జింఖానా, న్యూస్లైన్: కాకతీయ జట్టు బౌలర్ రాము 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. దీంతో కాకతీయ జట్టు 6 వికెట్ల తేడాతో హెచ్యూసీసీ జట్టుపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్యూసీసీ 161 పరుగులకు కుప్పకూలింది. ఆరిఫ్ (67) అర్ధ సెంచరీతో రాణించగా... శుభమ్ 31 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
మరో మ్యాచ్లో గౌలిపుర జట్టు 177 పరుగుల భారీ తేడాతో చీర్ఫుల్ చాంప్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గౌలిపుర 7 వికెట్లకు 226 పరుగులు చే సింది. విరించి యాదవ్ (60), సాయి మోహిత్ (38) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన చీర్ఫుల్ చాంప్స్ 8 వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. భరత్ 3 వికె ట్లు తీసుకున్నాడు.
ఇతర మ్యాచ్ల స్కోర్లు
ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
స్పోర్టింగ్ ఎలెవన్: 185; కొసరాజు: 186/5 (అజయ్ పట్వారి 85 నాటౌట్, సాయి చరణ్ 70).
రాముకు 6 వికెట్లు
Published Thu, Dec 12 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement