విజేతలు జితేష్, హుమేరా | jitesh swamy , sheik homera winners | Sakshi
Sakshi News home page

విజేతలు జితేష్, హుమేరా

Published Wed, Dec 4 2013 12:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

jitesh swamy , sheik homera winners

సాక్షి, హైదరాబాద్: బీబీఆర్ హాస్పిటల్ ఏఐటీఏ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ (అండర్-16)లో జితేష్ స్వామి, షేక్ హుమేరా విజేతలుగా నిలిచారు. సికింద్రాబాద్‌లోని పల్లవి ప్లే గ్రౌండ్స్‌లో సూర్య టెన్నిస్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ టోర్నీ మంగళవారం ముగిసింది.
 
 బాలుర ఫైనల్లో ఐదో సీడ్ జితేష్ స్వామి (ఆంధ్రప్రదేశ్) 6-2, 6-3 స్కోరుతో తీర్థ శశాంక్ (ఏపీ)పై విజయం సాధించాడు. బాలికల ఫైనల్లో షేక్ హుమేరా (ఏపీ) 6-4, 6-4 తేడాతో ఏడో సీడ్ అమినేని శివానిని ఓడించింది. విజేతలకు ఏపీ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు రాజా నరసింహారావు, బీబీఆర్ హాస్పిటల్ డెరైక్టర్ బి. సందీప్ బహుమతులు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement