![సెమీస్లో సానియా జోడి](/styles/webp/s3/article_images/2017/09/3/41462474948_625x300.jpg.webp?itok=fKB7q8GR)
సెమీస్లో సానియా జోడి
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్సీడ్ సానియా-హింగిస్ 6-3, 6-2తో ఆరోసీడ్ హల్వకోవా -హర్డెకా (చెక్)పై గెలిచింది.
గంటా 2 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా ద్వయం ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టింది. సెమీస్లో సానియా జోడి... వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)తో తలపడుతుంది.