draw
-
తెలంగాణ ‘డ్రా’తో మొదలు
సాక్షి, హైదరాబాద్: ఐదున్నర దశాబ్దాల తర్వాత హైదరాబాద్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ (రెండో రౌండ్)లో తెలంగాణ ‘డ్రా’తో మొదలు పెట్టింది. శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్లో తెలంగాణ, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడాయి. అడపాదడపా తెలంగాణ స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా స్కోరు చేసేందుకు చేసిన ప్రయత్నాల్ని రాజస్తాన్ డిఫెండర్లు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.అలాగే రాజస్తాన్ దాడుల్ని తెలంగాణ రక్షణ పంక్తి నిలువరించడంతో మొదటి అర్ధభాగం ఒక్క గోల్ అయినా నమోదుకు కాకుండానే 0–0తో ముగిసింది. ద్వితీయార్ధం మొదలైన ఎనిమిది నిమిషాలకే రాజస్తాన్ ఖాతా తెరిచింది. 53వ నిమిషంలో ఫార్వర్డ్ ఆటగాడు అమిత్ గోడార చక్కని సమన్వయంతో తెలంగాణ డిఫెండర్లను బోల్తాకొటిస్తూ గోల్ను లక్ష్యానికి చేర్చడంతో రాజస్తాన్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు తెలంగాణ స్ట్రయికర్లు ఎంతగా శ్రమించినా ఫినిషింగ్ లోపాలతో గోల్ అయితే కాలేదు. ఇక పరాజయం ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తేజావత్ సాయి కార్తీక్ ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు. 90వ నిమిషంలో చాకచక్యంగా సాయి కార్తీక్ చేసిన గోల్తో తెలంగాణ 1–1తో గట్టెక్కింది. గోల్ పోస్ట్ వద్ద రాజస్తాన్ స్ట్రయికర్లను నిలువరించిన తెలంగాణ డిఫెండర్ తజాముల్ హుస్సేన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీ రెండో రౌండ్లో మొత్తం 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. టాప్–4లో నిలిచిన టీమ్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్లలో బెంగాల్ 3–1తో జమ్మూ కశీ్మర్పై... మణిపూర్ 1–0తో సరీ్వసెస్పై గెలుపొందాయి. -
గుకేశ్, డింగ్ లిరెన్ 13వ గేమ్ ‘డ్రా’... నేడు చివరిదైన 14వ గేమ్
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో తొమ్మిదో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్, చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య బుధవారం జరిగిన 13వ గేమ్ 68 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ‘కింగ్ పాన్’ ఓపెనింగ్ తో గేమ్ను ప్రారంభించగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లిరెన్ ఫ్రెంచ్ డిఫెన్స్తో జవాబు ఇచ్చాడు. గుకేశ్ కొత్త వ్యూహాలతో చైనా ప్లేయర్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. 68 ఎత్తులు ముగిశాక ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. నిర్ణీత 14 గేముల్లో 13 గేమ్లు ముగిశాక ఇద్దరూ 6.5–6.5తో సమఉజ్జీగా ఉన్నారు. నేడు చివరిదైన 14వ గేమ్ జరుగుతుంది. ఒకవేళ చివరిదైన 14వ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ఇద్దరూ 7–7తో సమంగా నిలుస్తారు. శుక్రవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
వరల్డ్ చెస్ చాంపియన్షిప్లో మరో ‘డ్రా’
భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్షిప్ పోరులో ‘డ్రా’ల పరంపర ఆగడం లేదు. శనివారం జరిగిన పదో గేమ్ కూడా సమంగానే ముగిసింది. తొలి గేమ్లో లిరెన్, మూడో గేమ్లో గుకేశ్ గెలవగా...ఆ తర్వాత ఇది వరుసగా ఏడో ‘డ్రా’ కావడం గమనార్హం. నల్ల పావులతో ఆడిన గుకేశ్, లిరెన్ కూడా ఎలాంటి దూకుడైన ఎత్తులకు ప్రయతి్నంచలేదు. ఇద్దరూ డిఫెన్స్కే ప్రాధాన్యతనివ్వడంతో 36 ఎత్తుల తర్వాత ‘డ్రా’ ఖాయమైంది. పది గేమ్లు ముగిసిన తర్వాత గుకేశ్, లిరెన్ చెరో 5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు. ఈ 14 గేమ్ల పోరులో ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. మిగిలిన 4 గేమ్ల ద్వారా మరో 2.5 పాయింట్లు ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం. నల్లపావులతో ఆడి గేమ్ను ‘డ్రా’గా ముగించడం సంతృప్తిగా ఉందన్న గుకేశ్... రాబోయే నాలుగు గేమ్లు ఉత్కంఠభరితంగా సాగుతాయని ఆశిస్తున్నానన్నాడు. -
గుకేశ్, డింగ్ లిరెన్ తొమ్మిదో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో వరుసగా ఆరో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య గురువారం జరిగిన తొమ్మిదో గేమ్ 54 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్లు జరుగుతాయి. ఇప్పటికి తొమ్మిది గేమ్లు పూర్తయ్యాయి. మరో ఐదు గేమ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరూ 4.5 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. మొదట 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ విశ్వవిజేతగా నిలుస్తాడు. 32 ఏళ్ల డింగ్ లిరెన్ తొలి గేమ్లో గెలుపొందగా... చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్లో నెగ్గాడు. మిగతా ఏడు గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. నేడు విశ్రాంతి దినం. శనివారం పదో గేమ్ జరుగుతుంది. -
ఎనిమిదో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో మరో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరిగిన ఎనిమిదో గేమ్ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్లు జరుగుతాయి. ఇప్పటికి ఎనిమిది గేమ్లు పూర్తయ్యాయి.ఇద్దరూ 4 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. మొదట 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ విశ్వవిజేతగా నిలుస్తాడు. 32 ఏళ్ల డింగ్ లిరెన్ తొలి గేమ్లో గెలుపొందగా... చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్లో నెగ్గాడు. మిగతా ఆరు గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. నేడు తొమ్మిదో రౌండ్ గేమ్ జరుగుతుంది. -
గుకేశ్ చేజారిన అవకాశం... లిరెన్తో ఏడో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: దొమ్మరాజు గుకేశ్ (భారత్), డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య మంగళవారం జరిగిన ఏడో గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసింది. చాంపియన్షిప్ సమరంలో ఇది వరుసగా నాలుగో ‘డ్రా’ కావడం విశేషం. 5 గంటల 22 నిమిషాల పాటు సాగిన గేమ్లో 72 ఎత్తుల తర్వాత ఆటను ముగించేందుకు గుకేశ్, లిరెన్ అంగీకరించారు. అయితే కీలక దశలో గెలిచే స్థితిలో నిలిచిన గుకేశ్ దానిని వథా చేసుకోవడం అతడిని నిరాశపరిచే అంశం. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ఓపెనింగ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచాడు. గుకేశ్ 44వ ఎత్తు తర్వాత లిరెన్ ఓటమికి బాట పడినట్లుగా కనిపించింది. అయితే ఈ గెలుపు అవకాశాన్ని వాడుకోలేక గుకేశ్ వేసిన 45వ ఎత్తు లిరెన్ మళ్లీ కోలుకునేలా చేసింది. ఏడు గేమ్ల తర్వాత ఇద్దరూ చెరో 3.5 పాయింట్లతో ఉన్నారు. -
సమంగా ముగిసిన ఐదో గేమ్
భారత ఆటగాడు దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్ సమరంలో మరో పోరు సమంగా ముగిసింది. సింగపూర్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఐదో గేమ్ 40 ఎత్తుల తర్వాత ‘డ్రా’ అయింది. ఈ ఫలితం అనంతరం గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ లిరెన్ చెరో 2.5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు.విజేతగా నిలవాలంటే మిగిలిన 9 గేమ్లలో మరో 5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. నల్ల పావులతో ఆడిన లిరెన్ తొలి గేమ్ తరహాలోనే ఫ్రెంచ్ డిఫెన్స్తో మొదలు పెట్టాడు. ఆ గేమ్లో ఓటమిపాలైన గుకేశ్ ఈ సారి జాగ్రత్త పడ్డాడు. అయితే 23వ ఎత్తు వద్ద గుకేశ్ తప్పుడు ఎత్తు వేసి ఓటమికి ఆస్కారం కల్పించగా...లిరెన్ దానిని గుర్తించలేకపోయాడు. దాంతో గుకేశ్ డ్రాతో గట్టెక్కాడు. ‘నేను చాలా పెద్ద తప్పు చేశానని తర్వాత అర్థమైంది. కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాను. ఇంకా ఈ సమరం సగం కూడా కాలేదు. కాబట్టి నాకూ మంచి అవకాశాలున్నాయని నమ్ముతున్నా’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు. ఇద్దరి మధ్య ఆరో గేమ్ నేడు జరుగుతుంది. -
అర్జున్ మూడు గేమ్లు ‘డ్రా’
టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొలి రోజు ఆడిన మూడు గేమ్లనూ ‘డ్రా’ చేసుకున్నాడు. కోల్కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్–నిహాల్ సరీన్ (భారత్) తొలి గేమ్ 44 ఎత్తుల్లో... అర్జున్–విదిత్ (భారత్) రెండో గేమ్ 35 ఎత్తుల్లో... అర్జున్–నారాయణన్ (భారత్) మూడో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా ’గా ముగిశాయి. మహిళల విభాగంలో భారత స్టార్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య కూడా తమ తొలి మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. -
చెన్నైయిన్తో హైదరాబాద్ మ్యాచ్ ‘డ్రా’
ఇండియన్ సూపర్ లీగ్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నైయిన్ ఎఫ్సీ జట్టుతో గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ రెండు మ్యాచ్ల్లో ఓడి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని ఒక పాయింట్తో 12వ స్థానంలో ఉంది. -
‘డ్రా’తో మొదలైన ఐఎస్ఎల్
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ‘డ్రా’తో ప్రారంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్లు ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 2–2 గోల్స్తో సమంగా ముగిసింది. ముంబై సిటీ తరఫున థేర్ క్రూమ్ 90వ నిమిషంలో గోల్ సాధించాడు. మోహన్ బగాన్ తరఫున తిరి 70వ నిమిషంలో, ఆల్బర్టో రోడ్రిగ్వెజ్ 28వ నిమిషంలో గోల్స్ కొట్టారు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే 9వ నిమిషంలో తిరి సెల్ఫ్ గోల్ చేయడం తుది ఫలితం సమంగా ముగిసేందుకు కారణమైంది. సొంత మైదానంలో భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్య మోహన్ బగాన్ మ్యాచ్ ఆద్యంతం దూకుడు ప్రదర్శించినా... ఈ టీమ్ను నిలువరించడంలో ముంబై సఫలమైంది. ఐఎస్ఎల్లో భాగంగా నేడు రెండు వేర్వేరు వేదికల్లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. భువనేశ్వర్లో ఒడిషా ఎఫ్సీతో చెన్నైయిన్ ఎఫ్సీ... బెంగళూరులో ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీతో బెంగళూరు ఎఫ్సీ తలపడతాయి. -
భారత్ 0 మారిషస్ 0
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్బాల్ జట్టు అంతర్జాతీయ వేదికపై ఇంకా ఎంతో ఎదగాల్సిన అవసరం ఉందని మరోసారి రుజువైంది. కొత్త కోచ్ మార్క్వెజ్ నేతృత్వంలో కొత్తగా జట్టు విజయాల బాట పడుతుందని ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 179వ స్థానంలో ఉన్న మారిషస్ జట్టు కూడా భారత్ను నిలువరించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం మొదలైన ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోరీ్నలో భాగంగా జరిగిన భారత్, మారిషస్ తొలి మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నీని ప్రారంభించారు. -
సౌతాఫ్రికా కొంపముంచిన వరుణుడు.. విండీస్తో తొలి టెస్టు డ్రా
ట్రినిడాడ్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో విండీస్పై దక్షిణాఫ్రికా మాత్రం పూర్తి ఆధిపత్యం సాధించింది. కానీ దురదృష్టవశాత్తూ పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 357 పరుగులు చేయగా.. ఆతిథ్య విండీస్ 233 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్లో 124 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ను 173/3 వద్ద డిక్లేర్ చేసింది. ప్రోటీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో స్టబ్స్ (68) హాఫ్ సెంచరీతో మెరిశాడు. 298 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్.. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. దీంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కరేబియన్ సెకెండ్ ఇన్నింగ్స్లో అలిక్ అథానాజ్(92) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 15 నుంచి గయానా వేదికగా ప్రారంభం కానుంది. -
‘డ్రా’తో గట్టెక్కిన భారత్
పారిస్: ఓటమి అంచుల్లో నుంచి భారత పురుషుల హాకీ జట్టు గట్టెక్కి ‘డ్రా’తో ఊపిరి పీల్చుకుంది. సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో మాజీ ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 22వ నిమిషంలో లుకాస్ మార్టినెజ్ గోల్తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 36వ నిమిషంలో తమ ఆధిక్యాన్ని 2–0కు పెంచుకునే అవకాశం అర్జెంటీనాకు వచ్చిం ది. కానీ పెనాల్టీ స్ట్రోక్ను మైసో కసెల్లా వృథా చేశాడు. స్కోరును సమం చేసేందుకు భారత్ శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. నిలకడగా పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. కానీ వాటిని లక్ష్యానికి చేర్చడంలో విఫలమైంది. అయితే మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్కు 59వ నిమిషంలో తొమ్మిదో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ పెనాల్టీ కార్నర్ను కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలిచి స్కోరును సమం చేయడంతోపాటు భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నేడు జరిగే మూడో లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్తో భారత్ ఆడుతుంది. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్హాకీ పురుషుల పూల్ ‘బి’ మ్యాచ్: భారత్ X ఐర్లాండ్ (సాయంత్రం గం. 4:45 నుంచి). ఆర్చరీ మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: అంకిత భకత్ X వియోలెటా (పోలాండ్) (సాయంత్రం గం. 5:15 నుంచి), భజన్ కౌర్ X సిఫా (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: బొమ్మదేవర ధీరజ్ X ఆడమ్ లీ (చెక్ రిపబ్లిక్) (రాత్రి గం. 10:45 నుంచి). బాక్సింగ్ పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్: అమిత్ పంఘాల్ X పాట్రిక్ చిన్యెంబా (జింబాబ్వే) (రాత్రి గం. 7:15 నుంచి). మహిళల 57 కేజీల మ్యాచ్: జైస్మిన్ లంబోరియా X నెస్థీ పెటెసియా (ఫిలిప్పీన్స్) (రాత్రి గం. 9:25 నుంచి). మహిళల 54 కేజీల ప్రిక్వార్టర్స్: ప్రీతి పవార్ X యెని మెర్సెలా (కొలంబియా) (అర్ధరాత్రి గం. 1.20 నుంచి). బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X అలి్ఫయన్ ఫజర్–మహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). మహిళల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో X సెట్యానా మాపసా–ఏంజెలా యూ (ఆ్రస్టేలియా) (సాయంత్రం గం. 6:20 నుంచి). షూటింగ్ ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్: పృథీ్వరాజ్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ట్రాప్ మహిళల క్వాలిఫికేషన్: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరు: భారత్ (మనూ భాకర్–సరబ్జోత్ సింగ్) ్ఠ దక్షిణ కొరియా (జిన్ ఓయె–లీ వన్హో) (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). -
గీసుకునే బొమ్మలివి! ఇదే నా ప్రేయసి, ఆస్తి..!
వెన్నెల ఎందుకు కాస్తుంది? కృష్ణశాస్త్రి పొయెట్రీ ఎందుకు రాస్తాడు? ముళ్ళపూడి అప్పారావు ఎందుకని అప్పులు చేస్తాడు? డబ్బులు రాలవని తెలిసినా మా నూనెపల్లె జెండాచెట్టు కింద కూచుని గుడ్డి మగ్బుల్ ‘బహారో ఫూల్ బర్సావో…’ అని నవ్వుతూ పాటను తగులుకుంటూ ఉండేవాడెందుకు? ఏమో! ఎవడికి తెలుసో నాకేం తెలుసు? కానీ ఇలా అకారణంగా నేనెందుకు స్కెచింగ్ చేస్తానో నాకు మాత్రం తెలీదు. ఏం వస్తుంది ఇలా గీస్తే? ఏం తెస్తాయి ఈ స్కెచ్లు? పుస్తకాలు పుస్తకాలుగా నిలువుగా పెరుగుతూ పోతే? ఎప్పటికీ చేతరాని బొమ్మల గురించి వ్రాయరాని మాటలు ఇలా అల్లుకుంటూ పోతే? ఏం తెలీదు. ఈ పని ఒక్క మనసుకు ఇష్టమని తెలియడం తప్ప. జీవితం అంతం వరకు ఇలా గీతలపై గీతలు అకారణంగా గీసుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఆకలేసినపుడు కాసింత అన్నం చాలు. చెవులకు కొంచెం సంగీతం చాలు, పుస్తకాల గూళ్ళో ఏరి దాచుకున్న కాసిని పుస్తకాలు చాలు. ఇంకేం, ఇంతకన్నా మరింకేం గీతల వెంట సాగడానికి? జీవితాన్ని ఇలా కొద్దికొద్దితో నింపుకుని భద్రంగా అపురూపంగా రేఖల్ని, రంగుల్ని ఏరుకుని మరీ ‘నేనొక పుష్పాన్ని, నీ కోమల పాదాలతాగ్రాల పూచిన పుష్పాన్ని నేనని, తొట్టతొలి రుషులు అగ్నికీలల్లో మంత్రగ్రామాలు దర్శించినట్లు నీ కౌగిట్లో ప్రేమ జ్యోతిని చూసినట్లు, నీ వలలో చిక్కిన శబలవర్ణసంచాలిత శఫరి నేనేనని…’ గీసుకునే బొమ్మలివి. వట్టి గాలి వేళ్ళు సుడులు సుడులుగా శూన్యంలో తిప్పి వేసిన వందల వేల బొమ్మలు జేబులో దాచుకోలేక ఆ ఊహలన్నిటిని గాలిపటం కట్టి ఆ మఖ్మల్ దారం వెంటపడి సాగిన స్కెచ్ల లేఖలివి.ఫైనల్ డ్రాయింగ్ పెళ్ళాం వంటిది. బొమ్మ పూర్తికాగానే మోహం నశిస్తుంది. మాయ ఆవిరవుతుంది. ఈ నా గీసుకునే స్కెచ్లన్నీ దరిచేరని నా ప్రేయసికి వ్రాసుకునే ప్రేమ లేఖలే! ఎందాకా ఎందాకా ఎగిరేవంటూ తన వెంట అనంతకాలం తరమనిస్తుంది. మీట్ మై స్కెచ్ బుక్. లేదా డ్రాయింగ్ జర్నల్. కాదా వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం. ఇది నా బైబుల్, ఇది నా ఖురాన్, ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి, నా నాస్తి… నా అంతటికీ నేను అనునిత్యం వ్రాసుకునే ప్రేమలేఖల సమాహారం కథ ఇది. తాళం చెవి పుట్టని, కనిపెట్టని నా బొమ్మల ప్రపంచపు తలుపు తెరుచుకోడానికి నేను దొంగిలించి తెచ్చిన జవరాలి పక్క పిన్ను కథ ఇది. ఓపిక ఉంటే వినండి. ఎందుకు స్కెచింగ్ అంటే, అక్షరమాలలో ముందు ‘అ’ నేర్చుకుంటాం కదా! కొంత తరువాత ‘మ’ కూడా నేర్చుకుంటాం. ఇంకా వత్తులు, దీర్ఘాలు గట్రా గట్రా… ఆ పై ‘అ’ పక్కన ‘మ’ వ్రాసి ‘మ’కు ‘మ’ వత్తు ఇచ్చి ‘అమ్మ’ అని నేర్చుకున్నదాన్ని ఏం చేస్తాం? అమ్మ వస్తుంది, అమ్మ పోతుంది, అమ్మ కూచుంటుంది, అమ్మ తల దువ్వుకుంటుంది, అమ్మ చదువుకుంటుంది, అమ్మ నాన్నకు ప్రయివేట్ చెబుతుంది… ఇట్లా బోలెడు మాటలు అక్షరాల్లో నేర్చుకుని వ్రాసినంత అంతే ఇదిగా బొమ్మల్లో కూడా గీతల అమ్మ ఈ పనులన్నీ చేస్తుంది. కాదు… చచ్చినట్లు మీరు చేయించాలి. ఊరికే మాటలు చెప్పినట్లు పుట్టుకతోపాటు బొమ్మలు తెచ్చుకోడం, దేవుడు ప్రత్యేక శ్రద్దతో మన మునివేళ్ళని తీర్చిదిద్దడం, భూమ్మీదకు పంపడం అంతా హంబక్, వట్టి సొల్లు మాటలు, పంచదార పూతల కవిత్వపు కబుర్లు. నిజానికి సత్యం అనునది సత్యప్రమాణకంగా ఏవిటంటే, చచ్చేదాకా 24 ఇంటూ 7 బై 365 అనే కాలమానంలో ఇలలో కలలో స్కెచింగ్ చేస్తూనే ఉండాలి. బొమ్మని రకరకాలుగా ఊహల్లో చిలుకుతూనే ఉండాలి. ఆర్టిస్ట్గా పుట్టడం ఈజీ, అది డిఫాల్ట్. కానీ క్రాఫ్ట్మన్ కావడం కఠినాతి కష్టం. ఆర్టిస్ట్గా ప్రపంచాన్ని నమ్మించడం పరమ ఈజీ. దునియా మూర్ఖపుది, అది దేన్నయినా నమ్మేస్తుంది. బట్ ఆర్టిస్ట్గా సిసలు క్రాఫ్ట్మన్గా నిన్ను నువ్వు ఒప్పించుకోడం కుదరని కార్యం, అది అందని ఎత్తు. ఆ విషయం ఎరిగి సాధన చేయడమే నువ్వు కనీసం ఎక్కగలిగిన ఎత్తు. ‘టు హూమ్ ఇట్ మే కన్సర్న్’ వోలె ఎవరికి వారికి వారి స్కెచింగ్ అర్థం ఏమైనా కాని, కానీ నేనదేవిటంటే స్కెచింగ్ అంటే గీస్తూనే వుండు అని అర్థం. గీతని ముచ్చటపడమని కూడా ఒక అర్థం. కదులుతున్న పిల్లి తోకపై ముచ్చటపడ్డం ఆరంభించి దాని మీసాల దాకా గీత గీసి చటుక్కున ఆపడం ఒక ముచ్చట. యూఅన్ అగ్లో (Euan Uglow) పెయింటింగ్ పనితనంపై మనసు పారేసుకుని ముని వేళ్ళతో కుంచెని తడిగా సాపుచేసి సుతారంగా అతనిలా రంగుని అద్దడానికి ప్రయత్నం చెయ్యడం ఒక ముచ్చట అన్నమాట. ఆర్టిస్ట్ మిన్యోలా (Mike Mignola)లాగా పలకలు పలకలుగా నల్ల రంగుని పులిమేసి హెల్బాయ్ అనే ఒక కామికి క్యారెక్టర్ పెదవి చివర, ఓవర్ కోటు అంచున చిన్న ఎరుపుని మరకలా అంటించడం కూడా అచ్చం ముచ్చటే. చూపుడు వేలు చివరని గుండ్రంగా గులాబి గోరు గీసేసి ఆ పై చిన్న స్కిన్ ముద్దని సున్నితంగా బాపు గీసినట్టు గీయాలని చూడటం అదో ముచ్చట; వేలి ముద్రల, కాగితపు అచ్చుల, ఎండుటాకుల ముద్రలని భద్రంగా కాగితంపైకి తర్జుమా చెయ్యడం కూడా బత్తాల్యా వోలె (Dino Battaglia) ఒక ముచ్చటే. ఇదంతా స్రష్టల వారి వారి పనితనంపై నా వంటి బుడత బుడిబుడి అడుగుల మర్యాద ముచ్చట. స్కెచింగ్ అంటే నాకు బొమ్మ నుంచి బొమ్మ కాపీ చెయ్యడం. (అనగా, నచ్చిన బొమ్మ ఏదైనా దాన్ని చూసి అలాగే గీసెయ్యడం అన్నమాట.) పత్రికల్లో అచ్చయిన ఫోటోలని రేఖాచిత్రాలుగా, రంగు నకళ్ళుగా గీసుకోడం. అలా బయటికి వెళ్ళి కదలని చెట్లు, కదిలే రైళ్ళు, ఆడే పిల్లలు, టీవీ ముందు పడతులు, ఆశాపాతకుల ఏడ్పు మొహాలు, ఊళ్ళో వీధులు, ఊరి బయటి గుట్టలు మిట్టలు, నడిచే గుంపులు, పడుకుని నిలబడి జారిగిలబడి మొబైల్ చూసుకుంటున్నవాళ్ళు, సభల్లో కవి కవిత్వ పఠనం వినలేక చచ్చినట్లు వినే పాపం వాళ్ళు, ఫేస్బుక్లో మొహం దూర్చి ఎన్ని లైకులు ఏమేం కామెంట్లు ఎవరెవరు ఇచ్చారు అని ఆత్రంగా చూసేవాళ్ళు; ఔఇంకా పెద్దపెద్ద పొట్టలవాళ్ళు, వంగిన వీపులవాళ్ళు, నడుములు లేని అమ్మాయిలు, బోలెడు బోల్డ్ మడతలు గల నడుములు గలవాండ్లు, కాటన్ ప్యాంట్ నిలువు ఫోల్డులు, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ మోకాలి కింది అడ్డ ఫోల్డ్స్, బూట్కు కట్టిన లేస్, స్నీకర్స్ సోల్-రన్నింగ్ షూ సోల్ల మధ్య తేడా, ఇదీ అదని కాదు, సమస్తాన్ని చూస్తూనే ఉంటూ బుర్రలోని బోల్దంత ఖాళీని, స్కెచ్బుక్ లోని పేజీల ఖాళీని వీలయినంత నింపుతూనే ఉండాలి. ఇదంతా స్కెచింగే. ఇక్కడ ప్రస్తావించిన ఏ విషయం కూడా నేను ఇతరులనుండి విన్నది కాదు, చదివినదీ కాదు; నాకు నేనుగా తెలుసుకున్నవివన్నీనూ. ఇన్నేళ్ళ బొమ్మల జీవితంలో ప్రత్యక్షంగా ఏ గురువూ తగిలింది లేదు, తట్టింది లేదు. ఇదిగో ఇదే దారీ అదే చెట్టు అక్కడే పిట్ట అని గురి చూపించిందీ లేదు. నాకు నేను గురువునై శిష్యుడనై నేర్చుకున్న చాలా చిన్నచిన్న పాఠాలు ఇవన్నీ. మొన్నటికి మొన్న కూడా అత్యంత మొదటిసారిగా ‘ఇది ఇలా కదా’ అని తట్టినపుడు అమితాశ్చర్యంతో ‘అరే అవును కదా’ అనుకోవడం. మనం మళ్ళీ మళ్ళీ ఎంత ఫూలిష్ అని తెలుసుకోడం. ఇవన్నీ పాఠాలే. ఇక్కడే కొన్ని బొమ్మలు భోజనం చేస్తున్న వారివి. గుర్తులేదు దేనికని వేసుకున్న స్కెచ్లో ఇవి. భోజనం అంటే ఏవుంది, ఒకణ్ణి కూచోబెట్టి వాడి ముందు కంచంతో సహా రకరకాల గిన్నెలుగా వడ్డించడం, అంతే కదా! పరమ మెకానికల్గా గీసుకున్న స్కెచ్లు. బుర్ర ఏమాత్రం వాడకుండా వేసుకెళ్ళిన బొమ్మలు. అలా వేస్తూ ఉండగా మధ్యలో తట్టింది! “ఏవిరా ఫూలిష్ ఫెలో! మనిషి కుడి చేత్తో అన్నం తింటున్నాడు. నువ్వు వాడి ముందు పెట్టిన నీళ్ల గ్లాసు కుడి చేతి వైపే వుంది. గిన్నెలు, గరిటలు అన్నీ కుడి చేయి వైపే పెడితే వాడు ఆ ఎంగిలి చెయ్యే ఉపయోగించి, ఎంగిలి చేత్తో పనులన్నీ చేసుకోవాలా!” అనుకున్నా. అరే, ఎంత బుద్దితక్కువ బొమ్మలు! ఆ పక్కనే పచ్చ చొక్కావాడు పద్దతిగా తింటున్నాడు. వాడు కూచున్న తీరు, పళ్ళెం, చెంబూ అన్నీ గ్రామర్ని అనుసరించి ఉన్నాయ్. ఇక్కడ ఇది ఓ మంచి పాఠం. ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ నేను ఎక్కడో ఫోటోగ్రాఫ్ చూసి వేసుకున్నది, స్వంతంగా గీసినది కాదు. మన మూలాలు మన బొమ్మల్ని డిసైడ్ చేస్తాయి. అదెలా అనడుగుతే, నేను ముసల్మానుల ఇంట పుట్టి పెరిగిన వాణ్ణి. నేను మసలిన వాతావరణంలో పీట వేసుకుని భోజనం చేసే సంప్రదాయం లేదు కాబట్టి, నాకు స్పృహ కలిగి ఎన్నడూ నా బొమ్మల్లో పీట తేను. ఇంకోటి మానసికమైనది. నాకు మొహమాటం చాలఎక్కువ. కొన్ని చెడ్డ అనుభవాల వలన జనానికి అనునిత్యం స్పృహలో ఉండే స్థాయీభేదం వల్ల ఎవరి ఇంటికి వెళ్ళినా భోజనం చెయ్యను. అత్యంత బలవంతం మీద వెళ్ళినా అక్కడి తిండి తినాల్సి వచ్చినా ప్రాణం పోతున్నంత గాభరాగా నిముషాల్లో విషయం ముగించి ప్రాణవాయువు కొరకు బయటపడతాను. ఈ గందరగోళంలో అక్కడ ఆ వాతావరణం, ఆ కప్పులు, స్పూన్లు, చెంబులు, లోటాలు, డైనింగ్ టేబుల్, నాప్కిన్ గుడ్డలు గమనించేదెక్కడా? నిజానికి ఇది ఒక ఆర్టిస్ట్గా నా పెద్ద లోపం. మనం ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వేషన్ అనే స్కెచింగ్ చెయ్యాలి. అందుకని ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ టెక్నికల్గా కరెక్ట్. కానీ ఆ పీట, ఆ చెంబు, ఆ మనిషి నావాడు కాదు. ఇంత చెబుతున్నందుకైనా నా పాఠం నేనే నేర్చుకుంటూ విషయాన్ని గ్రహించుకునే సామర్ధ్యం పెంచుకోవాలి, శక్తి ఏర్పరుచుకోవాలి. మరోటి, నెలలు నిండిన గర్భిణి స్త్రీ బొమ్మ వేయబోతాం. గట్టిగా గమనిస్తే ఆయమ్మ బ్రస్ట్ లైన్, కడుపు ఆ సమయంలో దాదాపూ వేరు వేరుగా ఉండవు. ఛాతీదాక దిగిన గీత సుతారంగా మర్యాదగా చాలా చిన్న జర్క్ ఇచ్చి పెద్ద కడుపు ఆర్క్ అల్లా దిగాలి. కానీ చాలామంది ఆ పెద్ద నిండు వక్షోజాలు వేరుగా, కడుపు వేరుగా అలా వేసేస్తారు. ఎప్పుడైనా చొక్కా లేని బ్రాహ్మణుల బొమ్మ గీయాలంటే నాకు ఎప్పుడూ కన్ఫ్యూజనే, జంధ్యం ఏ వైపునుండి ఏ వైపుకు వేసుకుంటారబ్బా అని. ఇలా రకరకాల డిటైళ్ళ గురించి ఆలోచించుకోవాలి. సిగరెట్ ముట్టించుకున్నవాడు తదనంతరం అగ్గిపుల్లని గాల్లో ఆర్పేసి ఎలా చెయ్యిని మెలితిప్పి విసిరి పడేస్తాడో అలాంటి వాళ్ళని ఊహించుకుని స్కెచ్లు గీసుకుని మన బంధుమిత్రసపరివారంలో ఎవరైనా పనీపాటా లేకుండా దొరికినపుడు అలాంటి అగ్గిపుల్ల పడేసే యాక్షన్ వాడితో చేయించి, దాన్ని మనం గీసుకున్న ఊహాచిత్రాల పక్కని గీసుకుని తేడా చూసుకోవాలి ఇక్కడో గులాబీ చొక్కా వాడు వున్నాడు, ఊరికే పని వున్నా లేకపోయినా ఒక క్యారెక్టర్ని అనుకునో, చదివో, ఊహించో వాడిని రకరకాలుగా వేయ ప్రయత్నించండి. ఆ పక్కనే కప్పు కాఫీనో ఉగ్గెడు పెగ్గో పుచ్చుకునేవాణ్ణి కూడా గీయండి. బొమ్మ అంటే అన్నిసార్లు తలనుంచి కాళ్ళదాక గీయనక్కరలేదు. ఆ మొహం, ఆ చేతులు, వాడి మూడ్ చూపించగలిగితే చాలు- అదే మజా ఇస్తుంది కొన్నిసార్లు. ఆ తరువాత ఆ పైన కార్నర్లో చిన్న మురిపమైన ముద్దు బొమ్మ, ఈ కింద ఒక నాగుపాము బుసలవంటి కురుల అందం. తొలినాళ్ళల్లో ఈ శ్రమ అంతా తెగ శ్రమ అనిపిస్తుంది. కానీ అలా వేసి వేసి మీరు మరిచిపోయిన ఈ బొమ్మలు అకస్మాత్తుగా ఓ రోజు మీ కంటపడి ఒక వెర్రి ఆనందం అవుతుంది. శ్రమైకజీవనసౌందర్యం అనేది రంపపు మిల్లులో రిక్షా చక్రంలోనే కాదు, అరిగిన పెన్సిల్ ములుకులో కూడా వుంటుంది. ఎటొచ్చీ ఈ అందం శ్రీశ్రీతో సహా ఎవరికీ అందనిది, మీకు మాత్రమే ఎరుకైనది. అందుకు కంగ్రాట్స్! ఇక్కడ పక్కకు ఒత్తిగిలించి పడుకున్న ముసలివాడి బొమ్మ మళ్ళీ మళ్ళీ వేసుకున్నది, అలా సాధన చేసుకున్నది. అయితే మళ్ళీ మళ్ళీ అదే బొమ్మని సాధన చెయ్యడం మా చెడ్డ బోరింగ్ కావచ్చు. కానీ ఒకదాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే దాన్ని ఆధారం చేసుకునే మిగతా అంతా కథ నడుస్తుంది. రెండు రెక్కలు, ఒక ముక్కు, కాసింత కడుపు, బారచాచిన కాళ్ళు ఇంత ఆకాశం చాలు. కాకి, చిలుక, కంజు, పిట్ట అంతా ఒకే సూత్రం. పిల్లి బొమ్మ వచ్చినవాడికి పులి కూడా తెలుస్తుంది. లెజెండ్ బ్రూస్ లీ ఇలా అన్నాడు: “నేను పదివేల కరాటే విన్యాసాల్ని సాధన చేసినవాడిని లెక్కచెయ్యను కానీ ఒకే విన్యాసాన్ని పదివేలసార్లు సాధన చేసిన వాడంటే భయభక్తులు చూపిస్తాను.” ఎంత గొప్ప సూత్రం! అయితే అన్నిసార్లు వద్దు కానీ ఒక బొమ్మని పదిసార్లో ముప్ఫై సార్లో గీద్దాం రండి. మరి ఇంకా బొమ్మలు వేసేవాళ్ళు ముఖ్యంగా ఏం చెయ్యాలంటే, మానవుడి వెన్నెముకకు ఫెవికాల్, గంజి కలిపి పెట్టి ఇస్త్రీ చేయించినట్లు వాడిని నీలిగినట్లు వేయకండి. మీ బొమ్మల్లో కొద్దిగా యాక్షన్ జోడించండి. నటుడు అమోల్ పలేకర్ తెలుసుగా, తను తన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జ్ఞాపకాలు చెబుతూ ఇట్లా అంటాడు: “నేను నటుడిగా శిక్షణ పొందిన సమయంలో హావభావాలు ఎలా పలికించాలో, డైలాగ్ని ఏ ఏ సంధర్భాల్లో ఎట్లా చెప్పాలో, నవరసాలు ఎట్లా ఒలికించాలో అన్నీ శుభ్రంగా చేసేవాణ్ణి. కానీ నా ఈ రెండు చేతులు వున్నాయే, వాటిని మాత్రం ఏంచెయ్యాలో నాకు అర్థంకాలేదు. చేతులు ఖాళీగా ఉన్నాయి కదాని తెగ ఊపుతూ మాట్లాళ్ళేను, అండర్ ప్లే అనేది ఒకటి ఉంటుంది కదా! అప్పుడు నేనేం చేశానంటే నా చేతులకు పెన్నునో, పెన్సిల్నో, సిగరెట్నో ఆ సన్నివేశానికి తగినట్లు అలవాటు చేశాను. ఇక అంతే, నా సమస్య తీరిపోయింది. రెండు చేతులు పెన్నుతో ఆడుతూ తన పని చేస్తుంటే మిగతా శరీరంతో నా నటన నేను కానిచ్చాను.” ఈ చిన్న ఎక్సర్సైజ్ తెలీక ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు. నటుడు కాలేదు. మీ బొమ్మ సూపర్ స్టార్ కావడానికి మీరు పెద్ద కష్టపడనక్కరలేదు. ఆల్రెడీ తెలుగులో బొమ్మలు వేసేవారు చాలా మంది సూపర్ స్టార్లే. అయితే మీ బొమ్మని నటుడిగా మలచడానికి మాత్రం మీరు తెగ కష్టపడక తప్పదు. ఆ సదరు బొమ్మ వాడిని ఊరికే నిలబెట్టకండి, వాడికో బొమ్మల చొక్కా తొడగండి, చేతిలో సిగరెట్ అంటించండి, భుజాన సంచో ఫ్లాస్కో తగిలించండి, నెత్తి మీద మూట ఎక్కించండి, ఆ బరువుకు తగిన నడక అలవాటు చెయ్యండి, ఆ పై వాడిని ఒక పరుగు తీయించండి… ఇదంతా సోది అంటారా? అయితే ఓకే. నో ప్రోబ్లెమ్! మామూలుగా ఎప్పటిలాగే మీ బొమ్మకి కృష్ణలాగే చంకలు గట్టిగా అంటించండి, ఏం భయం లేదు. పోలీసులు ఎన్కౌంటర్ కాదు కదా, కనీసం ఉరి కూడా వెయ్యరు. కడమకి మీ అభిమానులెవరూ మిమల్ని ఫేస్బుక్ నుంచి అన్ఫ్రెండ్ కూడా చెయ్యరు, నో వర్రీస్. లైఫ్ ఈజ్ గుడ్ పైగా ఇగ్నోరెన్స్ బ్లెస్సు కూడానూ. ఇంకా, స్కెచ్ పుస్తకాలు మూడు రకాలువి ఏ3, ఏ4, ఏ5 అని ఎప్పుడూ వెంట వుంచుకోడం మంచిదంటాడు రాన్ టైనర్ (Ron Tiner) అనే ఒక చిత్రకళా గురువు. నేను రెండు చాల్లే నాకు అనుకున్నా. ఒకటి ఏ5, ఇంకా జేబులో పట్టే పాకెట్ స్కెచ్ పుస్తకానికే పరిమితమయ్యా; అదీ కాదూ అనుకుంటే మడతలుగా పెట్టుకున్న తెల్ల కాగితం కూడా మోర్ దాన్ ఎనఫ్. నిజానికి ఓ అయిదారు సంవత్సరాల క్రితం వరకు మన దేశంలో మంచి స్కెచ్ బుక్లు మార్కెట్లో అందుబాట్లో వుండేవి కావు. ఇప్పుడు చాలా నయం, ఆన్లైన్లో అమెజాన్లో, హైద్రాబాద్లో అయితే పంజాగుట్ట హిమాలయలో చాలా రకాల స్కెచ్ బుక్లు అందుబాటులో వున్నాయి. ఆ స్కెచ్ పుస్తకాల పక్కనే బోల్డని పెన్నులు కూడా వుంటాయి. ఒకటో రెండో పద్నాలుగో మీ పర్స్ ఓపిక మేరకు ఎన్నుకోవచ్చు. సరే ఈ సరంజామా మంచి చెడ్డలు చాలా విస్తృతంగా తరువాతెప్పుడయినా తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు. చివరగా, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువేనంటారు. ఇలా నాకు తెలిసీ తెలీని సంగతులు బోల్డన్ని ఈ కచేరీలో వెయ్యొచ్చు. కానీ దానికి కూడా ఒక ఓపికుండాలి. అదీ కాక నాకు ఈ చెవిటి ప్రపంచం మీద చాలా నమ్మకం, నేను చచ్చుకుంటూ వ్రాసే ఇదంతా వినడానికి చదవడానికి కోరి ఈ జన్మ మీరు ఎత్తలేదు. జానేభీదో యార్! సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం “ప్రియం చ న అనృతం బ్రూయాత్”ఏషా ధర్మః సనాతనః అనగా… ఈ భగవంతుని సృష్టిలో కరీనా కపూర్ బొడ్డుని మించిన మాస్టర్ పీస్ గీయబడలేదు, ఇది సత్యం. కింబర్లీ కేన్ క్లియవేజ్ని బోలిన ప్రకృతి సృష్టించబడలేదు, ఇదీనూ సత్యమే. పరనిందని మించిన పరమగాంధర్వమగు రాగం పాడబడలేదు, దీని సంగతి అతి సత్యమని కొత్తగా చెప్పనక్కరయే లేదు. శుభమ్ భూయాత్! చిట్టి సలహా: నిజానికి ఈ రాతలు చాలా కాలం క్రితం, నేను బొమ్మలు మొదలెట్టిన సమయంలో, నా ఊహకు బొమ్మలు, పుస్తకాలు అందిన సమయంలోనే ఎవరైనా ఒక మంచి చిత్రకారుడు, కాస్త నాలెడ్జ్ షేరింగ్ మీద నమ్మకం ఉన్నవాడు, ముందు తరాల బొమ్మల పిల్లలపై కరుణ, దయ ఉన్నవాడు ఎవరో అప్పుడే వ్రాసిపెట్టి ఉండాల్సింది. అవి చదుకుని అన్వర్ అనే కాసింత మంచి చిత్రకారుడు ఇప్పుడు నాకు తగిలేవాడు. అటువంటి వాడెవడూ మనకు రాసిపెట్టి ఉండలేదు కాబట్టి కనుకొలను చివరి వెచ్చని చిరు చెమ్మంత స్కెచ్ బుక్ సలహా ఏవిటంటే, నాకు మల్లే పుస్తకాన్ని ర్యాండమ్గా నింపొద్దు . సబ్జెక్ట్కు కొన్ని పేజీలు వదులుకోండి. నిలబడ్డ మనుషులంతా ఒక చోట, కుక్కలు పిల్లులు వంటి జంతుజాలం ఒక చోట, కుర్చీలు మేజాలు భోజనాల బల్ల ఇత్యాది ఒక దగ్గర, మసీదులు గుళ్ళు గోపురాలు ఒకే సైడునా… ఇది అవసరమైనప్పుడు మీ సబ్జెక్ట్ని ఎక్కువ కష్టపడి వెదుక్కునేట్టు చెయ్యదు. ఆ స్కెచ్లోంచి మీరు మీకు కావాల్సిన రిఫరెన్స్ను అనాయాసంగా పొందగలరు. ప్రస్తుతానికి ఇదింతే భశుం.--అన్వర్(చదవండి: రవి పరంజపే : చిత్రకారుల సంపద..!) -
హంపి తొలి గేమ్ ‘డ్రా
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి, ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ తమ తొలి రౌండ్ గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగంలో తమిళనాడు అమ్మాయి వైశాలితో జరిగిన తొలి గేమ్ను ఆంధ్రప్రదేశ్ స్టార్ హంపి 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగంలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో... విదిత్తో జరిగిన గేమ్ను గుకేశ్ 21 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఓపెన్ విభాగంలో ఎనిమిది మంది మధ్య... మహిళల విభాగంలో ఎనిమిది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. రెండు విభాగాల విజేతలు ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్తో ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతారు. -
‘డ్రా’తో గట్టెక్కిన ఆంధ్ర
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు లీగ్ దశను ‘డ్రా’తో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా కేరళతో జరిగిన చివరిదైన ఏడో లీగ్ మ్యాచ్ను ఆంధ్ర జట్టు పోరాడి ‘డ్రా’ చేసుకుంది. చివరి రోజు ఓవర్నైట్ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 97 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు సాధించి ‘డ్రా’తో గట్టెక్కింది. 242 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కేరళ జట్టుకు 3 పాయింట్లు, ఆంధ్ర జట్టుకు ఒక పాయింట్ లభించాయి. అశ్విన్ హెబ్బర్ (165 బంతుల్లో 72; 12 ఫోర్లు, 1 సిక్స్) సంయమనంతో ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కరణ్ షిండే (82 బంతుల్లో 26; 5 ఫోర్లు), షేక్ రషీద్ (93 బంతుల్లో 36; 6 ఫోర్లు), షోయబ్ ఖాన్ (93 బంతుల్లో 11; 2 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి ఆంధ్ర జట్టుకు ఓటమి తప్పించడంలో కీలకపాత్ర పోషించారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 272 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ తొలి ఇన్నింగ్స్ను 514/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’
శ్రీనగర్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు రెండో ‘డ్రా’ నమోదు చేసింది. రియల్ కశ్మీర్ ఎఫ్సీ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. రెండు జట్లకు గోల్ చేసే అవకాశాలు లభించినా ఫినిషింగ్ లోపంతో సాధ్యపడలేదు. 13 జట్ల మధ్య జరుగుతున్న ఐ–లీగ్లో ఇప్పటి వరకు శ్రీనిధి జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడింది. ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి, మరో రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని ఓవరాల్గా 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈనెల 11న జరిగే తదుపరి మ్యాచ్లో ఢిల్లీ ఎఫ్సీతో హైదరాబాద్లో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
విజేత తేలేది ‘టైబ్రేక్స్’లోనే...
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో చాంపియన్ ఎవరో టైబ్రేక్స్ ద్వారా తేలనుంది. భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద, వరల్డ్ నంబర్వన్ కార్ల్సన్ (నార్వే) మధ్య ఫైనల్లో రెండో గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. వరుసగా రెండో ‘డ్రా’ తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా నేడు వీరిద్దరి మధ్య టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ముందుగా ర్యాపిడ్ ఫార్మాట్లో 25 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు ఆడిస్తారు. ఇందులో ఫలితం వస్తే ఫైనల్ను ముగిస్తారు. రెండు గేమ్ల తర్వాత కూడా సమంగా ఉంటే... ఈసారి 10 నిమిషాలు నిడివిగల రెండు గేమ్లు నిర్వహిస్తారు. ఇక్కడా ఫలితం తేలకపోతే 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్లను ఆడిస్తారు. అయినా ఫలితం తేలకపోతే 3 నిమిషాల నిడివిగల గేమ్లను ఇద్దరిలో ఒకరు గెలిచే వరకు ఆడించి విజేతను ఖరారు చేస్తారు. 32 ఏళ్ల కార్ల్సన్ గతంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్గా నిలువగా... ప్రజ్ఞానంద కెరీర్లో తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నాడు. -
రెండో గేమ్లో కార్ల్సన్తో గట్టి పోరాటమే చేయాలి: ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగం టైటిల్ కోసం భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద, వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మధ్య జరిగిన తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ గేమ్లో తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు సమ్మతించారు. ‘తొలి గేమ్లో నేను ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో గేమ్లో కార్ల్సన్తో గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అతడిని నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. వీరిద్దరి మధ్య నేడు రెండో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్లో కార్ల్సన్ తెల్ల పావులతో ఆడతాడు. ఈ గేమ్లో గెలిచిన ప్లేయర్కు ప్రపంచకప్ టైటిల్ లభిస్తుంది. ఒకవేళ రెండో గేమ్ కూడా ‘డ్రా’ అయితే గురువారం టైబ్రేక్ గేమ్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. -
నేడే మద్యం లాటరీలు
సాక్షి, హైదరాబాద్/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రానున్న రెండేళ్ల కాలానికిగాను లైసెన్సుల మంజూరు కోసం నేడు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘డ్రా’తీయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ ద్వారా ఈ లాటరీల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే డ్రా తీసే ప్రదేశంలోకి అనుమతించాలని, లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. కాగా, మంత్రి ఆదివారం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో కూడా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాటరీ ప్రక్రియ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. -
ప్రజ్ఞానంద తొలి గేమ్ ‘డ్రా’
బాకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ సెమీఫైనల్ను భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు. ఫాబియనో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీస్ తొలి గేమ్ను ప్రజ్ఞానంద 78 ఎత్తులో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రత్యర్థికి పలు మార్లు మెరుగైన అవకాశాలు వచ్చినా...చివరి వరకు పోరాడిన అతను ఓటమినుంచి తప్పించుకోగలిగాడు. శనివారం నల్లపావులతో ఆడి కరువానాను నిరోధించగలిగిన భారత కుర్రాడు ఆదివారం తెల్ల పావులతో ఆధిక్యం ప్రదర్శించగలిగితే ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరో సెమీస్లో వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ తన స్థాయిని ప్రదర్శించాడు. స్థానిక ఆటగాడు నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరుగుతున్న ఈ పోరులో తొలి గేమ్ను అతను 43 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. శనివారం తన రెండో గేమ్ను కార్ల్సన్ ‘డ్రా’ చేసుకోగలిగినా ఫైనల్లోకి అడుగు పెడతాడు. -
అర్జున్ విజయం హారిక ‘డ్రా’
బకూ (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు ఇరిగేశి అర్జున్ కీలక విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి రౌండ్లో నల్ల పావులతో ఆడి అర్జున్ గెలుపు నమోదు చేయడం విశేషం. ఈ గేమ్లో అర్జున్ 53 ఎత్తుల్లో స్వీడన్ గ్రాండ్మాస్టర్ నిల్స్ గ్రాండెలియస్ను ఓడించాడు. నేడు జరిగే రెండో రౌండ్ను అతను ‘డ్రా’గా ముగించినా సరే క్వార్టర్ ఫైనల్ చేరతాడు. మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక తొలి రౌండ్ను నల్లపావులతో ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాకినా (రష్యా)తో జరిగిన ఈ పోరును 48 ఎత్తులో హారిక ముగించింది. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ రౌండ్ తొలి గేమ్లో నల్లపావులతో ఆడి డి.గుకేశ్ కూడా విజయాన్ని అందుకున్నాడు. గుకేశ్ 38 ఎత్తుల్లో వాంగ్ హావో (చైనా)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్ మ్యాచ్లలో ఫెరెన్స్ బెర్క్స్ (హంగేరీ)– ప్రజ్ఞానంద (45 ఎత్తుల్లో)...ఇయాన్ నెపొమినియాచి (రష్యా)– విదిత్ గుజరాతీ మధ్య (31 ఎత్తుల్లో) జరిగిన తొలి గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. -
భారత్, జపాన్ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్ తమ రెండో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం జపాన్తో జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభం నుంచే పట్టుదల కనబరచడంతో మ్యాచ్ ఆఖరిదాకా పోటాపోటీగా సాగింది. రెండో క్వార్టర్ ముగిసే దశలో జపాన్కు లభించిన పెనాల్టీ కార్నర్ను కెన్ నగయొషి (28వ ని.లో) గోల్గా మలచడంతో జపాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడో క్వార్టర్లో భారత్కు లభించిన పెనాల్టీ కార్నర్ను కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా గోల్పోస్ట్లోకి నెట్టాడు. స్కోరు సమం కాగా... ఆఖరి క్వార్టర్లో మరో గోల్ నమోదు కాలేదు. ఇతర మ్యాచ్ల్లో మలేసియా 5–1తో చైనాపై ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, పాకిస్తాన్ల మధ్య జరిగిన పోరు కూడా 1–1తో ‘డ్రా’ అయ్యింది. ఆదివారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్లో భారత్... మలేసియాతో తలపడుతుంది. -
భారత మహిళలకు చేజారిన విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్ మహిళలతో చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయలక్ష్యం 226 పరుగులు...41.1 ఓవర్లలో స్కోరు 191/4...చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులే కావాలి. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (108 బంతుల్లో 77; 9 ఫోర్లు), దీప్తి శర్మ (1) ఒకే ఓవర్లో రనౌటయ్యారు. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్ స్కోరును సమం మాత్రమే చేయగలిగింది. చివర్లో 19 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా లక్ష్యాన్ని అందుకోలేక మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 33 నాటౌట్) మరో ఎండ్లో ఉండగా...చివరి ఓవర్ మూడో బంతికి మేఘనా సింగ్ను మారుఫా అవుట్ చేసింది. దాంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ కాగా... అంతకు ముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులే చేసింది. అప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించలేదు. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు ఒక్కోటి గెలవడంతో సిరీస్ 1–1తో ‘డ్రా’ అయింది. భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ స్మృతి మంధాన (85 బంతుల్లో 59; 5 ఫోర్లు) రాణించింది. స్మృతి, హర్లీన్ మూడో వికెట్కు 107 పరుగులు జోడించారు. కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (14; 2 ఫోర్లు) నిరాశపర్చడంతో పాటు స్వల్ప విరామంలో ఓవర్కు రెండు చొప్పున నాలుగు వికెట్లు కోల్పోవడం భారత్ గెలుపురాతను మార్చింది. అంతకు ముందు ఫర్జానా హక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు), షమీమా సుల్తానా (78 బంతుల్లో 52; 5 ఫోర్లు) బంగ్లా స్కోరులో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా ఫర్జానా నిలిచింది. చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై భారత కెపె్టన్ హర్మన్ప్రీత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాహిదా బౌలింగ్లో అవుటయ్యాక హర్మన్ తన బ్యాట్తో స్టంప్స్ను బలంగా కొట్టి అంపైర్తో వాగ్వాదానికి దిగింది. ‘ఈ మ్యాచ్తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో’ అని హర్మన్ వ్యాఖ్యానించింది. -
కార్మికులతో ముచ్చటించిన సింథియా.. రాజకీయాల్లో రాహుల్తో పోలిక..?
ఢిల్లీ: భారత్ జోడో యాత్ర మొదలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ట్రక్కు డ్రైవర్ల నుంచి కార్మికుల వరకు అందర్ని పలకరిస్తూ తన రాజకీయ పంథాను కొనసాగించారు. గతంలో రాహుల్ గాంధీకి అనుచరుడైన ప్రస్తుత బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా తాజాగా గ్వాలియర్లోని ఓ రెస్టారెంట్ కార్మికులను పలకరించారు. దీంతో నెటిజన్లు రాహుల్నే ఫాలో అవుతున్నారా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి సింథియా ఏం చెప్పారంటే..? ఇటీవల జ్యోతిరాదిత్య సింథియా గ్వాలియర్ వెళ్లే క్రమంలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అక్కడి కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల అందించిన ఆహారాన్ని తీసుకున్నారు. కార్మికుల్లో ఓ వృద్ధురాలు నుంచి ఆశీస్సులను పొందారు. स्वादिष्ट भोजन खाने के साथ साथ जरूरी है रसोइया से मिलना! 😁 आज ग्वालियर प्रवास के दौरान एक रेस्टोरेंट के युवा कर्मचारियों से मिला एवं खाने और स्थानीय मुद्दों पर चर्चा की । pic.twitter.com/eosNtXonBS — Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 6, 2023 ఈ వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందించి.. ఇలా కార్మికులను కలవడం రాహుల్ గాంధీ నుంచి నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి సింథియా కూడా సింపుల్గా బదులు చెప్పారు. నిజంగా నేర్చుకోవడం లేదని చెప్పారు. 2020లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేతృత్వంలో కమల్నాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు సింథియా. 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శివరాజ్ సింగ్తో చేతులు కలిపారు. అదే ఏడాది ఆయన రాజ్య సభకు ఎంపికయ్యారు. అనంతరం 2021లో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదీ చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు -
సిరీస్ మనదే.. చివరి టెస్ట్ ‘డ్రా’.. డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా
ఆఖరి రోజు ఏ మలుపూ లేదు. ఆలౌట్ చేయడం మన బౌలర్ల వల్ల కాలేదు. బ్యాటర్ల జోరులో ఏ మార్పూ లేదు. చివరకు ఎలాంటి డ్రామా లేకుండా నాలుగో టెస్టు ‘డ్రా’ అయింది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓ పది పరుగులు చేసుంటే ఇంకో ఈ టెస్ట్లో ఐదో సెంచరీ అయ్యేది. ఐదు రోజుల పాటు రోజుకో సెంచరీ చొప్పున ఈ మ్యాచ్కు అపూర్వ ఘనత దక్కేది. మరోవైపు క్రైస్ట్చర్చ్లో న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్ట్లో శ్రీలంక ఓడిపోవడంతో ఈ మ్యాచ్ తుది ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించింది. అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు రోజుల్లో ముగిసిన గత టెస్టులకు భిన్నంగా ఆఖరి మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. 2–1తో సిరీస్ను వశం చేసుకున్న టీమిండియా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. నాలుగో టెస్టు చివరి రోజు కూడా బ్యాటర్స్ హవానే కొనసాగింది. దీంతో భారత బౌలర్లు శక్తికి మించి శ్రమించినా రెండు వికెట్లే పడగొట్టగలిగారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 78.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), లబుషేన్ (213 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. ఫలితానికి అవకాశం లేకపోవడంతో గంట ముందే ‘డ్రా’కు ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించారు. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా... స్పిన్తో భారత్కు సిరీస్ విజయాన్నిచ్చిన బౌలింగ్ ద్వయం అశ్విన్–రవీంద్ర జడేజాలకు సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ఇచ్చారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఈనెల 17న ముంబైలో జరిగే తొలి మ్యాచ్తో మొదలవుతుంది. హెడ్ సెంచరీ మిస్... ఆఖరి రోజు ఓవర్నైట్ స్కోరు 3/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా కాసేపటికే ఓపెనర్ కునెమన్ (6) వికెట్ను కోల్పోయింది. జట్టు స్కోరు 14 పరుగుల వద్ద అతని వికెట్ను అశ్విన్ పడగొట్టగానే భారత శిబిరం సంబరపడింది. ఇక మ్యాజిక్ షురూ అనుకుంటే... అక్కడి పిచ్ ‘అంతలేదు’ అన్నట్లుగా బ్యాటర్లకే సహకరించింది. దీంతో హెడ్, వన్డౌన్ బ్యాటర్ లబుషేన్ నింపాదిగా ఆడుకున్నారు. రిస్క్ తీసుకోకుండా ‘డ్రా’ కోసమే వాళ్లిద్దరు క్రీజుకు అతుక్కుపోయారు. దీంతో భారత బౌలర్లు ఎంత చెమటోడ్చినా తొలి సెషన్లో మరో వికెటే దొరకలేదు. 73/1 స్కోరు వద్ద లంచ్ విరామానికికెళ్లారు. అనంతరం రెండో సెషన్లో హెడ్ 112 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... మరికాసేపటి ఆసీస్ స్కోరు 100 పరుగులు దాటింది. హెడ్ అడపాదడపా బౌండరీలతో పరుగులు సాధించడంతో ఐదో రోజు కూడా సెంచరీ ఖాయమనిపించింది. కానీ హెడ్ అహ్మదాబాద్ టెస్టుకు ఆ అరుదైన అవకాశం ఇవ్వకుండా 90 పరుగుల వద్ద అక్షర్ బౌలింగ్లో అవుటయ్యాడు. లబుషేన్ 150 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, 158/2 వద్ద రెండో సెషన్ ముగిసింది. ‘డ్రా’ దిశగా సాగడంతో మూడో సెషన్లో 11 ఓవర్ల ఆటే ఆడారు. సిరీస్లో జరిగిన మూడు టెస్టుల్లోనూ 30 పైచిలుకు వికెట్లు మూడు రోజుల్లోనే రాలితే... ఆఖరి టెస్టు ఐదు రోజులు జరిగినా బౌలర్లు 22 వికెట్లను మించి పడగొట్టలేకపోయారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480; భారత్ తొలి ఇన్నింగ్స్: 571; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: కునెమన్ (ఎల్బీడబ్ల్యూ) అశ్విన్ 6; హెడ్ (బి) అక్షర్ పటేల్ 90; లబుషేన్ (నాటౌట్) 63; స్టీవ్ స్మిత్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 6; మొత్తం (78.1 ఓవర్లలో 2 వికెట్లకు డిక్లేర్డ్) 175. వికెట్ల పతనం: 1–14, 2–153. బౌలింగ్: అశ్విన్ 24–9–58–1, రవీంద్ర జడేజా 20–7–34–0, షమీ 8–1–19–0, అక్షర్ పటేల్ 19–8–36–1, ఉమేశ్ యాదవ్ 5–0–21–0, గిల్ 1.1–0–1–0, పుజారా 1–0–1–0. మరో మ్యాచ్ మిగిలుంది... అదే ఫైనల్! భారత్, ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ అయితే ముగిసింది. కానీ ఇరుజట్ల మధ్య మరో ‘టెస్టు’ మిగిలుంది! అదేనండి... డబ్ల్యూటీసీ ఫైనల్. ఇక్కడ బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చినట్లే ఇంగ్లండ్లో ప్రపంచ టెస్టు చాంపియన్ ఎవరో కూడా తేలుతుంది. ఈ ఏడాది జూన్లో 7 నుంచి 11 వరకు లండన్లోని ది ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 16 సొంతగడ్డపై భారత జట్టుకిది వరుసగా 16వ టెస్ట్ సిరీస్ విజయం. 1 మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టి20) కనీసం 10 చొప్పున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్న తొలి క్రికెటర్గా కోహ్లి ఘనత. 50 భారత్ తరఫున తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్గా అక్షర్ పటేల్ గుర్తింపు పొందాడు. కెరీర్లో 12 టెస్టులు ఆడిన అక్షర్ 2,205 బంతుల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. బుమ్రా (2,465 బంతులు) పేరిట ఉన్న రికార్డును అక్షర్ సవరించాడు. 2 టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ 37 సిరీస్లలో 10 సార్లు ఈ పురస్కారం గెల్చుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (62 సిరీస్లలో 11 సార్లు) అగ్రస్థానంలో ఉండగా... జాక్వస్ కలిస్ (61 సిరీస్లలో 9 సార్లు) మూడో స్థానానికి పడిపోయాడు. -
రిజర్వేషన్ డ్రా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్రావు
-
Ind Vs Nz 1st Test : తొలి టెస్టు డ్రా
-
ఇంగ్లండ్, పాక్ టెస్టుకు వర్షం దెబ్బ
సౌతాంప్టన్: మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. నాలుగో రోజు కేవలం 10.2 ఓవర్ల ఆట సాధ్యమైంది. ఓవర్నైట్ స్కోరు 223/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 236 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ రిజ్వాన్ (72; 7 ఫోర్లు) బ్రాడ్ బౌలింగ్లో క్రాలీకి క్యాచ్ ఇచ్చి చివరి వికెట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ (4/56), అండర్సన్ (3/60) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. సోమవారం మ్యాచ్కు చివరి రోజు. -
భారత్-శ్రీలంక తొలి టెస్టు డ్రా
-
ఆంధ్ర, త్రిపుర మ్యాచ్ ‘డ్రా’
అగర్తల: ఆంధ్ర, త్రిపుర మధ్య హోరాహోరీగా సాగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ సమరం చివరకు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు ఆదివారం ఆంధ్ర జట్టు దూకుడుగా ఆడి సవాల్ విసరగా... ఆ తర్వాత త్రిపుర కూడా లక్ష్య ఛేదనలో వెనకడుగు వేయలేదు. చివరకు వెలుతురులేమితో మ్యాచ్కు ముగింపు లభించింది. 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆట ముగిసే సమయానికి త్రిపుర 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్మిత్ పటేల్ (99 బంతుల్లో 107 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సెంచరీ చేయగా, ఉత్తమ్ బోస్ (46 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. భార్గవ్ భట్కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 51/1తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్లకు 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శ్రీకర్ భరత్ (50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, అశ్విన్ హెబర్ (32 బంతుల్లో 44 నాటౌట్; 3 సిక్స్లు), సుమంత్ (42 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు), రికీ భుయ్ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. ఆంధ్ర 5.08 రన్రేట్తో పరుగులు చేయడం విశేషం. తాజా ఫలితంతో ఐదు మ్యాచ్ల తర్వాత 18 పాయింట్లతో ఆంధ్ర ఈ గ్రూప్లో అగ్రస్థానంలో ఉంది. తమ ఆఖరి మ్యాచ్లో ఆంధ్ర, ముంబైతో తలపడుతుంది. ఈ నెల 17 నుంచి సొంతగడ్డపై ఒంగోలులో జరిగే ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధిస్తే చాలు ఆంధ్ర క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. -
ఆనంద్కు మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. మాక్సిమి వాచెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 5 పాయింట్లతో మాక్సిమి, అరోనియన్ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో సో వెస్లీ (అమెరికా)తో ఆనంద్ ఆడతాడు. -
హారిక గేమ్ ‘డ్రా’
టెపి సిజ్మన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో ‘డ్రా’ నమోదు చేసింది. స్వీడన్లోని మాల్మో నగరంలో జొబావా (జార్జియా)తో శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్ను హారిక 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
శ్రీలంక ఘన విజయం
కొలంబో: బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ‘డ్రా’ చేసుకున్న శ్రీలంక జట్టు... వన్డే సిరీస్ను కూడా ‘డ్రా’గా ముగించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను బంగ్లాదేశ్ గెలుపొందగా... వర్షం కారణంగా రెండో మ్యాచ్ రద్దయింది. బ్యాట్స్మన్, బౌలర్లు సమష్టిగా రాణించడంతో బంగ్లాదేశ్తో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక 70 పరుగుల తేడాతో గెలిచి 1–1తో సిరీస్ను పంచుకుంది. తొలుత శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ (54; 4 ఫోర్లు), తిసార పెరీరా (52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మోర్తజా 3, ముస్తఫిజుర్ రహమాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లంక బౌలర్ కులశేఖర (4/37) చెలరేగడంతో బంగ్లాదేశ్ జట్టు 44.3 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. షకీబుల్ హసన్ (54; 7 ఫోర్లు), మెహదీ హసన్ మిరాజ్ (51; 6 ఫోర్లు) పోరాడారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్, దిల్రువాన్ పెరీరా, ప్రసన్న తలా 2 వికెట్లు పడగొట్టారు. -
పడగొట్టలేకపోయారు
⇔‘డ్రా’గా ముగిసిన మూడో టెస్టు ⇔రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 204/6 ⇔ ఆదుకున్న హ్యాండ్స్కోంబ్, మార్ష్ ⇔ఆలౌట్ చేయడంలో భారత్ విఫలం ∙25 నుంచి చివరి టెస్టు ప్చ్...ఆశించిన ఫలితం దక్కలేదు. చివరి రోజు ఆటలో ఎనిమిది వికెట్లు తీసి ఆస్ట్రేలియా కథ ముగిద్దామని భావించిన భారత్ ఆ ప్రయత్నంలో విఫలమైంది. అనుకూలంగా కనిపిస్తున్న పిచ్పై స్పిన్ తంత్రంతో ప్రత్యర్థి పని పట్టవచ్చని టీమిండియా పెట్టుకున్న నమ్మకాన్ని కంగారూ బ్యాట్స్మెన్ వమ్ము చేశారు. ఆరంభంలో రెండు కీలక వికెట్లు తీసి ఆశలు రేపినా... ఆ తర్వాత 62 ఓవర్ల పాటు మరో వికెట్టే దక్కలేదు. చివర్లో మరో రెండు వికెట్లు పడగొట్టగలిగినా అప్పటికే విజయం చేజారిపోయింది. అనూహ్య మలుపులు తిరిగి, ఆసక్తికరంగా సాగిన రాంచీ టెస్టులో చివరకు కోహ్లి సేనకు ‘డ్రా’నందమే మిగిలింది. నాలుగు పరుగుల వ్యవధిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు అవుటయ్యాడు... సిరీస్లో ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ స్మిత్ వెనుదిరిగే సమయానికి జట్టు ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో ఆసీస్ కుప్పకూలిపోవచ్చని అనిపించింది. కానీ హ్యాండ్స్కోంబ్, షాన్ మార్ష్ ఆసీస్ను ఆదుకున్నారు. ప్రత్యర్థి ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా పట్టు వదలకుండా మొండిగా పోరాడారు. భారత బౌలింగ్ను పట్టుదలగా ఎదుర్కొంటూ ఒకరు 200 బంతులు ఆడితే, మరొకరు 197 బంతులు ఎదుర్కొని తమ జట్టును క్షేమంగా తీరం చేర్చారు. మూడు టెస్టుల్లో మూడు రకాల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక తాడోపేడో తేల్చుకోవాల్సింది ధర్మశాలలోనే. రాంచీ: హోరాహోరీగా సాగుతున్న బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో మరో టెస్టుకు ఆసక్తికర ముగింపు లభించింది. ఐదు రోజుల పాటు ఇరు జట్లు పట్టుదలగా, పట్టు విడవకుండా పోరాడిన అనంతరం రాంచీలో జరిగిన మూడో టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ ఆఖరి రోజు సోమవారం ఓటమిని తప్పించుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దానిని విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ మెరుగైన ప్రదర్శనే ఇచ్చినా... ఆసీస్ను పడగొట్టడంలో మాత్రం విఫలమైంది. ఐదో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. పీటర్ హ్యాండ్స్కోంబ్ (200 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు), షాన్ మార్‡్ష (197 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఐదో వికెట్కు 124 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో జడేజాకు 4 వికెట్లు దక్కాయి. నాలుగు టెస్టుల ఈ సిరీస్లో ఇరు జట్లు ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచాయి. చివరిదైన నాలుగో టెస్టు శనివారం నుంచి ధర్మశాలలో జరుగుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 451, భారత్ తొలి ఇన్నింగ్స్: 603/9 డిక్లేర్డ్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (బి) జడేజా 14; రెన్షా (ఎల్బీ) (బి) ఇషాంత్ 15; లయన్ (బి) జడేజా 2; స్మిత్ (బి) జడేజా 21; మార్ష్ (సి) విజయ్ (బి) జడేజా 53; హ్యాండ్స్కోంబ్ (నాటౌట్) 72; మ్యాక్స్వెల్ (సి) విజయ్ (బి) అశ్విన్ 2; వేడ్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 16; మొత్తం (100 ఓవర్లలో 6 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–17; 2–23; 3–59; 4–63; 5–187; 6–190. బౌలింగ్: అశ్విన్ 30–10–71–1; జడేజా 44–18–54–4; ఉమేశ్ 15–2–36–0; ఇషాంత్ 11–0–30–1. సెషన్–1: స్మిత్ (బి) జడేజా ఓవర్నైట్ స్కోరు 23/2తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడగా, భారత బౌలర్లు చక్కటి బంతులతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఈ దశలో రెన్షా (15)తో వాదోపవాదాలు సాగిన అనంతరం అద్భుత బంతితో అతడిని అవుట్ చేసి ఇషాంత్ భారత్కు కీలక వికెట్ అందించాడు. మరో నాలుగు బంతులకే స్మిత్ (21)ను జడేజా బౌల్డ్ చేయడంతో భారత శిబిరంలో ఆనందం రెట్టింపైంది. జడేజా వేసిన బంతిని ముందుకొచ్చి ప్యాడ్తో స్మిత్ అడ్డుకునే ప్రయత్నం చేయగా, అది అతడిని దాటుకుంటూ వెళ్లి స్టంప్ను గిరాటేసింది. ఓవర్లు: 28.4, పరుగులు: 60, వికెట్లు: 2 సెషన్–2: కీలక భాగస్వామ్యం లంచ్ తర్వాత షాన్ మ, హ్యాండ్స్కోంబ్ తమ పోరాటం కొనసాగించారు. ఒకవైపు జాగ్రత్తగా డిఫెన్స్ ఆడుతూనే, మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా చక్కటి షాట్లతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. 27 పరుగుల వద్ద ఉమేశ్ బౌలింగ్లో మార్ష్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత్ కోరిన రివ్యూ వృథా అయింది. ఒక దశలో వరుసగా 32 బంతులపాటు పరుగే తీయని హ్యాండ్స్కోంబ్ ఆ తర్వాత అశ్విన్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు బాదడం విశేషం. ఓవర్లు: 33, పరుగులు: 66, వికెట్లు: 0 సెషన్–3: భారత్కు నిరాశ చివరి సెషన్లో కూడా ఆసీస్ బ్యాట్స్మెన్ పట్టు వదల్లేదు. భారత బౌలర్లందరూ గట్టి ప్రయత్నం చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయారు. ఉమేశ్ బౌలింగ్లో హ్యాండ్స్కోంబ్ 44 పరుగుల వద్ద అంపైర్ ఎల్బీని తిరస్కరించడంతో భారత్ రివ్యూ చేసింది. అయినా ఫలితం లభించలేదు. స్కోరు సమం చేసిన తర్వాత ఇద్దరు బ్యాట్స్మెన్ మరింత స్వేచ్ఛగా ఆడారు. ఈ క్రమంలో ముందుగా హ్యాండ్స్కోంబ్ 126 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ కొత్త బంతిని తీసుకున్నా కూడా లాభం లేకపోయింది. మరోసారి మార్ష్ విషయంలో రివ్యూ కోరి భారత్ భంగపడగా...ఆ వెంటనే అతను 190 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అనంతరం తక్కువ వ్యవధిలో మార్ష్, మ్యాక్స్వెల్ (2) వెనుదిరిగినా ఆసీస్కు ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది. ఓవర్లు: 31, పరుగులు: 55, వికెట్లు: 2 ♦ ♦ ♦ నిజానికి 150 పరుగుల ఆధిక్యాన్ని మేం కూడా ఊహించలేదు. ముందు రోజు రెండు వికెట్లు తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ ఇద్దరు ఆసీస్ బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడారు. వారిని అభినందించక తప్పదు. చివరి రోజు బంతి చాలా తొందరగా మెత్తబడిపోవడమే రెండో సెషన్లో మాకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడానికి కారణం. బలమైన ప్రత్యర్థి పోరాడుతుందని, అంత సులువుగా వికెట్లు ఇవ్వదని కూడా తెలుసు. రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం లేకుండానే గెలిచే స్థితిలో నిలవడం మాకు సంతృప్తినిస్తే, డ్రాతో బయటపడినందుకు వారు కూడా సంతోషించి ఉంటారు. నా దృష్టిలో పుజారా అమూల్యమైన ఆటగాడు. చాలా మంది అతని విలువను గుర్తించలేకపోవడం నాకు బాధ కలిగిస్తుంది. అశ్విన్, జడేజా సీజన్లో చెరో 4 వేలకు పైగా బంతులు విసిరారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. కానీ తప్పదు. జట్టు గెలవాలంటే అలాంటి విలువైన బౌలర్లను పూర్తిగా వాడుకోవాల్సిందే. –కోహ్లి, భారత కెప్టెన్ ♦ ♦ ♦ క్రికెట్లో జోరు కొనసాగించడం లాంటి మాట ఏదైనా ఉంటే నాలుగో టెస్టుకు ముందు అది ఇప్పుడు మా వైపే ఉందని చెప్పగలను. ఎందుకంటే మమ్మల్ని ఆలౌట్ చేయలేకపోవడం భారత్ను తీవ్రంగా బాధించి ఉంటుంది. మార్, హ్యాండ్స్కోంబ్ ప్రదర్శన అద్భుతం. నాకు గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి ఆటతీరు ప్రదర్శించడం గురించే మేం పదే పదే చర్చించుకున్నాం. ఐదు రోజులు టెస్టు సాగుతుందని నేను అనుకోలేదు. మేం మరో వంద పరుగులు చేయాల్సింది. పుజారా, సాహా చాలా బాగా ఆడారు. 210 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం నా కెరీర్లో ఎప్పుడూ జరగలేదు. బాగా అలసిపోయాను. –స్టీవ్ స్మిత్, ఆసీస్ కెప్టెన్ ⇔ భారత గడ్డపై ఒక విదేశీ జట్టు 150 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి మ్యాచ్ను కాపాడుకోవడం 2008 తర్వాత ఇదే తొలిసారి. అదే విధంగా భారత్లో టెస్టు మ్యాచ్ చివరి రోజు కనీసం 75 ఓవర్లు ఎదుర్కొని ఓటమి తప్పించుకోవడం కూడా 2008 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ⇔ ఈ టెస్టులో జడేజా మొత్తం 93.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 1990లో ఇంగ్లండ్తో నరేంద్ర హిర్వాణీ తర్వాత ఒక భారత బౌలర్ ఇన్ని ఓవర్లు వేయడం ఇదే మొదటిసారి. కోహ్లి మరో ఆరోపణ! బెంగళూరు టెస్టులో రివ్యూ వివాదం మరచిపోక ముందే కోహ్లి మరో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చాడు. భారత జట్టు ఫిజియో పాట్రిక్ ఫర్హర్ట్ను కొంత మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కావాలని అగౌరవపరిచారంటూ కోహ్లి ఆరోపించాడు. తనకు చికిత్స చేయడం అతని బాధ్యత అని, అనవసరంగా అతని పేరును ఎందుకు లాగారో తనకు అర్థం కావడం లేదని విరాట్ అన్నాడు. అయితే ఈ ఆరోపణలను స్మిత్ ఖండించాడు. కోహ్లి వ్యాఖ్యలతో తాను నిరాశ చెందానని, అసలు అలాంటిదేమీ జరగలేదని అతను వివరణ ఇచ్చాడు. భారత్లో ఆడే సమయంలో మైదానంలో ఉద్రిక్తతలు సహజమేనని, అయితే క్రీడా స్ఫూర్తితో ఆడటం ముఖ్యమని స్మిత్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు తన భుజం గాయం, మ్యాక్స్వెల్ వెక్కిరింతల అంశాన్ని చాలా చిన్నదిగా కోహ్లి కొట్టిపారేశాడు. చివరి రోజు కూడా భారత బౌలర్ ఇషాంత్కు, రెన్షాకు మధ్య మాటల యుద్ధం జరిగింది. కోపంగా కనిపించిన ఇషాంత్ ఒకే ఓవర్లో వరుస బౌన్సర్లతో రెన్షాను బెదరగొట్టాడు. చివరకు అదే ఓవర్లో ఒక ఫుల్ బంతితో రెన్షాను ఎల్బీగా అవుట్ చేసి విజయగర్వంతో అరిచేశాడు! -
భారత్, ఇంగ్లండ్ యూత్ టెస్టు డ్రా
నాగ్పూర్: భారత్ అండర్–19 జట్టు వికెట్ కీపర్ సురేశ్ లోకేశ్వర్ (125 బంతుల్లో 92 నాటౌట్; 14 ఫోర్లు) వీరోచితంగా పోరాడటంతో ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన యూత్ టెస్టు తొలి మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. 238 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులతో నిలిచి మ్యాచ్ను డ్రా చేసుకుంది. బ్యాటింగ్లో టాపార్డర్ విఫలవైునా.... లోయర్ ఆర్డర్ సహకారంతో లోకేశ్వర్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. లోకేశ్వర్తో పాటు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో డారిల్ ఫెరారియో (37) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో హెన్రీ బ్రూక్స్ 3, ఆరోన్ బియర్డ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అంతకుముందు 23/1 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... ఆఫ్ స్పిన్నర్ సిజోమో్న్ జోసెఫ్ (6/62) దాటికి 53 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ 238 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. జార్జ్ బార్ట్లెట్ (97 బంతుల్లో 68; 11 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీ చేయగా... హ్యారీ బ్రూక్ (58 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. భారత బౌలర్లలో డారిల్ ఫెరారియో 2 వికెట్లు పడగొట్టగా... కనిష్క్ సేత్, రిషభ్ భగత్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 501/5 డిక్లేర్ చేయగా... భారత్ 431/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. -
హారిక తొలి గేమ్ ‘డ్రా’
ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి రౌండ్లో తొలి గేమ్ను ‘డ్రా’గా ముగించింది. ఇరాన్లోని టెహరాన్లో శనివారం ఈ మెగా ఈవెంట్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ క్రీడాకారిణి షమీమా అక్తర్ లీజాతో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్లో నల్లపావులతో ఆడిన హారిక 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు ఎలీనా (అర్మేనియా)తో జరిగిన తొలి గేమ్ను భారత్కే చెందిన పద్మిని రౌత్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
హారికకు ఐదో స్థానం
ఖాంటీ మాన్సిస్క్: భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక సీజన్లో చివరి ‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రి టోర్నమెంట్ను ఐదో స్థానంతో ముగించింది. గురువారం జరిగిన ఆఖరి, 11వ రౌండ్ మ్యాచ్లో హారిక... ఫ్రాన్సకు చెందిన స్క్రిప్చెంకో అల్మిరాపై విజయం సాధించింది. 12 మంది అగ్రశ్రేణి గ్రాండ్ మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో చివరి రౌండ్ విజయంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. ఈ టోర్నీలో హారిక 2 విజయాలు, 1 పరాజయంతో పాటు 8 గేమ్లు డ్రా చేసుకుంది. గ్రాండ్ ప్రిలో తన ప్రదర్శన పట్ల హారిక సంతృప్తి వ్యక్తం చేసింది. -
హారికకు మరో డ్రా
ఖాంటీ మన్సిస్క్ (రష్యా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో మంగళవారం జరిగిన 9వ రౌండ్ గేమ్ను హారిక 55 ఎత్తు ల్లో డ్రాగా ముగించింది. తొమ్మిదో రౌండ్ తర్వాత హారిక 4.5 పారుుంట్లతో ఏడో స్థానంలో ఉంది. -
జీతంలో రూ.10 వేలు చేతికి!
♦ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే యోచనలో ♦ సర్కారు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ♦ ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా డ్రా చేసుకునే వెసులుబాటు ♦ ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరనున్న ప్రభుత్వం ♦ ముఖ్యమంత్రి కేసీఆర్కు చేరిన ఫైలు సాక్షి, హైదరాబాద్: ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు యోచిస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం విత్డ్రాపై ఆంక్షలు విధించడంతో ఈ నెల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుు. కనీసం రూ.10 వేల నగదు చేతికిచ్చేలా ఏర్పాట్లు చేయాలని టీఎన్జీవో ప్రతినిధులు సీఎస్ రాజీవ్శర్మకు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలను నేరుగా చెల్లించటం వీలు కాదని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఆర్బీఐ విధించిన నగదు విత్డ్రా పరిమితి ఆంక్షల ప్రకారం ఏటీఎంల నుంచి రూ.2 వేలు మాత్రమే డ్రా చేసుకునే వీలుంది. ఖాతాదారులు బ్యాంకు నుంచి రోజుకు రూ.10 వేలు, గరిష్టంగా వారంలో రూ.24 వేలు మించకుండా డ్రా చేయాలి. కానీ రాష్ట్రంలో దాదాపు ఎనభై శాతం ఏటీఎంలలో డబ్బు లేదు. బ్యాంకు బ్రాంచీల్లోనూ డబ్బు లేకపోవటంతో ఖాతాదారులు సైతం లైన్లలో గంటల తరబడి నిలబడి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఒకటో తారీఖున ఉద్యోగులు ముప్పు తిప్పలు పడటం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉద్యోగులందరికీ ఒకటో తేదీన కనీసం రూ.10 వేలు చేతికందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రత్యేకంగా బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఉద్యోగులందరికీ సరిపడే నగదును అందుబాటులో ఉంచటం, ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా అంత మేరకు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని యోచిస్తోంది. ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రత్యేకంగా బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రూ.10 వేలు ఉద్యోగులకు చెల్లించేందుకు అవసరమైన చర్యలు, ప్రతిపాదనలతో ఆర్థిక శాఖ ఫైలును సిద్ధం చేసింది. ఈ ఫైలును ముఖ్యమంత్రికి పంపించినట్లు తెలిసింది. సీఎం నిర్ణయం మేరకు నగదు చెల్లించాలా.. వద్దా.. అనే విషయంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు. నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను చర్చించేందుకు గురువారం రాష్ట్రస్థారుు బ్యాంకర్లతో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇందులో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశాన్ని చర్చించే అవకాశాలున్నారుు. -
విండీస్, జింబాబ్వే వన్డే ‘టై’
బులవాయో: జింబాబ్వే పేసర్ డొనాల్డ్ తిరిపానో సంచలన ఓవర్తో తమ జట్టును ఓటమి నుంచి రక్షించాడు. చేతిలో ఐదు వికెట్లతో వెస్టిండీస్ చివరి ఓవర్లో విజయానికి 4 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా... తిరిపానో 3 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్లో పరుగులు తీయలేక మరో ఇద్దరు బ్యాట్స్మెన్ రనౌటయ్యారు. ఫలితంగా శనివారం ఇక్కడ జరిగిన ముక్కోణపు టోర్నీ వన్డే మ్యాచ్ ‘టై’గా ముగిసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. క్రెరుుగ్ ఇర్విన్ (100 బంతుల్లో 92; 6 ఫోర్లు) సెంచరీ చేజార్చుకోగా, సికందర్ రజా (81 బంతుల్లో 77; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. కార్లోస్ బ్రాత్వైట్కు 4 వికెట్లు దక్కారుు. అనంతరం విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 257 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షై హోప్ (120 బంతుల్లో 101; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, క్రెరుుగ్ బ్రాత్వైట్ (117 బంతుల్లో 78; 2 ఫోర్లు) అండగా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో తిరిపానో, సీన్ విలియమ్స్ చెరో 2 వికెట్లు తీశారు. ఇది అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ‘టై’ అరుున 34వ మ్యాచ్ కావడం విశేషం. -
ఏటీఎంలో మాయాజాలం
వేంపల్లె: వేంపల్లె స్టేట్ బ్యాంకు ఏటీఎంలో రూ. 500 నోట్ల వరుసలో రెండు వంద నోట్లు రావడంతో ఖాతాదారుడు రూ.800లను నష్టపోయాడు. కర్ణాటకకు చెందిన హరితరుణ హల్లికు చెందిన లక్షుమయ్య వీరపునాయునిపల్లె మండలంలో విండ్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. ఆయన ఆదివారం ఉదయం ఏటీఎంలో రూ.19 వేలు డ్రా చేసేందుకు వెళ్లాడు. 500 నోట్లు 38 రావాల్సి ఉండగా.. కేవలం 36 రావడంతోపాటు రెండు 500 నోట్లకు బదులుగా మధ్య వరుసలో రెండు వంద నోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని అతను బ్యాంకు అధికారులకు తెలపగా.. ఎక్కడా పొరపాటు జరగలేదని.. బ్యాలెన్సింగ్ ఎంక్వైరీ (విచారణ) చేశామని చెబుతున్నారు. అలాగే పరిశీలించి బాధితునికి న్యాయం చేస్తామని బ్యాంకు మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. -
ఏటీఎంలో మాయాజాలం
వేంపల్లె: వేంపల్లె స్టేట్ బ్యాంకు ఏటీఎంలో రూ. 500 నోట్ల వరుసలో రెండు వంద నోట్లు రావడంతో ఖాతాదారుడు రూ.800లను నష్టపోయాడు. కర్ణాటకకు చెందిన హరితరుణ హల్లికు చెందిన లక్షుమయ్య వీరపునాయునిపల్లె మండలంలో విండ్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. ఆయన ఆదివారం ఉదయం ఏటీఎంలో రూ.19 వేలు డ్రా చేసేందుకు వెళ్లాడు. 500 నోట్లు 38 రావాల్సి ఉండగా.. కేవలం 36 రావడంతోపాటు రెండు 500 నోట్లకు బదులుగా మధ్య వరుసలో రెండు వంద నోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని అతను బ్యాంకు అధికారులకు తెలపగా.. ఎక్కడా పొరపాటు జరగలేదని.. బ్యాలెన్సింగ్ ఎంక్వైరీ (విచారణ) చేశామని చెబుతున్నారు. అలాగే పరిశీలించి బాధితునికి న్యాయం చేస్తామని బ్యాంకు మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనువిందు చేస్తున్న అద్భుత కళా ఖండాలు
-
హారికకు తొలి ‘డ్రా’
క్యాప్ డి అగ్డె (ఫ్రాన్స): అనతోలి కార్పోవ్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. మాథ్యూ కార్నెటి (ఫ్రాన్స)తో శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్ను హారిక 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎటెని బాక్రోట్ (ఫ్రాన్స)తో జరిగిన తొలి రౌండ్ గేమ్లో హారిక 45 ఎత్తుల్లో ఓడిపోగా... సబ్రీనా (స్పెరుున్)తో జరిగిన రెండో గేమ్ను హారిక 38 ఎత్తుల్లో గెలిచింది. -
కేరళతో పుణే మ్యాచ్ ‘డ్రా’
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో పుణే ఎఫ్సీ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. కేరళ బ్లాస్టర్స్తో సోమవారం జరిగిన మ్యా చ్ను పుణే జట్టు 1-1తో ‘డ్రా’గా ముగించిం ది. ఆట మూడో నిమిషంలోనే హెంగ్బార్ట్ గోల్తో కేరళ బ్లాస్టర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 68వ నిమిషంలో సిస్సోకో గోల్తో పుణే స్కోరును 1-1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న కేరళ బ్లాస్టర్స్ ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో ఉం డగా... నాలుగు మ్యాచ్లు ఆడిన పుణే నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మంగళవారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ డైనమోస్తో ముంబై సిటీ ఎఫ్సీ తలపడుతుంది. -
‘మాంగళ్య’ కారు విజేత పద్మజ
హన్మకొండ : బతుకమ్మ, దసరా పర్వదినాలను పురస్కరించుకొని హన్మకొండలోని మాంగళ్య షాపింగ్ మాల్లో వస్త్రాల కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులను వినియోగదారులకు అందించనున్నారు. ఈనెల 1 నుంచి 13 వరకు ఏడు లక్కీ డ్రాలను తీయనున్నారు. ఇందులోభాగంగా తొలి డ్రాను శనివారం తీశారు. ప్రతి రూ.500 కొనుగోలుపై ఒక ఉచిత గిఫ్ట్ కూపన్ను ఇస్తున్నారు. ఈనెల 1న కొన్న వస్త్రాలపై ఇచ్చిన గిఫ్ట్ కూపన్లలో నుంచి డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి ఆల్టో కారును వరంగల్కు చెందిన జి.పద్మజ(కూపన్ నంబర్ ఏ-837), రెండో బహుమతి కిలో వెండిని హన్మకొండకు చెందిన ప్రశాంత్, (కూపన్ నంబర్ ఈ-131) మూడో బహుమతి బైక్ను హన్మకొండకు చెందిన అమోఘ(కూపన్ నంబర్ ఏ-462) గెల్చుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మాంగళ్య షాపింగ్ మాల్ నిర్వాహకులు పీఎన్.మూర్తి, కాసం మల్లికార్జున్, నమశ్శివాయ, కేదారి, శివ, నాని, వరుణ్, అరుణ్, సిబ్బంది సందీప్, అనిల్ పాల్గొన్నారు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్లో హైదరాబాద్ ఆటగాడు కశ్యప్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం మొదలైన ఈ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో కశ్యప్ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. ప్రపంచ 815వ ర్యాంకర్ కో గ్యుంగ్ బో (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 107వ ర్యాంకర్ కశ్యప్ 15-21, 23-21, 21-19తో గెలుపొందగా... 100వ ర్యాంకర్ పనావిత్ తొంగ్నువామ్ (థాయ్లాండ్)తో జరిగిన రెండో రౌండ్లో 15-21, 21-16, 21-15తో విజయం సాధించాడు. కో గ్యుంగ్ బోతో జరిగిన మ్యాచ్లో కశ్యప్ రెండో గేమ్లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో నాలుగో సీడ్ తియాన్ హువీ (చైనా)తో కశ్యప్; వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; హావో (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్; హయెక్ జిన్ (కొరియా)తో జయరామ్ ఆడతారు. -
భారత జట్లకు ‘డ్రా’
బాకు (అజర్బైజాన్): చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లకు ‘డ్రా’ ఎదురైంది. సోమవారం జరిగిన పదో రౌండ్లో భారత పురుషుల జట్టు 2-2తో రష్యాతో... మహిళల జట్టు 2-2తో ఉక్రెయిన్తో ‘డ్రా’ చేసుకున్నాయి. పురుషుల విభాగంలో సెర్గీ కర్జాకిన్పై హరికృష్ణ 44 ఎత్తుల్లో గెలుపొందగా... సేతురామన్-గ్రిషుక్; విదిత్-నెపోమ్నియాచిల మధ్య గేమ్లు ‘డ్రా’ అయ్యాయి. క్రామ్నిక్ చేతిలో ఆధిబన్ ఓడిపోయాడు. మహిళల విభాగంలో హారిక-అనా ముజిచుక్; పద్మిని-మరియా ముజిచుక్ల మధ్య గేమ్లు ‘డ్రా’ అయ్యారుు. జుకోవాపై తానియా సచ్దేవ్ నెగ్గగా... ఉషెనినా చేతిలో సౌమ్య ఓడిపోయింది. -
సాకేత్ సంచలనం
యూఎస్ ఓపెన్ మెరుున్ ‘డ్రా’కు అర్హత న్యూయార్క్: పట్టుదలతో పోరాడిన తెలుగు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అనుకున్నది సాధించాడు. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో మెరుున్ ‘డ్రా’కు అర్హత పొందాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో సాకేత్ పురుషుల సింగిల్స్ విభాగం మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. వైజాగ్కు చెందిన 28 ఏళ్ల సాకేత్... భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వాలిఫరుుంగ్ మూడో రౌండ్ మ్యాచ్లో 6-3, 6-0తో పెద్జా క్రిస్టిన్ (సెర్బియా)పై గెలుపొందాడు. భారత నంబర్వన్ ప్లేయర్గా ఉన్న సాకేత్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ క్వాలిఫరుుంగ్ టోర్నమెంట్లలో ఆడినప్పటికీ మెరుున్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. సోమవారం మొదలయ్యే యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నీ మెరుున్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 48వ ర్యాంకర్ జిరీ వెసెలీ (చెక్ రిపబ్లిక్)తో సాకేత్ ఆడతాడు. యూకీ బాంబ్రీ, సోమ్దేవ్ దేవ్వర్మన్ తర్వాత ఇటీవల కాలంలో గ్రాండ్స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో పోటీపడనున్న మూడో భారతీయ క్రీడాకారుడిగా సాకేత్ నిలిచాడు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి సయ్యద్ మొహమ్మద్ హాది, సయ్యద్ ఆసిఫ్ ఖాద్రీ, గౌస్ మొహమ్మద్, ఎస్పీ మిశ్రా (హైదరాబాద్) గ్రాండ్స్లామ్ టోర్నీల్లో పాల్గొన్నారు. -
మూడు గెలిస్తే పతకం
♦ మిక్స్డ్ డబుల్స్ ‘డ్రా’ విడుదల ♦ తొలి రౌండ్లో ఆసీస్ జోడీతో సానియా-బోపన్న జంట ‘ఢీ’ రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగం ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. భారత్కు చెందిన సానియా మీర్జా-రోహన్ బోపన్న జంటకు నాలుగో సీడింగ్ లభించింది. గురువారం జరిగే తొలి రౌండ్లో సమంతా స్టోసుర్-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) ద్వయంతో భారత జోడీ తలపడుతుంది. కేవలం 16 జోడీలు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో మూడు విజయాలు సాధించిన జంటకు పతకం దక్కుతుంది. తొలి రౌండ్ను దాటితే... క్వార్టర్ ఫైనల్లో మోనికా నికెలెస్కూ-ఫ్లోరిన్ మెర్జియా (రొమేనియా) లేదా ఫెరర్-కార్లా నవారో (స్పెయిన్)లతో సానియా-బోపన్న తలపడతారు. వీరి పార్శ్వంలోనే రెండో సీడ్ క్రిస్టినా మ్లాడెనోవిచ్-హెర్బర్ట్ (ఫ్రాన్స్) ద్వయం... వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంటలు ఉన్నాయి. మరో పార్శ్వంలో టాప్ సీడ్ కరోలినా గార్సియా-మహుట్ (ఫ్రాన్స్); నాలుగో సీడ్ రాఫెల్ నాదల్-గార్బిన్ ముగురుజా (స్పెయిన్) జోడీలు ఉన్నాయి. -
భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా
కింగ్స్టన్ : వరుణుడి ప్రతాపం... వెస్టిండీస్ బ్యాట్స్మెన్ పోరాటంతో... కచ్చితంగా గెలుస్తామనుకున్న రెండో టెస్టును భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. ఛేజ్ (269 బంతుల్లో 137 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో పాటు, బ్లాక్వుడ్ (54 బంతుల్లో 63; 9ఫోర్లు, 2 సిక్సర్లు), డౌరిచ్ (114 బంతుల్లో 74; 6ఫోర్లు, 1 సిక్సర్), హోల్డర్ (99 బంత్లు 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీలతో రాణించడంతో చివరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో104 ఓవర్లలో 6 వికెట్లకు 388 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో దాదాపు 100 ఓవర్ల పాటు వర్షం వల్ల నష్టపోవడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరచిన వెస్టిండీస్ ఆటగాడు ఛేజ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు 9 నుంచి సెయింట్లూసియాలో జరుగుతుంది. రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు: వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 196 (బ్లాక్వుడ్ 62; అశ్విన్ 5/52) భారత్ తొలి ఇన్నింగ్స్: 500/9 డిక్లేర్డ్ (రాహుల్ 158, రహానే 108 నాటౌట్; ఛేజ్ 5/121) వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 388/6 (ఛేజ్ 137 నాటౌట్; షమీ 2/82). -
మనోళ్లకు క్లిష్టమైన డ్రా
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ముంబై: రియో ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్లో ఐదో సీడ్ సైనాకు గ్రూప్ ‘జి’లో... తొమ్మిదో సీడ్ సింధుకు గ్రూప్ ‘ఎం’లో... పురుషుల సింగిల్స్లో తొమ్మిదో సీడ్ శ్రీకాంత్కు గ్రూప్ ‘హెచ్’ లో చోటు దక్కింది. సైనా గ్రూప్లో మరియా ఉలిటినా (ఉక్రెయిన్), లొహెని విసెంటి (బ్రెజిల్)... సింధు గ్రూప్లో మిచెల్లి లీ (కెనడా), లారా సరోసి (హంగేరి), శ్రీకాంత్ గ్రూప్లో హెన్రీ హుర్స్కెనైన్ (స్వీడన్), లినో మునోజ్ (మెక్సికో) ఉన్నారు. గ్రూప్ ‘టాపర్లు’ మాత్రమే నాకౌట్ దశ (ప్రిక్వార్టర్ ఫైనల్స్)కు అర్హత సాధిస్తారు. ‘డ్రా’ ప్రకారం ప్రిక్వార్టర్స్లో సైనాకు పోర్న్టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్లాండ్)... క్వార్టర్స్లో లీ జురుయ్ (చైనా), సెమీస్లో టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్); సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), క్వార్టర్స్లో యిహాన్ వాంగ్ (చైనా), సెమీస్లో ఒకుహారా (జపాన్) లేదా రచనోక్ (థాయ్లాండ్) ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఐదో సీడ్ జాన్ జార్గెన్సన్ (డెన్మార్క్)తో... క్వార్టర్ ఫైనల్లో లిన్ డాన్ (చైనా)తో సెమీస్లో లీ చోంగ్ వీ (మలేసియా)తో తలపడే అవకాశముంది. -
‘డ్రా’తోనే ముగింపు
భారత్, విండీస్ ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్ సెయింట్ కిట్స్: వెస్టిండీస్ పర్యటనలో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ను కూడా భారత జట్టు ‘డ్రా’గా ముగించింది. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో శనివారం ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్లో ఫలితం తేలలేదు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ ఎలెవన్ తమ రెండో ఇన్నింగ్స్లో 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బ్లాక్వుడ్ (51) టాప్స్కోరర్గా నిలవగా, హాడ్జ్ (39 నాటౌట్), విశాల్ సింగ్ (39) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ఆంటిగ్వాలో జరుగుతుంది. -
ఆటో డ్రైవర్ కుటుంబంపై ఖాకీ క్రౌర్యం
చెన్నై: ఓ ఆటో డ్రైవర్ కుటుంబంపై ముగ్గురు ఖాకీలు తమ ప్రతాపం చూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తిరువణ్ణామలై జిల్లా చెంగం లో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పంచాయితీ శానిటరీ కార్మికురాలు ఉష, ఆటో డ్రైవర్ రాజా భార్యాభర్తలు. వీరికి సూర్య (17) కొడుకు కూడా ఉన్నాడు. రాజా,ఉష మధ్య స్వల్ప తగాదా రావడంతో భార్యను చెంపమీద కొట్టాడు రాజా. అనవసరంగా బంగారం కొనుగోలు చేసిందన్నది రాజా ఆరోపణ. వారిద్దరి మధ్య వివాదం నడుస్తుండగా అక్కడే ఉన్న ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు కల్పించుకున్నారు. అనంతరం రాజాపై చేయి చేసుకున్నారు. విషయాన్ని రాజా వివరించే లోపే మురుగనందం, విజయ కుమార్, నమ్మాజ్వార్ అనే కాని స్టేబుళ్లు రాజాపై విరుచుకుపడి వీరంగం సృష్టించారు .పట్టపగలు నడివీధిలో తమ ఖాకీ క్రౌర్యాన్ని ప్రదర్శించారు. అడ్డొచ్చిన సూర్యపైనా లాఠీ ఝళిపించారు. తన భర్తను, కొడుకుని విడిచిపెట్టమని ఉష వేడుకున్నా వినకుండా ప్రతాపాన్ని చూపించారు. అంతేకాదు ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన అక్కడ గుమిగూడిన వారిని కూడా లాఠీలతో చితక బాదారు. చివరికి బాధితులను అలాగే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన మిగతాపోలీసులు హాస్పిటల్ కు వచ్చి బాధితులతో బేర సారాలకు దిగారు. కానీ అప్పటికే ఆ దృశ్యాలన్నీ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో వివాదం ముదిరి ..పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. మరోవైపు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు, తొక్కవాది గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమపై విరుచుకుపడిన ముగ్గురు పోలీసులపైనా కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై జిల్లా ఎస్పీ ఆర్. పొన్ని ని వివరణ కోరగా విచారణ జరుగుతోందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముగ్గురు నిందితులను వెల్లూరు బదిలీ చేశామని.. ఈ ఘటనపై చెంగం డీఎస్పీ పూర్తి విచారణ తరువాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దీనిపై స్థానిక ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు విమర్శలు గుప్పించాయి. -
హరికృష్ణ గేమ్ డ్రా
డాన్జూ (చైనా): సూపర్ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో డ్రా నమోదు చేసుకున్నాడు. యు యాంగ్జీ (చైనా)తో సోమవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్ను హరికృష్ణ 87 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. నాలుగో రౌండ్ తర్వాత హరికృష్ణ రెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
తొలి వార్మప్ మ్యాచ్ డ్రా
మిశ్రాకు నాలుగు వికెట్లు బెసెటెరీ (సెయింట్ కిట్స్): భారత్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ల మధ్య జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఆదివారం వార్నర్పార్క్లో జరిగిన రెండో రోజు ఆటలో బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు 87 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. హోప్ (229 బంతుల్లో 118; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. రాజేంద్ర చంద్రిక (142 బంతుల్లో 69; 10 ఫోర్లు), వార్రీకన్ (75 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/67) రాణించగా, సీమర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ తలో వికెట్ పడగొట్టారు. ఇషాంత్ శర్మ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్లో భారత్ 93 ఓవర్లలో 6 వికెట్లకు 258 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. రెండో వార్మప్ మ్యాచ్ జూలై 14 నుంచి 16 వరకు జరుగుతుంది. -
హారిక, హంపి గేమ్లు ‘డ్రా’
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మరో ‘డ్రా’ను నమోదు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఆరో రౌండ్లో జూ వెన్జున్ (చైనా)తో హంపి 27 ఎత్తుల్లో... అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఆరో రౌండ్ తర్వాత హంపి 4.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతుండగా... హారిక నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. హరికృష్ణకు షాక్: మరోవైపు చైనాలోనే జరుగుతున్న డాన్జూ సూపర్ గ్రాండ్మాస్టర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బూ జియాంగ్జి (చైనా)తో శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో హరికృష్ణ 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. -
అర్జెంటీనా, భారత్ మ్యాచ్ డ్రా
వాలెన్సియా: ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో భారత్, అర్జెంటీనాల మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (16వ నిమిషంలో), రమణ్దీప్ సింగ్ (47), దేవిందర్ వాల్మీకి (57) గోల్స్ చేయగా అర్జెంటీనా నుంచి మటియాస్ (15), గోంజలో పెలియట్ (21), లూకాస్ విలా (30) గోల్స్ సాధించారు. -
‘డ్రా’లను కూడా ఫిక్స్ చేశారు
యూరోపియన్ టోర్నీలపై బ్లాటర్ జ్యూరిచ్: కొన్ని యూరోపియన్ టోర్నీల ‘డ్రా’లను కూడా తమకు అనుకూలంగా ఫిక్స్ చేసుకున్నారని ‘ఫిఫా’ మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ సంచలన ఆరోపణలు చేశారు. దీని కోసం చల్లని, వేడి బంతులను ఉపయోగించారని తెలిపారు. ‘డ్రా’కు ముందు చిన్న ఫుట్బాల్స్పై ఆయా జట్ల పేర్లను రాస్తారు. తమకు కావాల్సిన జట్టు బంతిని ముందే ఫ్రిజ్లో ఉంచి అనుకూలమైన ‘డ్రా’లో వేస్తారని చెప్పారు. అయితే తన హయాంలో మాత్రం ఇలా ఒక్క డ్రా కూడా ఫిక్స్ కాలేదని స్పష్టం చేవారు. మరోవైపు తన అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను స్విస్, యూఎస్ పరిశోధకులు ఇప్పటిదాకా సేకరించలేకపోయారని బ్లాటర్ తెలిపారు. తనపై జరిగిందంతా ఓ కుట్రగా ఆయన పేర్కొన్నారు. -
ఇంగ్లండ్, శ్రీలంక మూడో టెస్టు ‘డ్రా’
లార్డ్స్: భారీ వర్షం కారణంగా చివరి రోజు 12.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంతో.... ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. 32/0 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది. కరుణరత్నే (37 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. మూడు టెస్టుల ఈ సిరీస్ను ఇంగ్లండ్ 2-0తో సొంతం చేసుకుంది. గురు, శనివారాల్లో ఐర్లాండ్తో రెండు వన్డేల్లో తలపడే శ్రీలంక... అనంతరం ఇంగ్లండ్తో 21న మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్లో పాల్గొంటుంది. -
మహిళా గ్రూపు సభ్యుల డబ్బు హాంఫట్
♦ సభ్యులకు తెలియకుండా డ్రా ♦ అధికారులు, సీఏల కుమ్మక్కు ♦ రెండేళ్ల తరువాత వెలుగులోకి.. మెదక్: మహిళా గ్రూప్ సభ్యులకు తెలియకుండా అధికారులతో కుమ్మక్కైన ఐకేపీ కోఆర్డినేటర్ రూ. 2.10 లక్షలు డ్రా చేసిన సంఘటన రెండేళ్ల తరువాత వెలుగులోకి వచ్చింది. ఇం దుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండలం శమ్నాపూర్ తండాలో సుమారు వందకు పైగా ఇళ్లు ఉన్నాయి. ఈ తండాలో స్వ యం సహాయక గ్రూపులను నడిపిం చేందుకు కోఆర్డినేటర్ ను నియమిం చారు. అయితే సదరు కోఆర్డినేటర్ మహిళా గ్రూప్ సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారికి తెలి యకుండానే అధికారులతో కుమ్మక్కై మూడు గ్రూప్లకు చెందిన రూ. 2.10 లక్షలు డ్రా చేసుకున్నాడు. బ్యాంకులో చెల్లించడం లేదు. దీంతో సంబంధిత గ్రూ పు సభ్యులకు బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడం లేదు. మాకు ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని మహిళలు బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా అసలు విష యం బయట పడింది. 2014లో మూడు గ్రూపుల సభ్యుల రూ. 2.10 లక్షలు స్త్రీ నిధి రుణాలు పొందారని, వాటిని వడ్డీతో సహ చెల్లిస్తేనే కొత్త రుణాలి స్తామని బ్యాంకు అధికారులు తెల్చి చెప్పడంతో అమాయక మహిళలంతా తెల్ల మొహం వేశారు. ఈ విషయంపై లబోదిబోమంటూ ఐకేపీ అధికారులకు మొరపెట్టుకున్నారు. శమ్నాపూర్ తండాలో సీఏ పనిచేసిన వ్యక్తి గతంలో ఈ రుణం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో విషయాన్ని ఎవరికి చెప్పొద్దని, త్వరలోనే సీఏ నుంచి డబ్బులు వసూలు చేయిస్తామని ఐకేపీ అధికారులు మహిళా సంఘాల సభ్యులను బుజ్జగించే పనిలో పడ్డ ట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బులు డ్రా చేసిన సీఏ ను పిలిపించి లోలోపల చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అధికారి వివరణ: ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం ఇందిరను సాక్షి వివరణ కోరగా తాను ఇక్కడకు రాకముందే ఈ వ్యవహారం జరిగిందన్నారు. కాగా మహిళా గ్రూప్ సభ్యులకు తెలియకుండా శ్రీనిధి రుణాలు తీసుకున్న సీఏతో మాట్లాడుతున్నామని, త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు. -
మెయిన్ ‘డ్రా’కు రుత్విక
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో రుత్విక అజేయంగా నిలిచింది. తొలి రౌండ్లో రుత్విక 21-9, 21-16తో మరో తెలుగమ్మాయి గుమ్మడి వృశాలిని ఓడించగా... రెండో రౌండ్లో 21-16, 21-18తో గ్రేస్ గేబ్రియల్ (నైజిరియా)పై గెలిచింది. రుత్వికతోపాటు భారత్కే చెందిన తన్వీ లాడ్, రితూపర్ణ దాస్, అరుణ ప్రభుదేశాయ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్లో భారత్ నుంచి సౌరభ్ వర్మ ఒక్కడే మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు. -
హరికృష్ణకు రెండో ‘డ్రా’
న్యూఢిల్లీ: జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. భారత్కే చెందిన అభిజిత్ గుప్తాతో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను హరికృష్ణ 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ ఐదు పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికకు తొలి పరాజయం ఎదురైంది. ఆంటోన్ గిజారో (స్పెయిన్)తో జరిగిన గేమ్లో హారిక 53 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయాన్ని సాధించాడు. ఫియాలా విక్లావ్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్లో ఆనంద్ 32 ఎత్తుల్లో గెలిచాడు. -
ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాం
సిడ్నీ: ఆస్ట్రేలియా, వెస్టిండీస్ల మధ్య చివరి టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్... ప్రత్యర్థితో ఓ వినూత్న ప్రతిపాదన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 112.1 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండా డిక్లేర్ చేస్తుందని... వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 40 పరుగులు చేసి డిక్లేర్ చేస్తే... ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70 ఓవర్లలో 370 లక్ష్యంతో తాము ఆడతామని ప్రతిపాదించాడు. కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తమ జట్టు సభ్యులతో సంప్రదించి దీనిని తిరస్కరించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి 38 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (103 బంతుల్లో 122; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. 82 బంతుల్లో శతకం పూర్తి చేసిన వార్నర్... సిడ్నీ మైదానంలో వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వోజెస్ (ఆస్ట్రేలియా)కు రిచీ బెనాడ్ పేరిట పతకాన్ని ఇచ్చారు. ఇకపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్ల మధ్య జరిగే ఫ్రాంక్ వారెల్ ట్రోఫీలో ప్రతిసారీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన క్రికెటర్కు బెనాడ్ పతకం ఇస్తారు. -
మెయిన్ ‘డ్రా’కు సోమ్దేవ్
చెన్నై: గత సీజన్లో నిలకడలేని ఆటతీరుతో నిరాశపరిచిన భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు సోమ్దేవ్ దేవ్వర్మన్ ఈ ఏడాదిలో శుభారంభం చేశాడు. చెన్నై ఓపెన్లో సోమ్దేవ్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్లో సోమ్దేవ్ 2-6, 7-5, 6-4తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై గెలుపొందాడు. మరోవైపు భారత్కే చెందిన సాకేత్ మైనేని, శ్రీరామ్ బాలాజీలకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో తెలుగు ప్లేయర్ సాకేత్ 4-6, 2-6తో థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో; శ్రీరామ్ బాలాజీ 6-7 (2/7), 6-7 (0/7)తో పావిక్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయారు. -
తాజ్ వివాంతలో ఘనంగా గ్రోమోర్ రైతు సంబరాలు
-
‘డ్రా’తో గట్టెక్కిన హైదరాబాద్
రంజీ ట్రోఫీ రౌండప్ సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ నిరాశజనక ఆటతీరు కొనసాగుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్తో ఉప్పల్లో జరిగిన మ్యాచ్ను కష్టపడి ‘డ్రా’గా ముగించింది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లోనూ హైదరాబాద్కు కనీసం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రాకపోవడం గమనార్హం. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో (ఫాలోఆన్) 113.1 ఓవర్లకు 329 పరుగులు చేసింది. దీంతో కశ్మీర్కు 150 పరుగుల లక్ష్యం ఎదురైంది. కశ్మీర్ జట్టు 17 ఓవర్లలో 2 వికెట్లకు 56 పరుగులు చేసింది. సమయం సరిపోకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. కశ్మీర్కు 3, హైదరాబాద్కు 1 పాయింట్ లభించాయి. ఇతర మ్యాచ్లలో మధ్యప్రదేశ్ 87 పరుగులతో బరోడాపై, హిమాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్ 6 పరుగులతో త్రిపురపై, తమిళనాడు 8 వికెట్లతో రైల్వేస్పై, కర్ణాటక 92 పరుగులతో రాజస్తాన్పై, సౌరాష్ట్ర 4 వికెట్లతో సర్వీసెస్పై, విదర్భ 82 పరుగులతో మహారాష్ట్రపై విజయం సాధించాయి. బెంగాల్-హర్యానా, ఢిల్లీ-ఒడిషా, గోవా-జార్ఖండ్ల మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. -
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్లోని తొలి గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ సేతురామన్తో సోమవారం జరిగిన తొలి గేమ్ను తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 74 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మంగళవారం వీరిద్దరి మధ్యే జరిగే రెండో గేమ్లో గెలిచిన వారు మూడో రౌండ్కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ‘డ్రా’ అయితే, బుధవారం టైబ్రేక్ గేమ్లను నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఆరుగురు బరిలోకి దిగగా... సూర్యశేఖర గంగూలీ, లలిత్బాబు, ఆధిబన్, విదిత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. -
ఆనంద్కు ఐదో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో ఓడిన ఆనం ద్ ఆ తర్వాత వరుసగా ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకోవడం గమనార్హం. మిగి లిన రెండు రౌండ్లలో అరోనియన్, కార్ల్సన్ లతో ఆనంద్ తలపడతాడు. ప్రస్తు తం ఆనంద్ 2.5 పాయిం ట్లతో 9వ స్థానంలో ఉన్నా డు. మరో గేమ్లో ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ ఆరున్నర గంటలు పోరాడినా తుదకు 66 ఎత్తుల్లో గ్రిష్చుక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
ఆనంద్కు మూడో డ్రా
సెయింట్ లూయిస్: సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో డ్రా నమోదు చేశాడు. మాక్సీమ్ వాచిర్ లాగ్రావీ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను విషీ 42 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. దీంతో రెండు పరాజయాలు, మూడు డ్రాలతో ఓవరాల్గా ఆనంద్ ఒకటిన్నర పాయిం ట్లతో జాబితాలో చివరి స్థానంలో ఉన్నాడు. -
డ్రానందమే..
ఆసీస్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ అనధికారిక టెస్టు చెన్నై: భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే సుదీర్ఘకాలం అనంతరం జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ మ్యాచ్లో ఐదు వికెట్లతో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగా మరో స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (6/132) కూడా ఆకట్టుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు ఈనెల 28 నుంచి ఇదే వేదికపై జరుగుతుంది. 240 పరుగుల లక్ష్యంతో చివరి రోజు శనివారం బరిలోకి దిగిన ఆసీస్ ‘ఎ’ 46 ఓవర్లలో నాలుగు వికెట్లకు 161 పరుగులు చేసింది. ఇక ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపేశారు. బాంక్రాఫ్ట్ (109 బంతుల్లో 51; 8 ఫోర్లు), ట్రేవిస్ హెడ్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించగా అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 121/3 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘ఎ’ 78.3 ఓవర్లలో 206/8 వద్ద డి క్లేర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ (66 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. -
నాలుగో రోజు ఆట రద్దు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ‘డ్రా’ దిశగా సాగుతోంది. మ్యాచ్ నాలుగో రోజు శుక్రవారం వర్షం కారణంగా ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క బంతి కూడా వేయడం సాధ్యం కాకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. మూడో రోజు ముగిసే సరికి తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 61 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా మరో 17 పరుగులు వెనుకబడి ఉంది. -
భారత్ ప్రత్యర్థి చెక్ రిపబ్లిక్
- డేవిస్కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ ‘డ్రా’ విడుదల - స్వదేశంలో సెప్టెంబరు 18 నుంచి 20 వరకు మ్యాచ్ లండన్: ప్రతిష్టాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీల్లో భారత్ పురుషుల టెన్నిస్ జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి 20 వరకు జరిగే ఈ మ్యాచ్లో టాప్ సీడ్, మాజీ చాంపియన్ చెక్ రిపబ్లిక్తో భారత్ తలపడుతుంది. భారత్లోనే జరిగే ఈ మ్యాచ్కు వేదికను (న్యూఢిల్లీ లేదా పుణే) వచ్చే నెలలో ఖరారు చేసే అవకాశముంది. 2012, 2013లలో డేవిస్ కప్ టైటిల్ను నెగ్గిన చెక్ రిపబ్లిక్... 1980లో అవిభాజ్య చెకోస్లోవేకియా రూపంలో తొలిసారి చాంపియన్గా నిలిచింది. ప్రపంచ 6వ ర్యాంకర్ థామస్ బెర్డిచ్తోపాటు 44వ ర్యాంకర్ జిరీ వాసెలీ, 54వ ర్యాంకర్ లుకాస్ రోసోల్ చెక్ రిపబ్లిక్ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశముంది. డబుల్స్లో ఫ్రాంటిసెక్ సెర్మాక్ (70వ ర్యాంకర్), రోమన్ జెబావీ (106వ ర్యాంకర్) ఉన్నారు. వీరే కాకుండా గతంలో భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్కు భాగస్వాములుగా ఉన్న రాడెక్ స్టెపానెక్, లూకాస్ లూహీ కూడా జట్టులో ఉండే అవకాశముంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ముగిసిన ఐదు రోజులకే డేవిస్ కప్ పోటీ ఉన్నందున బెర్డిచ్లాంటి స్టార్ ప్లేయర్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండే అవకాశముంది. ఒకవేళ అలా జరిగితే భారత్కూ విజయావకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖాముఖి రికార్డులో చెక్ రిపబ్లిక్ 3-0తో భారత్పై ఆధిక్యంలో ఉంది. 1997లో చెక్ రిపబ్లిక్ చేతిలో 2-3తో ఓడిన భారత్... 1986లో, 1926లో చెకోస్లోవేకియా చేతిలో 1-4తో పరాజయం పాలైంది. -
12గంటల్లో 100 అద్బుతాలు
-
ఆనంద్ తొలి గేమ్ డ్రా
స్టావెంజర్ (నార్వే): భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. నార్వే చెస్ టోర్నమెంట్లో తొలి రౌండ్ గేమ్ను డ్రా చేసుకున్నాడు. తెల్లపావులతో ఆడిన విషీ ఆరంభంలో అద్భుతమైన ఎత్తులు వేసినా.. బెర్లిన్ డిఫెన్స్తో కరుణ (ఇటలీ) సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో 37 ఎత్తుల వద్ద గేమ్ డ్రాగా ముగిసింది. మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు టోర్నీ జరుగుతుంది. ఇతర గేమ్ల్లో నకమురా (అమెరికా)... లుడ్విగ్ హమ్మర్ (నార్వే)పై; వచియర్ లాగ్రావీ (ఫ్రాన్స్)... అరోనియన్ (ఆర్మేనియా)పై; అనిష్ గిరి (నెదర్లాండ్స్)... గ్రిస్చుక్ (రష్యా)పై; తపలోవ్ (బల్గేరియా)... కార్ల్సెన్ (నార్వే)పై నెగ్గారు. -
ఆనంద్ ‘డ్రా’ల పర్వం
షామ్కిర్ (అజర్బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు ‘డ్రా’లు నమోదు చేసిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ నాలుగో రౌండ్లోనూ ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ మాజీ చాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో సోమవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్ను ఆనంద్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
భారత్కు క్లిష్టమైన ‘డ్రా’
2018 ప్రపంచకప్ ఫుట్బాల్ క్వాలిఫయింగ్ న్యూఢిల్లీ: మరో మూడేళ్లలో రష్యాలో జరిగే 2018 ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు సంబంధించి ఆసియా జోన్ క్వాలిఫయింగ్ ‘డ్రా’ విడుదలైంది. మలేసియాలోని కౌలాలంపూర్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రెండో దశ ‘డ్రా’ను తీశారు. గ్రూప్ ‘డి’లో పటిష్ట జట్లయిన ఇరాన్, ఒమన్, గ్వామ్, తుర్క్మెనిస్థాన్ల సరసన భారత్కు చోటు దక్కింది. ఈ నాలుగు జట్లతో భారత్ ఇంటా, బయటా పద్ధతిలో ఎనిమిది మ్యాచ్లు ఆడుతుంది. ఈ పోటీలు ఈ ఏడాది జూన్ 11 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు జరుగుతాయి. మొత్తం ఎనిమిది గ్రూప్లలో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు, ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లు ఫైనల్ క్వాలిఫయింగ్కు అర్హత సాధిస్తాయి. -
భారత్, బంగ్లాదేశ్ ఫుట్బాల్ మ్యాచ్ డ్రా
ఢాకా: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) అండర్-23 చాంపియన్షిప్ అర్హత రౌండ్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. అయితే స్థానిక బంగబంధు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధం ముగియగానే ఫ్లడ్లైట్లు మొరాయించాయి. 40 నిమిషాలు వేచి చూసిన అనంతరం మ్యాచ్ ప్రారంభం కావడంతో ఆటగాళ్లలో అంతకుముందటి జోష్ కనిపించలేదు. ఈ డ్రాతో ఆడిన మూడు మ్యాచ్ల్లో భారత్ ఒక్క పాయింట్ సాధించి నాలుగు జట్ల గ్రూపులో మూడో స్థానంలో నిలిచింది. దీంతో తదుపరి దశకు అర్హత సాధించలేకపోయింది. -
హారిక గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్ సెమీఫైనల్ రౌండ్ తొలి గేమ్ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకుంది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో ఆదివారం జరిగిన తొలి గేమ్ను నల్లపావులతో ఆడిన హారిక 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. సోమవారం వీరిద్దరి మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్లో హారిక తెల్లపావులతో ఆడనుండటం ఆమెకు అనుకూలాంశం. ఈ గేమ్లో నెగ్గినవారు ఫైనల్కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే విజేతను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహిస్తారు.