జిబెట్ నవ్వింది | jibet smiled | Sakshi
Sakshi News home page

జిబెట్ నవ్వింది

Published Mon, Sep 29 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

జిబెట్ నవ్వింది

జిబెట్ నవ్వింది

మహిళల స్టీపుల్‌చేజ్ స్వర్ణం బహ్రెయిన్ క్రీడాకారిణిదే లలితకు కాంస్యం, సుధా సింగ్‌కు నిరాశ
 
 ఇంచియూన్: ఆసియా క్రీడల్లో శనివారం జరిగిన స్టీపుల్ చేజ్‌లో తొలి స్థానంలో నిలిచిన రూత్ జిబెట్ (బహ్రెయిన్)పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ అంశంలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన భారత క్రీడాకారిణులు లలిత, సుధాసింగ్‌లకు... జిబెట్‌పై వేటు కారణంగా ఓ స్థానం మెరుగై రజత, కాంస్యాలు లభించింది. అయితే ఈ ఫలితంపై బహ్రెయిన్ అధికారులు తిరిగి విచారించాలని ఆసియా క్రీడల నిర్వాహకులకు అప్పీలు చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల జ్యూరీ విచారణ జరిపి... జిబెట్ తప్పు చేయలేదని ఆమెకే స్వర్ణం అని ప్రకటించారు. దీంతో ఆదివారం తిరిగి ఈ విభాగంలో పతకాలు ఇచ్చారు. ముసిముసి నవ్వులతో ఈ బహ్రెయిన్ క్రీడాకారిణి సగర్వంగా స్వర్ణం అందుకుంది. భారత క్రీడాకారిణి లలిత తిరిగి కాంస్య పతకానికి పడిపోగా... సుధాసింగ్‌కు నాలుగో స్థానంతో నిరాశ మిగిలింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య దృష్టికి తీసుకెళతామని భారత చెఫ్ డి మిషన్ సమారివాల చెప్పారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement