
మురళీ విజయ్ హాఫ్ సెంచరీ
ముంబై:ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో భారత ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అర్థ శతకం సాధించాడు. ఇది విజయ్ కెరీర్లో 15వ హాఫ్ సెంచరీ. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా తొలుత ఇంగ్లండ్ను 400 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్ను ఆరంభించింది. భారత ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్తో కలిసి మురళీ విజయ్ ప్రారంభించాడు.
కాగా, రాహుల్(24) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత విజయ్తో కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో భారత్ 44.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 133 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.