ఐపీఎల్‌లో లసిత్‌ మలింగ... మనసు మార్చుకున్న లంక బోర్డు  | Lasith Malinga to play for Mumbai Indians | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో లసిత్‌ మలింగ... మనసు మార్చుకున్న లంక బోర్డు 

Published Wed, Mar 27 2019 1:37 AM | Last Updated on Wed, Mar 27 2019 1:37 AM

Lasith Malinga to play for Mumbai Indians - Sakshi

ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలంటే శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ... దేశవాళీ వన్డే టోర్నీ సూపర్‌ ప్రొవిన్షియల్‌ టోర్నీలో ఆడాల్సిందేనంటూ పంతం పట్టిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) మనసు మార్చుకుంది. ఐపీఎల్‌లో ఆడేందుకు మలింగకు అనుమతినిచ్చింది.

ఈ మేరకు తన అధికారిక ట్వీటర్‌ పేర్కొంది. సూపర్‌ ప్రొవిన్షియల్‌ వన్డే టోర్నీలో ఆడటం కన్నా ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లు పాల్గొనే ఐపీఎల్‌లో ఆడితే మలింగకు ఉపకరిస్తుందని బోర్డు ప్రకటించింది. మరోవైపు బీసీసీఐ జోక్యంతోనే శ్రీలంక బోర్డు తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement