
న్యూఢిల్లీ: మరోసారి సమష్టి ప్రదర్శన చేసిన ఆంధ్ర జట్టు విజయ్ హజారే దేశవాళీ వన్డే టోర్నమెంట్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సౌరాష్ట్రతో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచి 18 పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 214 పరుగులు సాధించింది. అర్పిత్ (55; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, కరణ్ శర్మ రెండేసి వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, మనీశ్, షోయబ్లకు ఒక్కో వికెట్ లభించింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 48.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ప్రశాంత్ కుమార్ (81 బంతుల్లో 73; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. బోడపాటి సుమంత్ (49 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), రవితేజ (26 బంతుల్లో 29 నాటౌట్) ఐదో వికెట్కు అజేయంగా 69 పరుగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment