
స్థాయికి మించి ఆడాల్సిందే: మిథాలీ
మహిళల ప్రపంచకప్లో భారత జట్టు ఇప్పుడు సెమీఫైనల్స్ బెర్త్ దక్కించుకోవాలంటే పటిష్టమైన ఆస్ట్రేలియా (12న), న్యూజిలాండ్ (15న) జట్లతో తలపడాల్సి ఉంది. దీంతో ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకుండా తమ శక్తిసామర్థ్యాలకు మించి ఆడాల్సిన అవసరం ఉందని కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. వరుసగా నాలుగు విజయాల అనంతరం టోర్నీలో భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.