ్గురికి వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ సాండ్రా పెర్కోవిచ్ (క్రొయేషియా)... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వైమి పెరెజ్ (క్యూబా) క్వాలి ఫయింగ్లో కమల్ప్రీత్ కంటే వెనుకబడ్డారు. కమల్ప్రీత్ డిస్క్ను 64 మీటర్ల దూరం విసిరితే... సాండ్రా పెర్కోవిచ్ 63.75 మీట ర్లు... వైమి పెరెజ్ 63.18 మీటర్లు విసి రారు. వలారీ అల్మన్ (అమెరికా) 66.42 మీటర్లు విసిరి క్వాలిఫయింగ్లో తొలి స్థానంలో నిలిచింది. అయితే అగ్రశ్రేణి అథ్లెట్స్ క్వాలిఫయింగ్లో కంటే ఫైనల్లోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తారు. ఈ నేపథ్యంలో ఫైనల్ ఆసక్తికరంగా సాగే అవకాశముంది. -
అథ్లెటిక్స్ తొలి స్వర్ణం ఇథియోపియా ఖాతాలో
టోక్యో: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లో తొలి స్వర్ణ పతకం ఇథియోపియా ఖాతాలోకి వెళ్లింది. శుక్రవారం అథ్లెటిక్స్ ఈవెంట్స్ ప్రారంభంకాగా... పురుషుల 10,000 మీటర్ల ఫైనల్ జరిగింది. ఇందులో ఇథియోపియా అథ్లెట్ సెలెమన్ బరేగా అందరికంటే ముందుగా 27 నిమిషాల 43.22 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచాడు. వరల్డ్ చాంపియన్, వరల్డ్ రికార్డు తన పేరిట లిఖించుకున్న కెన్యా అథ్లెట్ జోషువా చెప్తెగె (ఉగాండా) రజతం పతకంతో సరిపెట్టుకున్నాడు. చెప్తెగె 27 నిమిషాల 43.63 సెకన్లలో గమ్యానికి చేరాడు. శనివారం మహిళల 100 మీటర్ల సెమీఫైనల్స్తోపాటు ఫైనల్ ను నిర్వహిస్తారు. మహిళల 100 మీటర్ల ఫైనల్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు జరుగుతుంది. పురుషుల డిస్కస్త్రో, 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఫైనల్స్ కూడా జరుగుతాయి. -
‘పాజిటివ్’తో పోల్వాల్ట్ వరల్డ్ చాంపియన్ అవుట్
ఒలింపిక్స్లో శుక్రవారం అథ్లెటిక్స్ ఈవెంట్స్ ప్రారంభం కానుండగా... అమెరికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల పోల్వాల్ట్లో 2017, 2109 వరల్డ్ చాంపియన్గా నిలిచిన స్యామ్ హెండ్రిక్స్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దాంతో అతను ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. హెండ్రిక్స్కు సన్నిహితంగా మెలిగిన ఆస్ట్రేలియా అథ్లెట్లు కూడా ఐసోలేషన్లోకి వెళ్లారు. అథ్లెటిక్స్ ఈవెంట్ తొలి రోజు పురుషుల 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం కోసం పోటీ జరుగుతుంది. -
సత్తా చాటిన రాగవర్షిణి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో బి. రాగవర్షిణి అద్భుత ప్రదర్శన కనబరిచింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన అండర్–16 బాలికల 100మీ., 200మీ., పరుగులో ఆమె విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకుంది. 100మీ. పరుగును 13.5 సెకన్లలో పూర్తి చేసిన ఆమె పసిడి పతకాన్ని అందుకోగా... జషిత సుంకరి (14.5సె.) రజతాన్ని, కీర్తన (15.2 సె.) కాంస్యాన్ని గెలుచుకున్నారు. 200మీ. పరుగులో రాగవర్షిణి ( 27.5 సె.), జషిత (30.9సె.), కీర్తన (32.4సె.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–16 బాలికల 400మీ. : 1. దివ్య, 2. ఆర్నవి, 3. సత్యశ్రీ; 800మీ.: 1. పి. శ్రీయ, 2. ఆర్నవి, 3. నైనిత రావు; డిస్కస్ త్రో: 1. సునయన, 2. పవిత్ర, 3. వేదప్రియ; షాట్పుట్: 1. నవ్య, 2. వేద ప్రియ, 3. పవిత్ర; లాంగ్జంప్: 1. పవిత్ర, 2. సత్యశ్రీ ఆశ్రిత, 3. క్షీరజ. అండర్–14 బాలికల 100మీ. పరుగు: 1. కృతి, 2. కియోనా, 3. విభారావు; 600మీ. పరుగు: 1. యువిక, 2. సంజన, 3. ప్రీతి తివారీ; లాంగ్జంప్: 1. సుగంధి, 2. తార, 3. ఖుష్బూ. అండర్–18 బాలికల 100మీ. పరుగు: 1. రియా గ్రేస్, 2. అనన్య, 3. శ్రుతి; 200మీ. పరుగు: 1. రియా గ్రేస్, 2. ప్రేరణ, 3. నిషిత; 800మీ. పరుగు: 1. నిషిత, 2. నందిని, 3. అక్షిత; షాట్పుట్: 1. కరిష్మా, 2. శ్రుతి తివారీ; లాంగ్జంప్: 1. అనన్య, 2. నందిని, 3. అక్షిత; అండర్–14 బాలుర 100మీ. పరుగు: 1. అనిరుధ్, 2. జాన్ డేవిడ్, 2. చోటు సింగ్; 600మీ. పరుగు: 1. అరవింద్, 2. చోటు సింగ్, 3. జాన్ డేవిడ్; షాట్పుట్: 1. వ్రజ్రాజ్, 2. ఆదిత్య, 3. అమిత్ కుమార్. అండర్–18 బాలుర షాట్పుట్: 1. దత్త ప్రసాద్, 2. అభినయ్, 3. శివదత్త; 100మీ. పరుగు: 1. శశాంక్, 2. మనో వెంకట్, 3. చాంద్బాషా; 400మీ. పరుగు: 1. శ్రీకాంత్, 2. హవిశ్, 3. ఆశిష్. -
ఆది@ అథ్లెట్
వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంతో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ పతాకంపై ఐబీ కార్తికేయన్ నిర్మించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ కథను రాసుకుంటున్నంత సేపు నా మనసులో ఆదిగారే మెదిలారు. కథ విన్న ఆయన చేస్తానని చెప్పగానే నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. ఆయనతో పని చేయడానికి ఉత్సాహంగా ఉంది. అథ్లెటిక్స్ (క్రీడాకారులు)కు సంబంధించిన కథ ఇది. తన కలను సాకారం చేసుకోవడానికి కథానాయకుడు చేసిన ప్రయత్నం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం. త్వరలోనే ఇతర వివరాలు చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్), కెమెరా: ప్రవీణ్ కుమార్. -
భారత్కు ఐదు స్వర్ణాలు
హాంకాంగ్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పోటీల రెండో రోజు శనివారం భారత్కు ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు వచ్చాయి. బాలుర 10 వేల మీటర్ల నడక విభాగంలో విశ్వేంద్ర సింగ్ 44 నిమిషాల 9.75 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం గెలిచాడు. పరమ్జీత్ సింగ్ బిష్త్ (44ని:21.96 సెకన్లు) కాంస్యం సాధించాడు. డెకాథ్లాన్లో ఉసైద్ ఖాన్ 6952 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అన్సార్ అలీ (5943 పాయింట్లు)కి కాంస్యం లభించింది. బాలికల లాంగ్జంప్లో థబిత ఫిలిప్ మహేశ్వరన్ (5.86 మీటర్లు) బంగారు పతకాన్ని చేజిక్కించుకోగా... అంబ్రిక నర్జారీకి కాంస్యం దక్కింది. బాలుర 400 మీటర్ల రేసులో అబ్దుల్ రజాక్ (48.17 సెకన్లు)... బాలికల 100 మీటర్ల విభాగంలో అవంతిక నరాలే (11.97 సెకన్లు) స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. బాలుర 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో అతుల్ కుమార్ (6ని:00.45 సెకన్లు) రజతం గెలిచాడు. -
ఇండియన్ గ్రాండ్ప్రి అథ్లెటిక్స్ మీట్లో సుప్రియకు కాంస్యం
న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మద్దాలి సుప్రియ కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల 200 మీటర్ల పరుగును 24.48 సెకన్లలో పూర్తి చేసి సుప్రియ మూడో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్లో ద్యుతీ చంద్ (ఒడిశా–23.30 సె.) స్వర్ణం సాధించింది. తాజా విజయంతో ద్యుతీ చంద్ ఏప్రిల్ 21 నుంచి 24 వరకు దోహాలో జరిగే ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు అర్హత సాధించింది. సాయ్–పుల్లెల గోపీచంద్ –మైత్రా ఫౌండేషన్ సహకారంతో శిక్షణ పొందుతున్న ద్యుతీ, సుప్రియలిద్దరికీ నాగపురి రమేశ్ కోచ్గా ఉన్నారు. -
ప్రేమ్ కుమార్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అథ్లెట్ కె.ప్రేమ్ కుమార్ స్వర్ణంతో మెరిశాడు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ మీట్లో అతను 110 మీటర్ల హర్డిల్స్లో బంగారు పతకం సాధించాడు. రాయ్పూర్లో జరిగిన ఈ ఈవెంట్లో అతను పోటీని అందరికంటే ముందుగా 13.90 సెకన్లలో పూర్తి చేశాడు. సీనియర్ కోచ్, ‘ద్రోణాచార్య’ అవార్డీ నాగపురి రమేశ్ వద్ద ప్రేమ్కుమార్ శిక్షణ పొందాడు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు తలపడే ఈ అథ్లెటిక్స్లో పతకమే లక్ష్యంగా అతను కోచ్ రమేశ్ వద్ద తన ప్రదర్శనకు మెరుగులు దిద్దుకున్నాడు. ఈ క్రమంలో అతనికి ‘సాయ్–గోపీచంద్–మైత్రా ప్రాజెక్ట్’ అన్నివిధాలా చేయూతనిచ్చిందని స్వర్ణ విజేత ప్రేమ్ కుమార్ తెలిపాడు. ఈ సందర్భంగా అతను తన కోచ్కు, తోడ్పాటు అందించిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు. -
మారథాన్లో కొత్త ప్రపంచ రికార్డు
బెర్లిన్ (జర్మనీ): పురుషుల అథ్లెటిక్స్లో అత్యంత క్లిష్టమైన రేసు మారథాన్లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన బెర్లిన్ మారథాన్లో కెన్యాకు చెందిన 33 ఏళ్ల ఎలియుడ్ కిప్చోగె ఈ ఘనత సాధించాడు. రియో ఒలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన కిప్చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల ఒక నిమిషం 39 సెకన్లలో పూర్తి చేసి... స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2014 బెర్లిన్ మారథాన్లోనే కెన్యాకు చెందిన డెన్నిస్ కిమెట్టో (2గం:02ని.57 సెకన్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్చోగె తెరమరుగు చేశాడు. -
భారత అథ్లెటిక్స్ జట్టులో బికాశ్, బాల్రాజ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘానికి చెందిన బికాస్ కరార్, బి. బాల్రాజ్ ఎంపికయ్యారు. స్పెయిన్లోని మలగలో ఈనెల 4 నుంచి 16 వరకు జరిగే ఈ టోర్నీలో వీరిద్దరూ భారత్కు ప్రాతినిథ్యం వహిస్తారు. బికాస్ కరార్ 45ప్లస్ వయో విభాగంలో 200మీ., 400మీ. హర్డిల్స్ ఈవెంట్లలో తలపడతాడు. గతంలో అమెరికా, ఫ్రాన్స్, ఫిన్లాం డ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లోనూ బికాస్ పాల్గొనడం విశేషం. మరోవైపు బాల్రాజ్ 40ప్లస్ వయో విభాగంలో 800మీ. పరుగులో పాల్గొంటాడు. బాల్రాజ్కు చైనాలో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొన్న అనుభవం ఉంది. -
అర్పీందర్ అద్భుతం
జకార్తా: ఆసియా క్రీడల్లో పురుషుల ట్రిపుల్ జంప్ స్వర్ణం కోసం సుదీర్ఘంగా సాగుతున్న భారత నిరీక్షణకు అర్పీందర్ సింగ్ తెరదించాడు. అద్భుత ప్రదర్శనతో ఈ క్రీడాంశంలో అతడు 48 ఏళ్ల అనంతరం బంగారు పతకం అందించాడు. బుధవారం జరిగిన పోటీల్లో మూడో ప్రయత్నంలో 16.77 మీటర్లు దూకిన అర్పీందర్ టాప్లో నిలిచాడు. తొలి యత్నంలో విఫలమైనప్పటికీ... రెండో సారి అతడు 16.58 మీటర్లు జంప్ చేశాడు. మూడోసారి ఈ పంజాబ్ అథ్లెట్ దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు. ఉజ్బెకిస్తాన్కు చెందిన రుస్లాన్ కుర్బనోవ్ (16.62 మీ.) రజతం, షువో కావ్ (16.56 మీ.) కాంస్యం అందుకున్నారు. మరోవైపు 2014 కామన్వెల్త్ క్రీడల కాంస్యం తర్వాత అర్పీందర్కు ఇదే తొలి పతకం కావడం విశేషం. అతడి వ్యక్తిగత ఉత్తమ రికార్డు మాత్రం 17.17 మీటర్లు కావడం గమనార్హం. ట్రిపుల్ జంప్లో 1970 ఏషియాడ్లో మొహిందర్ సింగ్ గిల్ (16.11 మీ.) స్వర్ణం నెగ్గిన తర్వాత భారత్కు మరో స్వర్ణం రావడం ఇదే మొదటిసారి. -
'స్వప్న' సాకారం
చరిత్రలో నిలిచే విజయాలతో లభించిన రెండు స్వర్ణాలు... అరుదైన రికార్డుతో దక్కిన రజతం... నిలకడైన ప్రదర్శనకు అందిన కాంస్యంతో ఆసియా క్రీడల 11వ రోజు భారత్... నాలుగు పతకాలు సాధించింది. 11 స్వర్ణాలతో గత ఏషియాడ్ రికార్డు సమం చేసిన మన దేశం... ప్రస్తుతం మొత్తం 54 పతకాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది. హెప్టాథ్లాన్లో స్వప్న బర్మన్ స్వర్ణ స్వప్నం సాకారం చేయడం... ట్రిపుల్ జంప్లో అర్పీందర్ అదరగొట్టడం ఏషియాడ్లో బుధవారం భారత్ తరఫున నమోదైన మెరుపులు...! ద్యుతీ చంద్ రెండో పతకంతో సత్తా చాటగా...టీటీలో మరో కాంస్యంతో మిక్స్డ్ ద్వయం ఆనందం నింపింది. జకార్తా: కఠినమైన ఏడు క్రీడాంశాల సమాహారం... 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనత... గతంలో మూడుసార్లు ఊరించి చేజారిన కల... ఇప్పుడు మాత్రం నెరవేరింది. అద్భుత ప్రదర్శనతో బెంగాల్కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ దానిని సాధించింది. ఆసియా క్రీడల హెప్టాథ్లాన్లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది. ఏడు క్రీడాంశాల్లో ఇలా... రెండు రోజుల పాటు జరిగిన హెప్టాథ్లాన్లో ఏడు క్రీడాంశాల్లో స్వప్న మొత్తం 6,026 పాయింట్లు సాధించింది. హై జంప్ (1.82 మీ.), జావెలిన్ త్రో (50.63 మీ.)లలో టాపర్గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్పుట్ (12.69 మీ.), లాంగ్ జంప్ (6.05 మీ.)లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులో 13.98 సెకన్లతో నాలుగో స్థానంలో, 200మీ. పరుగులో 26.08 సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్... అందులో (2ని.21:13సె.) నాలుగో స్థానంలో నిలిచినా... మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. చైనాకు చెందిన క్వింగ్లింగ్ వాంగ్ (5954 పాయింట్లు) రజతం, జపాన్ అథ్లెట్ యమసాకి యుకి (5873 పాయింట్లు) కాంస్యంతో సరిపెట్టుకున్నారు. అయితే, 800 మీ. పరుగుకు ముందు యమసాకి కంటే 18 పాయింట్లు మాత్రమే వెనుకబడిన భారత అథ్లెట్ పూర్ణిమా హెంబ్రామ్ (5837 పాయింట్లు)... ఆ రేసులో మూడో స్థానంలో నిలిచినా ఓవరాల్ స్కోరులో వెనుకబడి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. మరోవైపు ఏషియాడ్ హెప్టాథ్లాన్లో భారత్ తరఫున సోమా బిశ్వాస్ (2002, 2006) రజతం నెగ్గడమే ఇప్పటివరకు అత్యుత్తమం. జేజే శోభా (2002, 2006), ప్రమీలా అయ్యప్ప (2010)లు కాంస్యాలు గెలిచారు. ఆరు వేళ్ల బర్మన్... ఏడు ఈవెంట్ల విన్నర్ రెండు కాళ్లకు ఆరు వేళ్లుంటే నడవొచ్చు. పరిగెత్తొచ్చు. అంతేకాదు పతకం కూడా గెలవొచ్చని ఏషియాడ్లో ఘనంగా చాటింది స్వప్న బర్మన్. ఇది కూడా ఓ ఘనతేనా అనుకుంటే ఒక అథ్లెట్ శ్రమను తక్కువగా అంచనా వేసినట్లే! ఎందుకంటే ఆరేసి వేళ్లున్న అమ్మాయి అయినా అబ్బాయైనా షూస్తో సౌకర్యంగా ఉండటం చాలా కష్టం. ఏకబికిన ఏడు ఈవెంట్లలో పాల్గొనడం మరెంతో కష్టం... కానీ ఇంతకు మించిన కష్టాలే నిత్యం చవిచూసిన బర్మన్కు ఈ హెప్టాథ్లాన్ పోటీ ఏపాటిది! అందుకేనేమో సౌకర్యం సంగతి పక్కనబెట్టింది. సాధించడంపైనే మక్కువ పెంచుకుంది. చివరకు ఇంచియోన్ (గత ఏషియాడ్లో ఐదోస్థానం)లో పోగొట్టుకున్న పతకాన్ని జకార్తాలో చేజిక్కించుకునేలా తయారు చేసింది. నాడు కష్టాలతో సహవాసం... నేడు పసిడితో సాకారం... బెంగాల్కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. అతను కూడా ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడిచింది. కడుపునిండా తినడానికే పోరాడాల్సిన ఇంట్లో పతకం కోసం ఆరాటపడటం అత్యాశే అని అనిపిస్తుంది! కానీ... స్వప్న కేవలం ఆరాటంతోనే గడిపేయలేదు. దినదిన పోరాటంతో కుంగిపోలేదు. ఓ లక్ష్యం కోసం సుదీర్ఘ ప్రయాణం చేసింది. చివరికి ఈ పయనంలో విజేతగా నిలిచింది. ఒకటి కాదు... రెండు కాదు... ఏడు. హైజంప్, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షాట్పుట్, 100 మీ. 200 మీ. 800 మీ. పరుగు పోటీలు. ఇవన్నీ ఓ ‘పట్టు’పడితే ముగిసే రెజ్లింగ్ పోటీలు కాదు. ధనాధన్గా బాదే క్రికెట్ మెరుపులు కాదు. ఒక్కో ఈవెంట్ ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. అన్నీ భిన్న మైనవే! అన్నీ కష్టమైనవే! కానీ ఇవన్నీ స్వప్నకు సలాం చేశాయి. పొట్టిగా ఉన్నావంటే... గట్టిగా బదులిచ్చింది... స్వప్న హెప్టాథ్లాన్కు హైజంప్తో బీజం పడింది. తన సోదరుడు దూకే ఎత్తును చూసి తాను దూకేందుకు సరదా చూపెట్టింది. 2011లో 1.20 మీ. నుంచి 1.30 మీటర్ల ఎత్తు వరకూ దూకింది. శిక్షణ కేంద్రంలో మిగతావారు వివిధ ఈవెంట్లలో ఆడటం చూసి క్రమంగా హెప్టాథ్లాన్ ప్లేయర్గా ఎదిగింది. ఈ చాన్స్ కూడా అంత ఈజీగా రాలేదు. ముందుగా శిక్షణ కోసం కోచ్ సుభాష్ సర్కార్ (ప్రస్తుత కోచ్ కూడా) వద్దకెళ్తే పొట్టిగా ఉన్నావ్ పోటీలకు పనికిరావని వారించారు. కానీ ఆ పొట్టి అమ్మాయే 2012 స్కూల్ గేమ్స్ (హై జంప్) పోటీల్లో స్వర్ణం గెలిచింది. వెంటనే కోచ్ నుంచి పిలుపొచ్చింది. సాయ్లో శిక్షణకు సీటొచ్చింది. సరిగ్గా ఆరేళ్ల తర్వాత చూస్తే ఆమె 66 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. హెప్టాథ్లాన్లో విజేతగా నిలిచింది. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు సిద్ధమైతున్న వేళ కూడా బర్మన్ను పంటినొప్పి తీవ్రంగా బాధపెట్టింది. అయితే యాంటిబయోటిక్స్ మందులతో బరిలోకి దిగి అనుకున్నది సాధించింది. -
ఏషియాడ్లో నేటి భారతీయం
అథ్లెటిక్స్: మహిళల లాంగ్జంప్ ఫైనల్ (నీనా వరాకిల్, జేమ్స్ నయన; సా.గం.5.10 నుంచి); పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (నీరజ్ చోప్రా, శివ్పాల్ సింగ్; సా.గం.5.15 నుంచి); మహిళల 400 మీ. హర్డిల్స్ ఫైనల్ (జువానా ముర్ము, అను రాఘవన్; సా.గం.5.15 నుంచి), పురుషుల 400 మీ. హర్డిల్స్ ఫైనల్ (సంతోష్, ధరున్; సా.గం.5.30 నుంచి), పురుషుల హైజంప్ ఫైనల్ (చేతన్; సా.గం.5.30 నుంచి); మహిళల 3 వేల మీ. స్టీపుల్చేజ్ ఫైనల్ (సుధా సింగ్, చింతా; సా.గం.5.45 నుంచి); పురుషుల 3 వేల మీ. స్టీపుల్చేజ్ ఫైనల్ (శంకర్లాల్; సా.గం.6 నుంచి). బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (సైనా వర్సెస్ తై జు యింగ్, సింధు వర్సెస్ యామగుచి, ఉ.గం.10.30 నుంచి) బాక్సింగ్: పురుషుల 49 కేజీలు (అమిత్ వర్సెస్ ఎన్ఖమండఖ్, సా.గం.5.15 నుంచి), పురుషుల 56 కేజీలు (హుసాముద్దీన్ వర్సెస్ అమర్, సా.గం. 6.15 నుంచి), పురుషుల 64 కేజీలు (ధీరజ్ వర్సెస్ కుబషేవ్; సా.గం.7 నుంచి), పురుషుల 75 కేజీలు (వికాస్ వర్సెస్ తన్వీర్). సోనీ టెన్–2, సోనీ ఈఎస్పీఎన్లలో ప్రత్యక్ష ప్రసారం -
ఏషియాడ్లో నేటి భారతీయం
అథ్లెటిక్స్: మహిళల 400 మీ. హర్డిల్స్ (జువానా ముర్ము; ఉ. గం.9 నుంచి); పురుషుల 400 మీ. హర్డిల్స్ (సంతోష్, ధరున్ అయ్యాసామి; ఉ.గం. 9.30 నుంచి); మహిళల 100 మీ. సెమీఫైనల్ (ద్యుతీ చంద్; సా. గం.5 నుంచి); పురుషుల లాంగ్జంప్ ఫైనల్ (శ్రీ శంకర్; సా. గం.5.10 నుంచి); మహిళల 400 మీ. ఫైనల్ (హిమదాస్, నిర్మల; సా.గం.5.30 నుంచి); పురుషుల 10 వేల మీ. ఫైనల్ (లక్ష్మణన్; సా. గం.5.50 నుంచి) ఆర్చరీ: మహిళల కాంపౌండ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (సా. గం.12.10 నుంచి) బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (సైన్ఠారచనోక్); (సింధ్ఠుజిందాపొల్; ఉ. గం.11.30 నుంచి) బాక్సింగ్: పురుషుల 60 కేజీలు (శివ థాపా–జున్ షాన్; సా. గం.5.45 నుంచి); పురుషుల 69 కేజీలు (మనోజ్ కుమార్ఠ్అబ్దురక్మనొవ్; మ. గం.2.15 నుంచి); మహిళల 51 కేజీలు (సర్జుబాలాదేవి ్ఠమదినా గఫరొకొవా; మ. గం. 3 నుంచి) షూటింగ్: స్కీట్ మహిళల, పురుషుల క్వాలిఫయింగ్, ఫైనల్స్ (రష్మీ రాథోడ్, గణెమత్ షెఖాన్, అంగద్ వీర్ సింగ్ బాజ్వా, షీరాజ్ షేక్; ఉదయం 6.30 నుంచి 2.30 వరకు) పురుషుల హాకీ: పూల్ ‘ఎ’లో దక్షిణ కొరియాతో భారత్ మ్యాచ్ (సా. గం.4.30 నుంచి). సోనీ టెన్–2, సోనీ ఈఎస్పీఎన్లలో ప్రత్యక్ష ప్రసారం -
స్త్రీలోక సంచారం
ఇండోనేషియాలోని జకార్తాలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్కి అర్హత పొందినప్పటికీ ‘అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎ.ఎఫ్.ఐ.) తనను ఎంపిక చెయ్యకపోవడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఉత్తరప్రదేశ్ మిడిల్–డిస్టెన్స్ రన్నర్ మోనికా చౌదరికి ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్లో అర్హత కోసం గువాహతిలో జరిగిన ఇంటర్స్టేట్ మీట్లో రజత పతకాన్ని పొందినప్పటికీ మీట్ మధ్యలో జ్వరపడి తేరుకున్న కారణంగా తనను ఏషియాడ్కు పంపే క్రీడాకారుల జాబితా నుంచి తొలగించడంతో ఆవేదన చెందిన మోనికా.. కోర్టు తనకు ట్రయల్గా మళ్లీ ఒక పోటీ పెట్టి తన సామర్థ్యం నిరూపించుకోడానికి బుధవారం నాడు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక అవకాశం ఇవ్వాలని ఎ.ఎఫ్.ఐ.కి సూచించడంతో భూటన్లో తనిప్పుడున్న నేషనల్ క్యాంప్ నుంచి హుటాహుటిన బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ కూతురు, ఇరవై ఏళ్ల మోడల్, నటì .. పారిస్ జాక్సన్.. ‘హార్పర్ బజార్’ పత్రిక (సింగపూర్ ఎడిషన్) సెప్టెంబర్ సంచిక ముఖచిత్రంగా ప్రత్యక్షమవడంపై ఆ దేశంలోని ఎల్.జి.బి.టి. హక్కుల ఉద్యమకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమెనొక ‘కపటి’గా అభివర్ణించడంతో పారిస్ జాక్సన్ క్షమాపణలు చెప్పి, ఇన్స్టాగ్రామ్లో తను పెట్టిన ఆ ముఖచిత్రం ఫొటోలను తొలగించారు. ‘బైసెక్సువల్’ (స్త్రీ,పురుషులిద్దరి ఆకర్షణకూ లోనయ్యే వ్యక్తి) అయిన పారిస్ హిల్టన్.. గే హక్కుల ఉద్యమకారిణి అయి ఉండి కూడా, సేమ్ సెక్స్ ‘భావ’బంధాలను నేరంగా పరిగణించే సింగపూర్ దేశం నుండి వెలువడిన హార్పర్ బజార్ పత్రికకు మోడలింగ్ చెయ్యడంపై విమర్శలు రావడంతో.. తను మరీ అంత లోతుగా అంతగా ఆలోచించలేదని, ఫ్యాషన్పై తనకున్న ఇష్టంతోనే కవర్ పేజీ మోడలింగ్కి అంగీకరించానని వివరణ కూడా ఇచ్చారు. 76 ఏళ్ల వయసులో ఈ ఏడాది ఆగస్టు 16న కన్నుమూసిన ప్రముఖ అమెరికన్ సింగర్, పియానిస్టు అరెథా ఫ్రాంక్లిన్ నివాళి సందర్భంగా ఎం.టి.వి. వీడియో మ్యూజిక్ అవార్డు ఫంక్షన్లో మాట్లాడుతూ పాప్ స్టార్ మడోన్నా.. ఆ పెద్దావిడకన్నా కూడా తన గురించే ఎక్కువగా చెప్పుకున్నారని విమర్శలు వచ్చాయి. దీనిపై మడోన్నా స్పందిస్తూ, ‘‘నిజానికది అరెథా నివాళి కార్యక్రమం కాదని, ‘వీడియో ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ ప్రకటించే వేడుకలో నిర్వాహకులు తనను అరెథాతో ఉన్న జ్ఞాపకాలను పంచుకోమని అడగడంతో తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి రెండు నిముషాల్లో ముగించలేకపోయానని’’ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. కేరళ వరద బాధితులను టీవీలో చూసి చలించిన 12 ఏళ్ల తమిళనాడు బాలిక అక్షయ.. రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యే తన హార్ట్ సర్జరీ కోసం సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు సేకరించిన 20 వేల రూపాయలలోంచి ఐదు వేల రూపాయలను కేరళకు విరాళంగా అందజేసింది! కరూర్ జిల్లా కుమారపాళ్యంలో తల్లితో పాటు ఉంటున్న అక్షయ.. ఆరేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోగా, ఆమె తల్లి జ్యోతిమణి.. కూతురి గుండె జబ్బుకు వేరే ఆర్థిక ఆసరా లేక.. నవంబరులో జరగవలసిన ఆమె సర్జరీ కోసం తెలిసినవాళ్ల ద్వారా అనేక మార్గాల్లో దాతల్ని ఆశ్రయిస్తోంది. ఉత్తరకాశిలో గతవారం 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య జరిగిన ఘటనపై స్వచ్ఛందంగా స్పందించిన ఉత్తరాఖండ్ హైకోర్టు.. బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న నేరాలను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రాగల 48 గంటల్లో శాశ్వత ప్రాతిపదికపై ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (సిట్) లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అలాగే ఉత్తరకాశి మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసు విచారణను ప్రభుత్వం తక్షణం ‘సిట్’కు అప్పగించాలని, ‘సిట్’ నాలుగు వారాల్లోపు ఈ కేసులో చార్జిషీటును దాఖలు చేయాలని ఆదేశించింది. బిహార్. భోజ్పూర్ జిల్లాలో బిమలేశ్ అనే 16 ఏళ్ల దామోదర్పూర్ గ్రామ విద్యార్థి, పన్నెండవ తరగతిలో చేరేందుకు దగ్గర్లోని బిహియా గ్రామానికి వెళ్లి, అక్కడి రెడ్ లైట్ ఏరియాలో.. మర్మావయవాల దగ్గర తీవ్ర గాయాలతో నిర్జీవంగా పడి ఉన్న ఘటనలో అక్కడి ఒక మహిళను అనుమానించి, ఆమెను నగ్నంగా ఊరేగించిన మూక ఘటనలో ఆర్.జె.డి. (రాష్ట్రీయ జనతా దళ్) కార్యకర్త సహా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళను వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతున్నప్పుడు సమయానికి వెళ్లి నిరోధించలేకపోయిన ఆరుగురు పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. ఆఖరి నిముషంలో ప్రాజెక్టు నుండి తప్పుకున్నందుకు ప్రియాంకా చోప్రాపై ‘భారత్’ సినిమా డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఆగ్రహంతో ఉన్నారని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు అలీ నోరు విప్పారు. ‘‘ఆమె నా స్నేహితురాలు. తనపై నాకేం కోపం లేదు. ఆమె చేసిన పనికి బాధా లేదు. ‘భారత్’ సినిమా నుంచి చివరి నిముషంలో ప్రియాంక తప్పుకోవడం వల్ల టీమ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినప్పటికీ, తను తప్పుకోడానికి ప్రియాంక చెప్పిన కారణాలన్నీ సబబుగానే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. ముఖేష్ ఛబ్రా డైరెక్ట్ చేస్తున్న రొమాంటిక్ ‘ట్రాజీకామెడీ’ ఫిల్మ్.. ‘కీజీ అవుర్ మ్యానీ’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోడానికి హీరో సుశాంత్ సింగ్ రాజ్పు™Œ .. ఆ సినిమా హీరోయిన్ (ఫీల్డులోకి కొత్తగా వచ్చిన అమ్మాయి) అయిన సంజనా సంఘీతో మితిమీరిన చనువు ప్రదర్శించడమే కారణం అని తెలుస్తోంది. గత నెలలో జంషెడ్పూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సుశాంత్ ‘ఎక్స్ట్రా–ఫ్రెండ్లీ’ ప్రవర్తనకు అసౌకర్యానికి గురయిన సంజనా ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారని, వెంటనే వారు ‘నీకు ఇష్టమైతేనే చెయ్యి’ అనడంతో.. అప్పట్నుంచీ ఆమె షూటింగ్కి అందుబాటులో లేరని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
పచ్చడి అన్నంతో ఒలింపిక్స్ పతకం చేజారింది!
తిరువనంతపురం : అలనాటి పరుగుల రాణి పీటీ ఉష 1984లో లాస్ఏంజిల్స్లో జరిగిన ఒలింపిక్స్లో పతకం చేజారడానికి కారణాలు చెబుతూ ఆవేదనం వ్యక్తం చేశారు. కేవలం పచ్చడి కలిపిన అన్నం మాత్రమే తనకు ఆహారంగా ఇవ్వడంతో శక్తికి మించి పరుగులు తీసినా భారత్కు పతకాన్ని అందించలేక పోయానని తెలిపారు. 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో ప్రతి రౌండ్లో అద్భుత ప్రదర్శన ఇస్తూ ఫైనల్స్కు వెళ్లారు. ‘ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించానని సంతోషించేలోపే ఆమె ఆనందం ఆవిరైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కొజోకరు కూడా అదే సమయంలో ఈవెంట్ పూర్తి చేశారు. ఇంకా చెప్పాలంటే పీటీ ఉష కంటే సెకన్లో వందో వంతు సమయం ముందుగానే హర్డిల్స్ పూర్తి చేశారని ప్రకటింగానే తాను తీవ్ర నిరాశకు లోనయ్యానని చెప్పారు. ఒలింపిక్ గ్రామంలో కేవలం అమెరికా వంటకాలు, ఆహారం మాత్రమే దొరుకుతుందని ముందుగా మాకు ఎవరు చెప్పలేదు. ఒలింపిక్ విలేజ్లో పోషకాలున్న ఆహారం నాకు ఇవ్వలేదు. కేవలం మామాడికాయ పచ్చడి, అన్నం మాత్రే ఆహారంగా ఇచ్చారు. చికెన్, బంగాళాదుంపలు వంటి ఆహారాన్ని కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈ కారణంగా నా ఎనర్జీ లెవల్స్ చాలా తగ్గిపోయాయి. తొలి 45 మీటర్ల హర్డిల్స్ను కేవలం 6.2 సెకన్లలో పూర్తిచేసి అద్భుతంగా ఆరంభించా. శాయశక్తులా యత్నించినా చివరి 35 మీటర్ల రేసులో కాస్త నెమ్మదించాను. ఎందుకంటే తగినంత పోషకాహారం తీసుకోని కారణంగా మూడో స్థానాన్ని సైతం వెంట్రుకవాసిలో కోల్పోయి పతకాన్ని చేజార్చుకున్నానని’ లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్లో జరిగిన అనుభవాలను పీటీ ఉష నెమరువేసుకున్నారు. ప్రస్తుతం ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్పై పూర్తిగా దృష్టిసారించానని చెప్పారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో మెరుగైన అథ్లెట్లను తయారు చేసి దేశానికి పతకాలు అందించడమే తన లక్ష్యమని పీటీ ఉష వివరించారు. -
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ ఫైనల్లో హిమ దాస్
భారత క్రీడాకారిణి హిమ దాస్ ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 400 మీటర్ల పరుగులో ఫైనల్కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్ హీట్స్లో 18 ఏళ్ల హిమ 52.10 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ముందంజ వేసింది. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ జిస్నా మాథ్యూ మాత్రం విఫలమైంది. సెమీ ఫైనల్ హీట్లో ఆమె 53.86 సెకన్ల టైమింగ్తో ఐదో స్థానానికే పరిమితమైంది. -
5 కి.మీ నడక విజేతలు యోగేందర్, కీర్తి
సాక్షి, హైదరాబాద్: అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ, రాజేశ్ అథ్లెటిక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సమ్మర్ రోడ్ రన్కు విశేష ఆదరణ లభించింది. వ్యాయామవిద్య యూనివర్సిటీ కాలేజి వేదికగా ఆదివారం జరిగిన ఈ ఈవెంట్లో 5 కి.మీ నడకవిభాగంలో యోగేందర్ యాదవ్, ఎ. కీర్తి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో యోగేందర్ (ఎంఎల్ఆర్ కాలేజి), నాగరాజ్ (హైదరాబాద్), ప్రేమ్ కుమార్ (నిజాం కాలేజి) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో కీర్తి (భవన్స్), ఎస్. లావణ్య (సెయింట్ పాయ్స్) తొలి రెండు స్థానాల్లో నిలవగా, జువేరియా ఫాతిమా (సెయింట్ ఆన్స్) మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో యు అండ్ మి సంస్థ డైరెక్టర సి. వీరేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–16 బాలుర 5 కి.మీ నడక: 1. అజయ్ కుమార్ (డిఫెన్స్ ల్యాబ్), 2. కె. జితేందర్ (సాయి చైతన్య), 3. రవికిరణ్ (జాన్సన్ గ్రామర్ స్కూల్); బాలికలు: 1. జె. రమ (పీజేఆర్ స్టేడియం), 2. ఎన్. విజయలక్ష్మి (సీఎస్ఎస్), 3. కె. అఖిల (సాయి చైతన్య). అండర్–13 బాలుర 2 కి.మీ నడక: 1. బి. మహేశ్ (పుడమి), 2. ఎం. సాయి (నవ్య జ్యోతి), 3. ఎం. మణి హర్షిత్ (భవన్స్); బాలికలు: 1. కె. విశాలాక్షి (జీహెచ్ఎస్), 2. వేముల శ్రీయ (సెయింట్ ఆన్స్), 3. గౌతమి (కేవీ, బేగంపేట్). అండర్–10 బాలుర 2 కి.మీ నడక: 1. సిద్ధార్థ్ (సీఎంఆర్ స్కూల్), 2. కె. జ్ఞానేశ్వర్ (కేవీఎస్), 3. ఎన్. గోపీ సింగ్ (సాయి చైతన్య); బాలికలు: 1. ఎం. రేవతి (ప్రగతి హైస్కూల్), 2. ఎం. శ్రీవిద్య (గీతాంజలి), 3. కె. మహేశ్వరి (సాయి చైతన్య). మాస్టర్ పురుషుల 2 కి.మీ నడక: 1. బి. విద్యా సాగర్ (పోస్టల్), 2. వై.శ్రీనివాస్ రావు (హైదరాబాద్), 3. కె. తాయప్ప (రంగారెడ్డి); బాలికలు: 1. కె. శిల్పవల్లి (జీడీసీ), 2. జి. రాధిక (ఓయూ గ్రౌండ్స్), 3. సీహెచ్ ప్రసన్న భారతి (హైదరాబాద్). -
అథ్లెటిక్స్కు వికాస్ గౌడ గుడ్బై
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్వర్ణం సాధించిన భారత ఏకైక డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ రిటైర్మెంట్ ప్రకటించాడు. గత 15 ఏళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ... దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టిన వికాస్ బుధవారం ఆటకు ‘టాటా’ చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ)కు లేఖ రాశాడు. దీన్ని ఏఎఫ్ఐ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 140 కేజీల బరువున్న వికాస్ వరుసగా నాలుగు ఒలింపిక్స్ల్లో (2004, 2008, 2012, 2016) భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. అం దులో 2012 లండన్ ఒలింపిక్స్లో ఫైనల్ రౌండ్కు అర్హత సాధించడం అత్యుత్తమం. జూలై 5వ తేదీన 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వికాస్ మైసూర్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డాడు. -
కళైమణిని పేదరికం ఓడించింది
కోయంబత్తూర్ : పరుగు అంటే ఆమెకు ప్రాణం. లేడిని మించిన వేగం ఆమెది. పరుగు పందెంలో నాలగు బంగారు పతకాలు గెలిచింది. ప్రభుత్వం మెచ్చి, ఏదైనా ఉపాధి చూపిస్తుంది అనుకుంది. కానీ నిరాశే ఎదురయ్యింది. పరుగు పందెంలో గెలిచిన ఆమెను పేదరికం ఓడించింది. చేసేదేమిలేక కుటుంబపోషణ నిమిత్తం ప్రస్తుతం టీ కొట్టు పెట్టుకుని బతుకు బండిని లాక్కొస్తోంది. ఆమే తమిళనాడుకు చెందిన కళైమణి. కోయంబత్తూరుకు చెందిన కళైమణి (45) రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. పదవ తరగతి వరకు చదువుకున్న కళైమణికి చిన్నతనం నుంచి క్రీడలంటే ఆసక్తి. పాఠశాలలో కబడ్డీ, మిగితా క్రీడల్లో పాల్గొనేది. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి 41కి.మీ. మరాథన్లో బంగారు పతకాలు సాధించింది. ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడంతో వివాహం చేసుకుని క్రీడలకు దూరమయ్యింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లల బాధ్యత చూసుకోవడం కోసం భర్తకు సహాయంగా ఒక చిన్న టీ కొట్టు నడుపుతుంది. టీ కొట్టు మీద రోజుకు రూ.400 - 500 వరకు సంపాదిస్తుంది. ఇప్పటికి పరుగు మీద ఇష్టాన్ని వదులుకోలేక ప్రతిరోజు 21కి.మీ దూరం పరిగెత్తుతు సాధన కొనసాగిస్తుంది. పూర్తిస్థాయిలో పరుగు మీద దృష్టి పెట్టడానికి, మెరుగైన సదుపాయల కల్పన కోసం రుణం ఇవ్వమని బ్యాంకులను ఆశ్రయించింది. కానీ బ్యాంకులు అప్పు ఇవ్వడానికి నిరాకరించడంతో స్నేహితుల వద్ద నుంచి ఆర్థిక సహాయం తీసుకుని సాధన కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఏదైన సహాయం చేస్తే తనలాంటి మరికొంత మందికి శిక్షణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. -
మహిళల 100 మీటర్ల రేసులో ద్యుతీచంద్కు స్వర్ణం
స్వదేశీ అథ్లెట్ల మధ్య నిర్వహిస్తున్న ఇండియన్ గ్రాండ్ప్రి–1 అథ్లెటిక్స్ మీట్లో ఒడిశా స్టార్ క్రీడాకారిణి ద్యుతీచంద్ స్వర్ణ పతకాన్ని సాధించింది. పాటియాలాలో మంగళవారం జరిగిన మీట్లో ద్యుతీ... 100 మీటర్ల దూరాన్ని 11.57 సెకన్లలో అధిగమించి విజేతగా నిలిచింది. ప్రస్తుతం ద్యుతీచంద్ తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఇదే మీట్లో పురుషుల జావెలిన్ త్రోలో ఆసియా చాంపియన్ నీరజ్ చోప్రా పసిడి పతకం గెలిచాడు. అతను జావెలిన్ను 82.88 మీటర్ల దూరం విసిరాడు. -
నాన్న కష్టం చూసి.. పరుగు ఆపేద్దామనుకున్నా..
‘సాహసం నాపదం.. రాజసంనా రథం.. సాగితే ఆపడం.. సాధ్యమా’ అన్నట్టుగా అథ్లెటిక్స్తో పేదరికం అనే హర్డిల్స్ను దాటుతూ సత్తాచాటుతోంది. కష్టాల్లో పుట్టి పెరిగినా.. కన్నీళ్లను గుండెల్లో దాచుకుని తండ్రి ప్రోత్సాహంతో జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తాపీమేస్త్రీ ఇంట పుట్టినా పరుగులో ప్రతిభ కనబరుస్తూ ఎన్నో రాష్ట్రస్థాయి పతకాలు సొంతం చేసుకున్న ‘బంగారు’ కొండ నిడదవోలు అన్నపూర్ణనగర్కు చెందిన యితం నాగాంజలి. పూరిపాకలో కుటుంబం జీవనం సాగిస్తున్నా తండ్రి, కోచ్ ప్రోత్సాహంతో పరుగే శ్వాసగా మైదానంలో చెలరేగిపోతోంది. నాగాంజలి విజయగాథ ఆమె మాటల్లోనే.. నిడదవోలు: మాది పేద కుటుం బం. చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగి పెద్దాయ్యాను. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. అథ్లెటిక్లో జాతీయ స్థాయిలో రాణిం చాలనే లక్ష్యంతో కష్టాలు, కన్నీళ్లను గుండెల్లో దాచుకుని అలుపెరుగని పరుగుపెడుతున్నాను. నిడదవోలు 7 వార్డు అన్నపూర్ణనగర్లో చిన్న పూరిపాకలో నివసిస్తున్నాం. నాన్న సత్తిబాబు, అమ్మ లక్ష్మితో పాటు ఇద్దరు చెల్లెళ్లు. నా న్న తాపీమేస్త్రీగా పనిచేస్తూ రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా డు. చిన్నప్పటి నుంచి పరుగంటే నాకెంతో ఇష్టం. నిడదవోలు జెడ్పీ బాలికల హైస్కూ ల్లో ఆరో తరగతి చదువున్న రోజుల్లో డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ శిబిరంలో చేరాను. అక్కడ అ బ్బాయిలతో సమానంగా పరుగు పెట్టడంతో పీఈటీల దృష్టి నాపై పడింది. చక్కగా పరుగు పెడుతుందని, నాగాంజలిని మా పాఠశాలలో చేర్పించమని శెట్టిపేట, చాగల్లు, ఊనగట్ల, గుడివాడ, చిక్కాల హైస్కూళ్ల పీఈటీ సార్లు నాన్నను అడిగా రు. అయితే నాన్న మాత్రం ఇంటికి దగ్గరలో ఉన్న బాలికల హైస్కూల్లో చదువుతూ దుర్గా పీఈటీ దగ్గర శిక్షణ తీసుకో మన్నారు. అక్కడ నుంచి నిడదవోలు మండలం పెండ్యాల హైస్కూల్లో చేరిన తర్వాత పీఈటీ నాగరాజు సార్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అక్కడ ఉన్నప్పుడే ఒకే ఏడాది ఏడు బం గారు పతకాలను సాధిం చాను. అప్పుడే బలంగా నిశ్చయించుకున్నా జాతీయ స్థాయిలో రా ణించాలని. జాతీయస్థాయిలో పేరుతో పా టు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించి నాన్న పడుతున్న కష్టానికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. డైట్ లేక పస్తులున్నా.. పదో తరగతి పూర్తవగానే పట్టణంలోని కళాశాలలో ఇంటర్లో చేరాను. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మై దానంలో రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేసేదానిని. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా మానకుండా ప్రాక్టీస్ చే స్తున్నా. అయితే నాన్న రోజంతా కూలీ పని చేసి తీసుకువచ్చిన రూ.400తో కుటుంబ పోషణ కష్టంగా మారింది. నేనే మో రోజూ డైట్ తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చి పస్తులున్న రోజులు ఉన్నాయి. అటువంటి సమయంలో కూడా అమ్మా నేనున్నా నువ్వు బాధపడకు అని నాన్న ధైర్యానిచ్చేవారు. టోర్నమెంట్కు వెళ్లడానికి ఖర్చులు, రోజూ శిక్షణ అ నంతరం డైట్ కోసం పడు తున్న ఇబ్బందులు చూసి ప్రాక్టీస్ మానేద్దామనుకు న్నా. బాదం, శెనగలు, పాలు, పండ్లు, గుడ్లు డైట్ తీసుకోనేందుకు రోజుకి రూ.300 వర కు ఖర్చవుతుంది. ఇంత ఖర్చు పెట్టలేని నాన్నను చూసి కళ్లం టా నీళ్లు తిరిగేవి. ఆ సమయంలో వద్దు నాన్న ఇంక ప్రాక్టీస్ చేయనని చె ప్పాను. అయితే నాన్న ఒప్పుకోలేదు. తినో తినకో నీకు ఏ లోటు రానివ్వమని ఆయన అనడంతో మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టాను. ఏం చేయాలో తెలియలేదు 2016లో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బూట్లకు రాయి తగలడంతో ఎడమ కాలు పాదానికి గాయమైంది. నొ ప్పి భరించలేకపోయోదాన్ని. పరుగు పెడుతుంటే నొప్పి బా గా వచ్చేది. కనీసం మందులు కొనుక్కోవడానికి డబ్బుల్లేని పరిస్థితి. ఏం చేయాలో.. నాన్నకు ఎలా చెప్పాలో తెలియక ఒంటరిగా కూర్చుని బాధపడేదాన్ని. నన్ను గమనించిన నా న్న, పీఈటీ నాగరాజు సార్ రాజమండ్రి ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. నాలుగు నెలలు మందులు వాడిన త ర్వాత బాధ తగ్గింది. మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నాలో పట్టుదల మరింత పెరిగింది. ఇంట్లో డైట్ సమస్యలు ఉన్నా అర్ధాకలితో ప్రాక్టీస్ చేశాను. పరుగులో ఈ స్థాయికి చేరుకున్న నేను దాతల సహకారంతో వివిధ పోటీల్లో రాణిస్తున్నాను. ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ మొదటి సం వత్సరం చదువుతూ పరుగులో శిక్షణ తీసుకుంటున్నా. ఉ ద్యోగం సాధించి నా ఇద్దరు చెల్లెళ్లకు వివాహలు చేయడమే నా ముందున్న లక్ష్యం. -
భారత అథ్లెటిక్స్ రిలే జట్టులో సుధాకర్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు సన్నాహకంగా నిర్వహించే అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇండోనేసియాలోని జకార్తాలో ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు ఈ మీట్ జరుగుతుంది. పురుషుల 4 గీ 100 మీటర్ల రిలేలో తెలంగాణ అథ్లెట్ సీహెచ్ సుధాకర్కు స్థానం లభించింది. సుధాకర్తోపాటు ఈ రిలే జట్టులో మొహమ్మద్ సాదత్, ఏకలవ్య దాసన్, విద్యాసాగర్, అనురూప్ జాన్, సత్నామ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలంగా జాతీయ అథ్లెటిక్స్ స్ప్రింట్ రేసుల్లో సుధాకర్ నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది గుంటూరులో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఖమ్మం జిల్లాకు చెందిన సుధాకర్ 100 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. -
టీమ్ చాంపియన్ హెచ్పీఎస్
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) బేగంపేట్ జట్టు సత్తా చాటింది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మూడు టీమ్ చాంపియన్షిప్ టైటిళ్లను కైవసం చేసుకుంది. అండర్–10 బాలుర, అండర్–12 బాలబాలికల విభాగాల్లో హెచ్పీఎస్ జట్లు విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలబాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ బోయిన్పల్లి జట్లు టీమ్ చాంపియన్షిప్ టైటిళ్లను సాధించాయి. అండర్–10 బాలికల టీమ్ చాంపియన్షిప్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుకు దక్కింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన అండర్–14 బాలికల 4000మీ. పరుగులో చిరెక్ స్కూల్కు చెందిన దియా గంగ్వార్ చాంపియన్గా నిలిచింది. అదితి సింగ్ (జ్యోతి వీఎస్), ప్రియాంక దాస్ (సెయింట్ ఆండ్రూస్) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. బాలుర విభాగంలో టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), ఎం. అరవింద్ (శాంతినికేతన్) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుపొందగా, సుహాస్ చౌదరి (కేవీ గచ్చిబౌలి) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–14 బాలుర 800మీ. పరుగు: 1. మోహిన్ (టీర్ఈఐఎస్), 2. ఎం. అరవింద్ (శాంతినికేతన్), 3. ఎం. సాయి (ఎన్జేఎంహెచ్ఎస్); బాలికలు: 1. సీహెచ్ రాఘవి (కేవీజీవీ), 2. పి. శ్రేయ (సెయింట్ మార్క్ హైస్కూల్), 3. యువిక (కెన్నడీ వీఎస్). షాట్పుట్: 1. ఎం. చంద్ర కుమార్, 2. టి. ఎమ్మాన్యుయేల్ (హెచ్పీఎస్), 3. ఎం. సుహాస్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. ధ్రుతి అనీశ్ కుమార్, 2. కె. ఖదీజ, 3. ఎం. వర్ణిక. హైజంప్: 1. ఎం. చంద్రకుమార్, 2. హిమవంత్ కృష్ణ, 3. బి. ప్రణయ్; బాలికలు: 1. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ), 2. ధ్రుతి, 3. సౌమ్య (హెచ్పీఎస్). అండర్–12 బాలుర 600మీ. పరుగు: 1. ఎన్. గణేశ్ (ప్రగతి వీఎంఎస్), 2. బి. మహేశ్ (పుడమి ఎన్హెచ్ఎస్), 3. ఎస్. గణేశ్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. బీఎస్ జాష్వి (సెయింట్ ఆండ్రూస్), 2. జి. రితిక (హెచ్పీఎస్), 3, ఎ. వైష్ణవి (జీసీఏఏ). హైజంప్: 1. పి. భవదీప్ (ఆర్మీ స్కూల్), 2. సీహెచ్ సిద్ధార్థ్ (సెయింట్ మేరీస్), 3. బి. ఇషాన్ (హెచ్పీఎస్); బాలికలు: 1. అదితి సింగ్, 2. ధ్రుతి, 3. సౌమ్య. షాట్పుట్: 1. ఆర్. అద్నాన్ (ఎంఎస్బీ), 2. ఎం. ప్రణవ్ (హెచ్పీఎస్), 3. ఇడ్రిస్ (ఎంఎస్బీ); బాలికలు: 1. బి. వర్‡్ష రెడ్డి (హెచ్పీఎస్), 2. ఎం. అవని (జీసీఏఏ), 3. సి. అవని (జీసీఏఏ). అండర్–10 బాలుర 600మీ. పరుగు: 1. పి. బద్రీనాథ్, 2. కె. దర్శ్ (ఎన్ఏఎస్ఆర్), 3. ఎస్. శ్రుశాంత్ రెడ్డి (శ్రీనిధి హైస్కూల్); బాలికలు: 1. కె. మహేశ్వరి (సాయి చైతన్య హైస్కూల్), 2. ఎం. రేవతి (ప్రగతి హైస్కూల్), 3. బి. శ్రీనిక (శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్). -
పృథ్వీర్, పద్మశ్రీలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ (ఆర్ఎఫ్వైఎస్) అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పృథ్వీర్ (తెలంగాణ మైనారిటీ స్కూల్), పద్మశ్రీ (సెయింట్ పాల్స్ స్కూల్) సత్తా చాటారు. గచ్చిబౌలిలో ఆదివారం జరిగిన 200 మీ. పరుగు జూనియర్ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ స్వర్ణాలను సొంతం చేసుకున్నారు. పృథ్వీర్ 24.24 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆర్. శ్రీకాంత్ (24.26 సె.) రెండోస్థానాన్ని, రేవంత్ (24.99 సె.) మూడో స్థానాన్ని సాధించారు. బాలికల విభాగంలో పద్మశ్రీ 27.55 సెకన్లలో, మానస (టీఎస్ఆర్ఎస్) 29.44 సెకన్లలో, శిల్ప (టీఎస్ఆర్ఎస్) 29.59 సెకన్లలో రేసును పూర్తిచేసి తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజి సత్తా చాటింది. సీనియర్ బాలబాలికల విభాగాల్లో ఆర్ఎఫ్వైఎస్ హైదరాబాద్ ‘రోల్ ఆఫ్ ఆనర్’ విజేతగా నిలిచింది. ఇతర ఈవెంట్ల ఫలితాలు సీనియర్ బాలుర 200 మీ. పరుగు: 1. వై. హరికృష్ణ (తెలంగాణ మైనారిటీస్ స్కూల్), 2. కె. అరవింద్ (తెలంగాణ మైనారిటీస్ స్కూల్), 3. చందు (భవన్స్ శ్రీ అరబిందో). 5000 మీ. పరుగు: 1. సౌరవ్ (ఆర్మీ పబ్లిక్ స్కూల్), 2. రవికిరణ్ (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. కేశవ్ (భవన్స్ శ్రీ అరబిందో). సీనియర్ బాలికల 5000 మీ. పరుగు: 1. గంగోత్రి (భవన్స్ శ్రీ అరబిందో), 2. శ్రావణి (భవన్స్ శ్రీ అరబిందో). కాలేజి బాలుర 5000 మీ. పరుగు: 1. బి. రమేశ్ (ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజి), 2. చిదుర్ల (వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి), 3. అజయ్ (రైల్వే డిగ్రీ కాలేజి). ఆర్ఎఫ్వైఎస్ హైదరాబాద్ రోల్ ఆఫ్ ఆనర్ విజేతల వివరాలు జూనియర్ బాలురు: 1. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, 2. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ బాలుర పాఠశాల. జూనియర్ బాలికలు: 1. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, 2. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సీనియర్ బాలురు: 1. భవన్స్ శ్రీ అరబిందో, 2. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్. బాలికలు: 1. భవన్స్ శ్రీ అరబిందో, 2. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్. కాలేజి బాలురు: 1. సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజి, 2. హిందీ మహావిద్యాలయ. బాలికలు: 1. ప్రభుత్వ డిగ్రీ కాలేజి, 2. ఫారెస్ట్ కాలేజ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. -
100 మీ. విజేత పద్మశ్రీ
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సీహెచ్ పద్మశ్రీ ఆకట్టుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె 100మీ. పరుగు ఈవెంట్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన అండర్–16 బాలికల 100మీ. పరుగులో పద్మశ్రీ (ఎస్పీహెచ్ఎస్) లక్ష్యాన్ని 13.4 సెకన్లలో చేరుకొని అగ్రస్థానాన్ని సాధించింది. ఏపీఎస్కు చెందిన స్వప్న (13.7సె.), ఆర్సీహెచ్ఎస్ అథ్లెట్ రియా గ్రేస్ (13.8సె.) తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. అండర్–14 బాలికల 100మీ. రేసులో కె. శిల్ప (14.1 సె.), దియా గంగ్వార్ (14.4 సె.), ఎం. మానస (14.7 సె.) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. బాలుర విభాగంలో రాహుల్ (12.3 సె.) విజేతగా నిలవగా, నితిన్ (12.5 సె.) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రణీత్ (12.6 సె.) మూడో స్థానంలో ఉన్నాడు. -
పట్టుదలే పెట్టుబడిగా...
అథ్లెటిక్స్లో కొత్త ఆశాకిరణం జ్యోతికశ్రీ సౌకర్యాలు అంతంత మాత్రం. ఆర్థిక పరిస్థితి నామమాత్రం. ప్రాక్టీస్ కోసం సింథటిక్ ట్రాక్ కూడా లేదు. రోల్ మోడల్గా తీసుకోవాలంటే ఆ స్థాయిలో విజయాలు సాధించిన వారు కూడా లేరు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన ప్రతిభనే నమ్ముకుంది. పట్టుదలే పెట్టుబడిగా తన నైపుణ్యానికి పదును పెట్టింది. ఆమె కృషికు సరైన మార్గదర్శకుడు కూడా లభించాడు. ఇంకేం ప్రతికూలతలను అధిగమిస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తూ తన లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఆ అమ్మాయే ఆంధ్రప్రదేశ్కు చెందిన 16 ఏళ్ల అథ్లెట్ దండి జ్యోతికశ్రీ. ఇటీవలే హైదరాబాద్లో జరిగిన జాతీయ యూత్ చాంపియన్షిప్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ జ్యోతికశ్రీ 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ విజయంతో ఆసియా యూత్ అథ్లెటిక్స్లో పాల్గొనే భారత జట్టులో చోటు సంపాదించింది. విజయవాడ స్పోర్ట్స్: అథ్లెటిక్స్లో తమ ప్రతిభకు తోడు కొన్ని అరుదైన శారీరక లక్షణాలు కూడా ఆటగాళ్లను ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటిదే ‘హార్స్ నీ’. గుర్రాలకు ఉండే తరహా మోకాలుతో అథ్లెట్లకు పరుగెత్తడంలో అదనపు ప్రయోజనం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ దీనిని సమర్థంగా ఉపయోగించుకొని సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన 14వ యూత్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 16 ఏళ్ల ఈ అమ్మాయి 400 మీటర్ల పరుగులో (56.7సెకన్లు) స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. దీంతో బ్యాంకాక్లో మే 20 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఆసియా యూత్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. జ్యోతిక తండ్రి శ్రీనివాసరావుకు తణుకులో ఇనుప బీరువాలు, కప్బోర్డులు తయారు చేసే చిన్న కార్ఖానా ఉంది. తల్లి లక్ష్మీనాగ వెంకటేశ్వరి గృహిణి. బాడీ బిల్డింగ్లో ఒకప్పుడు రాణించిన తండ్రి అథ్లెటిక్స్లో జ్యోతిక ఆసక్తిని చూసి ప్రోత్సహించారు. స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సీతారామయ్య ఈ సమయంలో తగిన శిక్షణ అందించారు. వరుస విజయాలు... అథ్లెటిక్స్లో ప్రాథమికాంశాలు నేర్చుకున్న తర్వాత ముుందుగా జూనియర్ స్టేట్ మీట్లో 200, 400 మీటర్ల విభాగాల్లో జ్యోతిక స్వర్ణపతకాలు సాధించింది. అనంతరం గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్లో కూడా అదే జోరును కొనసాగించి మరో రెండు స్వర్ణాలు అందుకుంది. 2015లో విశాఖపట్నంలో జరిగిన నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో 1000 మీటర్ల పరుగులో కాంస్య పతకం పొందింది. 2015లో కాకినాడలో జరిగిన సౌత్జోన్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో అండర్–16 విభాగంలో 400 మీటర్ల పరుగులో స్వర్ణపతకం, అదే ఏడాది కృష్ణా జిల్లా గుడివాడలో ‘పైకా’ నేషనల్స్లో 400 మీటర్లలో స్వర్ణపతకం కైవసం చేసుంది. 2015–16లో కేరళలో జరిగిన స్కూల్ గేమ్స్లో కూడా రజత పతకం సాధించింది. అనంతరం టర్కీలో జరిగిన వరల్డ్ స్కూల్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 400 మీటర్ల ఈవెంట్లో సెమీస్ వరకు చేరుకుంది. 2016లో కరీంనగర్లో జరిగిన సౌత్జోన్ నేషనల్స్లో 400 మీటర్ల విభాగంలో స్వర్ణపతకం, రిలేలో కాంస్య పతకం సాధించింది. మరింత సాధన... నిలకడైన విజయాలతో రాణిం చిన జ్యోతికశ్రీ రెండు వారా ల పాటు జంషెడ్పూర్లోని టాటా స్పోర్ట్స్ అకాడమీలో ప్రత్యే క శిక్షణ పొందింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి విజయవాడలోని ‘సాయ్’ అథ్లెటిక్స్ కోచ్ డీఎన్వీ వినాయక ప్రసాద్ను సంప్రదించారు. ఇక్కడినుంచి శిక్షణతో పాటు ఆమె చదువు కూడా కొనసాగింది. అథ్లెటిక్స్లో ప్రాక్టీస్తో పాటు చదువుకు కూడా ఆటంకం కలగకుండా ఆమె సాధన చేసింది. మార్చి లో పరీక్షల అనంతరం వెంటనే ఏప్రిల్లో యూత్ నేషనల్స్లో స్వర్ణం గెలుచుకోవడం జ్యోతిక పట్టుదలకు నిదర్శనం. ప్రాక్టీస్తో పాటు ఫిట్నెస్పై కూడా ఆమె ప్రత్యేక దృష్టి పెట్టింది. సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ ప్రసాద్ ఈ దశలో ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఆసియా యూత్ అథ్లెటిక్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని, అక్కడ కూడా కచ్చితంగా పతకం గెలుచుకుంటానని జ్యోతిక ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని ఆమె చెప్పింది. జ్యోతికది తీవ్రంగా కష్టపడే స్వభావం. ఇదే ఆమెకు వరుస విజయాలు అందిస్తోంది. యూత్ అథ్లెటిక్స్లో విజయం పెద్ద ఘనతగా భావిస్తున్నాం. ఏపీ రాష్ట్రంలో ఒక్క సింథటిక్ ట్రాక్ లేకపోయినా మట్టిలో, రోడ్లుపై సాధన చేసి మరీ జ్యోతిక తన సత్తాను చాటింది. ఆమె ఆటలో చిన్న చిన్న లోపాలు సరిదిద్ది అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. –కోచ్ డీఎన్వీ వినాయక ప్రసాద్ -
అథ్లెటిక్స్లో విదేశీ కోచ్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటేందుకు అథ్లెటిక్స్ విభాగంలో విదేశీ కోచ్ల నియామకానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రేస్వాకింగ్, 400మీ. పరుగు, 400మీ.రిలే విభాగాలకు విదేశీ కోచ్లతో పాటు సహాయక సిబ్బందిని నియమించారు. ఆస్ట్రేలియాకు చెందిన డేవ్ స్మిత్ రేస్ వాకింగ్ ఈవెంట్కు, గలీనా పి బుఖరీనా (అమెరికా) 400మీ. పరుగు విభాగాలకు కోచ్లుగా వ్యవహరిస్తారు. -
నేటి నుంచి జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరుగుతుంది. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా ఈనెల 25వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,000 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటారని శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. 35 ఏళ్లు పైబడిన వయో విభాగం నుంచి 95 ఏళ్లు పైబడిన వయోవిభాగం స్థాయిలో 25 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా పాల్గొంటారన్న శాట్స్ చైర్మన్... తెలంగాణ నుంచి 290 మంది అథ్లెట్లు ఇందులో తలపడుతున్నారని చెప్పారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, టి. పద్మారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘానికి (డబ్ల్యూఎంఏ) చెందిన స్టాన్ పెర్కిన్స్, ఐఏఏఎఫ్ మాస్టర్స్ కమిషన్కు చెందిన విన్స్టన్ థామస్, ఆస్ట్రేలియన్ మాస్టర్స్ అసోసియేషన్కు చెందిన విల్మా పెర్కిన్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాక్రీడాకారులు
నేటి నుంచి ఖేలో ఇండియా పోటీలు సిరిసిల్ల : జిల్లా క్రీడాకారులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సోమ, మంగళవారాల్లో జరిగే రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా పోటీల్లో వారు పాల్గొంటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు వివిధ జిల్లాల జట్లతో పోటీ పడనున్నారు.వీరికి ఆదివారం స్పోర్ట్స్ డ్రెస్లను వ్యాయామ ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గొట్టె అంజయ్య, రాందాస్, మౌనిక, శిరీష, వీరస్వామి, టీఆర్ఎస్వీ నాయకులు గజ్జెల దేవరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు కష్టమే: బోల్ట్
మొనాకో: తన కెరీర్ ముగింపు దశకు వచ్చిన తరుణంలో ఇంకా రికార్డులను బద్ధలు కొడతానని అనుకోవడంలేదని జమైకా చిరుత, ప్రపంచ ప్రఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ వ్యాఖ్యానించాడు. ఇక తాను పాల్గొనేది అది కొద్ది ఈవెంట్లో మాత్రమేనని, ఆ తరువాత కెరీర్ను ముగించక తప్పదని బోల్ట్ పేర్కొన్నాడు. ఇదే క్రమంలో తాను గతంలో సాధించిన ఘనతలను సవరించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని అని ఈ దిగ్గజ స్ప్రింటర్ తెలిపాడు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ అవార్డును అందుకోవడానికి వచ్చిన బోల్ట్.. పలు అనుభవాలను పంచుకున్నాడు. తాను గతంలో 200 మీటర్ల పరుగులో 19.19 సెకెండ్లలో నెలకొల్సిన రికార్డును మరోసారి అధిగమించడం కష్టమని ఈ సందర్భంగా బోల్ట్ తెలిపాడు. ' నా కాళ్లు రికార్డులు నెలకొల్పే ప్రదర్శనలు ఇవ్వడానికి సహకరించడం లేదు. గత సీజన్ తరువాత ఆ రికార్డును మరోసారి అందుకునే యత్నం చేశా. అందుకోసం యత్నించా కూడా. కానీ శరీరం అందుకు సహకరించలేదు. కెరీర్ ముగించే సమయంలో విపరీతంగా శ్రమించాలని అనుకోవడం లేదు. ఈ సమయంలో ఆ రికార్డును అధిగమించే ప్రణాళికలు కూడా ఏమీ లేవు.నేను ఆ రికార్డు వెనుకే ఉంటానేమో' అని బోల్ట్ పేర్కొన్నాడు. -
అథ్లెటిక్స్ పోటీలకు 200 మంది
గుంటూరు స్పోర్ట్స్: అండర్–14, 16 బాలబాలికల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మంగళవారం స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియంలో స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఈ పోటీల నుంచి జిల్లా జట్టును ఎంపిక చేసి విశాఖపట్నంలో నవంబర్లో 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్టేడియం సంయుక్త కార్యదర్శి సంపత్ కుమార్, ఉపాధ్యక్షుడు ఓరుగంటి అంకయ్య, అథ్లెటిక్స్ శిక్షకుడు భాష్యం కృష్ణారావు, టెన్నిస్ కోచ్ శివ ప్రసాద్, పీఈటీలు శరత్, నాయక్, రమాసుందరి, జి.జె.కిషోర్, ఎన్.శ్రీనివాస్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఖాజీపాలెం విద్యార్థినుల ప్రతిభ
ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలలో ఖాజీపాలెం డాక్టర్ డీఎస్ రాజు జూనియర్ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ భేతాళం సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం క్రీడాకారులను పలువురు అభినందించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9 వరకు ఆంధ్రప్రదేశ్ స్కూలు గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ (అండర్–19) పోటీలు గుంటూరు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో జరిగాయన్నారు. 1500, 800 మీటర్ల పరుగు పందెంలో కళాశాలకు చెందిన కె.వరలక్ష్మి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, వై.సంధ్యారాణి 3 కి.మీ పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం సాధించారన్నారు. రిలే పరుగు పందెంలో ౖÐð..సంధ్యారాణి, కె.వరలక్ష్మి, ఎం.ప్రసన్న, ఐ.దేవి వైష్ణవి కాంస్య పతకం సాధించారన్నారు. -
దక్షిణ భారత అథ్లెటిక్స్ పోటీలకు మేరికుమార్
నరసరావుపేట ఈస్ట్: దక్షిణ భారత అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ఎస్ఎస్ఎన్ కళాశాల ఐబీఏ విద్యార్థి ఎస్ మేరికుమార్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పీఎన్వీడీ మహేష్ శుక్రవారం తెలిపారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో కరీంనగర్లో జరిగే దక్షిణ భారత అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో జావెలిన్త్రో విభాగంలో మేరికుమార్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. విద్యార్థిని కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, కార్యదర్శి నాగసరపు సుబ్బరాయగుప్తా, ఉపాధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ మహేష్, వైస్ ప్రిన్సిపాల్ సోము మల్లయ్య, వ్యాయామ అధ్యాపకుడు వై మధుసూదనరావు తదితరులు అభినందించారు. -
ఉత్సాహంగా ఎంపికలు
అథ్లెటిక్స్ ఎంపికలకు 800 మంది క్రీడాకారులు హాజరు ఈ నెల 24 నుంచి గచ్చిబౌలిలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్ మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 24, 25తేదీల్లో జరిగే 3వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్–14, 16, 18, 20విభాగాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను మంగళవారం స్థానిక స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలకు జిల్లావ్యాప్తంగా దాదాపు 800మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి కేటగిరీల వారీగా 100మీ., 200మీ., 400మీ., 600మీ., 800మీ., 1500మీ., 2000మీ., 3000మీ., 5000మీ., 10000మీటర్ల పరుగుతో పాటు 5కేఎం, 10కేఎం నడక, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, డిస్కస్త్రో, జావెలిన్త్రో అంశాల్లో ఎంపికలు నిర్వహించారు. అంతకుముందు ఎంపికలను డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఓ నంబర్ 4 క్రీడాపాలసీని జారీ చేసినట్లు తెలిపారు. 50క్రీడాంశాల్లో అథ్లెటిక్స్కు అగ్రభాగాన ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. అథ్లెటిక్స్కు ఎనలేని గుర్తింపు ఉందని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఎంపికలకు బాలికలు కూడా అధికసంఖ్యలో రావడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్లో పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు రాజేశ్వర్, శ్రీనివాసులు, పీఈటీలు ఆనంద్, సునీల్కుమార్, శ్రీనివాసులు, సాధిక్ అలీ, స్వాములు తదితరులు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్ ఏఎంజీ హైస్కూల్
గుంటూరు స్పోర్ట్స్: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగిన అండర్–14, 16 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలలో చిలకలూరిపేటకు చెందిన ఏఎంజీ హైస్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ను సాధించారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి స్దేడియంలో మంగళవారం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ కార్యదర్శి జి.శేషయ్య ఏఎంజీ హైస్కూల్ జట్టుకు ట్రోఫీ అందించారు. గ్రామీణ క్రీడాకారులు అథ్లెటిక్స్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబర్చి రాణిస్తున్నారని చెప్పారు. మెరుగైన సదుపాయాలు వుంటే మేటి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం వుందన్నారు. జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ శిక్షకులు రమాసుందరి, పీఈటీలు రాజు, గమిడి సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్లో ‘మమత కాలేజీ’ సత్తా
హెల్త్ యూనివర్సిటీ పోటీల్లో మెడికోల ప్రతిభ ఖమ్మం స్పోర్ట్స్: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైద్య కళాశాలల పోటీల్లో ఖమ్మం మమత మెడికల్ కళాశాల విద్యార్థులు అథ్లెటిక్స్ విభాగంలో సత్తా చాటారు. ఈ నెల 9, 10వ తేదీల్లో కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో జరిగిన అథ్లెటిక్స్ టోర్నీలో మమత మెడికల్ కాలేజీ మెడికోలు ఏడు పతకాలు సాధించారు. పురుషుల షాట్పుట్, డిస్కస్త్రోలో సాయిఅక్షిత్ ప్రథమస్థానంలో నిలవగా, మహిళల డిస్కస్త్రోలో వి.మనీషారెడ్డి ద్వితీయ, షాట్పుట్లో తృతీయస్థానాలు సాధించగా, పురుషుల లాంగ్జంప్, హైజంప్లో జాన్చంద్ర తృతీయస్థానం దక్కించుకున్నారు. పురుషుల ఐదు కిలో మీటర్లపరుగులో అనిల్ ద్వితీయస్థానంలో నిలిచారు. కళాశాల విద్యార్థులు పతకాలు సాధించడం పట్ల ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, మమత కళాశాలల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు, సెక్రటరీ పువ్వాడ జయశ్రీ, కాలేజీ డీన్ కె.కోటేశ్వరరావు, మమత కళాశాల పీడీ శివరామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థులను గురువారం అభినందించారు. -
రేపు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ విద్యార్థులకు త్వరలో జరిగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ (అథ్లెటిక్స్)కు సంబంధించి నిర్వహణపై చర్చిం చేందుకు స్థానిక కొత్తూరు ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటేశులు తెలిపారు. రేపు ఆంగ్ల బోధనోపాధ్యాయులకు శిక్షణ జిల్లాలోని మోడల్ ప్రైమరీ స్కూళ్లలో పని చేస్తున్న ఇంగ్లిషు టీచర్లకు బుక్కపట్నం డైట్ కళాశాలలో బుధవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 14 నుంచి 18 వరకు ధర్మవరం, పెనుకొండ డివిజన్లకు, 20 నుంచి 24 వరకు అ నంతపురం, గుత్తి డివజన్ల పరిధిలోని టీచర్లు హాజరుకావాలని సూ చించారు. గతంలో ఆంగ్లపరీక్ష రాసిన ప్రతి ఉపాధ్యాయుడు త ప్ప కుండా శిక్షణకు హాజరుకావాలని, ఈ పరీక్షకు గైర్హాజరైన పాఠశాలల్లో ప్రస్తుతం ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు తప్పక హా జరుకావాలని తెలిపారు. హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల జాబితా పంపండి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సమ్మేటివ్–1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులు జాబితా, మీడియంల వారీగా విద్యార్థుల సంఖ్య వివరాలు ఎంఈఓలకు అందజేయాలని హెచ్ఎంలను డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో ఆదేశించారు. ఎంఈఓలు, మండలస్థాయిలో నిర్దేశించిన కమిటీ సభ్యులు బుధవారం ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో నిర్వహించే సమావేశానికి వివరాలతో హాజరుకావాలని సూచించారు. మీడియం, పాఠశాలల వారీగా మండలంలో ని 6–10 తరగతుల విద్యార్థుల సంఖ్య, సబ్జెక్టు వారీగా మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన పాఠశాల, నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు తదితర వివరాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. -
నిత్యకు రెండు స్వర్ణాలు
ఐసీఎస్ఈ-ఐఎస్సీ స్కూల్స్ అథ్లెటిక్స్ హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ- ఐఎస్సీ స్కూల్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జి. నిత్య మెరిసింది. కింగ్కోఠి సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్కు చెందిన ఆమె బాలికల 100 మీటర్ల పరుగు, లాంగ్జంప్ ఈవెంట్లలో విజేతగా నిలిచింది. 100 మీటర్ల స్ప్రింట్లో నిత్య 12.6 సెకన్లలో పోటీని పూర్తి చేసి బంగారు పతకం గెలుపొందింది. ఈమె సహచర విద్యార్థిని కె.హర్షిత (13.5 సె.) రజతం, గీతాంజలి స్కూల్ ఆత్రే చక్రబర్తి (14.4సె.) కాంస్యం నెగ్గారు. లాంగ్జంప్లో నిత్య (4.49 మీ.) మరో స్వర్ణం గెలువగా, ఇందులోనూ హర్షిత (4.37 మీ.)రజతం నెగ్గింది. సెయింట్ ఆన్స అమ్మాయి శివిన్ (3.93 మీ.) కాంస్యం గెలుచుకుంది. ఇతర ఫలితాలు బాలికల 800 మీ. పరుగు: 1. సాక్షి జైన్, 2. నిత్యా రెడ్డి, 3. ఐశ్వర్య వడియార్; షాట్పుట్: 1. శ్రీవియా గణపతి, 2. విన్నీ, 3. అంకిత పచార్; డిస్కస్ త్రో: 1. తేజస్విని, 2. సలోని, 3. ధాత్రి; బాలుర 800 మీ. పరుగు: 1. ఆదిపవన్ తేజ, 2. కౌషిక్, 3. సారుు చంద్ర; లాంగ్జంప్: 1. షణ్ముఖ సాయితేజ, 2. కార్తీక్ సింగ్, 3. రాహుల్. -
జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు రేపు
అండర్–14, 16, 18, 20 విభాగాల్లో ఎంపికలు రన్స్,త్రోస్, జంప్స్ ఈవెంట్స్లో పోరు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి సౌత్జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల సెలక్షన్స్లో పాల్గొనే శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, ఎన్.విజయ్కుమార్ తెలిపారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఎంపికలు ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతాయన్నారు. అండర్–14, 16, 18, 20 ఏళ్ల విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా ఎంపికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 100, 200, 400, 800, 1500, 3వేలు మీటర్ల పరుగు పందాలు, రిలే పరుగు, హార్టిల్స్, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, డిస్కస్త్రో, జావెలిన్త్రో, హేమర్త్రో, పోల్వాల్ట్ తదితర కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఎంపికల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు జిరాక్స్తో ఆ రోజ ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు చేరుకోవాలని వారు సూచించారు. మరిన్ని వివరాలకు సంఘ కార్యనిర్వహన కార్యదర్శి ఎం.సాంబమూర్తి (సెల్: 8500271575)ని సంప్రదించాలి. -
వికాస్ గౌడ చెత్త ప్రదర్శన
అథ్లెటిక్స్లో భారీ బృందంతో బరిలోకి దిగిన భారత్కు తొలి రోజు కలిసిరాలేదు. పురుషుల డిస్కస్ త్రోలో వికాస్ గౌడ ఓవరాల్గా 28వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందలేకపోయాడు. వరుసగా నాలుగో ఒలింపిక్స్లో పాల్గొంటున్న వికాస్ డిస్క్ను మూడు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా 58.99 మీటర్ల దూరం విసిరాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన వికాస్ భుజం గాయం కారణంగా ఈ ఏడాది ఎలాంటి పోటీల్లో పాల్గొనకుండానే నేరుగా ఒలింపిక్స్లో బరిలోకి దిగాడు. గతంలో డిస్క్ను 66.28 మీటర్ల దూరం విసిరి తన పేరిట జాతీయ రికార్డును లిఖించుకున్న వికాస్ ఈ ప్రదర్శన రియోలో పునరావృతం చేసిఉంటే ఫైనల్కు అర్హత పొందేవాడు. క్వాలిఫయింగ్ నుంచి 12 మంది ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్లో పియోటర్ మాలాచౌస్కీ (పోలాండ్) గరిష్టంగా 65.89 మీటర్ల దూరం... కనిష్టంగా ఫిలిప్ మిలానోవ్ (బెల్జియం) 62.68 మీటర్ల దూరం విసిరి ఫైనల్కు చేరుకున్నారు. మహిళల షాట్పుట్ క్వాలిఫయింగ్లో మన్ప్రీత్ కౌర్ (భారత్) ఇనుప గుండను 17.06 మీటర్ల దూరం విసిరి ఓవరాల్గా 23వ స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో జిన్సన్ జాన్సన్ (భారత్) హీట్స్లోనే వెనుదిరిగాడు. మూడో హీట్లో పాల్గొన్న జిన్సన్ జాన్సన్ ఒక నిమిషం 47.27 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచాడు. -
23 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
మహిళల 10 వేల మీటర్ల రేసులో అల్మాజ్ అయానాకు స్వర్ణం 29ని:17.45 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు రియో డి జనీరో: ప్రేక్షకులు అంతంత మాత్రంగానే హాజరైనా... రియో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజే ప్రపంచ రికార్డు బద్దలైంది. శుక్రవారం జరిగిన మహిళల 10 వేల మీటర్ల రేసులో ఇథియోపియా అథ్లెట్ అల్మాజ్ అయానా ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 29 నిమిషాల 17.45 సెకన్లలో గమ్యానికి చేరుకున్న అయానా... ఈ క్రమంలో 1993లో 29 నిమిషాల 31.78 సెకన్లతో వాంగ్ జున్జియా (చైనా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. అయానా ధాటికి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్ వివియన్ చెరియోట్ (కెన్యా-29ని:32.53 సెకన్లు) రజతం దక్కించుకోగా... డిఫెండింగ్ చాంపియన్ తిరునిష్ దిబాబా (ఇథియోపియా-29ని:42.56 సెకన్లు) కాంస్యపతకంతో సంతృప్తి పడింది. 24 ఏళ్ల అయానా 10 వేల మీటర్ల రేసులో పాల్గొనడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. రెండు నెలల క్రితం ఇథియోపియా జాతీయ ట్రయల్స్లో తొలిసారి 10 వేల మీటర్ల రేసులో పాల్గొని అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసి ఆమె రియో బెర్త్ను ఖాయం చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడల వేదికలో 10 వేల మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తొలి మహిళా అథ్లెట్గా అయానా గుర్తింపు పొందింది. -
దక్షిణ భారతస్థాయి అథ్లెటిక్స్ వేదికగా జిల్లా
అక్టోబర్ 4, 5 తేదీల్లో పోటీలు కరీంనగర్ స్పోర్ట్స్ : 28వ దక్షిణ భారతస్థాయి జూనియర్స్ అథ్లెటిక్ ్స పోటీలకు జిల్లా వేదికగా మారనుంది. ఢిల్లీలో కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇంyì యా ప్రతినిధులను గురువారం సంప్రదించారు. నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని జిల్లా అథ్లెటిక్ సంఘం ప్రతినిధులకు అందజేశారు. ఈ పోటీల వేదికగా జిల్లాను ఎంపిక చేశారు. జిల్లా అథ్లెటిక్ సంఘం కార్యదర్శి మహిపాల్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. పోటీల నిర్వహణ బాధ్యతలు జిల్లాకు వచ్చేలా కృషి చేసిన ఎంపీ వినోద్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్కు రాష్ట్ర క్రీడాకారులతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరీ, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్ నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు చెప్పారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో పోటీలు జరుగనున్నాయని, అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని తెలిపారు. -
ఖేల్ కహానీ
అథ్లెటిక్స్ అందుబాటులో ఉన్న స్వర్ణాలు 47 రకరకాల క్రీడాంశాల సమాహారమే అథ్లెటిక్స్. ట్రాక్ అండ్ ఫీల్డ్, రోడ్, ఫీల్డ్ ఈవెంట్స్, వాకింగ్లో పోటీలు జరుగుతాయి. సమయం, కొలతలు, ఎత్తు, దూరం, ఫినిషింగ్ పొజిషన్లాంటి లెక్కలతో విజేతలను నిర్ణయిస్తారు. రిలే రేసులు మినహా మిగతా పోటీలన్నీ వ్యక్తిగత విభాగాల్లోనే జరుగుతాయి. ఏథెన్స్ (1896) ఒలింపిక్స్తో ఈ పోటీలకు కాస్త వెలుగు వచ్చింది. అప్పట్లో అథ్లెట్లు పరుగులు తీస్తుంటే లైన్ పక్కన నిల్చొని జడ్జీలు నిశితంగా పరిశీలించేవారు. అయితే ఆధునిక పోటీలకు సంబంధించిన నియమ నిబంధనలు వెస్ట్రన్ యూరోపియన్, నార్త్ అమెరికా నిర్దేశించాయి. తర్వాతి కాలంలో ఈ అథ్లెటిక్స్ను ప్రపంచ మొత్తం విస్తరింపజేశాయి. ఒలింపిక్స్లో మిగతా పోటీలతో పోలిస్తే అథ్లెటిక్స్కు చాలా ప్రత్యేకత ఉంటుంది. క్షణాల్లో తారుమారయ్యే ఫలితాలు, వాయువును మించిన వేగంతో దూసుకుపోయే అథ్లెట్లు, సింహంలా ఆమాంతం లంఘించే నేర్పర్లు, ఆకాశం అంచుల దాకా ఎగిరే జంపింగ్లు, అలసట లేకుండా కిలో మీటర్లు పరుగెత్తడం, సింగిల్ నైట్తో స్టార్లుగా మారే క్రీడాకారులు దీనిలోనే ఎక్కువగా కనిపిస్తారు. అథ్లెటిక్స్లో ప్రధానంగా 100 మీటర్ల పరుగుకు ప్రపంచంలో వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఒక్క ఈవెంట్ ఫలితాలే దేశాల చరిత్రను మార్చిన సందర్భాలు ఉన్నాయి. కరీబియన్లు కత్తులు షార్ట్ డిస్టెన్స్ పరుగులో కరీబియన్లు, అమెరికన్ల హవా ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్లో మాత్రం ఆఫ్రికా అథ్లెట్ల హవా కొనసాగుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్లో అమెరికా అథ్లెట్ల ఆధిపత్యం కనబడుతుంది. పోల్వాల్ట్, హైజంప్లో రష్యా పటిష్టంగా ఉంటుంది. షాట్పుట్, డిస్కస్ త్రో, ట్రిపుల్ జంప్, స్టీపుల్ ఛేజ్లో కొన్ని చిన్న దేశాలు కూడా విశేషమైన ప్రతిభను చూపుతున్నాయి. ఒకరిద్దరిపై స్వల్ప ఆశలు ఈసారి రియో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందం జాబితా పెద్దగానే ఉంది. పురుషుల్లో 20 మంది, మహిళల్లో 17 మంది తమ పతక అవకాశాలను పరీక్షించుకోనున్నారు. 100, 200, 800, 4ఁ400, మారథాన్, 20, 50 కి,మీ, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో మన అథ్లెట్లు తమ ప్రతిభ పాటవాలను చూపెట్టనున్నారు. వికాస్ గౌడ, సీమా అంటిల్ (డిస్కస్ త్రో), రంజిత్ మహేశ్వరి (ట్రిపుల్ జంప్), కవితా రౌత్, జైశా, సుధా సింగ్ల మారథాన్ బృందంలపై పతకం ఆశలు కొద్దిగా పెట్టుకోవచ్చు. -
భారత్ ‘పసిడి సిక్సర్’
అథ్లెటిక్స్, షూటింగ్లలో స్వర్ణాలు దక్షిణాసియా క్రీడలు గువాహటి: సొంతగడ్డపై తమ దూకుడును కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల ఏడో రోజు శుక్రవారం భారత్కు మరో ఆరు స్వర్ణాలు లభించాయి. అథ్లెటిక్స్లో మారథాన్ రేసులో భారత్ క్లీన్స్వీప్ చేసింది. అందుబాటులో ఉన్న రెండు స్వర్ణాలనూ సొంతం చేసుకుంది. షూటర్లు తమ గురికి మరింత పదునుపెట్టి మరో నాలుగు బంగారు పతకాలను గెల్చుకున్నారు. ప్రస్తుతం భారత్ 146 స్వర్ణాలు, 80 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 249 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గగన్కు రెండు పతకాలు షూటింగ్లో భారత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన నాలుగు ఈవెంట్స్లోనూ భారత్కే పసిడి పతకాలు దక్కాయి. తెలంగాణ షూటర్ గగన్ నారంగ్ స్వర్ణం, కాంస్యం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో గగన్ నారంగ్, చెయిన్ సింగ్, ఇమ్రాన్ హసన్ ఖాన్లతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో చెయిన్ సింగ్కు స్వర్ణం, గగన్ నారంగ్కు కాంస్యం లభించాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో నీరజ్ కుమార్, గుర్ప్రీత్ సింగ్, మహేందర్ సింగ్లతో కూడిన భారత జట్టుకు బంగారు పతకం దక్కగా... ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో నీరజ్ కుమార్, గుర్ప్రీత్, మహేందర్లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభించాయి. మహిళల హాకీ జట్టుకు స్వర్ణం, పురుషుల జట్టుకు రజతం హాకీలో భారత్కు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల జట్టు స్వర్ణం సాధించగా... పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. మహిళల ఫైనల్లో భారత్ 10-0తో శ్రీలంకను ఓడించింది. తెలంగాణ క్రీడాకారిణి యెండల సౌందర్య భారత్ తరఫున రెండు గోల్స్ సాధించింది. మరోవైపు పురుషుల ఫైనల్లో భారత్ 0-1 గోల్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ హాకీ జట్టుకిది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. 2006, 2010 క్రీడల్లోనూ పాకిస్తాన్ విజేతగా నిలిచింది. రియో ఒలింపిక్స్కు కవిత అర్హత అథ్లెటిక్స్ పోటీలను భారత్ స్వర్ణాలతో ముగించింది. మహిళల మారథాన్ రేసులో కవితా రౌత్ విజేతగా నిలిచింది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని కవిత 2 గంటల 38 నిమిషాల 38 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. మారథాన్ విభాగంలో రియో ఒలింపిక్స్కు భారత్ నుంచి అర్హత పొందిన నాలుగో క్రీడాకారిణిగా కవిత గుర్తింపు పొందింది. ఇప్పటికే ఓపీ జైషా, లలితా బబ్బర్, సుధా సింగ్ రియో బెర్త్ను ఖాయం చేసుకున్నారు. పురుషుల మారథాన్లోనూ భారత్కే స్వర్ణం దక్కింది. భారత అథ్లెట్ నితేందర్ సింగ్ రావత్ 2 గంటల 19 నిమిషాల 18 సెకన్లలో గమ్యానికి చేరుకొని బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
బుల్లెట్’ దిగింది
♦నారంగ్ బృందానికి స్వర్ణం ♦టెన్నిస్లో మరో రెండు కనకాలు ♦అథ్లెటిక్స్లో కొనసాగిన హవా గుహవాటి: దక్షిణాసియా క్రీడల్లో భారత షూటర్ల గురి అదిరింది. గురువారం అందుబాటులో ఉన్న ఐదు స్వర్ణాలను క్లీన్స్వీప్ చేసి సత్తా చాటారు. టెన్నిస్, అథ్లెటిక్స్లోనూ టీమిండియా జోరు చూపెట్టడంతో పాయింట్ల పట్టికలో భారత్ దూసుకుపోతోంది. ఓవరాల్గా 237 (139 స్వర్ణాలు+ 78 రజతాలు+ 20 కాంస్యాలు) పతకాలతో టాప్లో కొనసాగుతోంది. శ్రీలంక (149), పాకిస్తాన్ (71) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాలిపరా షూటింగ్ రేంజ్లో జరిగిన పోటీల్లో హైదరాబాద్ స్టార్ షూటర్ గగన్ నారంగ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గినా... వ్యక్తిగత విభాగంలో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల వ్యక్తిగత రైఫిల్ ప్రోన్లో నారంగ్ 183.1 పాయింట్లతో రెండో స్థానం (రజతం)లో నిలవగా, చైన్ సింగ్ (భారత్) 184.1 పాయింట్లతో ‘పసిడి’ని సొంతం చేసుకున్నాడు. టీమ్ విభాగంలో నారంగ్, చైన్ సింగ్, సురేంద్ర సింగ్ల త్రయం 1871.5 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. పురుషుల వ్యక్తిగత 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్లో సమరేష్ జంగ్ 580 పాయింట్లతో స్వర్ణం, పెంబా తమంగ్ (579 పాయింట్లు), విజయ్ కుమార్ (577 పాయింట్లు) వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో కుహిలి గంగూలీ (619.9 పాయింట్లు) పసిడి, లజ్జా గౌస్వామి (608.2 పాయింట్లు) రజతం, అనుజా జంగ్ (607.5 పాయింట్లు) కాంస్యం సాధించారు. టీమ్ ఈవెంట్లోనూ ఈ ముగ్గురు 1835.6 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకున్నారు. జోరు తగ్గని అథ్లెట్లు భారత అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్లో మరో ఏడు స్వర్ణాలతో మెరిశారు. మహిళల జావెలిన్ త్రోలో సుమన్ దేవి (59.45 మీ.) స్వర్ణం, అన్ను రాణి (57.13 మీ.) రజతం గెలిచారు. పురుషుల ట్రిపుల్ జంప్లో వెటరన్ రంజిత్ మహేశ్వరి (16.45 మీటర్లు)కి పసిడి, సురేందర్ (15.89 మీటర్లు)కు రజతం లభించాయి. పురుషుల షాట్పుట్లో ఓం ప్రకాశ్ సింగ్ (18.45 మీటర్లు), జస్దీప్ సింగ్ (17.56 మీటర్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజతం సొంతం చేసుకున్నారు. పురుషుల 15 వందల మీటర్లలో అజయ్ కుమార్ సరోజ్ (3:53.46 సెకన్లు) స్వర్ణం నెగ్గాడు. మహిళల విభాగంలో పీయూ చిత్ర (4:25.29 సెకన్లు) పసిడితో మెరిసింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో ధరుణ్ అయ్యస్వామి (50.54 సెకన్లు), జితిన్ పాల్ (50.57 సెకన్లు); మహిళల్లో జునా మర్ము (57.69 సెకన్లు), అశ్విని అకుంజ్ (58.92 సెకన్లు) స్వర్ణాలు, రజతాలు సాధించారు. మహిళల 10 వేల మీటర్లలో సూర్య (32:39.86 సెకన్లు) కనకం కైవసం చేసుకుంది.. 4ఁ400 మీటర్ల రిలేలో పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలను సాధించాయి. రిషికకు రజతం టెన్నిస్లో హైదరాబాద్ అమ్మాయి రిషిక సుంకరకు రజతం లభించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో రిషిక-నటాషా పల్హా 5-7, 6-2, 4-10తో ప్రా ర్థన తోంబ్రే-శర్మద బాలు చేతిలో ఓడి రెండో స్థానంతో సంతృప్తిపడ్డారు. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో రామ్కుమార్ రామనాథన్ 7-5, 6-2తో సాకేత్ మైనేనిపై నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. -
స్వర్ణాల సెంచరీ పూర్తి
ఐదో రోజూ భారత్దే జోరు ఒకేరోజు 39 స్వర్ణాలుబ్యాడ్మింటన్లో రుత్విక సంచలనంఫైనల్లో సింధుపై విజయంతో స్వర్ణందక్షిణాసియా క్రీడలు గువాహటి/షిల్లాంగ్: బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్న భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో పసిడి పంటను పండిస్తున్నారు. పోటీల ఐదో రోజూ భారత్ ఏకంగా 39 స్వర్ణాలు సాధించి పతకాల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. బుధవారం జరిగిన క్రీడాంశాల్లో బ్యాడ్మింటన్, షూటింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్లలో భారత క్రీడాకారులు అందుబాటులో ఉన్న అన్ని స్వర్ణాలు సొంతం చేసుకొని క్లీన్స్వీప్ చేశారు. ప్రస్తుతం భారత్ 117 స్వర్ణాలు, 61 రజతాలు, 16 కాంస్యాలతో 194 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబుల్స్లో సిక్కి, జ్వాల, సుమీత్లకు స్వర్ణాలు షటిల్ బ్యాడ్మింటన్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్కు బంగారు పతకాలు లభించాయి. స్వర్ణం నెగ్గిన ప్రతి ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారులు (రుత్విక, శ్రీకాంత్, గుత్తా జ్వాల, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి) ఉండటం విశేషం. మహిళల సింగిల్స్లో యువతార గద్దె రుత్విక శివాని పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ 12వ ర్యాంకర్, తెలంగాణకే చెందిన పీవీ సింధుతో జరిగిన ఫైనల్లో ప్రపంచ 131వ ర్యాంకర్ రుత్విక 21-11, 22-20తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ‘మ్యాచ్ సంగతి అటుంచితే సింధుపై ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా గెలువలేదు. ఈ విజయం అనూహ్యం, అద్భుతం. నా కెరీర్లో ఇవి మధుర క్షణాలు. నమ్మశక్యంకాని విజయంతో నా కళ్లలోంచి ఆనందబాష్పాలు వస్తున్నాయి’ అని సింధును ఓడించిన తర్వాత రుత్విక వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 11-21, 21-14, 21-6తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)పై గెలిచి స్వర్ణం సాధించాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21-9, 21-7తో సిక్కి రెడ్డి-మనీషా (భారత్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జోడీ 21-18, 21-17తో అక్షయ్ దేవాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) జంటపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట 30-29, 21-17తో మనూ అత్రి-అశ్విని పొన్నప్ప జోడీని ఓడించింది. టేబుల్ టెన్నిస్లోనూ భారత్కు ఎదురులేకుండాపోయింది. పురుషుల సింగిల్స్లో ఆంథోనీ అమల్రాజ్, మహిళల సింగిల్స్లో మౌమా దాస్... మహిళల డబుల్స్లో మణిక బాత్రా-పూజా సహస్రబుద్ధే జోడీ... పురుషుల డబుల్స్లో సత్యన్-దేవేశ్ కరియా జంట విజేతలుగా నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నాయి.టెన్నిస్లో భారత్కు మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల డబుల్స్లో రామ్కుమార్ రామనాథన్-విజయ్ సుందర్ ప్రశాంత్, మహిళల సింగిల్స్లో అంకిత రైనా (భారత్), మిక్స్డ్ డబుల్స్లో అంకిత రైనా-దివిజ్ శరణ్ స్వర్ణాలు సాధించారు. స్క్వాష్లో తొలిసారి...దక్షిణాసియా క్రీడల చరిత్రలో తొలిసారి ఏకకాలంలో భారత పురుషుల, మహిళల జట్లు స్క్వాష్ ఈవెంట్లో విజేతగా నిలిచాయి. పురుషుల టీమ్ ఫైనల్లో సౌరవ్ ఘోషాల్, రవి దీక్షిత్, కుష్ కుమార్, హరీందర్ పాల్ సంధూలతో కూడిన భారత బృందం 2-1తో పాకిస్తాన్ను బోల్తా కొట్టించగా... జోష్నా చినప్ప, దీపిక, సునయన, ఆకాంక్షలతో కూడిన భారత మహిళల జట్టు 2-0తో పాకిస్తాన్ను ఓడించింది. అథ్లెటిక్స్లో భారత్కు ఒకేరోజు పది పసిడి పతకాలు వచ్చాయి. మహిళల లాంగ్జంప్లో మయూఖా జానీ, 400 మీటర్ల రేసులో ఎంఆర్ పూవమ్మ, 100 మీటర్ల హర్డిల్స్లో గాయత్రి, హైజంప్లో సహన కుమారి... పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, 400 మీటర్ల రేసులో అరోక్య రాజీవ్, డిస్కస్ త్రోలో అర్జున్, లాంగ్జంప్లో అంకిత్ శర్మ, 10 వేల మీటర్ల రేసులో గోపీ స్వర్ణాలు నెగ్గారు.షూటింగ్లో భారత్కు మూడు స్వర్ణాలు దక్కాయి. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో అపూర్వీ చండీలా విజేతగా నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో, పురుషుల 50 మీటర్ల టీమ్ పిస్టల్ ఈవెంట్లోనూ భారత్కు పసిడి పతకాలు లభించాయి.స్విమ్మింగ్లో పురుషుల 50 మీటర్ల బటర్ఫ్లయ్లో వీర్ధవల్ ఖాడే, మహిళల 200 మీటర్ల మెడ్లేలో శ్రద్ధ సుధీర్, 50 మీటర్ల బటర్ఫ్లయ్లో జ్యోత్స్న పన్సారె విజేతలుగా నిలిచారు. 4ఁ100 మీటర్ల పురుషుల, మహిళల రిలే రేసుల్లోనూ భారత్కు స్వర్ణాలు లభించాయి. వుషు క్రీడాంశంలో జ్ఞాన్దశ్ సింగ్ (తైజిక్వాన్, తైజియాన్)... సంతోంబి చాను (తైజిక్వాన్, తైజియాన్) పసిడి పతకాలు సాధించారు. ఈ ఇద్దరే కాకుండా పురుషుల సాన్షూ ఈవెంట్లో ఉచిత్ శర్మ (52 కేజీలు), రవి పాంచాల్ (56 కేజీలు), సూర్య భానుప్రతాప్ సింగ్ (60 కేజీలు)... మహిళల సాన్షూ ఈవెంలో సనతోయ్ సింగ్ (52 కేజీలు), అనుపమా దేవి (60 కేజీలు), పూజా కడియాన్ (70 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. -
యూత్ గేమ్స్ లో సత్తాచాటిన భారత్
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ గురువారం రోజు భారత్ చెలరేగారు. రెండు స్వర్ణాలతో సహా ఏకంగా.. ఏడు మెడల్స్ ఖాతాలో వేసుకున్నారు. ఆర్చర్ ప్రాచీ సింగ్ వ్యక్తిగత విభాగంలోనూ, టెన్సిస్ మిక్స్ డ్ డబల్స్ విభాగంలో శశికుమార్, ధృతీ వేణుగోపాల్ లు బంగారు పతకాలు సాధించారు. బాక్సర్ గౌరవ్ 52 కిలోల విభాగంలో, ఆర్చర్ నిషాంత్ బాలుర వ్యక్తిగత విభాగంలో, స్క్వాష్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో సెంధిల్, హర్షిత్ లు రజత పతకాలు సాధించారు. ఇక భీమ్ చంద్, ప్రజ్ఞా చౌహాన్లు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. కాగా ఈ క్రీడల్లో ఇప్పటి వరకూ 7 బంగారు, 4 రజత, 6 కాంస్య పతకాలు సాధించి భారత్ భారత్ పతకాల పట్టికలో ఆరో స్ధానం పొందింది. టెన్సిస్ వ్యక్తిగత విభాగంలో శశికుమార్, ధృతిలు ఫైనల్స్ శుక్రవారం ఉంది. దీంతో చివరి రోజు భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరే అవకాశం ఉంది. -
వీళ్లు మనకు తెలుసునా..!
గతవారం ఢిల్లీలో క్రీడా ఆవార్డుల కార్యక్రమం ముగిసింది. జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకూ అంతా రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా ఫోటోను ప్రముఖంగా ప్రచురించాయి. ప్రొఫెషనల్ టెన్నిస్ లో సానియా సాధించిన విజయాలకు ఖేల్ రత్న ఖచ్చితంగా సముచితమైన గౌరవమే..అయితే సానియా తో పాటు మరో డజను మంది ఆటగాళ్లు గత ఏడాది కాలంగా తమ తమ రంగాల్లో చూపిన అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులు గెలుచుకున్నారు. దురదృష్ట వశాత్తు వీరిని మీడియా పట్టించుకోలేదు. అవార్డుల వెనక రాజకీయాలు... క్రీడా బోర్డుల అతి చొరవ, అనేక వివాదాలు మాత్రమే మీడియా దృష్టిని ఆకర్షస్తాయి. ఆటలంటే.. క్రికెట్, చెస్, సానియా, సైనాలు మాత్రమే కాదు అని ఎంతో మంది తమ అద్వితీయ ఆటతీరుతో నిరూపిస్తున్నా.. కోట్లాది భారతీయుల గుర్తింపునకు మాత్రం నోచుకోవడం లేదు.. అలాంటి అన్ సంగ్ హీరోస్ దేశంలో చాలా మందే ఉన్నా.. కనీసం ఈ ఏడాది రాష్ట్ర పతి చేతులతో అవార్డులు పొందిన క్రీడాకారుల ఎంత మంది మనకు తెలుసు.. ? సందీప్ కుమార్: ఆర్చరీ పూనేకి చెందిన సందీప్ కుమార్ ఆసియా క్రీడల్లో పటిష్ట కొరియాని మట్టి కరిపించి ఈ విభాగంలో తొలి బంగారు పతకాన్ని భారత్ కు అందించాడు. పూనమ్మ: అథ్లెటిక్స్ ఆఫ్రికా, యూరప్, అమెరికాలు డామినేట్ చేసే ఈ విభాగంలో మన పూవమ్మ ప్రపంచ 42 రెండో ర్యాంక్ లో కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400మీటర్ల వ్యక్తిగత కాంస్య పతకంతో పాటు, బంగారు పతకం గెలుచుకున్న 4X400 మీటర్ల రిలే టీమ్ లో సభ్యురాలు. అంతే కాదు ఆసియా స్థాయిలో బోలెడు వ్యక్తిగ పతకాలు సాధించి.. అర్జున అవార్డుకు అర్హత పొందింది. దీపా కుమార్: జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీపా కుమార్ చరిత్రే సృష్టించింది. గ్లాస్కో కామన్ వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించి.. ఈ విభాగంలో పోడియం ఫినిష్ ఇచ్చిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల్లో పతకం తృటిలో కోల్పోయినా.. దీపా ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది. శ్రీజేష్ : హాకీ మన జాతీయ క్రీడా హాకీలో అద్భుత ప్రదర్శనకు గానూ.. శ్రీజేష్ అర్జున అవార్డు అందుకున్నాడు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం అందుకున్న భారత జట్టు గోల్ కీపర్ శ్రీజేష్. అంతే కాదు. ఈ క్రీడల్లో పాకిస్తాన్ మ్యాచ్ లో శ్రీజేష్ అద్వితీయ ప్రదర్శన ఆయనకు ఆర్జున అవార్డు తెచ్చిపెట్టింది. ఫైనల్లో పాకిస్థాన్ సంధించిన రెండు పెనాల్టీ స్ట్రోక్ లను శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఇక 2014 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. సతీష్ కుమార్: వెయిట్ లిఫ్టింగ్ అనామకుడిగా కామన్ వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టిన ఈ 23ఏల్ల తమిళనాడు క్రీడాకారుడు... 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో గేమ్స్ రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. బంగారు పతకాన్ని సాధించాడు. స్వరణ్ సింగ్ : రోయింగ్ 2012 సమ్మర్ ఓలింపిక్స్ లో రోయింగ్ లో ఫైనల్ కు చేరిన స్వరణ్.... 2013 ఆసియా రోయింగ్ చాంఫియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. ఇక 2014 ఆసియా క్రీడల్లో తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతూ కూడా కాంస్య పతకాన్ని సాధించాడు. ఇక అందరికంటే స్పెషల్ క్రీడాకారుడిని వరించి అర్జున అవార్డు మరింత వన్నెలద్దుకుంది. అతని పేరు శరత్ గైక్వాడ్. వివిద విభాగాల్లో అత్యధిక మెడల్స్ సాధించిన ప్రఖ్యాత క్రీడాకారిణి పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన శరత్ బెంగుళూరు వాసి. 2014 ఆసియా క్రీడల్లో ప్యారా స్విమ్మింగ్ విభాగంలో 6 పతకాలు సాధించాడు. 2012లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న శరత్.. భారత్ తరఫున పారాలంపిక్స్ కు వెళ్లిన తొలి భారతీయ క్రీడాకారుడు కావడం గమనార్హం. -
తన రికార్డు తానే బద్ధలు
న్యూఢిల్లీ: తన రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నాడు ప్రముఖ హ్యామర్ త్రో క్రీడాకారుడు కమల్ ప్రీత్ సింగ్. టస్కాన్లోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఈ అథ్లెట్ క్రీడాకారుడు 72.86 మీటర్ల దూరం హ్యామర్ను విసిరి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఆసియాలోనే మూడో వ్యక్తి గా రికార్డు నమోదుచేశాడు. గడిచిన రెండు నెలల్లోనే ఇలా జాతీయ స్థాయి రికార్డును బద్ధలు కొట్టేయడం ఇది రెండో సారి. ఇదిలా ఉండగా, జూన్ 3 నుంచి 7 వరకు చైనాలో జరిగే ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కోసం కమల్ ఎంపిక కాకపోవడం గమనార్హం. పంజాబ్కు చెందిన కమల్ ప్రీత్ సింగ్ పేరిట గతంలో 70.38, 70.37 మీటర్ల రికార్డు ఉండగా ఈసారి 72.86 మీటర్లు హ్యామర్ ను విసిరి రికార్డు బద్ధలు కొట్టాడు. -
'చనిపోయేలోపు భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉంది'
హైదరాబాద్:తాను చనిపోయేలోపు ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉందని అథ్లెటిక్ లెజెండ్ మిల్కాసింగ్ తెలిపాడు. శనివారం హైదరాబాద్ కు వచ్చిన మిల్కాసింగ్ మీడియాతో ముచ్చటించాడు. తాను ప్రస్తుతం 63 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సంగతిని మిల్కాసింగ్ గుర్తు చేసుకున్నాడు. భారతదేశంలో వందల కోట్ల మంది ప్రజలున్నా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఒలింపిక్స్ కు సెలెక్ట్ అవుతున్నారన్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమన్నాడు. క్రీడాకారులు మంచి ఫిట్ నెస్ గా ఉండాలని, అందుకు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలని సూచించాడు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం అందించాలన్నాడు. -
ఏఎఫ్ఐకు మిల్కాసింగ్ మద్దతు!
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్ ఫెడరేషన్(ఏఎఫ్ఐ)కు అథ్లెటిక్ లెజెండ్ మిల్కాసింగ్ మద్దుతుగా నిలిచాడు. దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో పురుషుల రిలే టీంను పంపకపోవడాన్నిఈ దిగ్గజ అథ్లెటిక్ సమర్ధించాడు. ' ఆ విభాగంలో భారత్ పేలవంగా ఉంది. 4/400 విభాగం నుంచి భారత అథ్లెటిక్ జట్టును ఆసియా గేమ్స్ కు పంపకపోవడం సరైన నిర్ణయం' అని మిల్కాసింగ్ అభిప్రాయపడ్డాడు. భారత అథ్లెటిక్స్ వారి అర్హతకు సంబంధించి శిక్షణా కార్యక్రమంలోనే పరీక్షించుకోవాలని తెలిపాడు. ఏఎఫ్ఐ కమిటీ 56 మంది అథ్లెటిక్స్ ను భారత్ నుంచి ఎంపిక చేసినా.. వారిని తిరిగి పరీక్షించాల్సిన అవసరం కూడా ఉందన్నాడు. -
ఎత్తు లేకున్నా... ఎంతో ఎత్తుకు..!
కనీసం నాలుగు అడుగులు దాటని ఎత్తు... వయసేమో రెండు పదులు... ప్రతిభ ఉన్నా కాలంతో పోటీపడదామంటే ప్రోత్సాహం కరువు... గుర్తించే వాళ్లు అంతకన్నా లేరు... ఇవీ మరుగుజ్జుల కష్టాలు... అలాగని వాళ్లు మనో ధైర్యాన్ని వీడలేదు... క్రీడల్లో తమకున్న నైపుణ్యానికి మరింత పదును పెట్టారు... మంచి ఫలితాలు సాధించారు... తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మరుగుజ్జులంటే అందరికీ చిన్నచూపే... సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు... ప్రతిభ ఉన్నా బండెడు కష్టాలే... అందుకే వాళ్లు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లతోనో... సర్కస్లో జోకర్లుగానో... చిరు వ్యాపారులుగానో స్థిరపడిపోతున్నారు. ఇవేమీ లేనివాళ్లు బతుకు బండిని భారంగా లాగిస్తున్నారు. అయితే సమాజంలో తమకూ ఏదో విధమైన గుర్తింపు దక్కాలన్న ఆశయం వారిని క్రీడాకారుల్ని చేసింది. తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించేలా చేసింది. ఫలితంగా మరుగుజ్జులు డ్వార్ఫ్ క్రీడల్లో, పారా ఒలింపిక్స్లో సత్తా చాటుతున్నారు. ఇంతింతై... మరుగుజ్జు క్రీడాకారుల కోసం అమెరికాలో డ్వార్ఫ్ అథ్లెటిక్ అసోసియేషన్ 1985లో ఏర్పాటైంది. మరుగుజ్జు క్రీడలను అభివృద్ధి చేసి, వాటికి ప్రాచుర్యం కల్పించి, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ సంఘం ఏర్పడింది. అలా తామూ ఏ క్రీడలనైనా ఆడగలమనే ధీమాను సాధించడమే కాకుండా మరుగుజ్జులకు పోటీలూ ఉన్నాయని ప్రపంచానికి చాటినట్లయింది. అలా మొదలైన వారి ప్రస్థానం ప్రపంచ క్రీడల్లో ప్రత్యేకంగా కొనసాగుతోంది. మరుగుజ్జులకు ప్రత్యేకం అథ్లెటిక్స్... ఫుట్బాల్... బాస్కెట్బాల్... స్విమ్మింగ్... బ్యాడ్మింటన్... ఫ్లోర్ హాకీ... వాలీబాల్... ఆర్చరీ.. టెన్నిస్... పవర్లిఫ్టింగ్... షూటింగ్... కర్లింగ్... ఇలా పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉండి.. క్రీడాకారుడిగా సత్తా చాటాలనుకునే మరుగుజ్జుల కోసం ప్రతీ నాలుగేళ్లకోసారి ప్రపంచ క్రీడలు జరుగుతాయి. ఇప్పటిదాకా ఆరుసార్లు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడలు జరగ్గా... చివరిసారిగా 2013లో అమెరికాలోని మిచిగాన్ ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. 2013 ప్రపంచ క్రీడల్లో 17 దేశాలకు చెందిన 395 మంది మరుగుజ్జులు పోటీల్లో పాల్గొన్నారు. 1993లో తొలిసారిగా ఈ పోటీలకు అమెరికాలోని చికాగో ఇల్లినాయిస్లో నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేది వీరే మరుగుజ్జుల పోటీల్లో పాల్గొనాలనుకునే వారి ఎత్తు నాలుగు అడుగుల పది అంగుళాలు మించకూడదు. కండరాలు అసాధారణంగా పెరగడం వల్ల కాళ్లు, చేతుల్లో వాపు వచ్చిన వారిని ఇందులో పాల్గొనేందుకు అనుమతినిస్తారు. అయితే ఈ పోటీల్లో పాల్గొనే వాళ్లంతా మెడికల్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక డ్వార్ఫ్ క్రీడలు ఎక్కడ జరిగినా నిబంధనలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఈ క్రీడల్లో పాల్గొనే వాళ్లు పారా ఒలింపిక్స్లోనూ బరిలోకి దిగుతుంటారు. అందుకే మరుగుజ్జులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఈ క్రీడల్లో పాల్గొనే వారికి ఫ్యూచర్స్, జూనియర్స్, ఓపెన్, మాస్టర్స్ వయస్సు గ్రూపుల్లో పోటీలు నిర్వహిస్తారు. వీరికి అత్యున్నత క్రీడలు ఒకరకంగా ప్రపంచ డార్ఫ్ గేమ్సే. మరుగుజ్జు క్రీడాకారులు ఏ దేశానికి చెందిన వారైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. తమ దేశానికి చెందిన చెఫ్ డి మిషన్ ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ చీఫ్ డి మిషన్ లేకపోతే పోటీల్లో పాల్గొనేందుకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మనకూ ఉన్నారు... మరుగుజ్జు క్రీడల్లో మనవాళ్లూ తక్కువేమీ తినలేదు. భారత్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొనేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు అంతర్జాతీయ వేదికల్లో రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లో పతకాల పంట పండించారు. 9 బంగారు పతకాలతో సహా మొత్తం 18 పతకాలు సాధించి భారత్ను ఆరో స్థానంలో నిలిపారు. 16 మంది పోటీల్లో పాల్గొనగా.. జోబీ మాథ్యూ, రాజన్న, ప్రకాశ్, ఆకాశ్ మాధవన్, నళిని, రేణు కుమార్లు తమ సత్తా చాటి పలు విభాగాల్లో పతకాలు సాధించారు. ఆల్రౌండర్ జోబి కేరళకు చెందిన 38 ఏళ్ల మరుగుజ్జు జోబీ మాథ్యూ అర్మ్ రెజ్లర్గా అందరికీ సుపరిచితమే. ప్రాక్సిమల్ ఫెమోరల్ ఫోకల్ డెఫీషియన్సీ (పీఎఫ్ఎఫ్డీ) కారణంగా జోబి 60 శాతం వైకల్యంతో పుట్టాడు. పీఎఫ్ఎఫ్డీ వల్ల జోబి కాళ్లలో ఏమాత్రం ఎదుగుల లేకపోయినా.. మిగిలిన శరీరం మొత్తం వయసుకు తగ్గట్లుగానే పెరిగింది. మూడు అడుగుల ఐదు అంగుళాల పొడవున్న ఈ కేరళ మరుగుజ్జు తాను ఎత్తు పెరగలేకపోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. కాళ్లు సహకరించకపోయినా.. మిగిలిన శరీరంలో అందరి లాగే పెరుగుదల ఉండటంతో జిమ్కి వెళ్లి తీవ్రంగా సాధన చేశాడు. అందుకు జోబికి తగిన ఫలితం దక్కింది. బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్లో సత్తా చాటాడు. స్పెయిన్లో జరిగిన 29వ ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్లో చాంపియన్గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లోనూ దుమ్ము రేపాడు. అథ్లెటిక్స్ క్లాస్ 3లో షాట్పుట్, డిస్కస్ త్రో, జావిలిన్ త్రో తోపాటు సీనియర్ క్లాస్ 1 బ్యాడ్మింటన్ సింగిల్స్లో బంగారు పతకాలు సాధించాడు. ఇక జోబి జనరల్ కేటగిరీలోనూ, వైకల్య విభాగంలోనూ రెజ్లింగ్, ఫెన్సింగ్, బాడీ బిల్డింగ్లో చాలా సార్లు సత్తా చాటి ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు. -
అథ్లెటిక్స్లో గిరిపుత్రుడు
గిరిజనతండాలు అంటేనే అత్యంత వెనుకబడిన ఆవాస ప్రాంతాలకు నిలయాలు. కనీస వసతులతోపాటు రవాణా సౌకర్యం అసలే ఉండదు. దీంతో అక్కడి ప్రజలు దయ నీయ పరిస్థితుల మధ్య జీవన పోరాటం చేస్తుంటారు. అలాంటి తండాకు చెందిన ఓ యువకుడు అథ్లెటిక్స్లో చిరుత వేగతంలో దూసుకెళ్లి సత్తాచాటుతున్నాడు. అతడే కోదాడ మండలంలోని భీక్యాతండాకు చెందిన గగులోతు వెంకటేష్. ఇతడు అనతికాలంలోనే మండలస్థాయి నుం చి అంతర్జిల్లాల స్థాయి పోటీల్లో పాల్గొని పలు బహు మతులు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. -భీక్యాతండా (కోదాడ రూరల్) కోదాడ మండలంలోని భీక్యాతండా గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గుగులోతు భద్యా- లక్ష్మి దంపతుల రెండో కుమారుడు వెంకటేష్కు చిన్నప్పటి నుంచే ఆటలంటే చాలా ఇష్టం. అందులోనూ పరుగు పందెంలో పాల్గొనడమంటే ఎగిరి గంతేంచేవాడు. ఆ మక్కువతోనే ఎక్కడ అథ్లెటిక్స్ జరిగినా పాల్గొని మెరుపు వేగంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకునేవాడు. ఇలా మండల స్థాయి అథ్లెటిక్స్ నుంచి రాష్ట్రస్థాయి వరకు పాల్గొని ఎన్నో పతకాలు, ప్రశంసపత్రాలు సొంతం చేసుకున్నాడు. హైస్కూల్ చదివేటప్పుడే మూడేళ్ల పాటు వరుసగా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందాడు. అథ్లెటిక్స్లోనే కాకుండా మరోవైపు లాంగ్జం ప్, క్రికెట్ పోటీల్లో కూడా ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం ఆడి పలు విజయాలతో బహుమతులు దక్కించుకున్నాడు. చదువుల్లోనూ ముందే.. ఆటలతో పాటు చదువులోనూ గుగులోతు వెంకటేష్ ముం దంజలోనే కొనసాగుతున్నాడు. 1 నుంచి 5 వరకు స్వగ్రామంలో చదివిన వెంకటేష్ 6 నుంచి పదో తరగతి వరకు చిలుకూరు మండలం నారాయణపురంలో చదివాడు. అనంతరం ఇంటర్మీడియట్ను కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిచేశాడు. తన హైస్కూల్, ఇంటర్ చదువులు ప్రతిరోజూ సైకిల్ మీద వచ్చి చదివాడు. ఇంటర్మీడియట్లో ఇతడు సాధించిన అత్యుత్తమ మార్కులను చూసిన చిలుకూరు మండలం రామాపురంలో గల గాంధీ అకాడమిక్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గేట్) కళాశాల యాజమాన్యం స్పందించి తమ కళాశాలలో డిప్లొమా (ఎలక్ట్రానిక్స్) కోర్సును ఉచితంగా చదివించింది. ఆ కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతో వెంకటేష్ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తాచాటాడు. అనంతరం వెంకటేష్ పీసెట్ రాసి రాష్ట్రస్థాయిలో 508 వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఖాళీగా ఉండకుండా స్థానిక విద్యార్థులకు క్రీడల్లో మెళకువలను నేర్పుతున్నాడు. వెంకటేష్ సాధించిన విజయాలు * 2003, 04, 05 సంవత్సరాల్లో 8 ,9, 10వ తరగతులు చదువుతున్నప్పుడు జిల్లాస్థాయిలో నిర్వహించిన వందమీటర్ల పరుగు పందెం, లాంగ్జంప్ పోటీల్లో పాల్గొని ప్రతిఏటా జిల్లా మొదటిస్థానంలో నిలిచాడు. * 2006లో నిర్వహించిన ఇంటర్లెవల్ స్కూల్స్థాయి అథ్లెటిక్స్లో పాల్గొని కాంస్య పతకం గెలుచుకున్నాడు. * ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా 2013లో నల్లగొండడలో నిర్వహించిన జిల్లాస్థాయి వందమీటర్ల పరుగు పందెంలో 11 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. * 2014 మార్చిలో వరంగల్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో ప్రతిభ కనబర్చి ప్రశంసపత్రం పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహించాలి ఇప్పటికే చాలా పోటీల్లో పాల్గొని సత్తాచాటాను. దాతలు ప్రోత్సహిస్తే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకుంటా. క్రీడల్లో రాణించే గిరిజన విద్యార్థులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. భవిష్యత్లో విద్యార్థులకు ఉచితంగా క్రీడా పాఠాలు నేర్పుతా. - గగులోతు వెంకటేష్, అథ్లెటిక్స్ -
ఆటలైనా, వ్యాయామాలైనా మితం.. హితం!
త్వరత్వరగా కండలు పెరిగిపోవాలని అతిగా వ్యాయామాలు చేసేస్తున్నారా? రాత్రికి రాత్రే ఛాంపియన్గా ఆవిర్భవించాలని ఆటల్లో అమితంగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారా? ఆరోగ్యానికి ఆటలు తప్పక తోడ్పడతాయి. మరి అదేపనిగా ఆడితే? అతి సర్వత్ర వర్జయేత్ అన్న సూక్తి ఆటలకూ వర్తిస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. ఆటలు ఫిట్నెస్ను మరింత ఎక్కువగా మరింత దీర్ఘకాలం కొనసాగేలా చూడాలి తప్ప... మీ ఫిట్నెస్కే ఆటంకంలా మారకూడదు. అలా మారేందుకు గల అవకాశాలేమిటో చెబుతున్నారు స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ డాక్టర్ భక్తియార్ చౌధురి. ఆటలూ, వ్యాయామాల పరిమితులేమిటో తెలుసుకోండి. నిత్యం ఫిట్గా ఉండండి. ఫామ్లో లేకపోవడం వేరు... ఫిట్నెస్తో లేకపోవడం వేరు. ఫామ్లో లేకపోయినా పర్లేదు. కానీ ఫిట్నెస్తో లేకపోవడం నిజంగా ఆటగాళ్ల కెరియర్కే ముప్పు. ఎందుకంటే ఆ రోజు విజృంభించేసి ఫామ్ను నిరూపించుకోవడం ఆటగాళ్ల చేతుల్లో పని. కానీ ఫిట్నెస్ అన్నది అప్పటికప్పుడు వచ్చేది కాదు. నిత్యం కృషి చేస్తూ కాపాడుకోవాల్సిన పెన్నిధి. సచిన్ ‘టెన్నిస్ ఎల్బో’ అనే సమస్యతో బాధపడుతూ ఫిట్నెస్తో లేడని క్రికెట్ వార్తలను ఫాలో అయ్యేవారు కొన్నిసార్లు చదవడమో, వినడమో చేసే ఉంటారు. అలాగే చాలామంది ఫాస్ట్బౌలర్లు భుజం కీలు అరుగుదల కారణంగా త్వరగా రిటైర్ కావాల్సి వచ్చింది. ఆమాటకొస్తే గాయాలతో బాధపడటం, ఫిటెనెస్ లేక ఆటకు దూరంగా ఉండాల్సి రావడం అన్న దురదృష్టం కేవలం క్రికెటర్లనే కాదు... చాలా మంది ఆటగాళ్లనూ, వ్యాయామం చేసేవారినీ వెంటాడుతూ, బాధించే అంశం. ఆటలకైనా, ప్రాక్టీస్కైనా, వ్యాయామానికైనా ముప్పులేనంతటి ఒక గరిష్ట పరిమితి అవసరం. ఆ అవసరం ఎంత ముఖ్యమో, దాన్ని సాధించడం ఎలాగో, తద్వారా దీర్ఘకాలం కెరియర్లో లైమ్లైట్లో ఉండటం ఎలాగో తెలుసుకుందాం. ఆటల్లో ఎందుకు గాయాలవుతాయి? ఆటలో పాల్గొనడం, గొప్ప ఆటగాడిగా మారడం లేదా వ్యాయామం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడం ఇవన్నీ ఆటలు కెరియర్గా ఎంచుకున్న ప్రతివారూ కోరుకునేవే. ఇందుకోసం దీర్ఘకాలం ఫిట్సెన్ వ్యాయామాలు చేయడం, నియమబద్ధంగా సమతులాహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం అవసరం. ఇవన్నీ సరైన రీతిలో పాటిస్తేనే మంచి ప్రయోజనాలు ఒనగూరుతాయి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఆటగాళ్లు త్వరత్వరగా ఫిట్నెస్ సాధించాలనే కోరికతో మంచి సౌష్టవంతో పాటు మంచి కండలు అతి స్వల్పకాలంలోనే కావాలనుకునేవారు అతిగా వ్యాయామం చేసి, గాయాల బారిన పడి, ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇదే ఆటల్లోగాని, వ్యాయామంలోగాని గాయాలకు కారణం. ఆటలతో ఫిట్నెస్ తప్పకుండా దక్కుతుందా? వేర్వేరు ఆటల ప్రభావం శరీరంపై వేర్వేరుగా ఉంటుంది. ఉదా: క్రికెట్లో భుజాలపై శ్రమ ఎక్కువగా పడుతుంది. ఆటలాడితే ఫిట్నెస్ బాగా పెరిగి, ఆరోగ్యం చేకూరుతుందనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. అది వాస్తవమే అయినా... ప్రతి ఆటలోనూ కొన్ని శరీర భాగాలకు మంచి వ్యాయామం దొరుకుతుంది. మరికొన్ని శరీర భాగాలకు అంతే వ్యాయామం అందకపోవచ్చు. క్రికెట్లో భుజాలపై ఎక్కువగా శ్రమ పడుతుంది. అలాగే ఫుట్బాల్లో కాళ్లపై చాలా ఎక్కువ శ్రమ పడుతుంది. వికెట్ల మధ్య రన్నింగ్ అనే అంశం ఉన్నప్పటికీ ఫుట్బాల్లో కాళ్లపై పడే ప్రభావంతో పోలిస్తే క్రికెట్లో కాళ్లపై పడే ప్రభావం తక్కువే. శరీరానికి పూర్తి ఫిట్నెస్ చేకూరాలంటే ఆటలతో పాటు శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం పడేలా, అన్నింటికీ ఫలితం అందేలా వ్యాయామాలు చేయాలి. అందుకే క్రికెట్ లేదా ఇతర రంగాలకు చెందిన ఆటగాళ్లయినా కేవలం ఆటకు మాత్రమే పరిమితం కారు. వార్మ్ అప్లో భాగంగానైనా లేదా ప్రిపరేషన్లో భాగంగానైనా ఇతర ఎక్సర్సైజ్లూ, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు. అప్పుడే శరీరానికంతటికీ ఫిట్నెస్ కలుగుతుంది. జిమ్లలో వ్యాయామం చేయడం ఎలా...? బరువులతో ఎక్సర్సైజ్ చేసేవారు త్వరగా కండరాలు పెరగాలే ఉద్దేశంతో బరువులు త్వరత్వరగా పెంచుకుంటూ పోకూడదు. తక్కువ బరువుతో మొదలుపెట్టి... రిపిటీషన్స్ ఎక్కువగా చేయాలి. అధిక బరువులు ఎత్తడం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవు. హెవీ వెయిట్స్తో కండరం మీద ఎక్కువ భారం పడేలా ఎక్సర్సైజ్ చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అంటే కండరాలు పెరగాలంటే కండరానికి మరింత ప్రోటీన్ అందేలా దాన్ని స్టిమ్యులేట్ చేయాలన్నమాట. ఇలా స్టిమ్యులేషన్ కలగాలంటే... మొదట్లోనే మరీ ఎక్కువ బరువులు ఎత్తడం అంతమంచిది కాదు. దానికి బదులుగా వ్యాయామం చేసేవారికి సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే ఆ కండరం అలసిపోయేవరకు ఎత్తుతూ ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం ఇరవై రిపిటీషన్స్ చేయడం ఉత్తమం. అంటే జిమ్లలో వ్యాయామం చేసేవారు చాలా నిదానంగా చేయాలన్నమాట. జిమ్ వ్యాయామాలు... అనర్థాలు ఇటీవల యువకుల్లో చాలామంది జిమ్ల వైపు మక్కువ చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా దీనిలోనూ అతిగా వ్యాయామాలు చేయడం, తప్పుడు విధానాల్లో చేయడం వల్ల కొన్ని అనర్థాలు కలుగుతాయి. వాటిలో కొన్ని ... 1) ఎక్కువ సమయం: దీర్ఘకాలం పాటు ఇన్డోర్ జిమ్లలోనే ఎక్కువసేపు ఎండ తగలకుండా ఉండటం వల్ల విటమిన్-డి లోపం రావడాన్ని ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. 2) సరైన కోచ్ ఆధ్వర్యంలో ఎక్సర్సైజ్ చేయనందువల్ల... ఎక్కువ బరువు లేపే సమయాలలో, సరైన కోణాలలో వ్యాయామ ఉపకరణాలను వాడకపోవడం వల్ల ‘మజిల్ ఇంబ్యాలెన్స్’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు బెంచ్ప్రెస్ అనే వ్యాయామం చేసేటప్పుడు బరువు సరిగా ఎత్తక... కుడిచేత్తో సునాయాసంగానూ, ఎడమచేత్తో ఒకింత కష్టంగానూ ఎత్తుతుంటారు. ఇది చాలా సాధారణంగా జరిగే క్రియ. ఇలాగే స్కిప్పింగ్ చేసేటప్పుడు సరైన టెక్నిక్ అవలంబించకపోతే భుజాలకు శ్రమ కలుగుతుంది. లెగ్ ప్రెస్, ల్యాట్పుల్లీ, బెసైప్ కర్న్ వంటి ఎన్నో వ్యాయామాలలో కోచ్ పర్యవేక్షణ ఉండటం అవసరం. లేకపోతే గాయాల బారిన పడేందుకు, మజిల్ ఇంబ్యాలెన్స్కు అవకాశాలు ఎక్కువ. ఏయే ఆటలూ... ఎలాంటి గాయాలు ఫుట్బాల్: ఈ ఆటలో ముఖ్యంగా మోకాలి కీలు వంటి భాగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఆటగాళ్లు ఒకరినొకరు ఢీకొనడం వల్ల గాయపడే అవకాశాలు ఎక్కువ. ఈ ఆట ఆడేవారిలో ఫిట్నెస్, నైపుణ్యతల పాళ్లు సరిగ్గా సగం సగం ఉండాలి. ఇలా లేనప్పుడు గాయపడే అవకాశాలు ఎక్కువ. క్రికెట్: ఈ ఆటను సరైన రీతిలో ఆడకపోవడం వల్ల లేదా అతిగా ఆడుతుండటం వల్ల వచ్చే అనర్థాలు, గాయాలు ఎన్నెన్నో. ఉదాహరణకు... ఆస్గుడ్ షాట్లర్ డిసీజ్ : మోకాలిచిప్ప కింద వాపు రావడం, నొప్పి ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. మన దేశంలో పిల్లల ఎదుగుదల 10-14 మధ్య వయసులో ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో ఈ ఆట ఎక్కువగా ఆడటం వల్ల ఎముకలు, దాని చుట్టూ ఉండే కండరాలు బిగింపునకు గురవుతాయి. అదీగాక పదే పదే అదేపనిగా ఆడుతుండటం వల్ల ఈ నొప్పి ఎక్కువై ఒక్కోసారి ఆట వదిలేయాల్సిన పరిస్థితి రావచ్చు. హ్యామ్స్ట్రింగ్ నొప్పి : అన్ని వయసులలో క్రికెట్ ఆటగాళ్లు ఈ నొప్పికి గురవుతారు. ఆటగాళ్ల హ్యామ్స్ట్రింగ్ కండరాలు త్వరగా శ్రమకు లోనవుతాయి. అందువల్ల వేగంగా పరుగెత్తినప్పుడు హ్యామ్స్ట్రింగ్ కండరాలకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ. ఫ్లెక్సిబిలిటీ : శరీరాన్ని కొన్ని కోణాలలో వంచుతున్నప్పుడు అవి తగినంతగా ఒంగేలా చూసుకోవడం (ఫ్లెక్సిబిలిటీతో ఉండేలా చూసుకోవడం) అవసరం. కాని కొందరు పిల్లలు, యువకులు ఇలా ఫ్లెక్సిబిలిటీకి తగినంత ప్రాముఖ్యం ఇవ్వరు. దానివల్ల అకస్మాత్తుగా ఒంగినప్పుడు నడుము, మెడ వంటి అవయవాలు నొప్పి బారిన పడే అవకాశముంది. 4. కీళ్ల గాయాలు: క్రికెట్లో ఎక్కువగా ఉపయోగించే కీలు భుజం కీలు. ఫలితంగా దాని కార్టిలేజ్, జాయింట్ కాప్సూల్ వంటివి గాయపడతాయి. క్రికెట్కు వ్యాయామం ఎంత ముఖ్యమో, విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. దీనివల్ల ఎప్పుడైనా ఏ శరీర భాగమైనా గాయపడితే అది తనకు తానే ఉపశమనాన్ని పొందుతుంది. ర్యాకెట్తో ఆడే ఆటలు బాడ్మింటన్, టెన్నిస్, టీటీ, స్క్వాష్ లాంటి ఆటల్లో ర్యాకెట్ (బ్యాట్)ను ఉపయోగిస్తారు. ర్యాకెట్ను వాడేటప్పుడు బలాన్ని, వేగాన్ని, నైపుణ్యాన్ని కలగలిపి తగుపాళ్లలో వాటిని ఉపయోగించడాన్ని నేర్చుకోవాలి. ఈ ఆటల్లో అయ్యే గాయాలు సాధారణంగా ఇలా ఉంటాయి... భుజం కీలు: ఈ కీలు తక్కువ సపోర్ట్నూ, ఎక్కువ కదలికనూ కలిగి ఉంటుంది. వేగంగా ర్యాకెట్తో కొట్టినప్పుడు ఇది గాయపడే అవకాశం ఎక్కువ. మెడ, నడుము: చాలాసేపు బంతిని తీక్షణంగా చూస్తూ ఉండటం, హుప్ అంటూ అకస్మాత్తుగా పైకి గెంతి ఆడటం, ఎక్కువసేపు నిలబడటం వల్ల మెడ, నడుము శ్రమకు గురవుతాయి. చీలమండ బెణుకు(యాంకిల్ స్ప్రెయిన్): ఈ కీళ్లు శరీరం బరువునంతా మోస్తుంటాయి. చురుగ్గా కదిలే ప్రక్రియలో అటూ, ఇటూ వేగంగా కదలడం వల్ల బెణుకుకు గురవుతాయి. చాలా ఆటగాళ్లలో ఈ కీలుకు కలిగే బాధ ఆటనే ఆపేస్తుంది. గాయాల బారినపడేందుకు దోహదం చేసే అంశాలివే... 1. తొందరపాటు: తక్కువ సమయంలోనే ఎక్కువ బరువులతో వ్యాయామాలు చేయడం. 2. తయారీ (ప్రిపరేషన్): శరీరం వ్యాయామానికి తయారవ్వక ముందే సంక్లిష్టమైన వ్యాయామాలు చేసేయడానికి ప్రయత్నించడం. 3. ఫిట్నెస్ అవసరాలు: ఉదాహరణకు మోడల్స్, సినిమా రంగంలో ఉన్నవారు, గొప్ప ఆటగాళ్లుగా ఆవిర్భవించాలనే కోరికతో ఉన్నవారు సమయం తక్కువగా ఉండటం వల్ల, ఆ కొద్దిపాటి సమయంలోనే వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలనే కాంక్షతో వ్యాయామాలు చేయడం లేదా ఆట ప్రాక్టీస్లో పాల్గొనడం. 4. శిక్షణలో పొరబాట్లు: ట్రైనింగ్ సమయంలో సరైన రీతిలో వ్యాయామం చేయకపోవడం / సరైన నిర్దేశకులు లేకపోవడం. 5. నిద్రాహారాలు: వ్యాయామం చేసేవారికి, ఆటల్లో పాల్గొనేవారికి ప్రాక్టిస్ ఎంత ముఖ్యమో సమతులాహారం, మంచి నిద్ర కూడా అంతే అవసరం. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వ్యాయామానికే/ప్రాక్టీస్కే ప్రాధాన్యమిచ్చినా ఫిట్నెస్ దెబ్బతింటుంది. 6. సదుపాయాలు: మంచి ఫిట్నెస్ యంత్రాలు లేకపోవడం, మంచి వాతావరణంలో వ్యాయామం చేయకపోవడం వంటి సందర్భాల్లోనూ వ్యాయామం/ఆటల వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మంచి ఫిట్నెస్ పరికరాలు/ఉపకరణాలు ఉండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం/ప్రాక్టీస్ చేస్తే గాయాల నుంచి కాపాడుకునే అవకాశాలూ పెరుగుతాయి. కోచ్ లేదా ట్రైనర్ భూమిక ఏమిటంటే... ఏదైనా నిర్ణీత లక్ష్యం కోసం వ్యాయామం చేస్తున్నా లేదా ఆటలాడుతున్నా మంచి ట్రైనర్ను ఎంపిక చేసుకోవాలి. దానికి అనుగుణంగా మీ ట్రైనర్ మీ ఫిట్నెస్ ప్రణాళికను నిర్ణయిస్తారు. ఉదా: మీరు ఎస్.ఐ. సెలెక్షన్స్ కోసం వ్యాయామం చేస్తుంటే దానికి అనుసరించాల్సిన వ్యాయామ ప్రణాళిక వేరు. అలాగే మీరు మంచి సౌష్టవాన్ని, స్టామినాను కోరుకుంటుంటే దానికి ఏరోబిక్స్ ఎక్కువగా ఉండేలా బరువులు తక్కువగా ఉండేలా, మీ శరీర బరువు ఆధారంగానే మీ కండరాలకు ఎక్సర్సైజ్ అందేలా... ఇలా ఎక్సర్సైజ్ ఉంటుందన్నమాట. అథ్లెటిక్స్ చాలావరకు (కొన్ని ఆటల్లో మినహా) ఎలాంటి ఆటవస్తువులూ లేకుండా ఆరుబయట ఆడే ఆటల్ని గతంలో స్పోర్ట్స్ అనేవారు. వేగంగా పరుగెత్తడం,దూరాలు దూకడం, వస్తువును దూరంగా విసరడం వంటి ఈ ఆటల్లో హ్యామ్స్ట్రింగ్ కండరాలకు ఎక్కువగా గాయాలవుతాయి. వేగంగా ఉరుకులు, పరుగులు, దూకడాలు, బలంగా విసరడాల్లో ఇతర పెద్దకండరాలకూ గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ బరువులు వద్దు... తక్కువ వయసులో ఉన్నవారు ఎక్కువ బరువులు లేపడం అంత సరైన పని కాదు. 15-22 మధ్య వయసులో ఉన్నవారు ఎక్కువ బరువులను ఎత్తకూడదు. దీనివల్ల ఎముక చివరిభాగం ప్లగ్ అయిపోయి ఎముక పెరుగుదల ఆగిపోవచ్చు లేదా ఫీమర్ వంటి తొడ ఎముక పొడవు పెరుగుదలకు అంతరాయం ఏర్పడవచ్చు. అందుకే ఈ వయసు వారు తక్కువ బరువుతో ఎక్కువ రిపిటేషన్స్ చేస్తుండమే మేలు. వ్యాయామాలు ఎలా చేస్తే మేలు... ఏదైనా వ్యాయామాలు చేయాలనుకున్నప్పుడు వారంలో మూడు రోజులు మాత్రమే బరువులు వాడి చేసే ఎక్సర్సైజ్లలో తక్కువ బరువులు, ఎక్కువ రిపిటీషన్లతో ఇన్డోర్లో వ్యాయామాలు చేయాలి. మిగతా మూడు రోజులు ఆరుబయట స్పోర్ట్స్లోనూ, ఏరోబిక్స్లో పాలుపంచుకోవాలి. ఒకరోజు తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు, శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. ఆహారం... వ్యాయామం చేసేవారికి ప్రోటీన్లతో కూడిన ఆహారం అంటూ కొన్ని ప్రకటనలు కనిపిస్తుంటాయి. అలాగే ‘లో-కార్బ్’ డైట్ అని, ప్రోటీన్ అండ్ ఎనర్జీ డ్రింక్స్అని మార్కెట్లో లభిస్తుంటాయి. సత్వరం శరీరానికి శక్తినిచ్చేవనో లేదా త్వరగా సన్నటి శరీరాన్ని పూర్తిగా కండలు తిరిగేలా చేసే ఆహారమనో టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తూ మంచి సౌష్టవం ఉన్న వారిని ఇందులో మోడళ్లుగా చూపుతుంటారు. నిజానికి ఈ సప్లిమెంట్లు అన్నీ వృథా అనే చెప్పవచ్చు. శరీరానికి అన్ని పోషకాలు అందేలా కూరగాయలను, ఆకుకూరలను మార్చి మార్చి ఇంట్లోనే వండే పుష్టికరమైన, సమతులాహారమే మంచి ఆహారం. బయట మార్కెట్లో లభించే ప్రోటీన్ డైట్ కంటే ఇంటి భోజనమే మంచి భోజనం. కృత్రిమ పోషకాలు వద్దు... చాలామంది కృత్రిమ పోషకాలతో ఉండే ఫుడ్ సప్లిమెంట్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. దాదాపు ప్రపంచంలో దొరుకుతున్న 800కు పైగా ఫుడ్ సప్లిమెంట్స్లో 85 శాతం అనవసరమైన పదార్థాలను కలిగి ఉన్నాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పైగా ఇందులో ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్స్ (ఆహారాన్ని దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచేందుకు వాడే పదార్థాలు), స్టెరాయిడ్స్ (ఉత్ప్రేరకాలు) ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. అందుకే ఇలాంటి కృత్రిమ పోషకాలకు దూరంగా ఉండాలి. ఫిట్నెస్ అంటే...? ఫిట్నెస్ అనేది నాలుగు అంశాల సమాహారం: 1) స్టామినా: ఫిట్నెస్లో మొదటిది స్టామినా. దీన్నే ఎండ్యూరెన్స్ అని కూడా అటారు. గుండె, రక్తప్రసరణ, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచుకోవడాన్ని స్టామినాగా పేర్కొనవచ్చు. 2) స్ట్రెంగ్త్ (బలసామర్థ్యాలు): ఏదైనా ఆటలో బలం కూడా చాలా ముఖ్యం వ్యాయామం చేయనప్పుడు, సోమరిగా ఉన్నప్పుడు ముందుగా కరిగిపోయేవి కండరాలే. దాంతో బలమూ తగ్గుతుంది. 3) ఫ్లెక్సిబిలిటీ: వయసు పెరుగుతున్న కొద్దీ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. అంటే ఎటు పడితే అటు త్వరగానూ, వేగంగానూ ఒంగగల సామర్థ్యం తగ్గుతుంది. 4) కొవ్వు, కండరాల నిష్పత్తి (బాడీ కంపోజిషన్): ఆహారం సరిగా తీసుకోకపోతే శరీరంలో ఉండే కొవ్వు, కండ నిష్పత్తిలో తేడాలు వచ్చి ఫిట్నెస్ తగ్గుతుంది. ఊబకాయం ఉన్నవారిలో శరీరంలో కొవ్వు శాతం 30 శాతం కంటే ఎక్కువగా అవుతుంది. వ్యాయామం/ఆటలో గాయాలైనప్పుడు ఏం చేయాలి? బ్లంట్ ఇంజ్యురీ (శరీరం తెగకుండా లోపలే గాయం) అయినప్పుడు వెంటనే ఇంటి చికిత్స తీసుకోవాలి. అంటే... మొదటి నాలుగు రోజులు ఐస్ ముక్కలను గాయమైన భాగానికి తాకేలా 5-10 నిమిషాలు ఉంచాలి. ఇలా రోజులో 4-5 సార్లు చేయాలి. దీనితో 90 శాతం గాయం తీవ్రత తగ్గుతుంది. 5 - 15 రోజుల పాటు: మూడు నిమిషాలు గోరువెచ్చని నీటితో కాపడం (హాట్ ప్యాక్), ఆ తర్వాత నిమిషం పాటు చల్లని ఐస్ ముక్కలతో ఐస్ప్యాక్... ఇలా ఒకటి తర్వాత ఒకటి చాలాసార్లు చేయాలి. నొప్పి 15 రోజుల కంటే ఎక్కువగా ఉంటే... తప్పనిసరిగా స్పోర్ట్స్ వైద్యనిపుణులను సంప్రదించాలి. తిరిగి ఆటలో పాల్గొనేటప్పుడు విసురుగా, దూకుడుగా కాకుండా, నిదానంగా ఆడుతూ, క్రమంగా వేగం, దూకుడూ పెంచుకుంటూ పోవాలి. ఏ డాక్టర్ను సంప్రదించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది ఆటగాళ్లు త్వరత్వరగా ఆటలో ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ కోసం తొందరపడుతుంటారు. నిజానికి ఎముకలు విరిగినప్పుడుగానీ లేదా గ్రేడ్-3 లిగమెంట్ గాయాలకు మాత్రమే శస్త్రచికిత్స అవసరమవుతుంది. అదీ అరుదుగానే. అందుకే ఆటల్లో పాల్గొనాలనే అభిరుచి ఉన్నవారు, దీర్ఘకాలం ఫిట్నెస్ కోసం తాపత్రయపడేవారు ఓపిగ్గా వేచి ఉండాలి. గొప్ప గొప్ప డాక్టర్లూ వేచి చూసే ధోరణినే అనుసరిస్తారు. గాయం తగిలిన మొదటిరోజే ఎమ్మారై వంటి పరీక్షలు నిర్వహిస్తే నిజంగానే గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే గాయం తగిలీ తగలగానే పెద్ద శస్త్రచికిత్స కంటే 2-3 వారాల పాటు ఉపశమన చికిత్సలు చేసి, నొప్పులు తగ్గాక అసలు చేయాల్సిన చికిత్స ఏమిటో నిర్ణయించాలి. చిన్నపిల్లలు కూడా గాయాల విషయంలో సరైన వైద్యులు, ఫిజియోల దగ్గరికి వెళ్లాలి. అంతేగాని గాయాన్ని తోమడం, చెట్ల మందులతో, పసర్లతో గాయంపై తీవ్రంగా రుద్దడం వంటివి చేయకూడదు. తగిన విశ్రాంతి తీసుకుని, మొదట ఉపశమన చికిత్సలు చేసి, రెండువారాల తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులను సంప్రదించాలి. -
అథ్లెటిక్స్ ఆణిముత్యం
తొర్రూరు, న్యూస్లైన్ : అథ్లెటిక్స్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ క్రీడా ఆణిముత్యంగా పలువురి అభినందనలు అందుకుంటున్నాడు ధరావత్ జగదీష్. తొర్రూరు శివారు దుబ్బతండాకు చెందిన ధరావత్ భీమ, సామ్కి దంపతుల కుమారుడైన జగదీష్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే జగదీష్ క్రీడలపై ఎంతో ఆసక్తి చూపేవాడు. స్కూల్ దశలోనే పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. ఇంటర్, డిగ్రీకి చేరుకునే సరికి క్రీడల్లో మరింత ప్రావీణ్యం సంపాదించాడు. పాల్గొన్న ప్రతీ పోటీలోనూ పతకాలు సాధిస్తూ జిల్లా నుంచి జాతీయస్థాయికి ఎదిగి అటు పుట్టిపెరిగిన గ్రామానికి ఇటు చదువుకుంటున్న యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాడు. ప్రతిభకు పతకాలు గుంటూరు జిల్లా బాపట్లలో 2011 డిసెంబర్లో జరిగిన రాష్ట్రస్థాయి 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం కైవసం చేసుకున్నాడు. లాంగ్జంప్, త్రిబుల్జంప్లోనూ ప్రథమస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాక ఎక్కువ ప్రథమస్థానాలు సాధించిన ందుకు చాంపియన్షిప్ దక్కించుకున్నాడు. 2012 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని అఖోలాలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం సాధించి రెండు బంగారు పతకాలు అందుకున్నాడు. అదే ఏడాది అక్టోబర్లో చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లోనూ ప్రతిభ చూపి 100, 200 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, త్రిబుల్జంప్, డిస్కస్త్రోలో ప్రథమస్థానాలు సొంతం చేసుకుని ఓవరాల్ చాంపియన్గా నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలోని బీదర్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో 49 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో వంద మీటర్ల పరుగులో బంగారు పతకం, 200మీటర్ల పరుగు, త్రిబుల్జంప్లో ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. పోటీ ఏదైనా పతకాల వేటలో ముందుంటున్న జగదీష్ను పలువురు అభినందిస్తున్నారు. అంతర్జాతీయస్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని ఆకాంక్షిస్తున్నారు. -
సింధు, శ్రీకాంత్లపైనే దృష్టి
టోక్యో: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారులు తొలి పరీక్షకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విశ్రాంతి కోరుకున్న సైనా నెహ్వాల్... చీలమండ గాయంతో పారుపల్లి కశ్యప్ ఈ టోర్నమెంట్ బరిలోకి దిగడంలేదు. ఈ నేపథ్యంలో భారత ఆశలన్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు... పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్లపై ఆధారపడి ఉన్నాయి. టోర్నీ తొలిరోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలవుతాయి. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తర్వాత తొలి అంతర్జాతీయ టోర్నీలో ఆడుతోన్న సింధు తొలి రౌండ్లోనూ, రెండో రౌండ్లోనూ క్వాలిఫయర్స్తో ఆడనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)తో సింధు ఆడాల్సి ఉంటుంది. మరో పార్శ్వంలో ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్లాండ్), నాలుగో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) ఉన్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఆరుగురు మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. శ్రీకాంత్తోపాటు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు భమిడిపాటి సాయిప్రణీత్, ఆనంద్ పవార్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్, హెచ్.ఎస్.ప్రణయ్లకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభించింది. తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ యున్ హూ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షో ససాకి (జపాన్)తో శ్రీకాంత్; సోనీ ద్వి కున్కురో (ఇండోనేసియా)తో ఆనంద్ పవార్; తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో అజయ్ జయరామ్; వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)తో ప్రణయ్; క్వాలిఫయర్తో సౌరభ్ వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హిరోయుకి సయెకి-తహోతా (జపాన్) జోడితో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం ఆడుతుంది. మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగడంలేదు. -
అండర్-14 చాంప్ హెచ్పీఎస్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఓవరాల్ అండర్-14 బాలుర టీమ్ టైటిల్ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్-బేగంపేట్) జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో అండర్-14 బాలుర విభాగంలో హెచ్పీఎస్ అథ్లెట్లు అత్యధిక పతకాలను గెలిచి టీమ్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన అండర్-14, 16 బాలబాలికలు విభాగాల్లో ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫలితాలు అండర్-14 బాలుర విభాగం: 800 మీ: 1. బి.బాలాజీ (హెచ్పీఎస్-బీ), 2. దివాకర్ (హెచ్పీఎస్-ఆర్), 3. కె.విష్ణు (హెచ్పీఎస్-బీ); 60 మీ: 1.బి.రాజేష్ (హెచ్పీఎస్-బీ), 2. కౌశిక్ నాయుడు (బీవీపీ), 3. వంశీకృష్ణ (ఎస్టీబీఎస్); 200 మీ: 1. బి.రాజేష్ (హెచ్పీఎస్-బీ), 2. వై.రవి ప్రసాద్ (కేవీయూ), 3. వెంకన్న (హెచ్పీఎస్-ఆర్); షాట్ఫుట్: 1. దివాకర్ (హెచ్పీఎస్-బీ), 2. డి.రవి నాయక్ (హెచ్పీఎస్-ఆర్), 3. కె.సందీప్ నాయక్ (హెచ్పీఎస్-ఆర్); హైజంప్: 1. హీరాలాల్ (హెచ్పీఎస్-బీ), 2. రవీందర్ (హెచ్పీఎస్-ఆర్), 3.దుర్గేశ్ కుమార్ (కేవీబీ పల్లి); లాంగ్జంప్: 1. రవీందర్ (హెచ్పీఎస్-బీ), 2. పి.మహేందర్(హైదరాబాద్), 3. హీరాలాల్ (హెచ్పీఎస్-బీ); బాలికల విభాగం: 60 మీ: 1. జి.నిత్య (సెయింట్ జోసెఫ్), 2. జి.వెన్నెల (కేవీ-2 ఉప్పల్), 3. డి.భవిక (హెచ్పీఎస్-బీ); 200మీ: 1. జి.నిత్య (సెయింట్ జోసెఫ్), 2. డి.భవిక (హెచ్పీఎస్-బీ), 3. రిషితరెడ్డి(సెయింట్ జోసెఫ్); 800 మీ: 1. నిహారిక (సెయింట్ జోసెఫ్), 2. జి.హార్ధికరెడ్డి (జేహెచ్పీఎస్), 3. డి.కీర్తి (జాన్సన్ గ్రామర్ స్కూల్); లాంగ్ జంప్: 1. కె.లాస్య (సెయింట్ ఆండ్రూస్), 2. టి.సుమతి (హెచ్పీఎస్-బీ), 3. పి. సాహితి (బీవీపీ); అండ ర్-16 బాలుర విభాగం: 100 మీ: 1. నితిన్ కుమార్ (బీఎస్సీ), 2. మహేందర్ (హెచ్పీఎస్-ఆర్), 3.ఎస్.శుభమ్ (కేవీ-గచ్చిబౌలీ); 400 మీ: 1. ఎల్.బీతేశ్వర్ (బీఎస్సీ), 2. నితిన్ కుమార్ (బీఎస్సీ), 3. వి.జయంత్ (ఏఈసీఎస్డబ్ల్యూ); 800 మీ: ఎల్.బీతేశ్వర్ (బీఎస్సీ), 2. అనిశ్ కుమార్ (కేవీ నెంబర్-1 గోల్కొండ), 3. టి.నితీష్ (హెచ్పీఎస్-ఆర్); 1500 మీ: 1. అనీశ్ కుమార్ (కేవీ-1 గోల్కొండ), 2 .కె.హనుమంతు (ఆల్ సెయింట్స్ స్కూల్), 3. సి.హెచ్.శ్రవణ్ కుమార్ (జాన్సన్ గ్రామర్ స్కూల్); షాట్పుట్: 1. రిచర్డ్ జాషువ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్), 2.ఎం.వెంకటేష్ (హెచ్పీఎస్-ఆర్), 3. రోహన్ (డిఫెన్స్ లాబ్ స్కూల్); జావెలిన్ త్రో: 1. ఆర్.శివ నాయక్ (ఆల్ సెయింట్స్ స్కూల్), 2. హనుమంతు (ఆల్ సెయింట్స్ స్కూల్), 3. బి.పటేల్ (ఢిఫెన్స్ లాబ్ స్కూల్).అండర్-16 బాలికలు: 100 మీ: 1.అష్టలక్ష్మీ (జేహెచ్పీఎస్), 2. ఎల్.అనీషా (సెయింట్ ఆండ్రూస్), 3. శరణ్య (జాన్సన్ గ్రామర్ స్కూల్); 400 మీ: 1.పి.శ్రేయ (జేహెచ్పీఎస్), 2. ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్పీఎస్), 3. రవళి (ఆల్ సెయింట్స్); 800 మీ: 1.పి. కావేరి (కేవీ-2 ఉప్పల్), 2. జి. భావన (ఓబుల్రెడ్డి స్కూల్), 3. జె.రవళి (ఆల్ సెయింట్స్); 1500 మీ: 1. జి. భావన (ఓబుల్రెడ్డి స్కూల్), 2. సాయి శివాని (హెచ్పీఎస్-ఆర్), 3. నమ్రత (జాన్సన్ గ్రామర్ స్కూల్); లాంగ్ జంప్: 1.ఎల్.అనీషా (సెయింట్ ఆండ్రూస్), 2 .ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్పీఎస్), 3. పి.శ్రేయ (జేహెచ్పీఎస్).