భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు తమ టెస్టు సిరీస్ను ఘనంగా ఆరంభించింది. న్యూజిలాండ్తో గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్లో 5-1 తేడాతో ఘనవిజయం సాధించింది.
న్యూఢిల్లీ: భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు తమ టెస్టు సిరీస్ను ఘనంగా ఆరంభించింది. న్యూజిలాండ్తో గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్లో 5-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో ఈనెల 2న ఆరంభమైన ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ 13 వరకు జరుగుతుంది. ఏడో నిమిషంలోనే మన్దీప్ సింగ్ భారత్ తరఫున ఖాతా తెరిచాడు.
మూడు నిమిషాల అనంతరం పెనాల్టీ కార్నర్ను వరుణ్ కుమార్ గోల్గా మలిచి 2-0 ఆధిక్యాన్ని అందించాడు. 16వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ మరో పెనాల్టీని గోల్గా మలిచాడు. 25వ నిమిషంలో కివీస్ ఏకైక గోల్ సాధించగలిగింది. 50వ నిమిషంలో పర్వీందర్ సింగ్, 54వ నిమిషంలో సుమీత్ టొప్పో గోల్స్తో భారత్ తిరుగులేని విజయాన్ని అందుకుంది.