3 పరుగుల తేడాతో ఓపెనర్లు అవుట్ | indian openers out | Sakshi

3 పరుగుల తేడాతో ఓపెనర్లు అవుట్

Mar 23 2016 8:15 PM | Updated on Sep 3 2017 8:24 PM

టి-20 ప్రపంచ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. 3 పరుగుల తేడాతో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ అవుటయ్యారు.

బెంగళూరు: టి-20 ప్రపంచ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. 3 పరుగుల తేడాతో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ అవుటయ్యారు. బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.

భారత ఓపెనర్లు రోహిత్ (18), ధవన్ (23) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 42 పరుగులు జోడించారు. అయితే ఈ స్కోరు వద్ద రోహిత్ పెవిలియన్ చేరాడు. బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఓవర్లో రోహిత్ క్యాచవుటయ్యాడు. ఆ వెంటనే ధవన్.. షకీబల్ హసన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో భారత్ పరుగుల జోరు కాస్త తగ్గింది. విరాట్ కోహ్లీ, రైనా బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement