fifth test
-
ధూమ్ ధామ్
హిమాలయాల చెంత భారత టెస్టు క్రికెట్ ప్రదర్శన మరింత ఉన్నతంగా శిఖరానికి చేరింది...ధర్మశాలలో అంచనాలకు అనుగుణంగా చెలరేగిన మన జట్టు ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టి టెస్టు సిరీస్ను 4–1తో సగర్వంగా గెలుచుకుంది... 259 పరుగుల ఆధిక్యం అంటేనే టీమిండియా గెలుపు లాంఛనం అనిపించింది... కానీ ఇంగ్లండ్ కనీస స్థాయి పోరాటపటిమ కూడా ప్రదర్శించలేక చేతులెత్తేసింది. బజ్బాల్ ముసుగులో అసలు టెస్టును ఎలా ఆడాలో మరచిపోయిన ఆ జట్టు ఆటగాళ్లు గుడ్డిగా బ్యాట్లు ఊపి పేలవ షాట్లతో వేగంగా తమ ఓటమిని ఆహ్వానించారు. తన వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో అశ్విన్ ఈ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకోగా...విజయంతో తమ వంతు పాత్ర పోషించిన కుర్రాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఓటమితో మొదలైన ఈ ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్కు ఇన్నింగ్స్ విజయంతో భారత్ ఘనమైన ముగింపునిచ్చింది. ధర్మశాల: సొంతగడ్డపై టెస్టుల్లో భారత జట్టు తమ స్థాయి ఏమిటో మరోసారి చూపించింది. మూడో రోజే ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు వెనుకబడి శనివారం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్ (128 బంతుల్లో 84; 12 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, అశ్విన్ (5/77) ఐదు వికెట్లు పడగొట్టాడు. 7 వికెట్లతో పాటు కీలక పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ తర్వాతి నాలుగు మ్యాచ్లు గెలిచి సిరీస్ను 4–1తో సొంతం చేసుకుంది. 2 డబుల్ సెంచరీలు సహా మొత్తం 712 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. రూట్ మినహా... వెన్నునొప్పితో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో కెపె్టన్ రోహిత్ మైదానంలోకి దిగలేదు. దాంతో బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఆలస్యం చేయకుండా రెండో ఓవర్లోనే అశ్విన్ కు బౌలింగ్ బాధ్యత అప్పగించాడు. అంతే...ఐదో బంతికి డకెట్ (2) అవుట్తో మొదలైన ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. కొద్ది సేపటికి క్రాలీ (0) కూడా వెనుదిరగ్గా, ఒలీ పోప్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో జానీ బెయిర్స్టో (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్లు), రూట్ మాత్రమే 56 పరుగుల భాగస్వామ్యంతో కొద్దిసేపు ప్రతిఘటించారు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్లోనే మూడు సిక్సర్లతో బెయిర్స్టో దూకుడు ప్రదర్శించాడు. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే బెయిర్స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, స్టోక్స్ (2) పేలవ ఫామ్ కొనసాగింది. లంచ్ వరకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. విరామం తర్వాత ఫోక్స్ (8)ను పడగొట్టి అశ్విన్ ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లతో దెబ్బ కొట్టగా...తర్వాతి వికెట్ జడేజా ఖాతాలో చేరింది. మరో ఎండ్లో పోరాడుతున్న రూట్ ఇక లాభం లేదనుకొని ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్లో కొట్టిన షాట్కు లాంగాన్ వద్ద బుమ్రా క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. టెస్టు క్రికెట్కు ప్రోత్సాహకాలు... యువ ఆటగాళ్లు టెస్టు ఫార్మాట్పై మరింత శ్రద్ధ పెట్టేందుకు బీసీసీఐ కొత్త తరహా ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. టెస్టులు రెగ్యులర్గా ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుతో పాటు ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ పేరుతో భారీ మొత్తం అందించనుంది. 2022–23 సీజన్నుంచే దీనిని వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఏడాదిలో భారత జట్టు ఆడే టెస్టుల్లో కనీసం సగానికి పైగా టెస్టులు ఆడితే రూ. 30 లక్షలు అందిస్తారు. 75 శాతం పైగా మ్యాచ్లు ఆడితే ఈ మొత్తం రూ.45 లక్షలు అవుతుంది. తుది జట్టులో లేని ప్లేయర్కు ఇందులో సగం లభిస్తుంది. ఉదాహరణకు భారత జట్టు ఏడాదిలో 10 టెస్టులో ఆడితే ఒక ఆటగాడు అన్ని మ్యాచ్లలోనూ బరిలోకి దిగితే అతనికి రూ.4.50 కోట్లు లభిస్తాయి. ఒక్కో మ్యాచ్ ఫీజు రూ.15 లక్షల ద్వారా వచ్చే రూ.1.50 కోట్లకు ఇది అదనం. సగంకంటే తక్కువ టెస్టులు ఆడితే ఇది వర్తించదు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218; భారత్ తొలి ఇన్నింగ్స్ 477; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) సర్ఫరాజ్ (బి) అశ్విన్ 0; డకెట్ (బి) అశ్విన్ 2; పోప్ (సి) యశస్వి (బి) అశ్విన్ 19; రూట్ (సి) బుమ్రా (బి) కుల్దీప్ 84; బెయిర్స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; స్టోక్స్ (బి) అశ్విన్ 2; ఫోక్స్ (బి) అశ్విన్ 8; హార్ట్లీ (ఎల్బీ) (బి) బుమ్రా 20; వుడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; బషీర్ (బి) జడేజా 13; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 195. వికెట్ల పతనం: 1–2, 2–21, 3–36, 4–92, 5–103, 6–113, 7–141, 8–141, 9–189, 10–195. బౌలింగ్: బుమ్రా 10–2–38–2, అశ్విన్ 14–0–77–5, జడేజా 9–1–25–1, కుల్దీప్ 14.1–0–40–2, సిరాజ్ 1–0–8–0. జిమ్మీ@ 700 ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్గా, తొలి పేసర్గా ఘనతకెక్కాడు. శనివారం కుల్దీప్ను అవుట్ చేయడంతో ఈ వికెట్ అతని ఖాతాలో చేరింది. అత్యధిక వికెట్ల జాబితాలో స్పిన్నర్లు మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే అతనికంటే ముందున్నారు. 41 ఏళ్ల 7 నెలల వయసులో తన 187వ టెస్టులో అతను ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. మే 2003లో జింబాబ్వేపై అండర్సన్ తన తొలి టెస్టు ఆడాడు. 178 = 178 భారత జట్టు టెస్టు చరిత్రలో తొలి సారి విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా వచ్చింది. ఇప్పటివరకు మన విజయాలకంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. భారత్ మొత్తం 579 టెస్టులు ఆడగా 222 మ్యాచ్లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. 36 అశ్విన్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 36వ సారి. రిచర్డ్ హ్యాడ్లీ (36)ని సమం చేశాడు. ‘ఒక టెస్టు గెలవాలంటే అన్నీ సరిగ్గా కుదరాలి. ఈ సారి మేం అలాగే చేయగలిగాం. కొందరు ఆటగాళ్లు ఏదో ఒక దశలో సిరీస్లో అందుబాటులో ఉండరని తెలుసు. టెస్టులు ఎక్కువగా ఆడకపోయినా ఈ కుర్రాళ్లందరికీ మంచి అనుభవం ఉంది. మ్యాచ్కు అనుగుణంగా వారిని వాడుకున్నాం. ఒత్తిడి ఎదురైనప్పుడు అంతా సరిగా స్పందించారు. ఇది సమష్టి విజయం. పరుగులు చేయడం గురించే చర్చిస్తాం కానీ టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. మా బౌలర్లు దానిని చేసి చూపించారు. కుల్దీప్, యశస్వి గొప్పగా ఆడారు’ –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
IND VS ENG 5th Test Day 2: 15 ఏళ్లలో తొలిసారి..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 102 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 433/8గా ఉంది. యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్మన్ గిల్ (110), దేవ్దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56), రవీంద్ర జడేజా (15), దృవ్ జురెల్ (15), అశ్విన్ (0) ఔట్ కాగా.. కుల్దీప్ (6), బుమ్రా (0) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 215 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4 వికెట్లు పడగొట్టగా.. టామ్ హార్ట్లీ 2, ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. Historic - Team India's Top 5 scored 50+ scores in a Test innings for the first time after 15 years. - TEAM INDIA WRITTEN HISTORY AT DHARAMSHALA...!!!! 🇮🇳 pic.twitter.com/S32yzlfHx6 — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 15 ఏళ్లలో తొలిసారి.. భారత తొలి ఇన్నింగ్స్లో ఐదుగురు టపార్డర్ బ్యాటర్లు 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు (యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్మన్ గిల్ (110), దేవ్దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56)) నమోదు చేశారు. భారత్కు సంబంధించి టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. 1998లో తొలిసారి ఐదుగురు భారత టాపార్డర్ బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. కోల్కతా వేదికగా జరిగిన నాటి మ్యాచ్లో ఆసీస్పై ఈ అరుదైన ఫీట్ నమోదైంది. ఆతర్వాత 1999లో ఓసారి (మొహాలీలో న్యూజిలాండ్పై), ఆతర్వాత 2009లో ముంబై వేదికగా శ్రీలంకపై మరోసారి భారత టాపార్డర్ బ్యాటర్లు ప్రతాపం చూపించారు. తిరిగి 15 ఏళ్ల తర్వాత మరోసారి భారత టాపార్డర్లోని ఐదుగురు బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. -
అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన పడిక్కల్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్.. తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేసిన పడిక్కల్.. సిక్సర్ సాయంతో అర్దసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 103 బంతులు ఎదుర్కొన్న అతను.. 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 65 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 పడిక్కల్కు ఇది మొదటి టెస్ట్ మ్యాచే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పడిక్కల్తో పాటు ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్లోని టాప్ ఐదుగురు బ్యాటర్లు 50 పరుగుల మార్కును తాకారు. భారత్కు సంబంధించి టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. గతంలో ఆసీస్, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన టెస్ట్ల్లో భారత టపార్డర్లోని ఐదుగురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీ మార్కును దాటారు. ఈ ఇన్నింగ్స్లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్మన్ గిల్ (110), సర్ఫరాజ్ ఖాన్ (56) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (14), దృవ్ జురెల్ (15) క్రీజ్లో ఉన్నారు. 100 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్కోర్ 426/5గా ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
కుల్దీప్ ఫటాఫట్...ఓపెనింగ్ ధనాధన్!
ధర్మశాలలో తొలి రోజే వాతావరణం భారత్కు అనుకూలంగా మారిపోయింది. గిర్రున తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక తలవంచిన ఇంగ్లండ్ అరవై ఓవర్ల లోపే పది వికెట్లనూ స్పిన్నర్లకే అప్పగించింది. టాస్ గెలిచిన సానుకూలత, శుభారంభం తర్వాత ఒక దశలో 175/3తో మెరుగైన స్థితిలో నిలిచిన పర్యాటక జట్టు పేలవ ప్రదర్శనతో 43 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకుంది. ఎడంచేతి మణికట్టుతో కుల్దీప్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, తన వందో టెస్టు మ్యాచ్లో నాలుగు వికెట్లతో అశ్విన్ అండగా నిలిచాడు. మరోమారు యశస్వి జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్, రోహిత్ సహకారం వెరసి సిరీస్లో భారత్కు తొలిసారి ఓపెనింగ్లో సెంచరీ భాగస్వామ్యం... ఆట ముగిసేసరికి కేవలం 83 పరుగుల లోటుతో ముగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే శుక్రవారమే చివరి టెస్టు పూర్తిగా భారత్ చేతుల్లోకి రావడం ఖాయం. ధర్మశాల: ఇంగ్లండ్తో గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులో భారత్కు అన్ని విధాలా సరైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు), రోహిత్ శర్మ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలు సాధించగా... రోహిత్తో పాటు శుబ్మన్ గిల్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజ్లో ఉన్నాడు. ఆడిన మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పటిదార్ స్థానంలో భారత్ దేవ్దత్ పడిక్కల్ను తొలిసారి తుది జట్టులోకి ఎంపిక చేసింది. మరోవైపు 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్కు కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపిక అందించింది. టపటపా... ఓపెనర్లు క్రాలీ, డకెట్ (27) ఇంగ్లండ్కు మరోసారి శుభారంభం అందించారు. అయితే కుల్దీప్ రాకతో పరిస్థితి మారిపోయింది. గిల్ అద్భుత క్యాచ్తో తన తొలి ఓవర్లోనే డకెట్ను వెనక్కి పంపిన కుల్దీప్... కొద్ది సేపటికే పోప్ (11)ను కూడా అవుట్ చేశాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 100/2 కాగా, క్రాలీ కొన్ని చక్కటి షాట్లతో క్రీజ్లో పట్టుదలగా నిలబడ్డాడు. అయితే రెండో సెషన్లో భారత స్పిన్నర్లు మరింతగా చెలరేగిపోగా... ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కుల్దీప్ బౌలింగ్లో అనూహ్యంగా టర్న్ అయిన బంతి క్రాలీ వికెట్లను ఎగరగొట్టగా, 100వ టెస్టు ఆడుతున్న బెయిర్స్టో (29) వికెట్ కూడా కుల్దీప్ ఖాతాలోనే చేరింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. శుభారంభం... భారత ఓపెనర్లు యశస్వి, రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 20 పరుగుల వద్ద రోహిత్ను అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో అతను నాటౌట్గా తేలడం కలిసొచ్చింది. తొలి 27 బంతుల్లో 6 పరుగులే చేసి ఓపిక ప్రదర్శించిన యశస్వి స్పిన్నర్ల రాకతో చెలరేగిపోయాడు. బషీర్ వేసిన తొలి ఓవర్లో అతను 3 సిక్సర్లు బాదాడు. అయితే బషీర్ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో అర్ధ సెంచరీని దాటిన యశస్వి అదే ఊపులో మూడో బంతికి ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. అనంతరం 77 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, మరోవైపు గిల్ కూడా దూకుడుగా ఆడాడు. పడిక్కల్@ 314 ఈ మ్యాచ్తో కర్ణాటకకు చెందిన దేవ్దత్ పడిక్కల్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇప్పటికే 2 టి20లు ఆడిన పడిక్కల్... టెస్టులు ఆడిన 314వ భారత ఆటగాడిగా నిలిచాడు. 17 ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన 17వ ప్లేయర్గా బెయిర్స్టో గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అండర్సన్ (187), స్టువర్ట్ బ్రాడ్ (168), కుక్ (161), జో రూట్ (140), స్టివార్ట్ (133), బెల్ (118), గూచ్ (118), గోవర్ (117), అథర్టన్ (115), కొలిన్ కౌడ్రే (114), బాయ్కాట్ (108), పీటర్సన్ (104), బోథమ్ (102), స్టోక్స్ (102), స్ట్రాస్ (100), థోర్ప్ (100) ఉన్నారు. 14 భారత్ తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకున్న 14వ ప్లేయర్గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ (200), ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), కుంబ్లే (132), కపిల్దేవ్ (131), గావస్కర్ (125), వెంగ్సర్కార్ (116), గంగూలీ (113), కోహ్లి (113), ఇషాంత్ శర్మ (105), సెహ్వాగ్ (103), హర్భజన్ (103), పుజారా (103) ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 79; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 27; పోప్ (స్టంప్డ్) జురేల్ (బి) కుల్దీప్ 11; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 26; బెయిర్స్టో (సి) జురేల్ (బి) కుల్దీప్ 29; స్టోక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫోక్స్ (బి) అశ్విన్ 24; హార్ట్లీ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 6; వుడ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; బషీర్ (నాటౌట్) 11; అండర్సన్ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (57.4 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–64, 2–100, 3–137, 4–175, 5–175, 6–175, 7–183, 8–183, 9–218, 10–218. బౌలింగ్: బుమ్రా 13–2–51–0, సిరాజ్ 8–1–24–0, అశ్విన్ 11.4–1–51–4, కుల్దీప్ 15–1–72–5, జడేజా 10–2–17–1. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బ్యాటింగ్) 52; గిల్ (బ్యాటింగ్) 26; ఎక్స్ట్రాలు 0; మొత్తం (30 ఓవర్లలో వికెట్ నష్టానికి) 135. వికెట్ల పతనం: 1–104. బౌలింగ్: అండర్సన్ 4–1–4–0, మార్క్ వుడ్ 3–0–21–0, హార్ట్లీ 12–0– 46–0, షోయబ్ బషీర్ 11–2–64–1. -
రాకాసి బౌన్సర్.. రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్ను ఎవరూ ఆడలేరు..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలుత ఇంగ్లండ్ను 218 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్లోనూ చెలరేగి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్లో కొనసాగుతున్నాడు. రోహిత్కు జతగా శుభ్మన్ గిల్ (26) క్రీజ్లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది. 151.2kmph delivery from Mark Wood. But Rohit Sharma says I'll play my favourite shot and send it out of the ground. 🫡pic.twitter.com/cuajTdxVHH — Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఇన్నింగ్స్లో హిట్మ్యాన్ ఆడిన ఓ షాట్ రోజు మొత్తానికి హైలైట్గా నిలిచింది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్కు రోహిత్ తగు రీతిలో సమాధానం చెప్పాడు. 151.2 కిమీ వేగంతో నిప్పులు గక్కుతూ వచ్చిన ఆ బౌన్సర్కు హిట్మ్యాన్ తన ఫేవరెట్ పుల్షాట్ ఆడి భారీ సిక్సర్గా మలిచాడు. రోహిత్ ఆడిన ఈ సాహసోపేతమైన షాట్ను చూసి బౌలర్, ఫీల్డర్లు సహా మైదానంలో ఉన్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. హిట్మ్యాన్ అభిమానులు ఈ షాట్కు సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో షేర్ చేస్తూ తమ ఆరాధ్య ఆటగాడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్ను ఎవ్వరూ ఆడలేరన్న విషయాన్ని ఒప్పుకోవాలి. -
Viral Video: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్ను చూసే నేర్చుకోవాలి..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తొలుత ఇంగ్లండ్ను 218 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్లోనూ రెచ్చిపోయి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్లో కొనసాగుతున్నాడు. రోహిత్కు జతగా శుభ్మన్ గిల్ (26) క్రీజ్లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. First Kuldeep Yadav give the ball to Ravi Ashwin but Ashwin return the ball to Kuldeep Yadav to celebrate his 5-Wicket haul. - Beautiful moments of the day...!!!! pic.twitter.com/64ev9CFM4f — CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024 కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత మైదానంలో తారసపడిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన అనంతరం భారత ఆటగాళ్లు పెవిలియన్కు వెళ్తుండగా వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు. అయితే ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ ఇన్నింగ్స్ హీరో కావడంతో అశ్విన్ సహచరుల మాటకు ఒప్పుకోలేదు. కుల్దీప్నే ముందుగా నడవాల్సిందిగా కోరాడు. ఇలా నువ్వు-నేను అంటూ అశ్విన్, కుల్దీప్ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి అశ్విన్.. కుల్దీప్ను ఒప్పించాడు. కుల్దీప్ టీమ్ను లీడ్ చేస్తూ పెవిలియన్వైపు నడిచాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరలవుతుంది. వందో టెస్ట్ ఆడుతూ 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్ను చూసే నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Yashasvi Jaiswal: సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును (ఇంగ్లండ్పై టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు, 656) బద్దలు కొట్టిన యశస్వి.. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండింది. సచిన్.. ఆసీస్పై 74 ఇన్నింగ్స్ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్పై కేవలం 9 ఇన్నింగ్స్ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు. ఈ రికార్డుతో పాటు యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో బౌండరీ బాది టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి.. టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి 1000 పరుగుల మార్కును తాకేందుకు 16 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. వినోద్ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్ల్లోనే చేరుకున్నాడు. ఓవరాల్గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్కు చెందిన సచ్క్లిఫ్ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్ల్లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితా.. సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్పై 774 పరుగులు సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్పై 732 పరుగులు యశస్వి జైస్వాల్ 2024లో ఇంగ్లండ్పై 712 పరుగులు విరాట్ కోహ్లి 2014/15లో ఆస్ట్రేలియాపై 692 పరుగులు డబ్యూటీసీ 2023-25 సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు జైస్వాల్ -
4–1 వేటలో... ఘనమైన ముగింపుపై భారత్ దృష్టి
భారత జట్టు హైదరాబాద్లో తొలి టెస్టును కోల్పోయిన తీరు చూస్తే నాలుగో టెస్టు ముగిసే సరికి మన జట్టు సిరీస్ గెలుచుకోగలదని ఎవరూ ఊహించలేదు. తర్వాతి మూడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ మెరుగ్గానే ఆడినా, వెనుకబడిన ప్రతీసారి కోలుకుంటూ టీమిండియా వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు సిరీస్ సొంతం కావడంతో చివరి మ్యాచ్నూ గెలిచి ఘనంగా ముగించాలని రోహిత్ బృందం భావిస్తుండగా... సిరీస్ ఓడినా మరో మ్యాచ్ గెలిచి అంతరాన్ని 2–3కు తగ్గిస్తూ స్వదేశం వెళ్లాలని స్టోక్స్ జట్టు పట్టుదలగా ఉంది. ధర్మశాల: భారత గడ్డపై ఇంగ్లండ్ ఆడిన గత రెండు టెస్టు సిరీస్లను టీమిండియా 4–0తో, 3–1తో గెలుచుకుంది. ఈ సిరీస్లో ఇప్పటికే 3–1తో పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో సిరీస్లో చివరిదైన ఐదో టెస్టుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఆఖరి సమరంలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ సిరీస్ను 4–1తో ముగిస్తుందా లేక తాము నమ్ముకున్న ‘బజ్బాల్’తో ఇంగ్లండ్ రెండో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం. బుమ్రా వచ్చేశాడు సిరీస్ గెలుచుకున్న ఉత్సాహంతో భారత శిబిరంలో ప్రస్తుతం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఆటగాళ్లంతా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓపెనర్లు రోహిత్, యశస్విలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సిరీస్లో ఇప్పటికే 655 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ను నిలువరించడం ఇంగ్లండ్ వల్ల కావడం లేదు. ఒక్క రజత్ పటిదార్ మాత్రమే ఇప్పటి వరకు విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్లలో కలిపి 63 పరుగులే చేసినా... అతనికి మరో మ్యాచ్లో అవకాశం దక్కుతోంది. గత టెస్టులో విఫలమైన సర్ఫరాజ్ ఈసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కీపర్ ధ్రువ్ జురేల్ రాంచీ టెస్టుతోనే తానేంటో చూపించగా... జడేజా, అశ్విన్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా తన 100వ టెస్టు ఆడనున్న అశ్విన్ ఈ మ్యాచ్ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. నాలుగో టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతుండటంతో మన పేస్ మరింత పటిష్టంగా మారింది. సిరాజ్తో పాటు గత మ్యాచ్లో రాణించిన ఆకాశ్దీప్కు మూడో పేసర్గా అవకాశం ఇస్తారా లేక మూడో స్పిన్నర్గా కుల్దీప్ను ఎంచుకుంటారా అనేది మ్యాచ్ రోజే తేలుతుంది. రాబిన్సన్ స్థానంలో వుడ్ ఇంగ్లండ్ తుది జట్టులో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. బౌలింగ్లో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పాటు వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్కు ఇంగ్లండ్ చోటు కల్పించింది. తన 187వ టెస్టు బరిలోకి దిగేందుకు సిద్ధమైన సీనియర్ అండర్సన్ 700 వికెట్ల మైలురాయికి మరో రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా ఇంగ్లండ్ ఇద్దరు స్పిన్నర్లు హార్ట్లీ, బషీర్లను ఎంచుకుంది. అయితే బ్యాటింగే ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. ప్రతీ ఒక్కరు సిరీస్లో ఒక్కో సమయంలో రాణించినా సమష్టిగా ఆడకపోవడం వరుస ఓటములకు కారణమైంది. ఓపెరన్లు క్రాలీ, బెన్ డకెట్లతో పాటు పోప్ రాణించాల్సి ఉంది. జో రూట్ ఫామ్లోకి రావడం సానుకూలాంశం కాగా కెప్టెన్ బెన్ స్టోక్స్ తన స్థాయికి తగినట్లుగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. సిరీస్లో ఇప్పటి వరకు విఫలమవుతూనే ఉన్న బెయిర్స్టో తన 100వ టెస్టులోనైనా ఆకట్టుకుంటాడా లేదా వేచి చూడాలి. 1 ధర్మశాల స్టేడియంలో ఇప్పటి వరకు ఒకే ఒక టెస్టు జరిగింది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్, వాతావరణం ధర్మశాలలో చల్లటి వాతావరణం, పిచ్ సీమ్ బౌలింగ్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే దాని ప్రభావం కొద్ది సేపే ఉండవచ్చు. పచ్చిక దాదాపుగా తొలగించడంతో బ్యాటింగ్కు బాగా అనుకూలంగా కనిపిస్తోంది. -
ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 1-3 తేడాతో సిరీస్ను కోల్పోయింది. సిరీస్లోని చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు లభించిన విరామ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ విరామ సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సహచర క్రికెటర్లతో కలిసి స్థానిక జలపాతంలో రీఫ్రెష్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. England cricketer James Anderson and his teammates enjoying a refreshing dip in a local khadd in Dharamshala 😍 pic.twitter.com/JQravFPLvM — Go Himachal (@GoHimachal_) March 6, 2024 ఇంగ్లీష్ ఆటగాళ్లు సిరీస్ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిలో మమేకమైపోయారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా కనెక్టైనట్లుంది. హిమాచల్ ప్రదేశ్ శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్ వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడి జలపాతాలు, ఎత్తైన మంచు కొండలు భూతలస్వర్గాన్ని తలపిస్తాయి. అందుకే ఈ ప్రాంతం ఇంగ్లీష్ క్రికెటర్లకు స్వదేశానుభూతిని కలిగిస్తుంటుంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల నడుమ భారత్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో సొంత అభిమానులను నిరుత్సాహపరిచింది. బజ్బాల్ అంటూ ఊదరగొట్టిన వీరు రోహిత్ సేన దెబ్బకు తోకముడిచారు. బెన్ డకెట్, ఓలీ పోప్, రూట్ సెంచరీలు మినహా ఈ సిరీస్లో ఇంగ్లండ్కు చెప్పకోదగ్గ ప్రదర్శనలు లేవు. స్టార్లతో నిండిన జట్టు నుంచి ఊహించని ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. -
‘వంద’కు అటు ఇటు...
ధర్మశాల: టి20ల మెరుపులతో సంప్రదాయ టెస్టు సిరీస్లే కుదించబడుతున్నాయి. 3, 5 టెస్టుల సిరీస్ నుంచి 2, 3 టెస్టుల సిరీస్ లేదంటే అనామక జట్లయితే మొక్కుబడిగా ఏకైక టెస్టుతో ఐదు రోజుల ఆటను కానిచ్చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా ధనాధన్ ఆట మాయలో అసలైన ఫార్మాట్కు మంగళం పాడి లీగ్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లతోనే కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక క్రికెటర్ 100వ టెస్టు ఆడటం ఆ ఆటగాడికే కాదు... ఇప్పుడు టెస్టు ఫార్మాట్కే మైలురాయిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మరి ప్రత్యర్థి జట్ల నుంచి చెరొకరు 100వ టెస్టు ఆడటమైతే అనూహ్యం! ఆతిథ్య భారత్ నుంచి దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బృందం నుంచి బెయిర్స్టోలకు రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ధర్మశాలలో జరిగే ఐదో టెస్టు చిరస్మరణీయం కానుంది. ఈ ఇద్దరు 99 మ్యాచ్లాడి టెస్టు క్రికెట్కు అభి‘వంద’నం పలుకేందుకు సిద్ధమయ్యారు. 14వ భారత క్రికెటర్గా... భారత క్రికెట్లోనే విజయవంతమైన సారథులుగా వెలుగొందిన అజహరుద్దీన్ (99), ధోని (90)లు కూడా 100 టెస్టులు ఆడలేకపోయారు. జహీర్ ఖాన్ (92) సైతం ‘వంద’ భాగ్యానికి నోచుకోలేకపోయాడు. కొందరికే సాధ్యమైన ఈ మైలురాయిని అందుకోవడానికి అశ్విన్ సిద్ధమయ్యాడు. ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ ... కుంబ్లే తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. 2011లో వెస్టిండీస్పై ఢిల్లీ టెస్టులో అరంగేట్రం చేసిన అశ్విన్ 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టుల్లో టీమిండియా ఘనవిజయాల్లో భాగమైన అశ్విన్ ... ధోని సారథ్యంలో తురుపుముక్కగా రాటుదేలాడు. 99 టెస్టులాడి 507 వికెట్లు పడగొట్టాడు. 35 సార్లు ఐదేసి వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశాడు. వందో టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడిగా అశ్విన్ ఘనత వహిస్తాడు. 17వ ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్స్టో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జానీ బెయిర్స్టో గురించి మనవాళ్లకి, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకి బాగా తెలుసు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్గా వార్నర్తో కలిసి మెరిపించాడు. టెస్టుల్లో నిలకడైన బ్యాటర్. 2012లో వెస్టిండీస్తో అరంగేట్రం చేసిన బెయిర్స్టో 99 టెస్టుల్లో 36.42 సగటుతో 5974 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 26 అర్ధ శతకాలున్నాయి. కీపర్గా 242 క్యాచ్ల్ని పట్టడంతో పాటు 14 స్టంపౌట్లు చేశాడు. వందోటెస్టు ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్ ఈ ఘనతకెక్కనున్న 17వ ఇంగ్లండ్ క్రికెటర్. వన్డేల్లో వందో మ్యాచ్ కూడా ధర్మశాలలోనే ఆడిన బెయిర్స్టో ఇప్పుడు అక్కడే మరో 100కు సై అంటున్నాడు. ఇది అతిపెద్ద సంబరం. ఎందుకంటే నా కెరీర్లో ఇది గమ్యాన్ని మించిన పయనం. ఎప్పటికీ ప్రత్యేకం. ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాను. ఎంతో నేర్చుకున్నాను. 2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ నా కెరీర్కు టర్నింగ్ పాయింట్. నాలుగు టెస్టుల్లో 52.64 సగటుతో 14 వికెట్ల పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్నా. కెరీర్ ఆరంభంలోనే పనైపోయిందనుకున్న ప్రతీసారి నన్ను నేను మార్చుకుంటూ సరికొత్త బౌలింగ్ అస్త్రాలతో ఇక్కడిదాకా ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. –అశ్విన్ ఇది నాకు భావోద్వేగానికి గురిచేసే మ్యాచ్. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే అందరూ కలలు కంటారు. నేనైతే ఆ కలల్ని నిజం చేసుకొని కెరీర్లో వందో ఆటకు రెడీ కావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. 8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు నా తల్లే సర్వస్వం. అందుకే ఈ ఘనత ఆమెకే అంకితం. –బెయిర్స్టో -
ప్రత్యేక హెలికాప్టర్తో ధర్మశాలలో ల్యాండ్ అయిన హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో జాయిన్ అయ్యాడు. నాలుగో టెస్ట్ అనంతరం లభించిన విరామంలో వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన రోహిత్.. తిరిగి టీమిండియాతో జత కట్టాడు. Jamnagar ✈️Dharamsala Captain Rohit Sharma's normal duties resume.pic.twitter.com/4CKlGqjW5H — CricTracker (@Cricketracker) March 5, 2024 ఇంగ్లండ్తో జరుగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్కు వేదిక అయిన ధర్మశాలలో హిట్మ్యాన్ ప్రత్యేక హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యాడు. మ్యాచ్కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీసీసీఐయే స్వయంగా రోహిత్కు హెలికాప్టర్ను అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 7 నుంచి ధర్మశాలలో ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ముందస్తు వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు రోహిత్ సతీసమేతంగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అన్ని రంగాల సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరందరిలో భారత క్రికెటర్లు ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. -
Rohit Sharma: మరో 'ఆరేస్తే' క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ఆటగాడవుతాడు..!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో ఆరు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 594 సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ ఖాతాలో 553 సిక్సర్లు ఉన్నాయి. గేల్ తర్వాత షాహిద్ అఫ్రిది (476), మార్టిన్ గప్తిల్ (398), ధోని (383), జయసూర్య (359), ఇయాన్ మోర్గన్ (352), ఏబీ డివిలియర్స్ (346), జోస్ బట్లర్ (328) వరుసగా టాప్ 10 స్థానాల్లో ఉన్నారు. హిట్మ్యాన్ ముంగిట మరో రికార్డు.. ధర్మశాల టెస్ట్లో రోహిత్ శర్మ మరో సిక్సర్ కొడితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. కాగా, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్ట్ మ్యాచ్ నామమాత్రం సాగనుంది. సిరీస్ వరకు ఇది అప్రధానమైన మ్యాచే అయినప్పటికీ... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 దృష్ట్యా కీలకం కానుంది. ఈ సిరీస్లో టీమిండియా సీనియర్ల సేవలు కోల్పోయినప్పటికీ.. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి భారత్-ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ ఇద్దరు ఆటగాళ్లకు 100వ టెస్ట్ మ్యాచ్ కానుంది. టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ జానీ బెయిర్స్టో తమ కెరీర్లలో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్తో ఇద్దరు ఆటగాళ్లు (వేర్వేరు జట్లకు చెందిన వారు) 100 టెస్ట్ల మార్కును తాకడం ఇది మూడోసారి మాత్రమే. అశ్విన్, బెయిర్స్టోలకు చిరకాలం గుర్తుండిపోయే ఈ మ్యాచ్ కోసం వారితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా, కెరీర్లో అత్యంత ముఖ్యమైన మైలురాయిని (100వ టెస్ట్) చేరుకునే ముందు ఇంగ్లండ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్స్టోను ఫామ్ లేమి సమస్య తెగ కలవరపెడుతుంది. భారత్తో సిరీస్లో అతను ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ALERT 🚨. In the next match, both Ravi Ashwin and Jonny Bairstow will play their 100th Test match. This will be only the 3rd time in 147 years of Test history that players from two different teams will play their 100th Test in the same match. pic.twitter.com/nYq4ytbhHm — Vishal. (@SPORTYVISHAL) February 29, 2024 తొలి టెస్ట్లో 47 పరుగులు (37, 10) చేసిన బెయిర్స్టో.. రెండో టెస్ట్లో 51 (25, 26), మూడో టెప్ట్లో 4 (0, 4), నాలుగో టెస్ట్లో 68 పరుగులు (30, 38) మాత్రమే చేసి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. బెయిర్స్టో వందో మ్యాచ్లోనైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి. బెయిర్స్టో ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 36.43 సగటున 5974 పరుగులు చేశాడు. అశ్విన్ విషయానికొస్తే.. యాష్ ఇదే సిరీస్లోని మూడో మ్యాచ్లో 500 వికెట్ల మార్కును తాకి చరిత్రపుటల్లోకెక్కాడు. ప్రస్తుతం అతను ఓ మోస్తరు ఫామ్తో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్లో యాశ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి, సిరీస్ లీడింగ్ వికెట్టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 99 టెస్ట్లు ఆడిన అశ్విన్.. 507 వికెట్లు, 3309 పరుగులు చేశాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు, 5 సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మార్చి 7 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభంకానుంది. -
ఇంగ్లండ్తో ఐదో టెస్ట్.. భారత జట్టు ప్రకటన
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగబోయే చివరాఖరి (ఐదు) టెస్ట్ కోసం అప్డేట్ చేసిన భారత్ జట్టును ఇవాళ (ఫిబ్రవరి 29) ప్రకటించారు. నాలుగో టెస్ట్కు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడంటే తుది జట్టులో అతని స్థానం ఖరారైనట్లే. బుమ్రా.. ఆకాశ్దీప్తో కలిసి భారత పేస్ బౌలింగ్ దళాన్ని లీడ్ చేస్తాడు. బుమ్రా పునరాగమనంతో నాలుగో టెస్ట్లో ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయిన సిరాజ్పై వేటు పడే అవకాశం ఉంది. ధర్మశాల పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుండటంతో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం లేదు. 🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5th @IDFCFIRSTBank Test against England in Dharamsala announced. Details 🔽 #INDvENG https://t.co/SO0RXjS2dK — BCCI (@BCCI) February 29, 2024 భారత తుది జట్టు విషయానికొస్తే.. నాలుగో టెస్ట్లో ఆడిన జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. వరుసగా మూడు టెస్ట్ల్లో విఫలమైన రజత్ పాటిదార్ స్థానంలో దేవ్దత్ పడిక్కల్ తుది జట్టులోకి రావచ్చు. సిరాజ్ ప్లేస్లో బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైపోయింది. ఐదో టెస్ట్లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, అశ్విన్కు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది. ధర్మశాల టెస్ట్ అశ్విన్కు 100వ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. అయితే ఈ ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. రోహిత్ అప్డేట్ చేసిన జట్టులో ఉన్నాడంటే తుది జట్టులో ఉన్నట్లే. మొత్తంగా చూస్తే బుమ్రా రీఎంట్రీ మినహా ఐదో టెస్ట్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఐదో టెస్ట్ కోసం అప్డేట్ చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), కేఎస్ భరత్ (వికెట్కీపర్), దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మొమమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఐదో టెస్ట్లో భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శస్వి జైస్వాల్, శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆకాష్ దీప్ -
ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్.. టీమిండియాకు శుభవార్త
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగనున్న ఐదో టెస్ట్కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త తెలిసింది. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే ఆఖరి మ్యాచ్కు పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం. వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐదో టెస్ట్కు ముందు టీమిండియా ఫ్యాన్స్కు ఓ మింగుడుపడని వార్త కూడా వినిపిస్తుంది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఖరి మ్యాచ్కు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. మెరుగైన చికిత్స కోసం రాహుల్ను అతి త్వరలో లండన్కు పంపించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో తొలి రెండు టెస్ట్లు ఆడిన రాహుల్.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా తొడ కండరాల సమస్య తలెత్తడంతో తదుపరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజా సమాచారం నిజమైతే రాహుల్ ఆఖరి టెస్ట్లో ఆడటం అనుమానమే. కాగా, స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియాను గాయాల బెడద వేధిస్తూనే ఉంది. సిరీస్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత కారణాల చేత విరాట్ కోహ్లి, గాయం కారణంగా మొహమ్మద్ షమీ దూరం కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, బుమ్రా గాయాలు, ఇతరత్రా కారణాల చేత మధ్యలో పలు మ్యాచ్లకు దూరమయ్యారు. సీనియర్ల గైర్హాజరీ, గాయాల సమస్య వేధిస్తున్నప్పటికీ.. యంగ్ ఇండియా అద్భుత ప్రదర్శనలు చేసి సిరీస్ కైవసం చేసుకోవడం విశేషం. -
ముందే సంబరపడితే ఇలాగే ఉంటది.. కీలకమైన స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టి వదిలేసిన స్టోక్స్
యాషెస్ సిరీస్ 2023 ఐదో టెస్ట్ చివరి రోజు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఘోర తప్పిదం చేశాడు. కీలక సమయంలో (లంచ్కు ముందు ఓవర్ తొలి బంతికి) మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే స్టీవ్ స్మిత్ (40) క్యాచ్ను జారవిడిచాడు. మొయిన్ అలీ బౌలింగ్లో స్మిత్ గ్లవ్స్ను తాకిన బంతిని లెగ్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ అతికష్టం మీద (చాలా ఎత్తుకు ఎగిరి) పట్టుకున్నట్లే పట్టుకుని వదిలేశాడు. STOKES 😒pic.twitter.com/OUD88ZWZkF — CricTracker (@Cricketracker) July 31, 2023 సంబురాలు చేసుకునే తొందరలో స్టోక్స్ మోకాలికి తగిలి బంతి నేలపాలైంది. ఇంతటితో ఆగకుండా స్టోక్స్ రివ్యూకి వెళ్లి ఇంకో ఘోర తప్పిదం చేశాడు. రీప్లేలో బంతి స్మిత్ గ్లవ్స్కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంతి నిర్దిష్ట సమయం పాటు స్టోక్స్ చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇంగ్లండ్ అప్పీల్కు నాటౌట్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో కీలక సమయంలో ఇంగ్లండ్కు వికెట్ దక్కకపోగా, రివ్యూ కోల్పోయింది. It's lunch on Day 5. Steve Smith and Travis Head keep Australia steady as teams head for Lunch. pic.twitter.com/8mTKpA0eXZ — CricTracker (@Cricketracker) July 31, 2023 కాగా, స్టోక్స్.. స్టీవ్ స్మిత్ క్యాచ్ జారవిడిచాక ఆట మరో 5 బంతుల పాటు సాగింది. అనంతరం అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కూడా మొదలైంది. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 238/3గా ఉంది. స్టీవ్ స్మిత్ (40), ట్రవిస్ హెడ్ (31) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ గెలవాలంటే 146 పరుగులు, ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్లు కావాల్సి ఉంది. లంచ్ విరామ సమయం పూర్తయ్యాక కూడా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్ను పాక్షికంగా నిలిపివేశారు. ఇదిలా ఉంటే, 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్లు ఆసీస్ ఆటగాళ్లను వణికించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. -
Ashes 5th Test Day 5: ఆసీస్ను వణికిస్తున్న ఇంగ్లండ్ పేసర్లు.. తొలి సెషన్లోనే..!
యాషెస్ సిరీస్-2023లో ఆఖరి (ఐదవది) టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్లు ఆసీస్ ఆటగాళ్లను వణికిస్తున్నారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. Chris Woakes gets David Warner early on Day 5. 📸: Sony LIV pic.twitter.com/yvj0U7KmiE — CricTracker (@Cricketracker) July 31, 2023 ఐదో రోజు ఆట ప్రారంభమయ్యాక 4వ ఓవర్ రెండో బంతికి క్రిస్ వోక్స్ బౌలింగ్లో వికెట్కీపర్ జానీ బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ పెవిలియన్కు చేరగా.. ఆ వెంటనే ఆరో ఓవర్ రెండో బంతికి అదే క్రిస్ వోక్స్ బౌలింగ్లో ఉస్మాన్ ఖ్వాజా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 49వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్ వుడ్ బౌలింగ్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి లబూషేన్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆసీస్ 34 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి (169/3) బిక్కుబిక్కుమంటుంది. Chris Woakes is in the act for England.pic.twitter.com/UlekQeEhqX — CricTracker (@Cricketracker) July 31, 2023 లబూషేన్ ఔటయ్యాక కాస్త దూకుడు పెంచిన ఆసీస్ వేగంగా పరుగులు చేస్తూనే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్టీవ్ స్మిత్ (35 బంతుల్లో 21; 4 ఫోర్లు, ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 22; 4 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. 57 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 210/3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి. అదే ఇంగ్లండ్ విజయం సాధించలాంటే మరో 7 వికెట్లు పడగొట్టాలి. తొలి సెషన్లో ఇప్పటివరకు 19 ఓవర్లు జరిగాయి. ఈ రోజు ఇంకా 71 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. -
అదరగొట్టిన ఇంగ్లండ్
లండన్: తొలి రోజునుంచే ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్లో మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధమైంది. చివరిదైన ఐదో టెస్టును గెలుచుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్ బలంగా పట్టు బిగించింది. పదునైన బ్యాటింగ్తో చెలరేగి ఆస్ట్రేలియా ముందు దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచేందుకు సిద్ధమైంది. మ్యాచ్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. అండర్సన్ (8 బ్యాటింగ్), బ్రాడ్ (2 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 377 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు రోజులు ఆసీస్ బ్యాటర్లు నిలబడి లక్ష్యాన్ని ఛేదిస్తారా లేక ఇంగ్లండ్ 2–2తో సిరీస్ను సమం చేస్తుందా చూడాలి. ఇంగ్లండ్ మరోసారి తమ బ్యాటింగ్లో తొలి బంతినుంచే ‘బజ్బాల్’ దూకుడును ప్రదర్శించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (76 బంతుల్లో 73; 9 ఫోర్లు), బెన్ డకెట్ (55 బంతుల్లో 42; 7 ఫోర్లు) ఎప్పటిలాగే ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. వీరిద్దరు తొలి వికెట్కు 17 ఓవర్లలోనే 79 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచి్చన కెప్టెన్ బెన్ స్టోక్స్ (67 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు తగ్గకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం జో రూట్ (106 బంతుల్లో 91; 11 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్స్టో (103 బంతుల్లో 78; 11 ఫోర్లు) ఇన్నింగ్స్లు ఇంగ్లండ్ను మరింత పటిష్ట స్థితికి చేర్చాయి. రూట్, బెయి ర్స్టో ఐదో వికెట్కు 110 పరుగులు జత చేశారు. 2019లోనూ ఇంగ్లండ్ గ డ్డపై జరిగిన ‘యాషెస్’ సిరీస్ 2–2తో సమంగా ముగిసింది. ఇరు జట్లు చెరో 2 టెస్టులు గెలవగా, మరో టెస్టు ‘డ్రా’ అయింది. ఆ తర్వాత 2021లో తమ సొంతగడ్డపై జరిగిన ‘యాషెస్’లో ఆ్రస్టేలియా 4–0తో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ‘దెమెంతియా’ బాధితులకు మద్దతుగా... మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లు భిన్నమైన రీతిలో దెమెంతియా (మతిమరపు) వ్యాధిగ్రస్తులకు సంఘీభావం ప్రకటించారు. ప్రతీ ఆటగాడు తమ పేరు రాసి ఉన్న జెర్సీ కాకుండా జట్టులోని మరో సభ్యుడి జెర్సీని ధరించి మైదానంలోకి దిగారు. మతిమరపు కారణంగా తమ వస్తువులను గుర్తించడంలో గందరగోళానికి గురి కావడం ‘దెమెంతియా’ లక్షణాల్లో ఒకటి. బ్రాడ్ పేరుతో అండర్సన్, స్టోక్స్ పేరుతో బెయిర్స్టో, వోక్స్ పేరుతో అలీ...ఇలా ఆటగాళ్లు టీ షర్ట్లు ధరించి ఆడారు. -
రాణించిన స్మిత్.. 295 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ ఆఖరి ఐదో టెస్టులో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 103.1 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కమిన్స్ (36; 4 ఫోర్లు), మర్ఫీ (34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తొమ్మిదో వికెట్కు 49 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లు వోక్స్ 3 వికెట్లు... బ్రాడ్, వుడ్, రూట్ తలా 2 వికెట్లు తీశారు. -
ఇంగ్లండ్ 283 ఆలౌట్
లండన్: ఆ్రస్టేలియాతో గురువారం మొదలైన యాషెస్ సిరీస్ చివరిదైన ఐదో టెస్టును ఇంగ్లండ్ అదే దూకుడుతో ప్రారంభించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 54.4 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు డకెట్ (41; 3 ఫోర్లు), జాక్ క్రాలీ (22; 3 ఫోర్లు), మొయిన్ అలీ (34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (91 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకట్టుకున్నారు. ఆసీస్ పేస్ బౌలర్ స్టార్క్ (4/82) రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. వార్నర్ (24) అవుటయ్యాడు. -
టీమిండియాకు పరాభవం.. ఇంగ్లండ్కు చిరస్మరణీయం
‘ఇంగ్లండ్ను ఉతికి ఆరేస్తాం’... ఎన్నో రోజులుగా టెస్టు మ్యాచ్ గురించి ప్రసారకర్తలు సాగించిన ప్రచారమిది! చివరకు చూస్తే అంతా తలకిందులైంది. మూడు రోజులకు పైగా ఆధిక్యం ప్రదర్శించిన టీమిండియా ఆఖరికి ప్రత్యర్థికి మ్యాచ్ను అప్పగించింది. ఇంగ్లండ్ తమ టెస్టు చరిత్రలోనే అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించగా... మన జట్టు భారీ స్కోరుతో సవాల్ విసిరి కూడా దానిని కాపాడుకోలేకపోయింది. చివరి రోజు ఇంగ్లండ్ 119 పరుగులు చేయాలిæ్స ఉన్నా... మన బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తారేమో అనుకున్నా ఎలాంటి సంచలనం సాధ్యం కాలేదు. మరో వికెట్ కూడా కోల్పోకుండా గంటన్నరలోనే ఛేదన పూర్తి చేసిన ఇంగ్లండ్ సొంతగడ్డపై సిరీస్ చేజారిపోకుండా కాపాడుకోగలిగింది. బర్మింగ్హామ్: భారత్, ఇంగ్లండ్ మధ్య ‘పటౌడీ ట్రోఫీ’ ఐదు టెస్టుల సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మంగళవారం ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 76.4 ఓవర్లలో 3 వికెట్లకు 378 పరుగులు చేసి గెలిచింది. నాలుగో రోజే 259 పరుగులు చేసిన ఆ జట్టు మిగిలిన 119 పరుగులను కూడా వికెట్ నష్టపోకుండా సాధించింది. అజేయ సెంచరీలు సాధించిన జో రూట్ (173 బంతుల్లో 142 నాటౌట్; 19 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్స్టో (145 బంతుల్లో 114 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్కు 269 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో టీమ్ను గెలిపించారు. రెండు ఇన్నింగ్స్లలోనూ శతకాలు బాదిన బెయిర్స్టో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ సిరీస్లో 4 సెంచరీలు సహా 737 పరుగులు చేసిన రూట్ ఇంగ్లండ్ తరఫున... 22.47 సగటుతో 23 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ మొదలవుతుంది. 19.4 ఓవర్లలోనే... ఛేదనలో నాలుగో రోజే దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్ మంగళవారం కూడా ఎక్కడా తగ్గలేదు. చివరి వరకు అదే జోరును కొనసాగిస్తూ వేగంగా ఆట ముగించింది. ఇక ఏమీ చేయలేమన్నట్లుగా భారత బౌలర్లు కూడా ముందే చేతులెత్తేశారు. దాంతో ఓవర్కు 6 పరుగుల చొప్పున బాదుతూ తొలి సెషన్లో ఇరవై ఓవర్ల లోపే ఇంగ్లండ్ లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో 136 బంతుల్లో రూట్, 138 బంతుల్లో బెయిర్స్టో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సిరాజ్ ఓవర్లో బెయిర్స్టో మూడు ఫోర్లు బాది లక్ష్యానికి చేరువ చేయగా, తర్వాతి ఓవర్లో జడేజా బౌలింగ్లో రివర్స్ స్వీప్తో సింగిల్ తీసి రూట్ జట్టును గెలిపించాడు. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపు ఐదు (4.93) రన్రేట్తో పరుగులు తీస్తూ 76.4 ఓవర్లలోనే ఛేదించడం ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని సూచిస్తోంది. స్కోరు వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 భారత్ రెండో ఇన్నింగ్స్: 245 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్స్టో (నాటౌట్) 114; ఎక్స్ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0. -
IND VS ENG 5th Test: కోహ్లి, స్మిత్లను దాటేసిన రూట్
బర్మింగ్హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్ట్లో (రీ షెడ్యూల్డ్) ఇంగ్లండ్ 7 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జో రూట్ (142), జానీ బెయిర్స్టో (114) అజేయ శతకాలతో ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఫలితంగా ఐదు మ్యాచ్ల పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్ 2-2తో సమం చేసుకుంది. ఇదిలా ఉంటే, కెరీర్ అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్న జో రూట్ ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్లను అధిగమించాడు. రెండున్నరేళ్లుగా సెంచరీల మోత మోగిస్తున్న (11 శతకాలు) రూట్.. తాజా శతకంతో కోహ్లి (27), స్మిత్ (27) సెంచరీల రికార్డును దాటేశాడు. ఇప్పటివరకు 121 టెస్ట్లు ఆడిన రూట్ 28 శతకాలను బాదాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రూట్ బాదిన శతకాలే ఇప్పటివరకు అత్యధికం. ఫాబ్ ఫోర్గా చెప్పుకునే విరాట్, స్మిత్, విలియమ్సన్ గణాంకాలతో పోలిస్తే రూట్ గణాంకాలు అత్యుత్తమంగా ఉన్నాయి. A modern-day Great - Joe Root, what an unbelievable consistency since 2021.pic.twitter.com/bZdu696ibQ — Johns. (@CricCrazyJohns) July 5, 2022 కోహ్లి.. 102 టెస్ట్ల్లో 7 డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 28 అర్ధసెంచరీల సాయంతో 49.53 సగటున 8074 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 86 టెస్ట్ల్లో 3 డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 36 అర్ధసెంచరీల సాయంతో 59.38 సగటున 8016 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సారధి విలియమ్సన్.. 88 టెస్ట్ల్లో 4 డబుల్ సెంచరీలు, 24 సెంచరీలు, 33 అర్ధసెంచరీల సాయంతో 52.63 సగటున 7368 పరుగులు చేయగా.. రూట్ 121 టెస్ట్ల్లో 5 డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 54 అర్ధసెంచరీల సాయంతో 50.77 సగటున 10458 పరుగులు స్కోర్ చేశాడు. చదవండి: IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్ -
IND VS ENG 5th Test: బాగా ఆడలేదు, ఓడాం.. పరాజయానికి సాకులు చెప్పదల్చుకోలేదు..!
గత కొన్ని ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్లో, ఇక్కడా మాకు మంచి అవకాశాలు లభించాయి. కానీ వాటిని ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్లో ఒకే తరహా తీవ్రత, ప్రదర్శన, ఫిట్నెస్ మ్యాచ్ ఆసాంతం కొనసాగించలేకపోవడం దానికి కారణమని భావిస్తున్నా. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విఫలమయ్యాం. తుది జట్టుపై చర్చ సహజం. శార్దుల్ బాగానే ఆడుతున్నాడు కాబట్టే మరో అవకాశమిచ్చాం. అశ్విన్ స్థాయి ఆటగాడిని పక్కన పెట్టడం అంత సులువు కాదు. అయితే తొలి రోజు పిచ్ చూసినప్పుడు పేసర్లకు అనుకూలిస్తుందని అనిపించింది. మ్యాచ్ చివరి వరకు కూడా బంతి పెద్దగా స్పిన్ కాలేదు. పిచ్లో కూడా పెద్దగా మార్పు రాలేదు కాబట్టి రెండో స్పిన్నర్ ఉన్నా ఫలితం మారకపోయేదేమో. తొలి నాలుగు టెస్టుల సమయంలో నేను లేను. అప్పుడు ఇంగ్లండ్ కొంచెం ఇబ్బంది పడ్డా, ఇప్పుడు వరుసగా మూడు విజయాల తర్వాత ఇక్కడకు వస్తే, మనం టెస్టులు ఆడి చాలా రోజులైంది. అయినా ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు. ఇంగ్లండ్ కీలక సమయాల్లో బాగా ఆడింది కాబట్టి టెస్టు గెలవగలిగింది. –రాహుల్ ద్రవిడ్, భారత్ హెడ్ కోచ్ -
IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్
అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు పుండు మీద కారం చల్లే పరిణామం! ఇంగ్లండ్తో చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లు కోత విధించింది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో మన జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇదే సిరీస్ తొలి టెస్టులో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లు ఇలాగే కోల్పోయింది. కాగా, బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్లో టీమిండియా 7 వికెట్లు తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పరాభవంతో పటౌడీ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. స్కోరు వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284; భారత్ రెండో ఇన్నింగ్స్: 245; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్స్టో (నాటౌట్) 114; ఎక్స్ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0. -
IND VS ENG: పంత్ సెంచరీ చేశాడంటే టీమిండియాకు ఓటమి తప్పదా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మ్యాచ్ ఆఖరి రోజు టీమిండియా గెలుపుకు మరో 7 వికెట్లు అవసరముండగా.. ఇంగ్లండ్ విజయానికి మరో 119 పరుగులు కావాల్సి ఉంది. వరుణుడు ఆటంకం కలిగిస్తేనో లేక ఏదైనా అద్భుతం జరిగితేనో తప్ప ఈ మ్యాచ్లో టీమిండియా పరాజయాన్ని ఆపడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ టీమిండియా అభిమానులు తమ బౌలర్లపై ఏ మూలనో ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆఖరి రోజు తమ పేసర్లు చెలరేగి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందిస్తారని వారు భావిస్తున్నారు. ఏదో మూలన భారత విజయావకాశాలు మినుకుమినుకుమంటున్నా ఫాన్స్ను ప్రస్తుతం ఓ అంశం కలవరపెడుతంది. అదేంటంటే.. విదేశాల్లో రిషబ్ పంత్ సెంచరీ బాదిన సందర్భాల్లో టీమిండియా గెలిచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇదే విషయం టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది. పంత్ తన టెస్ట్ కెరీర్లో మొత్తం 5 సెంచరీలు బాదగా.. అందులో నాలుగు విదేశీ పిచ్లపై సాధించినవే ఉన్నాయి. ఈ నాలుగింటిలో పంత్ సిడ్నీలో సెంచరీ చేసిన మ్యాచ్ డ్రా కాగా.. మిగతా రెండు మ్యాచ్ల్లో (ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్ను మినహాయించి) టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాకు మరో ఓటమి తప్పదని భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. పంత్ సెంచరీల వివరాలు.. 1. 2018 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 114- టీమిండియా ఓటమి 2. 2019 ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా (నాలుగో టెస్ట్) పంత్ 159 నాటౌట్- మ్యాచ్ డ్రా 3. 2021 ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా (నాలుగో టెస్ట్) పంత్ 101- ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో టీమిండియా విజయం 4. 2022 ఇండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా (మూడో టెస్ట్) పంత్ 100 నాటౌట్- టీమిండియా ఓటమి 5. 2022 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 146, 57- ? ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. -
టీమిండియాతో ఐదో టెస్ట్: జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్ పేసర్ రీ ఎంట్రీ
England Squad For Test VS India: టీమిండియాతో రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్ట్కు ఇంగ్లండ్ తుది జట్టు ఖరారైంది. ఒక్క మార్పు మినహా తాజాగా న్యూజిలాండ్పై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రంగంలోకి దించుతుంది. జేమీ ఓవర్టన్ స్థానంలో వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. Our XI for the fifth LV= Insurance Test with @BCCI 🏏 More here: https://t.co/uXHG3iOVCA 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/xZlULGsNiB — England Cricket (@englandcricket) June 30, 2022 ఓపెనర్లుగా అలెక్స్ లీస్, జాక్ క్రాలే.. వన్డౌన్లో ఓలీ పోప్.. జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ వరుసగా 4, 5, 6 స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. మూడో టెస్ట్ సందర్భంగా కరోనా బారిన పడిన బెన్ ఫోక్స్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ వికెట్కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పేసర్లుగా మ్యాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, ఆండర్సన్.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా జాక్ లీచ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్పై సందిగ్ధత కొనసాగుతుంది. కరోనా బారిన పడిన కెప్టెన్ రోహిత్ శర్మ హెల్త్పై ఇంతవరకు అధికారిక అప్డేట్ లేదు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ ఎవరనే విషయంపై గందరగోళం నెలకొంది. తుది జట్టు విషయంలో టీమిండియా గోప్యత పాటిస్తుంది. కాగా, కరోనా కారణంగా గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన చివరి టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఇంగ్లండ్తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ -
ఇంగ్లండ్తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న టెస్ట్ మ్యాచ్పై ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ తన అంచనాలను వెల్లడించాడు. న్యూజిలాండ్ను 3-0తో క్లీన్స్వీప్ చేసి జోష్ మీద ఉన్న ఇంగ్లండ్ను ప్రస్తుత పరిస్థితుల్లో ఆపడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ గతేడాదే పూర్తై ఉంటే ఫలితం టీమిండియాకే అనుకూలంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు లోడెడ్ గన్ను తలపిస్తుందని, దానికి ఎదురుపడిన వారు ఎంతటి వారైనా ఫైరవుతారని హెచ్చరించాడు. టీమిండియాకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సేవలు అందుబాటులో లేకపోవడం మరింత మైనస్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మైండ్ సెట్ గతేడాదితో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు స్టోక్స్ టీమ్ ఎదురుదాడినే ప్రధాన అస్త్రంగా వినియోగిస్తుందని తెలిపాడు. అంతిమంగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టే ఫేవరెట్ అని జోస్యం చెప్పాడు. కాగా, గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి జరుగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో (4 మ్యాచ్లు) ఉండగా సిరీస్ ఫలితంగా తేలకుండా నిలిచిపోయింది. రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే 3-1తో, డ్రా చేసుకున్నా 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం 2-2తో సిరీస్ డ్రా అవుతుంది. చదవండి: రోహిత్ దూరమైతే అతడిని కెప్టెన్గా నియమించవద్దు: పాక్ మాజీ కెప్టెన్ -
కరోనా కారణంగా రద్దైన 'ఆ' టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
India Vs England 5th Test To Be Held In July 2022: ఐపీఎల్-2021 రెండో దశకు ముందు ఇంగ్లండ్ పర్యటనలో రద్దైన ఐదో టెస్ట్(మాంచెస్టర్) మ్యాచ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు క్లారిటీ ఇచ్చాయి. భారత శిబిరంలో కరోనా కేసు వెలుగు చూడడంతో రద్దైన ఆ మ్యాచ్ను వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించాయి. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్లో పర్యటించనుండగా.. అందులో భాగంగా జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్బాస్టన్ వేదికగా రద్దైన టెస్ట్ జరుగుతుందని ఇరు దేశాల బోర్డులు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య 3 టీ20లు (జులై 7, 9, 10), 3 వన్డేలు(జులై 12, 14, 17) జరగనున్నాయి. కాగా, భారత్- ఇంగ్లండ్ల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ 10న జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్.. టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కు కరోనా నిర్దారణ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే.. -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు
దుబాయ్: ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్పై టీమిండయా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2-1తేడాతో టీమిండియా సిరీస్ గెలిచిందని వివాదాస్పద స్టేట్మెంట్ చేశాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన రసవత్తర సిరీస్లో టీమిండియానే అసలైన విజేత అని పేర్కొని వివాదానికి తెరలేపాడు. తుది ఫలితం వెలువడకుండానే టీమిండియాను విజేతగా పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ), బీసీసీఐ, ఐసీసీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయంపై రోహిత్ ఎలా ప్రకటన చేస్తాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, 5 టెస్ట్ల సిరీస్లో భాగంగా జరగాల్సిన ఆఖరి మ్యాచ్ కరోనా కారణంగా అర్ధాంతరంగా రద్దైన సంగతి తెలిసిందే. చివరి టెస్ట్కు కొద్ది గంటల ముందు భారత బృందంలో కరోనా కేసు బయటపడడంతో టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు నిరాకరించారు. నాలుగు టెస్ట్లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 లీడ్లో ఉంది. రద్దైన ఆఖరి టెస్ట్ను వచ్చే ఏడాది టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలో షెడ్యూల్ చేసేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సూచనప్రాయంగా అంగీకారం తెలిపాయి. అయితే, ఆ మ్యాచ్ స్టాండ్ అలోన్ టెస్ట్గా జరుగుతుందా లేక 5టెస్ట్ల సిరీస్లో భాగంగా జరుగుతుందా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సంచలన స్టేట్మెంట్ చేయడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో సిరీస్లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. 4 మ్యాచ్ల్లో 52.57 సగటుతో 368 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: వార్నర్ను పక్కకు పెట్టడానికి క్రికెటేతర కారణాలు ఉన్నాయి..! -
రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?
ముంబై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే, రీ షెడ్యూల్ అయ్యే ఆ మ్యాచ్తో ఈ సిరీస్కు సంబంధం ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నోరుమెదపలేదు. రీ షెడ్యూల్ మ్యాచ్ 5 టెస్ట్ల సిరీస్లో భాగంగానే జరగాలని ఈసీబీ పట్టుబడుతుంటే.. బీసీసీఐ మాత్రం అది స్టాండ్ అలోన్ మ్యాచ్(సెపరేట్ మ్యాచ్) అవుతుందని సూచన ప్రాయంగా పేర్కొంది. 4 టెస్ట్లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సిరీస్ ఫలితం ఎటూ తేలలేదు. ఈ విషయమై ఐసీసీ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్లకు వైరస్ సోకింది. అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్లో ఆడలేమంటూ చేతులెత్తేసింది. చదవండి: అతన్ని వదులుకోవడం కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం.. -
ఐదో టెస్టు భవితవ్యం మీరే తేల్చండి
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం ఐసీసీ వరకు చేరింది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), బీసీసీఐల మధ్య ఈ టెస్టుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో సిరీస్ విజేతను నిర్ణయించే మాంచెస్టర్ టెస్టుపై తుది నిర్ణయం మీరే తీసుకోవాలంటూ ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్సీ)కి ఈసీబీ లేఖ రాసింది. తమ జట్టు ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా బారిన పడటంతో ఐదో టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందు ఆడలేమంటూ టీమిండియా తప్పుకుంది. అయితే ఈ విషయం లో ఈసీబీ వాదన మరోలా ఉంది. భారత ఆటగాళ్లకు చేసిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్గా రిపోర్టులు వచ్చినా టెస్టులో ఆడటానికి వారు ఇష్టపడలేదని, అది వారి తప్పు కాబట్టి టెస్టులో టీమిండియా ఓడినట్లు అంగీకరించాలని పట్టుబడుతోంది. ఐసీసీ కూడా ఇదే తీర్పు ఇవ్వాలని కోరుకుంటుంది. -
సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్ రద్దుపై ఆండర్సన్ భావోద్వేగం
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్ కరోనా కారణంగా అర్దంతరంగా రద్దైన నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ స్పందించాడు. ఈ వేసవి అంతర్జాతీయ క్రికెట్ ఇలా ముగియడం నిజంగా సిగ్గుచేటని, సీజన్ ఆఖరి మ్యాచ్ను ఆస్వాదించాలని భావించిన అభిమానులు తమను క్షమించాలని తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. సిరీస్ డిసైడర్ అయిన మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకున్న అభిమానులు తమను మన్నించాలని, మిస్ అయిన మ్యాచ్ రీషెడ్యూల్ అవ్వాలని అశిద్దామని భావేద్వేగపూరిత మెసేజ్ను పోస్ట్ చేశాడు. తన హెంగ్రౌండ్(ఓల్డ్ట్రాఫర్డ్)లో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని ఈ 39 ఏళ్ల లాంకషైర్ క్రికెటర్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by James Anderson (@jimmya9) ఇదిలా ఉంటే, ఇదు టెస్ట్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. పాక్షికంగా రద్దైన ఐదో మ్యాచ్పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం తేలాల్సి ఉంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రా కాగా, రెండో మ్యాచ్ భారత్, మూడో టెస్ట్ ఇంగ్లండ్, నాలుగో మ్యాచ్ టీమిండియా గెలిచాయి. 4 మ్యాచ్ల్లో 24.67 సగటుతో 15 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్ ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో ఓసారి 5 వికెట్ల ప్రదర్శన మరోసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ జాబితాలో 21 వికెట్లతో ఓలీ రాబిన్సన్ అగ్రస్థానంలో ఉండగా, 18 వికెట్లతో టీమిండియా పేసర్ బుమ్రా రెండో ప్లేస్లో నిలిచాడు. చదవండి: అదే జరిగితే ఇంగ్లండ్తో సిరీస్ సమం అయినట్టే.. -
నా వల్లే కోవిడ్ వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోను.. ఆఖరి టెస్ట్ రద్దుపై రవిశాస్త్రి
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్ కరోనా కారణంగా అర్దంతరంగా రద్దైన విషయం తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర ఆటగాళ్లు ఓ బుక్ లాంచ్ ఈవెంట్కు వెళ్లడమే. వీరు బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల అనుమతి తీసుకోకుండా ఆ ఈవెంట్కు వెళ్లడంతో తొలుత రవిశాస్త్రి, ఆతర్వాత వరుసగా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్లు కరోనా బారిన పడ్డారు. ఐదో టెస్ట్కు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్కు సైతం కరోనా నిర్ధారణ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఈ పరిస్థితి రావడానికి హెడ్ కోచ్ రవిశాస్త్రినే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన తొలిసారి స్పందించాడు. తాజాగా ఆయన ఓ ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడుతూ.. యూకే మొత్తం బార్లా తెరిచుండగా నా వల్లే కోవిడ్ వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనని తనను విమర్శించే వారిపై ఎదురుదాడికి దిగాడు. ఆంక్షలు పూర్తిగా సడలించారు.. ప్రజలంతా స్వేచ్చగా తిరుగుతున్నారు. జరిగేది ఉంటే తొలి టెస్ట్ నుంచే ఏదైనా జరిగి ఉండవచ్చుంటూ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం టీమిండియా ఇంగ్లండ్పై దాదాపు గెలిచినంత పనిచేసిందన్నాడు. గతంలో ఇదే పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటనలో కూడా భారత జట్టు అద్భుతంగా రాణించిందని కొనియాడాడు. కోవిడ్ సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో ఏ ఇతర జట్టు కూడా టీమిండియాలా ఆడలేదని ఆకాశానికెత్తాడు. చదవండి: కోవిడ్ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్ కోసమే..! -
అదే జరిగితే ఇంగ్లండ్తో సిరీస్ సమం అయినట్టే..
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దైన నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఆశ్రయించింది. సందిగ్ధత నెలకొన్న ఈ విషయంలో ఎదో ఒక పరిష్కారం చూపాలని ఐసీసీని కోరింది. మ్యాచ్తో పాటు సిరీస్ ఫలితంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్ రిసొల్యూషన్ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. కరోనా కేసుల వల్ల మ్యాచ్ రద్దైందని ప్రకటిస్తే.. తమకు 40 మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వీలుంటుందని ఇంగ్లీష్ బోర్డు పేర్కొంది. కాగా, ఈ విషయమై పరిష్కారం చూపేందుకు ఐసీసీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ ఐదో టెస్ట్ను పూర్తిగా రద్దు(రీషెడ్యూల్ చేయకుండా) చేస్తే.. భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్ట్ల సిరీస్గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదనకు ఈసీబీ ఒప్పుకోకపోవచ్చు. రెండోది.. టీమిండియానే ఈ మ్యాచ్ ఆడటానికి విముఖత చూపినందున ఇంగ్లండ్కు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. మ్యాచ్ ఆడటానికి ఇంగ్లండ్ జట్టు సిద్ధంగా ఉన్నా.. కరోనా కారణంగా భారత్ ఒప్పుకోలేదు కాబట్టి ఫలితాన్ని ఇంగ్లండ్కు అనుకూలంగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే 2-2తో సిరీస్ సమం అవుతుంది. అప్పుడు ఇంగ్లండ్ బోర్డు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లకు కూడా వైరస్ సోకింది. అనంతరం టీమ్ ఫిజియో నితిన్ పటేల్కు, ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్లకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్గా తేలింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్లో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది. రీషెడ్యూల్ కోసం రంగంలోకి గంగూలీ.. ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో ఈసీబీకి సుమారు 40 మిలియన్ పౌండ్ల నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఈసీబీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో ఇంగ్లండ్కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 22న లేదా 23న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈలోపు ఐసీసీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాదా పర్యటన రద్దయ్యే అవకాశం ఉంది. చదవండి: కోవిడ్ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్ కోసమే..! -
కోవిడ్ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్ కోసమే..!
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన చివరి టెస్ట్ కోవిడ్ కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ రద్దుకు మొగ్గుచూపిందంటూ ఇంగ్లీష్ మీడియా విషప్రచారం చేస్తోంది. దీనికి ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా తోడై టీమిండియా, బీసీసీఐలపై బురదజల్లుతున్నారు. కరోనా బూచిని చూపించి టీమిండియా డ్రామాలాడిందని, ఈ తతంగమంతా ఐపీఎల్ కోసమేనని రకరకాలు కథనాలు ప్రచారం చేస్తుంది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో రెండుసార్లు నెగిటివ్ వచ్చినా కోహ్లి సేన మ్యాచ్ ఆడేందుకు ససేమిరా అనడం, ఆపై మాంచెస్టర్ వీధుల్లో చక్కర్లు కొట్టడం, ఆ వెంటనే ఐపీఎల్ కోసం ప్రత్యేక విమానాల్లో దుబాయ్కు బయల్దేరడంపై ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కస్సుబుస్సులాడుతున్నాడు. కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్లో ఒక్క మ్యాచ్కు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్లంటేనే ముఖ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్ టెస్ట్ 'నెగెటివ్' రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన కోహ్లి అండ్ కో అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్ట్ ఆడితే ఏమయ్యేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ టెస్ట్ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు 'డబ్బు' గెలిచిందని ఘాటుగా విమర్శించారు. టీమిండియా ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోనన్న భయం కంటే ఐపీఎల్కు దూరమవుతామనే ఆందోళన ఎక్కువైందని, అందువల్లే మాంచెస్టర్ టెస్ట్ రద్దయిందని నోరుపారేసుకున్నాడు. మరోవైపు వాన్.. టీమిండియా ఆటగాళ్లపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం ఘాటుగానే బదులిచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. ఆ సమయంలో టెస్ట్ సిరీస్ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్' లీగ్ కోసం రెండు, మూడో టెస్ట్ల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్ను విమర్శించడంలో అర్థం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు చేసిందేంటని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు లేకున్నా.. ఎందుకు ఆ సిరీస్ బాయ్కట్ చేసిందని నిలదీశాడు. చదవండి: ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులు..! -
ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులు..!
IND VS ENG 5th Test Cancellation: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్ రద్దైన నేపథ్యంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారని తెలుస్తోంది. తమ జట్టు సిరీస్ను డ్రా చేసుకునే అవకాశముండటంతో టీమిండియా సభ్యులు కరోనా బూచి చూపించి కావాలనే బరిలోకి దిగేందుకు నిరాకరించారని వారు ఆరోపిస్తున్నారు. కొత్త కరోనా కేసులు నమోదవుతాయని భయపడిన టీమిండియా క్రికెటర్లు మాంచెస్టర్ వీధుల్లో తిరగడమేంటని నిలదీస్తున్నారు. ఇంతటితో ఆగని ఇంగ్లీష్ క్రికెటర్లు ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ మ్యాచ్లను బహిష్కరిస్తామని హెచ్చరించారని తెలుస్తోంది. ఈ విషయమై(ఐపీఎల్ బహిష్కరణ) జానీ బెయిర్స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు బ్రిటిష్ మీడియా కథనాలు సైతం ప్రచారం చేస్తోంది. ఐపీఎల్లో పాల్గొంటున్న ఐదుగురు క్రికెటర్లలో ఒకరు ఇంగ్లండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టారని సమాచారం. ఇదిలా ఉంటే, భారత బృందంలో కరోనా కేసు వెలుగు చూడటంతో మ్యాచ్కు మూడు గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. భారత కోచింగ్ సిబ్బంది వరుసగా వైరస్ బారిన పడడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సుదీర్ఘ చర్చల అనంతరం ఈసీబీ రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సొంతగడ్డపై సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని ఇంగ్లీష్ ప్లేయర్లు కడుపు మంటతో ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగారని సమాచారం. చదవండి: ఆ మూడు ఐపీఎల్ జట్లకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం -
2008లో ఇంగ్లండ్ ఏం చేసిందో మరవొద్దు.. ఉగ్రదాడి జరిగినా..!
IND VS ENG 5th Test Reschedule: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ ప్రతిపాదనను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాడు. 2008లో ముంబై దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్ 26) కటక్లో భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండింది. దాడుల కారణంగా 7మ్యాచ్ల సిరీస్లోని చివరి రెండు వన్డేలను రద్దయ్యాయి. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. దాడుల నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన 2 మ్యాచ్ల టెస్టు సిరీస్పై సందిగ్ధత నెలకొంది. అయితే టెస్టు సిరీస్ ఆడటానికి ఇంగ్లండ్ జట్టు భారత్కు తిరిగి రావడంతో అప్పట్లో ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. షెడ్యూల్లో ఉన్న ప్రకారం అహ్మదాబాద్, ముంబైలో కాకుండా అహ్మదాబాద్, చెన్నైలలో ఆ రెండు మ్యాచ్లు జరిగాయి. ఈ సిరీస్లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు భారత్ చేతిలో 0-1తో ఓడింది. కాగా, సునీల్ గవాస్కర్ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. 2008లో ఇంగ్లండ్ చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని, ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్ కోసం ఇంగ్లీష్ జట్టు మళ్లీ భారత్కు వచ్చిందని, ఇప్పుడు మనం కూడా అందుకు కృతజ్ఞత చూపాలని కోరాడు. నాడు ఇంగ్లండ్ జట్టు ఉగ్రదాడి తర్వాత కూడా భారత్లో పర్యటించిందంటే.. అది కేవలం నాటి కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చొరవ వల్లేనన్నాడు. చదవండి: ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..? -
ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?
మాంచెస్టర్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దైన విషయం తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అర్ధంతరంగా రద్దైన ఈ మ్యాచ్ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు జై షా వెల్లడించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగం జరుగుతున్న సిరీస్ కాబట్టి ఇరు జట్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, మ్యాచ్ రద్దు ప్రకటన అనంతరం తొలుత టీమిండియా మ్యాచ్ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ (forfeit the match) ప్రకటన విడుదల చేసిన ఈసీబీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. టీమిండియా కరోనా కేసుల భయం కారణంగా జట్టును బరిలోకి దించలేకపోతుందంటూ మార్చేసింది. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్తో ప్రస్తుత సిరీస్కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రీ షెడ్యూల్ అయినా సిరీస్తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్ -
రీ షెడ్యూల్ అయినా సిరీస్తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్
మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్తో ప్రస్తుత సిరీస్కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కు నిన్న కరోనా నిర్దారణ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేటి మ్యాచ్ బరిలోకి దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఈసీబీ మరో విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరోనా కేసుల కారణంగా టీమిండియా మ్యాచ్ను వదులుకోవడానికి(forfeit the match) సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసింది. ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్లో ఉంచింది. చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. మాట మార్చిన ఈసీబీ -
'టీమిండియా ఓడిపోయింది'.. వెంటనే మాట మార్చిన ఈసీబీ
మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైంది. మ్యాచ్కు ముందు రోజు భారత శిబిరంలో కరోనా కేసు వెలుగుచూడడం కారణంగా టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు సుముఖంగా లేరని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనలో తొలుత టీమిండియా మ్యాచ్ను వదులుకుంటుందని(forfeit the match) ప్రకటించిన ఈసీబీ.. ఆ వెంటనే మాట మార్చి ఆ పదాన్ని తొలగించి మరో ప్రకటన విడుదల చేసింది. కాగా, జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కు నిన్న కరోనా నిర్దారణ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేటి మ్యాచ్ బరిలోకి దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఈసీబీ మరో విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరోనా కేసులు అధికమవుతాయన్న కారణంగా టీమిండియా మ్యాచ్ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్లో ఉంచింది. అంతకుముందు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్లు మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, సిరీస్ ఫలితంపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ అంశం ప్రస్తుతం ఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్ తెలిపారు. చదవండి: టీమిండియా ఫిజియోకు కరోనా.. ఆఖరి టెస్ట్ అనుమానమే..? -
టీమిండియా ఫిజియోకు కరోనా.. ఆఖరి టెస్ట్ అనుమానమే..?
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టుకు జూనియర్ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్ పర్మార్ ఇవాళ(గురువారం) కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆఖరి టెస్ట్ సాధ్యాసాధ్యాలపై అనుమానులు నెలకొన్నాయి. రేపటి మ్యాచ్ జరుగుతుందో లేదోనని స్వయానా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే సందేహం వ్యక్తం చేయడంతో మ్యాచ్ నిర్వహణ దాదాపుగా అసాధ్యమేనని తెలుస్తోంది. యోగేశ్ పర్మార్కు కరోనా నిర్దారణ అయ్యాక భారత బృందం మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు రాత్రికి ఆర్టీ-పీసీఆర్ ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాలపైనే ఆఖరి మ్యాచ్ నిర్వహణ ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు ఆటగాళ్లు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని సూచించారు. కాగా, తన పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం తొలుత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఆతర్వాత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చదవండి: టాప్-10లోకి బుమ్రా.. దూసుకొస్తున్న శార్దూల్ -
టీమిండియాలో మరోసారి కరోనా కలకలం..
లండన్: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్ట్(సెప్టెంబర్ 10)కు ముందు భారత శిబిరంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. జట్టుతో పాటు ఉన్న సహాయక సిబ్బందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేస్తున్నట్లు టీమిండియా యాజమాన్యం ప్రకటించింది. అలాగే జట్టు సభ్యులందరికీ మరోసారి కోవిడ్ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఆతర్వాత కొద్ది రోజులకు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లు కూడా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. చదవండి: అతని గాయమే అశ్విన్కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్ -
షమీ, పుజారా ఫిట్.. రోహిత్ శర్మ డౌట్..!
మాంచెస్టర్: ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్కు ముందు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. నాలుగో టెస్ట్ సందర్భంగా రోహిత్ 353 నిమిషాల పాటు క్రీజ్లో గడపడం వల్ల అతని తొడలు ఎర్రగా కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడం వల్ల రోహిత్ రెండు తొడలకు గాయాలయ్యాయి. ఇదే మ్యాచ్లో రోహిత్ మోకాలి గాయం కూడా తిరగబెట్టింది. దీంతో ఆఖరి టెస్ట్ సమయానికి రోహిత్ ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ గాయాల తీవ్రతపై బీసీసీఐ సైతం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం రోహిత్ గాయాన్ని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ గాయం తీవ్రమైతే అతని స్థానంలో పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్లలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, గాయంతో నాలుగో టెస్ట్కు దూరమైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతనితో పాటు నాలుగో టెస్ట్లో చీలమండ గాయానికి గురైన పుజారా సైతం పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుధవారం టీమిండియా సాధనలోనూ షమీ పాల్గొన్నాడు. దీంతో శుక్రవారం ప్రారంభమయ్యే అయిదో టెస్ట్కు షమీ, పుజారా అందుబాటులో ఉండనున్నాడు. గత మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేని సిరాజ్ స్థానంలో షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గత కొన్ని ఇన్నింగ్స్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న రహానేపై వేటు తప్పేలా లేదు. ఇదే జరిగితే అతని స్థానంలో సూర్యకుమార్ టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయం. కాగా, ఐదు టెస్ట్ల సిరీస్లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో నిలిచిన కోహ్లీ సేన సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. ఆఖరి టెస్ట్లో గెలిచినా.. డ్రా చేసుకున్న సిరీస్ భారత్ కైవసం చేసుకోనుంది. 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. చదవండి: ఇంగ్లండ్లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే -
ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. బట్లర్, లీచ్ రీ ఎంట్రీ
లండన్: టీమిండియాతో ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాల చేత ఓవల్ టెస్ట్కు దూరమైన వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ తిరిగి జట్టులోకి రాగా, సామ్ బిల్లింగ్స్పై వేటు పడింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగనున్న చివరి టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టులో రెండు మార్పులు జరిగే ఆస్కారం ఉంది. జానీ బెయిర్స్టో, మొయిన్ అలీ స్థానాల్లో జోస్ బట్లర్, జాక్ లీచ్ ఫైనల్ ఎలెవెన్లో ఆడే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియా సైతం ఓ మార్పు చేసేలా కనిపిస్తుంది. వరుసగా విఫలమవుతున్న జడేజా స్థానంలో అశ్విన్ను ఆడించాలని కోహ్లి భావిస్తునట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ 157 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితంగా 5 టెస్ట్ల సిరీస్లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్) మెయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: టీమిండియా టెస్ట్ల్లో గొప్పే కావచ్చు.. వైట్ బాల్ క్రికెట్లో కాదు -
తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లండ్
లండన్: కొంత ప్రతిఘటన ఎదుర్కొన్నా సిరీస్ ట్రోఫీని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా... ఇప్పుడు యాషెస్ను పూర్తి ఆధిక్యంతో కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇదే సమయంలో గురువారం నుంచి ఆరంభమయ్యే చివరిదైన ఐదో టెస్టు ఇంగ్లండ్కు ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం 1–2తో వెనుకబడి ఉన్న ఆతిథ్య జట్టు ఆఖరి మ్యాచ్లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. జోరు మీదున్న కంగారూలను ముఖ్యంగా మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్ను నిలువరిస్తేనే ఇంగ్లండ్ కోరిక నెరవేరే వీలుంది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జేసన్ రాయ్పై వేటు వేసి ఆల్రౌండర్ స్యామ్ కరన్కు చోటిచి్చంది. ఓవర్టన్ను తప్పించి క్రిస్ వోక్స్ను తీసుకుంది. ఆసీస్ సైతం బ్యాట్స్మన్ ట్రావిస్ హెడ్ను పక్కనపెట్టి ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను ఆడించనుంది. ఎడంచేతి వాటం పేసర్ స్టార్క్ స్థానంలో సిడిల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టులోనూ విజయం సాధిస్తే 2001 తర్వాత ఆ్రస్టేలియా... ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ను గెలిచినట్లవుతుంది. స్మిత్ వీరగాథ; వార్నర్, రూట్ వైఫల్యాల బాధ పరుగులు 671... సగటు 134.20... ఐదు ఇన్నింగ్స్ల్లో స్మిత్ ప్రదర్శన ఇది. ఇదే ఊపులో అతడు టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి సైతం ఎగబాకాడు. సిరీస్లో రెండు జట్ల మధ్య ప్రధాన తేడా స్మిత్ అని దీంతోనే తెలిసిపోతోంది. తోడుగా లబషేన్, అడపాదడపా వేడ్, కెపె్టన్ పైన్, లోయరార్డర్ రాణిస్తుండటంతో ఆసీస్ గట్టెక్కుతోంది. ఓపెనర్ వార్నర్ (మొత్తం 79 పరుగులు) అధ్వాన ఫామ్ నుంచి బయటపడితే వారి బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. సిరీస్లో ఉమ్మడిగా 42 వికెట్లు పడగొట్టిన కమిన్స్–హాజల్వుడ్ పేస్ ద్వయాన్ని ఎదుర్కొనాలంటే ఇంగ్లండ్ బ్యాట్స్మెన్కు శక్తికి మించి పోరాడక తప్పేలా లేదు. జట్టుకు మూలస్తంభమైన కెప్టెన్ రూట్ పరుగులు సాధిస్తే మిగతావారిలోనూ ఆత్మవిశ్వాసం వస్తుంది. అయితే, అతడే ఫామ్ వెదుకులాటలో ఉండటం ఇంగ్లండ్ను దెబ్బతీస్తోంది. గాయంతో బాధపడుతున్న స్టోక్స్ బ్యాటింగ్కే పరిమితం కానున్నాడు. కరన్ రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్ చేరిక జట్టు రాతను మార్చే వీలుంది. పేసర్లు బ్రాడ్, ఆర్చర్ మరింత పకడ్బందీగా బంతులేసి... బ్యాటింగ్లో బట్లర్, బెయిర్స్టో విలువైన ఇన్నింగ్స్ ఆడితేనే ఇంగ్లండ్కు గెలుపు అవకాశాలుంటాయి. లేదంటే ఐదేళ్ల తర్వాత స్వదేశంలో ప్రత్యర్థి జట్టుకు సిరీస్కు కోల్పోతుంది. 2014లో ఆ జట్టు శ్రీలంక చేతిలో 1–0తో పరాజయం పాలైంది. -
రాహుల్ వీరోచితం పోరాటం.. భారత్ నిలిచేనా?
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు భారత్ తీవ్రంగా పోరాడుతోంది. 464 పరుగుల భారీ లక్ష్యంతో చివరి రోజు బరిలోకి దిగిన భారత్.. లంచ్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (116, 136 బంతుల్లో 17 పోర్లు, 1 సిక్సు)తో వీరోచితంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కళ్లుచెదిరే షాట్లతో అలరించిన రాహుల్ ఈ సీరిస్లో తొలి శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్తో పాటు, రిషబ్ పంత్ (18) క్రీజ్లో ఉన్నాడు. మొదటి ఇన్సింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించిన విహారి రెండో ఇన్సింగ్స్లో డకౌట్గా వెనుదిరిగి తీవ్రంగా నిరిశపరిచాడు. రహానే 37 పరుగులుతో కొంతసేపు రాహుల్కు అండగా నిలిచాడు. భారత్ ఇంకా 285 పరుగులు వెనుకబడి ఉంది. ఈ తరుణంలో చివరి టెస్ట్ను కనీసం డ్రాతో ముగించాలని టీమిండియా పోరాడుతోంది. ప్రధాన బ్యాట్సమెన్ అందరూ అవుట్ కావడంతో టెయిలెండర్లు ఎంత మేరకు నిలుస్తారో వేచి చూడాలి. -
కుమ్మెసిన కుక్.. భారత్ ముందు భారీ టార్గెట్
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో ఇంగ్లండ్ రెండో ఇన్సింగ్స్లో 423 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు 464 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించింది. 114/2 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి నుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కుక్ తన చివరి ఇన్సింగ్స్ లో 147 పరుగులతో వీరోచిత సెంచరీతో చెలరేగాడు. మరో ఆటగాడు జో రూట్ తనదైన శైలిలో రెచ్చిపోయి 125 పరుగులు సాధించాడు. క్రీజ్లో పాతుకుపోయిన వీరిద్దరిని ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి వరుస బంతుల్లో అవుడ్ చేశాడు. చివర్లో బేయిర్స్టో 37 పరుగులతో రాణించాడు. దీంతో రెండో ఇన్సింగ్స్లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లు నష్టానికి 423 పరుగుల సాధించి డిక్లేర్ చేసింది. మొదటి ఇన్సింగ్స్లోని 40 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 464 పరుగుల భారీ టార్గెట్ను ఉంచింది. భారత బౌలర్లలో విహారి, జడేజా మూడేసి వికెట్లతో రాణించారు. రేపు చివరి రోజు కావడంతో భారమంతా బ్యాట్స్మెన్పైనే ఉంది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కుని రేపంతా నిలడబితే టెస్ట్ను డ్రాగా ముగించే అవకాశం ఉంటుంది. -
చివరి టెస్ట్: జడేజా ఒంటరి పోరాటం
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ 292 పరుగులుకు ఆలౌట్ అయ్యింది. ఆల్రౌండర్ జడేజా 86 పరుగులతో చివరి వరకూ పోరాడి నాటౌట్గా నిలిచాడు. 176 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్ను విహారి, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అరంగేట్ర మ్యాచ్లోనే తెలుగు కుర్రాడు హనుమ విహారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోర్ 237 వద్ద హనుమ విహారి (56)ని మెయిన్ అలీ ఔట్ చేశాడు. దీంతో భారత్ మరో ఇరవై పరుగుల లోపు ఆలౌట్ అవుతుందని భావించారు. కానీ జడేజా ఒంటరి పోరాటంతో భారత్ 292 పరుగులు చేయగలిగింది. ఇషాంత్ శర్మ (4) కొద్ది సేపు క్రీజ్లో జడేజాకు అండగా నిలిచాడు. ఆ తరువాత వచ్చిన షమి వెంటనే ఔటైనా.. చివరి వికెట్గా వచ్చిన బూమ్రా సహాయంతో జడేజా పోరాడాడు. చివరి వికెట్గా బూమ్రా రనౌట్ కావడంతో భారత్ ఇన్సింగ్స్ ముగిసింది. చివరి వికెట్కు 32 పరుగుల భాగస్వామ్యం నమోదవ్వడం విశేషం. దీంతో ఇంగ్లండ్కు మొదటి ఇన్సింగ్స్లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్, మోయిన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కగా.. బ్రాడ్, కరణ్, రషీద్లు తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఇంగ్లండ్పై ఘన విజయం సాధించిన భారత్
-
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
కెప్టెన్గా కొనసాగబోనంటూ సంకేతాలు తమ బౌలర్ల కన్నా అశ్విన్, జడేజా బాగా ఆడారని కితాబు టెస్టు సిరీస్లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం ఎదురుకావడంతో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒకింత నిర్వేదంగా స్పందించాడు. ఈ ఘోర ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో 88 ఓవర్లలో కేవలం 207 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో 400కుపైగా పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లోనూ 103 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడింది. కానీ రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్తో 48 పరుగులకు ఏడు వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లండ్ సైకిల్ స్టాండ్లా కుప్పకూలింది. భారత పర్యటనలో ఇంగ్లండ్కు ఇది వరుసగా రెండో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి. ఈ ఓటమితో కంగుతిన్న కెప్టెన్ కుక్.. తాను ఇంటికి వెళ్లి కొంత సమయం తీసుకొని కెప్టెన్గా కొనసాగేది లేనిది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. అదే సమయంలో భారత బౌలర్లు అశ్విన్, జడేజాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్ బౌలర్ల కన్నా వారు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. అయితే, తమ జట్టు బౌలర్లు మొయిన్, ఆదిల్, జఫర్లను కించపరిచే ఉద్దేశం తన వ్యాఖ్యల వెనుక లేదని వివరణ ఇచ్చాడు. -
స్వీట్ రివెంజ్పై కోహ్లి ఉక్కిరిబిక్కిరి!
భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టును చిత్తుచేసి.. టెస్టు సిరీస్ను 4-0 తేడాతో చేజిక్కించుకోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. జట్టు నుంచి తాను ఇంతకుమించి ఏమీ కోరలేదని, ఇంతకన్నా అపూర్వం మరొకటి ఉండదని సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ను ఓడించడం ద్వారా భారత్ టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. అయినా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో అసాధారణరీతిలో ఆడి.. ఇంగ్లిష్ జట్టును చిత్తుగా మట్టికరిపించింది. ఐదు టెస్టుల సిరీస్ను 4-0తో సొంతం చేసుకోవడం ద్వారా ఇంగ్లిష్ జట్టుపై భారత్ స్వీట్ రివెంజ్ తీర్చుకున్నట్టు అయింది. ఇప్పటివరకు ఇంగ్లండ్తో జరిగిన మూడు వరుస సిరీస్లలో భారత్కు పరాభవమే మిగిలింది. 2011, 2012, 2014లలో జరిగిన టెస్టుసిరీస్లలో ఆ జట్టుదే గెలుపు. ఈ నేపథ్యంలో భారత్కు లభించిన ఈ మధురవిజయంపై కెప్టెన్ కోహ్లి హర్షం వ్యక్తంచేశాడు. 'ఇంతకుమించి నేనేమీ అడిగి ఉండను. నిజానికి 3-0తో సిరీస్ను గెలుచుకున్నప్పటికీ ఈ స్థాయిలో విజయం సాధించడమంటే మాటలు కాదు. ఇది జట్టు వ్యక్తిత్వానికి నిబద్ధతకు నిదర్శనం. దేశం కోసం ఆడేందుకు ఆటగాళ్లు ఎంతగా సన్నద్ధమయ్యోరో ఇది చాటుతోంది' అని మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ కార్యక్రమంలో కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. మొదటి రెండు టెస్టుల్లో అంతగా ఆడకపోయినా ఈ టెస్టులో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించారని కోహ్లి కితాబిచ్చారు. టాస్ ఓడిపోయి.. మొదటి ఇన్నింగ్స్లో ప్రత్యర్థి జట్టుకు భారీ పరుగులు సమర్పించుకున్నా.. తిరిగి ఎదురుదాడితో ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం అసాధారణమని కోహ్లి ప్రశంసల జల్లు కురిపించారు. ఐదో టెస్టులో మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు 477 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బరిలోకి వచ్చిన టీమిండియా కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ, కేఎల్ రాహుల్ 199 పరుగులతో రాణించడంతో అద్భుతమైనరీతిలో 759 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లిష్ టీమ్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
విరాట్ సేన సంచలన విజయం
-
విరాట్ సేన సంచలన విజయం
-
విరాట్ సేన సంచలన విజయం
చెన్నై:భారత్ తో చివరి టెస్టు ఆఖరి రోజు ఆటలో లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 97/0. దాంతో మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అంతా భావించారు. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. లంచ్ తరువాత రెండో సెషన్లో నాలుగు వికెట్లు సాధించి ఆధిక్యంలో నిలిచిన విరాట్ సేన.. మూడో సెషన్లో ఇంగ్లండ్ భరతం పట్టింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా విజృంభించి ఏడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, మిగతా పనిని ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్లు పూర్తి చేశారు. దాంతో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో తమకు తిరుగులేదని నిరూపించింది. తద్వారా సిరీస్ను భారత్ 4-0 గెలుచుకుని ఇంగ్లండ్ కు నిరాశను మిగిల్చింది. ఇంకా ఈ రోజు ఆటలో దాదాపు 7.0 ఓవర్లు ఉండగానే భారత్ సంచలన విజయం సాధించడం ఇక్కడ విశేషం. 12/0 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం ఆఖరి రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ కు మంచి ఆరంభమే లభించింది. కెప్టెన్ అలెస్టర్ కుక్(49), జెన్నింగ్స్(54)లు బాధ్యతాయుతంగా ఆడారు. ప్రధానంగా ఈ ఇద్దరూ తొలి సెషన్లో వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. తొలి వికెట్ కు 103 పరుగులు జోడించి సమయోచిత ఆట తీరు ప్రదర్శించారు. కాగా, రెండో సెషన్ లో ఇంగ్లండ్ పతనం ఆరంభమైంది. కుక్ ను తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపిన జడేజా.. ఆపై స్వల్ప వ్యవధిలో జెన్నింగ్స్ ను అవుట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత 19 పరుగుల వ్యవధిలో రూట్ ను జడేజా అవుట్ చేయగా, బెయిర్ స్టోలను ఇషాంత్ శర్మ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మొయిన్ అలీ(44), బెన్ స్టోక్స్(23)లు పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 63 పరుగులను జోడించడంతో ఇంగ్లండ్ తిరిగి గాడిలో పడినట్లు కనబడింది. కాగా, 192 పరుగుల వద్ద అలీని జడేజా ఐదో వికెట్ గా అవుట్ చేయడంతో ఇక ఇంగ్లండ్ తేరుకోలేదు. పరుగు వ్యవధిలో స్టోక్స్ ను జడేజా అవుట్ చేసి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. ఆపై కాసేపటికి డాసన్(0)ను అమిత్ మిశ్రా అవుట్ చేయగా, రషిద్(2)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. అయితే జాస్ బట్లర్-స్టువర్ట్ బ్రాడ్లు కాసేపు భారత్ బౌలింగ్ ను ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. తొలుత ఈ జోడిలో బ్రాడ్ ను జడేజా అవుట్ చేయగా, ఆ తరువాత వెంటనే బాల్ కూడా జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. దాంతో భారత్ ఖాతాలో అపూర్వమైన విజయం చేరింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నాయర్ కు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్ కోహ్లికి లభించింది. ఇది భారత్ కు వరుసగా 18 వ టెస్టు విజయం కావడం మరొక విశేషం కాగా, 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 477 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 207 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 759/7 -
జడేజా విజృంభణ
చెన్నై: ఇంగ్లండ్ తో చివరి టెస్టు ఆఖరి రోజు ఆటలో భారత స్సిన్నర్ రవీంద్ర జడేజా దూకుడు కొనసాగిస్తున్నాడు. జడేజా ఐదు వికెట్లు సాధించి ఇంగ్లండ్ టాపార్డర్ను కకావికలం చేశాడు. అలెస్టర్ కుక్ (49), జెన్నింగ్స్(54),రూట్(6), మొయిన్ అలీ(44), స్టోక్స్(23) లను అవుట్ చేశాడు. దాంతో టీ విరామం తరువాత ఇంగ్లండ్ 192 పరుగుల వద్ద ఆరో వికెట్ను నష్టపోయింది. మొయిన్ అలీని ఐదో వికెట్ గా జడేజా అవుట్ చేయగా ఆ తరువాత కొంత సేపటికి స్టోక్స్ ను అవుట్ చేశాడు. అంతకుముందు బెయిర్ స్టో(1)ను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపాడు. ఇంకా సుమారు 20.0 ఓవర్లు పాటు ఆట మిగిలి ఉండటంతో భారత్ విజయంపై ఆశలు పెట్టుకోగా, ఇంగ్లండ్ మాత్రం డ్రా కోసం పోరాడుతోంది. మరో నాలుగు వికెట్లను తీస్తే భారత్ ఖాతాలో సంచలన విజయం చేరుతుంది.12/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్ లో అత్యంత నిలకడగా ఆడింది. ఆ తరువాత రెండో సెషన్ లో నాలుగు కీలక వికెట్లను చేజార్చుకోగా, మూడో సెషన్ ఆదిలోనే రెండు వికెట్లను నష్టపోయింది. ఆ తరువాత ఏడో వికెట్ ను మిశ్రా తీయగా, ఎనిమిదో వికెట్ ను ఉమేష్ యాదవ్ తీశాడు. ఏడో వికెట్ గా డాసన్(0) అవుట్ కాగా, ఎనిమిదో వికెట్ గా రషిద్(2) పెవిలియన్ చేరాడు. -
'వాటి విలువ 500 పరుగులు'
చెన్నై:ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పేలవమైన ఫీల్డింగ్ పట్ల ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొన్ని క్యాచ్లను వదిలేయడంతోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నాడు. తమ ఆటగాళ్ల ఫీల్డింగ్ స్థాయి చాలా కింద వరుసలో ఉందంటూ అసహనం వ్యక్తం చేశాడు. ' మేము మంచి క్రికెటర్లమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే స్లిప్ లో మంచి ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు మా జట్టులో లేరనే చెప్పాలి. మా జట్టులో సహజసిద్ధమైన అథ్లెట్లు ఎవ్వరూ లేరనే నేను అనుకుంటున్నా. ఈ క్రమంలోనే కొన్ని క్యాచ్లను వదిలేశాం. ప్రధానంగా చివరి టెస్టు భారత తొలి ఇన్నింగ్స్ లో మూడు కీలక క్యాచ్లను మా ఆటగాళ్లు వదిలేశారు. వాటి విలువ 500 పరుగులు అనే విషయం మా జట్టు సభ్యులు తెలుసుకుంటే మంచింది. ఏది ఏమైనా ఇక్కడ భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసింది. గత కొంతకాలంగా ఉప ఖండ పిచ్ల్లో ఆడుతున్నా, ఆ రకమైన వాతావరణానికి మా ఆటగాళ్లు పూర్తిగా అలవాటు పడలేదు. దాంతోనే మేము ఆశించిన ఫలితాలు రాలేదు. బంగ్లాదేశ్ పర్యటన మొదలుకొని, భారత టెస్టు సిరీస్లో మా జట్టు పూర్తిగా వైఫల్యం చెందింది. మా పేలవమైన ప్రదర్శనపై తీవ్రస్థాయిలో కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది'అని బేలిస్ పేర్కొన్నాడు. -
1985 తరువాత అశ్విన్
చెన్నై:ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించిన భారత ఆల్ రౌండర్ రవి చంద్రన్ అశ్విన్..ఇంగ్లండ్ తో చివరి టెస్టులో కూడా ఒక అరుదైన ఘనతను నమోదు చేశాడు. అది కూడా 30 ఏళ్ల రికార్డును అశ్విన్ సవరించాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అశ్విన్ 25 కు పైగా వికెట్లను, 250కి పైగా పరుగులను సాధించాడు. ఇలా ఒక సిరీస్లో 25 వికెట్లు, 250 పరుగులు సాధించడం దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఇదే తొలిసారి. 1985లో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ బోథమ్ ఆ ఘనతను సాధించగా, ఆ తరువాత అశ్వినే మొదటి ఆటగాడు. యాషెస్ సిరీస్లో బోధమ్ 31 వికెట్లతో పాటు సుమారు 250 పరుగులను సాధించాడు. కాగా, ఈ సిరీస్లో అశ్విన్ ఇప్పటివరకూ 28వికెట్లు తీయగా, 306 పరుగులను సాధించాడు. గత 40 ఏళ్లకు పైగా కాలం నుంచి చూస్తే ఐదు టెస్టుల సిరీస్లో 26కు పైగా వికెట్లు, 294కు పైగా పరుగులు సాధించడం కూడా ఇదే తొలిసారి. 1966-67 సీజన్లో చివరిసారి దక్షిణాఫ్రికా ఆటగాడు ట్రెవర్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ట్రెవర్ ఈ మార్కును చివరిసారి సాధించాడు. ఐదో టెస్టు టెస్టు భారత తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్(67) హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో అశ్విన్ 70 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 32 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 58 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేయగా, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 72 పరుగులు నమోదు చేశాడు. -
జడేజా అరుదైన ఘనత
చెన్నై:ఇంగ్లండ్ తో చివరిటెస్టులో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చివరిరోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్(49)ను జడేజా అవుట్ చేశాడు. జడేజా సంధించిన ప్రమాదకరమైన బంతిని కుక్ ఆడటంలో విఫలమై లెగ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ 103 పరుగుల వద్ద తొలి వికెట్ ను నష్టపోయింది. అయితే కుక్ వికెట్ ను సాధించే క్రమంలో జడేజా ఒక అరుదైన ఫీట్ ను సాధించాడు. ఈ సిరీస్లో ఆరుసార్లు జడేజా బౌలింగ్ లో కుక్ అవుటయ్యాడు. ఇలా ఒక సిరీస్లో అత్యధికంగా ఒకే బౌలర్ చేతిలో కుక్ అవుట్ కావడం ఇదే తొలిసారి. అయితే ఈ సిరీస్లో జడేజా బౌలింగ్ వేసే క్రమంలో కుక్ యావరేజ్ 12.50 గా నమోదైంది. నాల్గో టెస్టులో రెండు సార్లు జడేజాకు చిక్కిన కుక్.. ఐదో టెస్టులో రెండు సార్లూ జడేజా బౌలింగ్ లోనే అవుటయ్యాడు. అంతకుముందు మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో జడేజా బౌలింగ్ లో కుక్ అవుట్ కాగా, తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో జడేజా బౌలింగ్ లో కుక్ పెవిలియన్ చేరాడు. ఈ రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఉదయం సెషన్లో 19.0 ఓవర్ తరువాత జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఈ తన ప్రయోగంలో కోహ్లి మరోసారి సఫలమయ్యాడు. జడేజా వేసిని 39.0 ఓవర్ నాల్గో బంతికి కుక్ అవుటయ్యాడు. ఆ తరువాత జెన్నింగ్స్(54) ను కూడా జడేజా పెవిలియన్ కు పంపాడు. దాంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. -
డ్రా దిశగా చివరి టెస్టు
చెన్నై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్నచివరి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. 12/0 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లంచ్ సమయానికి 37.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. తొలి సెషన్ ముగిసే నాటికి భారత్ కు వికెట్లు లభించకపోవడంతో మ్యాచ్లో ఫలితం వచ్చే అవకాశాలు కనబడుటం లేదు. అద్భుతం ఏమైనా జరిగితే తప్పా మ్యాచ్లో ఫలితం వచ్చే అవకాశాలు తక్కువ. కేవలం భారత్ కు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉండటంతో దాన్ని అడ్డుకోవడానికి ఇంగ్లండ్ శతవిధాలా ప్రయత్నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ క్రమంలోనే ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 477 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 759/7 వద్ద డిక్లేర్ చేసింది. -
ముప్పైని మూడొందలుగా మార్చాడు!
చెన్నై: కరుణ్ నాయర్... ఆడుతున్న మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్న క్రికెటర్. భారత్ నుంచి కేవలం వీరేంద్ర సెహ్వాగ్కు మాత్రమే సాధ్యమైన ఆ అరుదైన ఘనతను సాధించిన ఆటగాడు. దాంతో పాటు తొలి సెంచరీని డబుల్గా మార్చిన మూడో భారత క్రికెటర్గా, మొదటి శతకాన్ని ట్రిపుల్ గా మార్చిన ప్రపంచ మూడో బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. అయితే ఇక్కడ కరుణ్ నాయర్కు అదృష్టం రెండు విధాల కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ మ్యాచ్కు ముందు నాయర్ స్థానంలో మరో భారత ఆటగాడు మనీష్ పాండే తుది జట్టులో ఆడే అవకాశం ఉందనే వాదన వినిపించింది. అందుకు కారణం అంతకుముందు నాయర్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలం కావడమే. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ టెస్టుల ద్వారా అరంగేట్రం చేసిన నాయర్.. ఆ తరువాత ముంబైలో టెస్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఆ రెండు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడిన నాయర్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నాయర్ స్థానంలో మనీష్ కు అవకాశం కల్పించాలనే అనుకున్నారు. ఇది భారత్ కు నామ మాత్రపు టెస్టే కావడంతో ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తారనే అంతా భావించారు. అయితే ఈ కర్ణాటక కుర్రాడిపై నమ్మకం ఉంచిన అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లిలు మళ్లీ మరొక అవకాశం ఇచ్చి చూశారు. దాన్ని చక్కగా వినియోగించుకున్న నాయర్ ఇప్పుడు రికార్డుల ధీరుడిగా మారిపోయాడు. కాగా, నాయర్ కు మరొక అదృష్టం కలిసొచ్చింది. భారత తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో నాయర్ 34 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 85.0 ఓవర్లో ఇంగ్లిష్ బౌలర్ బాల్ వేసిన బంతికి నాయర్ కాస్త తడబడ్డాడు. కొద్దిగా స్వింగ్ అవుతూ వచ్చిన బంతిని నాయర్ గట్టిగా కొట్టాడు. ఆ క్రమంలోనే బంతి ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కుక్ చేతుల్లోంచి దాటుకుని బౌండరీకి తరలిపోయింది. ఈ క్షణంలో కాస్త అప్రమత్తంగా ఉండి ఉంటే క్యాచ్ ను పట్టుకోవడం కూడా కష్టం కాదనే అనిపించింది. ఒకవేళ కుక్ ఆ క్యాచ్ ను పట్టివుంటే నాయర్ ఇన్నింగ్స్ అప్పుడే ముగిసేది. కాకపోతే క్రికెట్లో క్యాచ్లను వదిలివేయడం సాధారణంగా జరిగే పరిణామమే అయినప్పటికీ నాయర్ కు అదృష్టం ఇలా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆ తరువాత ఎటువంటి అవకాశం ఇవ్వని నాయర్ ట్రిపుల్ తో చెలరేగిపోయాడు. ఆ క్రమంలోనే భారత అభిమానులకు పండుగ చేశాడు. -
టీమిండియా కొత్త చరిత్ర
చెన్నై:ఇంగ్లండ్ తో జరుగుతున్న సుదీర్ఘ టెస్టు సిరీస్లో టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. భారత తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులను రికార్డును సొంతం చేసుకుంది. గత అత్యధిక పరుగుల రికార్డును ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ అధిగమించింది. 2009లో ముంబైలో జరిగిన టెస్టులో శ్రీలంకపై భారత్ 726 పరుగులే భారత్ కు ఇప్పటివరకూ టాప్ స్కోర్. దీన్ని భారత్ తాజాగా అధిగమించింది. కరుణ్ నాయర్ అత్యద్భుతమైన ఆట తీరుతో భారత్ ఆ మార్కును బద్ధలు కొట్టింది.ఇప్పటివరకూ భారత్ నాలుగుసార్లు మాత్రమే ఏడొందల మార్కును చేరింది. గత 12 ఏళ్లలోనే ఏడొందలకు పైగా పరుగులను టీమిండియా నాలుగుసార్లు సాధించడం విశేషం. 2004లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై తొలిసారి ఏడొందల పరుగులకు పైగా చేసిన భారత్.. ఆ తరువాత 2009లో శ్రీలంకపై ముంబైలో, 2010లో శ్రీలంకపై కొలంబోలో ఈ మార్కును భారత్ సాధించింది. ఇదిలా ఉంచితే, ఒక సిరీస్లో టీమిండియా నాలుగుసార్లు టాస్ కోల్పోయిన తరువాత నాలుగొందలకు పైగా పరుగులను సాధించడం నాల్గోసారి.ఇంతవరకూ ఏ జట్టూ ఈ తరహాలో టాస్ కోల్పోయి నాలుగుసార్లు నాలుగొందల మార్కును చేరుకోలేదు. -
టీమిండియా ఆడేసుకుంటుంది..
చెన్నై: ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. నామమాత్రమైన చివరి టెస్టులోనూ ఆడేసుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ సాధించిన భారీ పరుగులకు దీటైన జవాబిస్తూ దూసుకుపోతుంది. సోమవారం నాల్గో రోజు ఆట తొలి సెషన్ లో వికెట్ మాత్రమే కోల్పోయి భారత్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. భారత జట్టు 146.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 512 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కరుణ్ నాయర్ 241 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 150 పరుగులు చేసి భారత జట్టును మరింత పటిష్ట స్థితికి చేర్చాడు. ఆదివారం నాటి ఆటలో కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ ను ఆడుకుంటే, ఈ రోజు ఆటలో కరుణ్ నాయర్ పరీక్షగా నిలిచాడు. ఈ క్రమంలోనే నాయర్ భారీ శతకం సాధించాడు. 391/4 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ అత్యంత నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. మురళీ విజయ్ అవుటైన తరువాత క్రీజ్లోకి వచ్చిన అశ్విన్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. నాయర్-అశ్విన్లు సమయోచితంగా ఆడుతుండటంతో భారత జట్టు ఐదొందల మార్కును చేరింది. దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును భారత్ అధిగమించింది. -
38 ఏళ్ల తరువాత విరాట్ సేన
చెన్నై:విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా అరుదైన ఫీట్ను సాధించింది. ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ్లండ్ తో సిరీస్లో భాగంగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆటగాడు కరుణ్ నాయర్ శతకం నమోదు చేశాడు. తద్వారా ఈ సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు సాధించారు. ఇదే తరహాలో ఒక సిరీస్ లో ఆరుగురు భారత ఆటగాళ్లు వ్యక్తిగత సెంచరీలను నమోదు చేయడం 1978-79 సీజన్ తరువాత ఇదే తొలిసారి. చివరిసారి స్వదేశంలో వెస్టిండీస్పై భారత్ ఆ ఘనత సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను నమోదు చేశారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాల్గోసారి మాత్రమే. ఈ మ్యాచ్లో నాయర్ సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్ కూడా శతకం సాధించాడు. అంతకుముందు మురళీ విజయ్, విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్, పూజారాలు శతకాలు చేసిన వారిలో ఉన్నారు. కాగా, ఈ సిరీస్లో భారత జట్టు ఇప్పటివరకూ ఎనిమిది శతకాలను సాధించడం మరో విశేషం. ఇందులో విరాట్ కోహ్లి, మురళీ విజయ్లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్లు తలో ఒక సెంచరీ సాధించారు. -
కరుణ్ నాయర్ కొట్టేశాడు!
చెన్నై:ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్లో భాగంగా మూడో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్.. తన ఆడుతున్న మూడో మ్యాచ్లోనే శతకం సాధించాడు. చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కరుణ్ నాయర్ 185 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఇది నాయర్ కెరీర్లో తొలి టెస్టు సెంచరీ. ఓవర్ నైట్ ఆటగాడిగా ఇన్నింగ్స్ ఆరంభించిన నాయర్ ఆద్యంతం ఆకట్టుకుని సెంచరీతో సత్తా చాటుకున్నాడు. గత రెండు టెస్టుల్లో నాయర్ విఫలమైనా, సెలక్టర్లు మరొకసారి కల్పించిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ రోజు ఆటలో భాగంగా 391/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ నిలకడగా బ్యాటింగ్ చేసింది. మురళీ విజయ్ తో కలిసి నాయర్ 63 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్ ను పటిష్ట స్థితికి చేరింది. అయితే నాయర్ సెంచరీ చేసిన తరువాత మురళీ విజయ్ అవుటయ్యాడు. దాంతో భారత్ జట్టు 435 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. -
కేఎల్ రాహుల్ బ్యాటింగ్ రికార్డు
-
రప్ఫాడించిన రాహుల్!
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రప్ఫాడించాడు. ఇంగ్లండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారై రాహుల్ (150) భారీ శతకం సాధించాడు. 253 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో రాహుల్ 150 పరుగుల మార్కును చేరాడు. ఈ రోజు ఆట తొలి రెండు సెషన్లలో రాహుల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. గత ఐదు ఇన్నింగ్స్ ల్లో కలుపుకుని 104 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఈ మ్యాచ్లో దుమ్మురేపాడు. అంతకుముందు ఐదు ఇన్నింగ్స్ ల్లో 38 పరుగుల అత్యధిక స్కోరును మాత్రమే కల్గి ఉన్న రాహుల్.. ఒక్కసారిగా పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. తన టెస్టు కెరీర్లో నాల్గో సెంచరీ సాధించిన రాహుల్..150 పరుగులను రెండోసారి సాధించాడు. 60/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు మంచి ఆరంభం లభించింది. రాహుల్ కు జతగా మరో ఓవర్ నైట్ ఆటగాడు పార్థీవ్ పటేల్(71;112 బంతుల్లో7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడి 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత పార్థీవ్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం పూజారాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించాడు. ఆపై విరాట్ కోహ్లి(15) నిరాశపరచడంతో భారత జట్టు 211 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. ఈ తరుణంలో రాహుల్-కరుణ్ నాయర్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 100 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్ తిరిగి గాడిలో పడింది. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.ఇప్పటివరకూ టెస్టుల్లో రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 158 పరుగులు కాగా, దాన్ని ఈ మ్యాచ్లో అధిగమించాడు. భారత జట్టు 88.0 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 313 పరుగులతో ఉంది. -
రాహుల్ శతక్కొట్టుడు
-
రాహుల్ శతక్కొట్టుడు
చెన్నై: ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకం సాధించాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్స్ లో భాగంగా రాహుల్ 171 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఇది రాహుల్ టెస్టు కెరీర్లో నాల్గో సెంచరీ. ఈ రోజు ఆటలో 30 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ను ఆరంభించిన రాహుల్.. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ శతకం సాధించాడు. అంతకుముందు 60/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు మంచి ఆరంభం లభించింది. రాహుల్ కు జతగా మరో ఓవర్ నైట్ ఆటగాడు పార్థీవ్ పటేల్(71;112 బంతుల్లో7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడి 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత పార్థీవ్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం పూజారాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే పూజారా(16) ఎంతోసేపు క్రీజ్లో నిలవలేదు.భారత్ స్కోరు 181 పరుగుల వద్ద పూజారా అవుటయ్యాడు. ఆ తరువాత రాహుల్ సెంచరీ సాధించడంతో టీమిండియా 54.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. -
ఓపెనర్లు ఇరగదీశారు..
-
ఓపెనర్లు ఇరగదీశారు..
చెన్నై:ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, పార్థీవ్ పటేల్లు ఇరగదీశారు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలుత కేఎల్ రాహుల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తరువాత కొద్ది సేపటికీ పార్థీవ్ 81 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అయితే టీమిండియా ఓపెనర్లు సెంచరీకిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 31 ఇన్నింగ్స్ ల తరువాత ఇదే తొలిసారి. 2015 జూన్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనింగ్ జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని చివరిసారి సాధించింది. అప్పట్నుంచి ఈ ఇన్నింగ్స్ ముందు వరకూ చూస్తే టీమిండియా ఓపెనింగ్ యావరేజ్ 24.72గా ఉంది. ఇదిలా ఉంచితే 2011 నుంచి చూస్తే టీమిండియా ఓపెనర్లు 50 కు పైగా వ్యక్తిగత స్కోరు సాధించడం ఇది నాల్గోసారి మాత్రమే. 60/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును కదిలిస్తోంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు పార్థీవ్, రాహుల్లు సమయోచితంగా ఆడుతూ భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. కాగా, పార్థీవ్ పటేల్(71) భారీ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా అవుటయ్యాడు. దాంతో ఈ జోడి 152 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. -
‘తోక’ చుక్కానిలా...
ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ అద్భుత బ్యాటింగ్ తొలి ఇన్నింగ్సలో 477 ఆలౌట్ డాసన్, రషీద్ అర్ధ సెంచరీలు భారత్ దీటైన జవాబు తొలి ఇన్నింగ్సలో వికెట్ నష్టపోకుండా 60 రెండో రోజు తొలి సెషన్లో భారత బౌలర్లు తమ ఆధిపత్యాన్ని చూపుతూ 37 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు తీశారు. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 321/7. ఇంకేముంది.. 400 కూడా కష్టమే అనుకున్న తరుణంలో వారి టెరుులెండర్లు అసాధారణ బ్యాటింగ్ను ప్రదర్శించారు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ... అరంగేట్ర టెస్టులోనే డాసన్ అదరగొట్టగా.. రషీద్ కూడా తన సహకారాన్ని అందించడంతో ఎనిమిదో వికెట్కు ఏకంగా 108 పరుగులు చేరి జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. అయితే ఇంగ్లండ్ విసిరిన సవాల్కు భారత్ దీటైన సమాధానమిస్తోంది. ఓపెనర్లు రాహుల్, పార్థివ్ పటేల్ పర్యాటక బౌలర్లపై దూకుడును చూపిస్తూ వికెట్ నష్టపోకుండా రెండో రోజు తమ తొలి ఇన్నింగ్సను ముగించారు. చెన్నై: ఐదు టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్నైనా విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు టెరుులెండర్లు భరోసానిచ్చారు. మిడిలార్డర్ను భారత బౌలర్లు త్వరగానే పెవిలి యన్కు చేర్చినా... చివర్లో లియాన్ డాసన్ (148 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్ (155 బంతుల్లో 60, 8 ఫోర్లు) అత్యంత ఓపికతో అర్ధ సెంచరీలతో రాణించి ఆతిథ్య జట్టు సహనాన్ని పరీక్షించారు. ఈ ఇద్దరితోపాటు స్టువర్ట్ బ్రాడ్ (19), జాక్ బాల్ (12) కూడా రెండంకెల స్కోరు సాధించారు. ఫలితంగా శనివారం రెండో రోజు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్సలో 157.2 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (262 బంతుల్లో 146; 13 ఫోర్లు, 1 సిక్స్) తన ఓవర్నైట్ స్కోరుకు మరో 26 పరుగులు మాత్రమే జత చేశాడు. ఇంగ్లండ్ చివరి మూడు వికెట్ల మధ్య 156 పరుగులు రావడం విశేషం. జడేజాకు మూడు వికెట్లు లభించగా... ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్, మిశ్రా చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. క్రీజులో లోకేశ్ రాహుల్ (68 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు), పార్థివ్ పటేల్ (52 బంతుల్లో 28 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. మురళీ విజయ్ గాయం కారణంగా ఓపెనర్గా బరిలోకి దిగలేదు. ఇంగ్లండ్కన్నా ఇంకా 417 పరుగులు వెనకబడి ఉన్న భారత్ చేతిలో ఇంకా పది వికెట్లున్నాయి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స: కుక్ (సి) కోహ్లి (బి) జడేజా 10; జెన్నింగ్స (సి) పార్థివ్ (బి) ఇషాంత్ 1; రూట్ (సి) పార్థివ్ (బి) జడేజా 88; మొయిన్ అలీ (సి) జడేజా (బి) ఉమేశ్ యాదవ్ 146; బెయిర్స్టో (సి) రాహుల్ (బి) జడేజా 49; స్టోక్స్ (సి) పార్థివ్ (బి) అశ్విన్ 6; బట్లర్ ఎల్బీడబ్ల్యూ (బి) ఇషాంత్ 5; డాసన్ నాటౌట్ 66; రషీద్ (సి) పార్థివ్ (బి) ఉమేశ్ యాదవ్ 60; బ్రాడ్ (రనౌట్) 19; బాల్ (బి) మిశ్రా 12; ఎక్స్ట్రాలు 15; మొత్తం (157.2 ఓవర్లలో ఆలౌట్) 477. వికెట్ల పతనం: 1-7, 2-21, 3-167, 4-253, 5-287, 6-300, 7-321, 8-429, 9-455, 10-477. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 21-3-73-2; ఇషాంత్ 21-6-42-2; జడేజా 45-9-106-3; అశ్విన్ 44-3-151-1; మిశ్రా 25.2-5-87-1; కరుణ్ నాయర్ 1-0-4-0. భారత్ తొలి ఇన్నింగ్స: రాహుల్ బ్యాటింగ్ 30; పార్థివ్ బ్యాటింగ్ 28; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 60. బౌలింగ్: బ్రాడ్ 5-2-6-0; బాల్ 3-0-9-0; మొయిన్ అలీ 7-1-18-0; స్టోక్స్ 2-0-12-0; రషీద్ 2-0-13-0; డాసన్ 1-1-0-0. సెషన్-1: భారత్దే ఆధిపత్యం ఓవర్నైట్ స్కోరు 284/4తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ను తొలి సెషన్లో భారత బౌలర్లు ఇబ్బంది పెట్టారు. తొలి ఓవర్ ఐదో బంతికే బెన్ స్టోక్స్ (6)ను అశ్విన్ అవుట్ చేశాడు. ఈ సిరీస్లో అశ్విన్ అతడిని అవుట్ చేయడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే బట్లర్ (5)ను ఇషాంత్ ఎల్బీగా పెవిలియన్కు చేర్చాడు. అశ్విన్ బౌలింగ్లో మొరుున్ అలీ ఓ సిక్స్, ఫోర్ బాది జోరును చూపాడు. అరుుతే డ్రింక్స్ విరామం తర్వాత ఉమేశ్ యాదవ్ ఓవర్లో జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమేశ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని మొయిన్ అలీ పుల్ షాట్ ఆడాడు. అరుుతే టాప్ ఎడ్జ తీసుకున్న బంతి జడేజా చేతుల్లోకి వెళ్లింది. దీంతో 321 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు 350 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. అరుుతే జట్టును కాపాడే బాధ్యత డాసన్, ఆదిల్ రషీద్ తీసుకున్నారు. జాగ్రత్తగా ఆడుతూ వికెట్ పడకుండా లంచ్ విరామానికి వెళ్లారు. ఓవర్లు: 29, పరుగులు: 68, వికెట్లు 3 సెషన్-2: శతక భాగస్వామ్యం లంచ్ అనంతరం డాసన్, రషీద్ జోడీ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఇన్నింగ్సను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చివరి మూడు వికెట్లను త్వరగా తీద్దామనుకున్న భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చక్కటి బ్యాటింగ్తో ఈ ద్వయం ఆకట్టుకుంది. ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో రషీద్ వరుసగా రెండు ఫోర్లు బాది కాస్త జోరును పెంచాడు. ఇదే ఊపుతో 141 బంతుల్లో ఓ చక్కటి ఫోర్తో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అరుుతే ఉమేశ్ వేసిన ఓవర్లో వైడ్ బంతిని ఆడబోరుున రషీద్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే డాసన్ 148 బంతుల్లో కెరీర్లో తొలి అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఓవర్లు: 31, పరుగులు: 100, వికెట్లు: 1 సెషన్-3: భారత్ దూకుడు టీ విరామానంతరం మూడో ఓవర్లోనే బ్రాడ్ రనౌట్గా వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స 157వ ఓవర్లో డాసన్ రెండు భారీ సిక్సర్లు బాది 17 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మిశ్రా.. బాల్ (18 బంతుల్లో 12; 1 సిక్స్)ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స ముగిసింది. ఆ తర్వాత రాహుల్, పార్థివ్ పటేల్ భారత్ ఇన్నింగ్సను దీటుగా ఆరంభించారు. రెండో ఓవర్లో పార్థివ్ ఫోర్ బాదగా... అటు రాహుల్ చక్కటి స్ట్రొక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా సింగిల్స్ తీస్తూ వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. ఓవర్లు: 6.2, పరుగులు: 25, వికెట్లు: 2 (ఇంగ్లండ్) ఓవర్లు: 20, పరుగులు: 60, వికెట్లు: 0 (భారత్) -
విరాట్ సేన..కూల్ కూల్గా
-
విరాట్ సేన..కూల్ కూల్గా
చెన్నై:చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ సాధించిన భారీ స్కోరుకు టీమిండియా కూల్ కూల్గా సమాధానమిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా శనివారం తొలుత ఇంగ్లండ్ 477 పరుగులు సాధించగా.. ఆ తరువాత విరాట్ సేన ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. ఆట ముగిసేసమయానికి భారత్ 20.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసి దీటుగా బదులిస్తోంది. ఈ రోజు ఆటలో ఇంగ్లండ్ పదే పదే బౌలర్లను మార్చినా భారత్ ఓపెనింగ్ జోడిని విడదీయలేకపోయింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(30 బ్యాటింగ్), పార్థీవ్ పటేల్(29 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు 284/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 477 పరుగుల వద్ద ఆలౌటైంది.బెయిర్ స్టో(49),మొయిన్ అలీ(146), రషిద్(60),డాసన్(66 నాటౌట్)లు రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఈ రోజు ఆట తొలి సెషన్లో భారత్ జోరు కొనసాగింది. మూడు కీలక వికెట్లను తీసి భారత్ పై చేయి సాధించింది. తొలుత బెయిర్ స్టోను అవుట్ చేసిన భారత్, ఆ తరువాత బట్లర్ను అవుట్ చేసింది. ఆపై శతకం వీరుడు మొయిన్ అలీని కూడా అవుట్ చేసింది. దాంతో లంచ్ లోపే ఇంగ్లండ్ మూడు ప్రధాన వికెట్లను కోల్పోవడంతో భారత్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. దాంతో ఇంగ్లండ్ 321 పరుగులకే ఏడు వికెట్లను నష్టపోయింది. కాగా, రెండో సెషనల్ లో ఇంగ్లండ్ హవా కొనసాగింది. లంచ్ కు ముందు మొయిన్ అలీ ఏడో వికెట్గా అవుటైన తరువాత భారత్కు అసలు పరీక్ష ఎదురైంది. ఇంగ్లండ్ టెయిలెండర్లు డాసన్, రషిద్లు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ జోడి ఎనిమిదో వికెట్ కు108 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రషిద్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది రషిద్ టెస్టు కెరీర్లో రెండో హాప్ సెంచరీ. రషిద్ అవుటైన తరువాత డాసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో రెండో సెషన్లో ఇంగ్లండ్ హవా పూర్తిగా కొనసాగింది. టీ తరువాత ఇంగ్లండ్ మరో 25 పరుగులు చేసిన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. అశ్విన్, మిశ్రాలకు చెరో వికెట్ దక్కింది. -
క్యాచ్ వదిలారు..మూల్యం చెల్లించుకున్నారు!
-
37 ఏళ్ల రికార్డు బద్ధలైంది!
చెన్నై: భారత్ తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ డాసన్ ఒక రికార్డును సవరించాడు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన డాసన్(66 నాటౌట్;148 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన డాసన్ 60కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా ఎనిమిదో వికెట్గా దిగి అరంగేట్రం టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక స్కోరు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ డేవిడ్ బెయిర్ స్టో(59)పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. 1979లో డేవిడ్ బెయిర్ స్టో తన అరంగేట్రం టెస్టులో ఎనిమిదో స్థానంలో దిగి అత్యధిక స్కోరు సాధించాడు. ఆ సమయంలో డేవిడ్ బెయిర్ స్టో సాధించిన రికార్డుకు కూడా భారత్పైనే కావడం విశేషం. తాజాగా ఆ స్కోరును డాసన్ అధిగమించడంతో 37 ఏళ్ల రికార్డు తెరమరుగైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెయిర్ స్టో(49), మొయిన్ అలీ(146)లు రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆ తరువాత డాసన్, రషిద్(60)లు హాఫ్ సెంచరీలతో మెరిసి ఇంగ్లండ్ ను మరితం పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. ఈ జోడి ఎనిమిదో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. దాంతో చెపాక్ స్టేడియంలో ఎనిమిదో వికెట్కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ స్టేడియంలో అత్యుత్తమ భాగస్వామ ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం ఇమ్రాన్ ఖాన్-వసీం అక్రమ్లు జంట పేరిట ఉంది. 1987లో ఇమ్రాన్-వసీంలు ఇక్కడ నమోదు చేసిన 112 పరుగులు నేటికీ అత్యుత్తమ భాగస్వామ్యం. -
ఇంగ్లండ్ భారీ స్కోరు
-
ఇంగ్లండ్ భారీ స్కోరు
చెన్నై: భారత్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. 284/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 193 పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, టెయిలెండర్ల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోరును నమోదు చేసింది. భారత్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ మరోసారి నాలుగువందలకు పైగా స్కోరు సాధించింది. ఈ రోజు ఆటలో బెయిర్ స్టో(49), బట్లర్(5), మొయిన్ అలీ(146) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ తడబడినట్లు కనిపించింది. కాగా, ఆ తరువాత ఇంగ్లండ్ టెయిలెండర్లు డాసన్, రషిద్లు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఇంగ్లండ్ తిరిగి గాడిలో పడింది. తొలి సెషన్లో భారత్ జోరు ఈ రోజు ఆట తొలి సెషన్లో భారత్ జోరు కొనసాగింది. మూడు కీలక వికెట్లను తీసి భారత్ పై చేయి సాధించింది. తొలుత బెయిర్ స్టోను అవుట్ చేసిన భారత్, ఆ తరువాత బట్లర్ను అవుట్ చేసింది. ఆపై శతకం వీరుడు మొయిన్ అలీని కూడా అవుట్ చేసింది. దాంతో లంచ్ లోపే ఇంగ్లండ్ మూడు ప్రధాన వికెట్లను కోల్పోవడంతో భారత్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ మూడు వికెట్లలో అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలు తలో వికెట్ చొప్పున పంచుకున్నారు. దాంతో ఇంగ్లండ్ 321 పరుగులకే ఏడు వికెట్లను నష్టపోయింది. రెండో సెషన్లో ఇంగ్లండ్ హవా రెండో రోజు ఆటలో లంచ్కు ముందే ఇంగ్లండ్ మూడు వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్పై భారత్ పట్టుసాధించినట్లు కనబడింది. మొయిన్ అలీ ఏడో వికెట్గా అవుటైన తరువాత భారత్కు అసలు పరీక్ష ఎదురైంది. ఇంగ్లండ్ టెయిలెండర్లు డాసన్, రషిద్లు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ జోడి ఎనిమిదో వికెట్ కు108 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రషిద్(60;155 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది రషిద్ టెస్టు కెరీర్లో రెండో హాప్ సెంచరీ. రషిద్ అవుటైన తరువాత డాసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 121 బంతులను ఎదుర్కొన్న డాసన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో రెండో సెషన్లో ఇంగ్లండ్ హవా పూర్తిగా కొనసాగింది. టీ విరామానికి ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 452 పరుగులు చేసింది. కాగా, టీ తరువాత మరో 25 పరుగులు చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. అశ్విన్, మిశ్రాలకు చెరో వికెట్ దక్కింది. -
క్యాచ్ వదిలారు..మూల్యం చెల్లించుకున్నారు!
చెన్నై:ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ మూడు అద్భుత విజయాలతో సిరీస్ను సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటుకున్న భారత్.. సిరీస్లో తమకు ఎదురులేదని నిరూపించింది. అయితే ప్రత్యేకంగా ఈ సిరీస్ లో భారత్ తన ఫీల్డింగ్ విషయంలో మాత్రం చాలా పేలవంగా ఉంది. రాజ్కోట్ లో జరిగిన తొలి టెస్టులో ఏడు క్యాచ్లను వదిలేసిన విరాట్ సేన.. ఆ తరువాత మొహాలీలో జరిగిన రెండో టెస్టులో నాలుగు క్యాచ్లను జారవిడిచింది. కాగా, 4-0తో సిరీస్ గెలిచి రికార్డును తిరగరాయాలన్న భారత్.. ఐదో టెస్టులో ఒక కీలకమైన క్యాచ్ను వదిలేసింది. ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ పరుగులేమీ చేయకుండా ఉన్న తరుణంలో అతని క్యాచ్ ను భారత ఫీల్డర్లు వదిలేశారు. మొయిన్ ఇచ్చిన క్యాచ్ను కేఎల్ రాహుల్ వదిలేశాడు. దాంతో లైఫ్ లభించిన అలీ ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి రోజు ఇంగ్లండ్ పైచేయి సాధించడంలో అలీ కీలక పాత్ర పోషించాడు. ఆ క్యాచ్ తరువాత ఎటువంటి అవకాశాన్ని ఇవ్వని అలీ(146) భారీ శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 262 బంతుల్ని ఎదుర్కొన్న అలీ 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఇంగ్లండ్ను పటిష్టస్థితికి చేర్చాడు. ఫీల్డింగ్ కోచ్ అసంతృప్తి ఇంగ్లండ్ తో సిరీస్లో భారత జట్టు ఫీల్డింగ్ పై ఆ విభాగంలో కోచ్గా ఉన్న ఆర్.శ్రీధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిరీస్ ను ముందుగానే గెలుచుకన్నప్పటికీ క్యాచ్లను వదిలేయడం నిరాశ గురి చేసిందన్నాడు. క్యాచ్లను పట్టేక్రమంలో టైమింగ్ చాలా ముఖ్యమైనదని భారత క్రికెటర్లకు హితబోధ చేశాడు. క్రికెట్లో ఫీల్డింగ్ పరంగా తప్పులు జరగడం సహజమంటూనే, తమ ఆటగాళ్లు ఫీల్డింగ్ లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ఒకవేళ మొయిన్ అలీ ముందుగానే పెవిలియన్కు చేరి ఉంటే మ్యాచ్ పై పట్టుదొరికేదన్నాడు. గత కొంతకాలం నుంచి వికెట్ల వెనుక ఫీల్డింగ్లో భారత్ బాగా మెరుగుపడినప్పటికీ, ఇంగ్లండ్ తో సిరీస్లో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారన్నాడు.క్యాచ్లను పట్టడంలో వెనుకబడిన పక్షంలో మ్యాచ్ ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందన్నాడు. -
మొయిన్ అలీ అజేయ శతకం
-
మొయిన్ అలీ అజేయ శతకం
చెన్నై: భారత్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ తీసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జెన్నింగ్స్ (1), అలెస్టర్ కుక్(10)ఆదిలోనే నిష్క్రమించగా, జో రూట్(88), బెయిర్ స్టో(49)లు రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 146 పరుగులు జోడించిన తరువాత రూట్ అవుటయ్యాడు. ఆ తరువాత మొయిన్ అలీతో కలిసి స్టో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ జోడి 86 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తరువాత స్టో అవుటయ్యాడు. ఆపై మొయిన్ అలీ శతకం నమోదు చేసి జట్టును మరింత పటిష్ట స్థితికి చేర్చాడు. ఆట ముగిసే సమయానికి అలీ(120 బ్యాటింగ్), స్టోక్స్(5 బ్యాటింగ్)లు క్రీజ్లో ఉన్నారు.భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మకు వికెట్ లభించింది. కుక్ రికార్డు.. ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. చివరిదైన ఐదో టెస్టులో కుక్ 11వేల పరుగుల మార్కును చేరాడు. తద్వారా ఈ ఫార్మాట్లో తక్కువ సమయంలో పదకొండు వేలు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ పరుగుల్ని కుక్ 10 సంవత్సరాల 290 రోజుల్లోనే సాధించి రికార్డు సృష్టించాడు. అంతకుముందు టెస్టు ఫార్మాట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని ఇంత త్వరగా చేరుకున్న ఆటగాడు లేడు. ఈ మ్యాచ్ కు ముందు 10,998 పరుగులతో ఉన్న కుక్.. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగులు చేయడం ద్వారా పదకొండ వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. అయితే ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేసి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కుక్ 140 మ్యాచ్ల్లో 252 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనతను సాధించాడు. ఇందులో 30 శతకాలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది మేలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫాస్టెస్ట్ పదివేల పరుగుల రికార్డును కుక్ అధిగమించిన సంగతి తెలిసిందే. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ 31 ఏళ్ల 4 నెలల వయసులోనే ఆ మార్కును చేరాడు.