‘డ్రా’తోనే ముగింపు | Image for the news result India vs WICB President's XI, 2nd Practice match ends in a draw | Sakshi
Sakshi News home page

‘డ్రా’తోనే ముగింపు

Published Mon, Jul 18 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

‘డ్రా’తోనే ముగింపు

‘డ్రా’తోనే ముగింపు

భారత్, విండీస్ ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్
సెయింట్ కిట్స్: వెస్టిండీస్ పర్యటనలో రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌ను కూడా భారత జట్టు ‘డ్రా’గా ముగించింది. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో శనివారం ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ ఎలెవన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బ్లాక్‌వుడ్ (51) టాప్‌స్కోరర్‌గా నిలవగా, హాడ్జ్ (39 నాటౌట్), విశాల్ సింగ్ (39) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో  భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ఆంటిగ్వాలో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement