టీమిండియా కొత్త చరిత్ర | india create new record | Sakshi
Sakshi News home page

టీమిండియా కొత్త చరిత్ర

Published Mon, Dec 19 2016 4:27 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

టీమిండియా కొత్త చరిత్ర

టీమిండియా కొత్త చరిత్ర

చెన్నై:ఇంగ్లండ్ తో జరుగుతున్న సుదీర్ఘ టెస్టు సిరీస్లో టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. భారత తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులను రికార్డును సొంతం చేసుకుంది. గత  అత్యధిక పరుగుల రికార్డును ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో  భారత్ అధిగమించింది.  2009లో ముంబైలో జరిగిన టెస్టులో శ్రీలంకపై భారత్ 726 పరుగులే భారత్ కు ఇప్పటివరకూ టాప్ స్కోర్.

 

దీన్ని భారత్ తాజాగా అధిగమించింది. కరుణ్ నాయర్ అత్యద్భుతమైన ఆట తీరుతో భారత్ ఆ మార్కును బద్ధలు కొట్టింది.ఇప్పటివరకూ భారత్ నాలుగుసార్లు మాత్రమే ఏడొందల మార్కును చేరింది.  గత 12 ఏళ్లలోనే ఏడొందలకు పైగా పరుగులను టీమిండియా నాలుగుసార్లు సాధించడం విశేషం. 2004లో సిడ్నీలో  ఆస్ట్రేలియాపై తొలిసారి ఏడొందల పరుగులకు పైగా చేసిన భారత్.. ఆ తరువాత 2009లో శ్రీలంకపై ముంబైలో,  2010లో శ్రీలంకపై కొలంబోలో ఈ మార్కును భారత్ సాధించింది.

ఇదిలా ఉంచితే, ఒక సిరీస్లో టీమిండియా నాలుగుసార్లు టాస్ కోల్పోయిన తరువాత నాలుగొందలకు పైగా పరుగులను సాధించడం నాల్గోసారి.ఇంతవరకూ ఏ జట్టూ ఈ తరహాలో టాస్ కోల్పోయి నాలుగుసార్లు నాలుగొందల మార్కును చేరుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement