gymkhana grounds
-
విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో భారీ అగ్నిప్రమాదం
-
విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ: నగరంలోని జింఖానా గ్రౌండ్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జింఖానా గ్రౌండ్స్లోని బాణాసంచా స్టాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 18 టపాసుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత మూడు స్టాల్స్లో ప్రమాదం చోటు చేసుకోవడంతో దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇద్దరు అగ్నికి ఆహుతయ్యారు. వారిని దుకాణంలో పని చేసే వారిగా గుర్తించారు. -
2న జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ శాంతి సభను నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ వెల్లడించారు. 2న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్లోని హరిహరకళా భవన్లో శాంతి సభ పోస్టర్ను ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... శాంతి సభలకు 25 పార్టీల్లో 19 పార్టీలు మద్దతు ప్రకటించి రానున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు, ప్రపంచ శాంతి కోసం ఈ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని... ఆయన వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాకపోతే ప్రజలు, దేవుడి తీర్పుకు అంగీకరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉందని ప్రజా గాయకులు గద్దర్తో పాటు మరికొంత మంది పేర్లు పరిశీలిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 25న తన పుట్టిన రోజు సందర్భంగా 59 మంది మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగులకు, అక్టోబర్ 2వ తేదీన సభకు వచ్చిన నిరుద్యోగుల్లో లాటరీ ద్వారా అమెరికాలో ఉద్యోగాల కోసం పాస్ పోర్టుతో పాటు వీసాను కూడా అందిస్తామని చెప్పారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రజలందరూ సమానంగా, సమాన హక్కులు పొందడం అనేది ప్రజాస్వామ్య దేశం లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే లౌకికవాదాన్ని పదికాలాలపాటు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ఈ శాంతి సభలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ క్రిష్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రవికుమార్, కన్వీనర్ జీ శ్యాం అబ్రహాం, వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, సంఘ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బిషప్లు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’) -
IND VS AUS 3rd T20 Tickets: జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట.. ఏడుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్/ రాంగోపాల్పేట్: గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతం. ఒక్కసారిగా వర్షం. జింఖానా గ్రౌండ్స్ వద్ద అప్పటివరకు కిలోమీటర్ పొడవు క్యూ లైన్లలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు ఒకేసారి మైదానం ప్రధాన గేటు వైపు దూసుకువచ్చారు. లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఫలితం.. తీవ్రమైన తొక్కిసలాట. ఊపిరే అందని పరిస్థితి. కొందరు కింద పడిపోయారు. కాళ్ల కింద నలిగిపోయారు. గుమిగూడిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు గాయపడ్డారు. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే భారత్–ఆ్రస్టేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం జింఖానా మైదానంలో నేరుగా (ఆఫ్లైన్) టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన హెచ్సీఏ ఆ మేరకు సరైన ఏర్పాట్లు, బందోబస్తు చేయలేదని, అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల తర్వాత మ్యాచ్తో.. మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బుధవారం వరకు ఆన్లైన్లోనే టికెట్ల అమ్మకాలు అంటూ చెప్పిన హెచ్సీఏ.. గురువారం మాత్రం కౌంటర్ ద్వారా టికెట్లు అమ్మాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలు జరుగుతాయని ప్రకటించింది. మైదానంలోని హెచ్సీఏ కార్యాలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన గేట్ వద్ద కుడివైపు పురుషులు, ఎడమవైపు మహిళలకు లైన్లు కేటాయించారు. గేటు దాటి లోపలకు వచ్చిన తర్వాత మాత్రం ఒకే లైన్లో టిక్కెట్ కౌంటర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం బుధవారం రాత్రి నుంచే అభిమానులు గ్రౌండ్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. గురువారం తెల్లవారుజాముకే వీరి సంఖ్య పది వేలు దాటింది. ఒక్కోటి దాదాపు కి.మీ. మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. ప్రధాన గేట్ను మూసి ఉంచిన పోలీసులు విడతల వారీగా కొందరి చొప్పున లోపలి క్యూ లైన్లోకి పంపిస్తున్నారు. వర్షంతో పరుగులు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో తలదాచుకునేందుకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్లకు ఇదే గేటు కావడంతో లోపల నుంచి వచ్చే వారి కోసం పోలీసులు కొద్దిగా దాన్ని తెరిచారు. అదే సమయంలో బయట ఉన్న దాదాపు 1,000 మంది ఒకేసారి లోపలకు దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ముందు వరుసల్లో ఉన్న వాళ్లు కింద పడిపోయారు. అదే అదనుగా కొందరు పోకిరీలు.. మహిళలు, యువతులపై పడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. తొక్కిసలాట, లాఠీచార్జిలో ఒక కానిస్టేబుల్, ఒక అగ్నిమాపక సిబ్బందితో పాటు ఏడుగురికి గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఉదంతంతో గ్రౌండ్స్ వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. టిక్కెట్ల విక్రయానికి మరో కౌంటర్ ఏర్పాటు చేయించారు. సాయంత్రం టిక్కెట్ల విక్రయం పూర్తయ్యే వరకు భారీ బందోబçస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జీ తర్వాత బయట ఉన్నవారిని పోలీసులు పంపేయగా.. సాయంత్రం వరకు ఉండి టిక్కెట్ల దొరకని వారు నిరసనకు ప్రయత్నించడంతో అధికారులు నచ్చజెప్పి పంపేశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స తొక్కిసలాటలో గాయపడిన ఏడుగురిని సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జింఖానా మైదానంలో స్వీపర్గా పనిచేసే బోరబండకు చెందిన రంజిత, బేగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్, కవాడీగూడకు చెందిన విద్యార్థి ఆదిత్యనాథ్, తిరుమలగిరి ఇందిరానగర్కు చెందిన విద్యారి్థని సయ్యదా ఆలియా, కొంపల్లి బహుదూర్పల్లికి చెందిన సాయి కిశోర్, సికింద్రాబాద్ కంట్రోల్ రూమ్కు చెందిన అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ శ్రీనాథ్ యాదవ్, కేపీహెచ్బీ (జేఎన్టీయూ)కి చెందిన సుజాత ఉన్నారు. వీరిలో సాయి కిశోర్, సుజాతలను ప్రా£ýథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామని, చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో మూడు కేసులు హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్తో పాటు నిర్వాహకులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జింఖానా వద్ద జరిగిన తొక్కిసలాటకు హెచ్సీఏ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చికిత్స పొందుతున్న వారు ఫిర్యాదు చేయడంతో, హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్తో పాటు నిర్వాహకులపై బేగంపేట పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ యాక్ట్, 420, 21,22/76 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నట్లు ఫిర్యాదులందాయి. హెచ్సీఏ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని, వారిపై చర్యలు ఉంటాయని, నోటీసులు జారీ చేస్తామని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్ చెప్పారు. కనీస ఏర్పాట్లు లేకపోవడం వల్లే.. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం సుమారు 39,800లో అన్నిరకాల పాస్ల సంఖ్య 20 శాతానికి మించదు. మిగిలిన వాటిని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచే విషయంలో హెచ్సీఏలో నెలకొన్న గందరగోళం తాజా పరిస్థితికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లోనా లేక ఆఫ్లైన్లోనా అనే విషయంలో బుధవారం వరకు స్పష్టత లేకుండా పోయింది. హెచ్సీఏలో చాలా కాలంగా ఉన్న విభేదాల కారణంగా గతంలో టికెట్ల విషయంలో కీలకంగా, చురుగ్గా వ్యవహరించినవారు అధ్యక్షుడు అజారుద్దీన్కు సహకరించలేదని సమాచారం. దీంతో ఆయన పూర్తిగా దిగువ స్థాయి ఉద్యోగులపై ఆధారపడ్డారు. బుధవారం జింఖానా మైదానం వద్దకు ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో వచ్చి హడావుడి చేసిన నేపథ్యంలో.. ఆఫ్లైన్లో టికెట్లు అమ్ముదామని అజహర్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద కనీస ఏర్పాట్లు, బందోబస్తు లేకపోవడం, వర్షం నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్ నిర్వహణ సులువు కాదు: అజారుద్దీన్ గురువారం చోటు చేసుకున్న ఘటనలో తన తప్పేమీ లేదని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత సులువు కాదని పేర్కొన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమరి్పస్తామని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మ్యాచ్ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. అందరం క్రికెట్ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నామని అన్నారు. మ్యాచ్ టికెట్లు అన్నీ అమ్ముడుబోయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగితే సహించం: మంత్రి శ్రీనివాస్గౌడ్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం సందర్భంగా జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో టీ20 క్రికెట్ మ్యాచ్ ఏర్పాట్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్సీఏ పాలకమండలి ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వ సహకారాన్ని కోరిఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 25న జరిగే మ్యాచ్ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని విజ్ఞప్తి చేశారు. జింఖానా వద్ద గాయపడిన వారికి హెచ్సీఏ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యసేవలు అందజేస్తామన్నారు. సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, టీఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమా రెడ్డి, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు నాలుగు కౌంటర్లు అని చెప్పినా డిజిటల్ పేమెంట్లు పని చేయలేదు. మధ్యాహ్నం వరకు ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు. మరో కౌంటర్ కేవలం పోలీసుల కోసమే కేటాయించినట్టుంది. చాలామంది అడ్డదారిలో అక్కడకు వెళ్లి కొనుక్కున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వేచి చూసినా నాకు టికెట్ దొరకలేదు. – సాయి ప్రవీణ్, గాజులరామారం -
జింఖానా గ్రౌండ్ ‘తొక్కిసలాట’దృశ్యాలు
-
జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం నగరంలోని జింఖానా మైదానంలో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, మ్యాచ్ వీక్షేందుకు టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూ లైన్లలో బారులుతీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. పలువురు స్పృహ తప్పపడిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు సైతం గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పి ఉద్రికత్త చోటుచేసుకుంది. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదిలా ఉండగా.. టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హెచ్సీఏ వివాదం: జింఖానా వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్సీఏ)లో వివాదం ముదురుతోంది. సికింద్రాబాద్ జింఖానా వద్ద హెటెన్షన్ నెలకొంది. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్మీట్కు పోలీసుల అనుమతి నిరాకరించారు. జింఖానా బయట భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో ఎలాగైనా ప్రెస్మీట్ నిర్వహిస్తామని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. అంబుడ్స్మెన్ ప్రకటనపై అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అజార్ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు తెలిపారు. జింఖానా నుంచి అజార్ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్ గ్రూప్, జాన్ మనోజ్ గ్రూప్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు అంబుడ్స్మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్ మనోజ్ను హెచ్సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు అంబుడ్స్మన్ దీపక్ వర్మ అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేశారు. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు కొనసాగనుంది. ఈ క్రమంలో అంబుడ్స్మన్ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. అంబుడ్స్మన్గా దీపక్ వర్మను ఏజీఎం వ్యతిరేకించింది. అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసే అధికారం దీపక్వర్మకు లేదని పేర్కొంది. దీపక్వర్మ నియామకమే చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. -
చెలరేగిన మిలింద్, త్యాగి
సాక్షి, హైదరాబాద్: ఎ1-డివిజన్ మూడు రోజు లీగ్లో మంగళవారం మొదలైన అన్ని మ్యాచ్ల్లోనూ బౌలర్ల ప్రతాపమే కనబడింది. జింఖానా గ్రౌండ్స్లో జరుగుతున్న మ్యాచ్లో డెక్కన్ క్రానికల్ బౌలర్లు సీవీ మిలింద్ (5/49), సుదీప్ త్యాగి (5/45)లు ఎన్స్కాన్స్ బ్యాట్స్మెన్పై జూలు విదిల్చారు. ఏ దశలోనూ అవకాశమివ్వకుండా చెలరేగారు. దీంతో ఎన్స్కాన్స్ తొలి ఇన్నింగ్స్లో 37.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్ ఆరంభించిన డెక్కన్ క్రానికల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది. వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారడంతో మొదటి రోజు పూర్తిస్థాయి ఆట సాధ్యపడలేదు. ఏఓసీ మైదానంలో ఎంపీ కోల్ట్స్- ఏఓసీ జట్ల మధ్య, రైల్వే గ్రౌండ్స్లో ఆర్.దయానంద్-దక్షిణమధ్య రైల్వే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ల్లో తొలి రోజు ఆట పూర్తిగా రద్దయింది. ఇతర మ్యాచ్ల స్కోర్లు బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 142 (అనిరుధ్ 6/56, అన్వర్ అహ్మద్ 2/61, పాండే 2/20), హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 91/1 (సరేందర్ సింగ్ 37 బ్యాటింగ్, వినయ్ గౌడ్ 34) ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 82 (సూర్యప్రకాశ్ 5/31, చందన్సహాని 5/46), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 229/3 (అన్షుల్ లాల్ 67, చైతన్యకృష్ణ 64 బ్యాటింగ్, శాండిల్య 41; కృష్ణచరిత్ 3/53) రాణించిన విశాల్: ఎస్బీహెచ్ 216/7 తొలి రోజు బ్యాటింగ్కు దిగిన అన్ని జట్లు ఆలౌటైతే ఒక్క ఎస్బీహెచ్ మాత్రమే విశాల్ శర్మ (94 బంతుల్లో 50 బ్యాటింగ్, 8 ఫోర్లు) రాణించడంతో నిలబడింది. ఆంధ్రాబ్యాంక్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో మొదటి రోజు ఆటలో ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. డాని డెరెక్ ప్రిన్స్ (38), శ్రీహరిరావు (37) ఫర్వాలేదనిపించారు. ఆంధ్రాబ్యాంక్ బౌలర్ ఎం.ఎ.ఖాదర్ 4 వికెట్లు తీశాడు. -
50 మీ. విజేత వైష్ణవి
డీఎస్ఏ సమ్మర్ అథ్లెటిక్స్ మీట్ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హెచ్డీఎస్ఏ సమ్మర్ అథ్లెటిక్స్ మీట్లో 50 మీటర్ల పరుగు పందెంలో వైష్ణవి స్వర్ణం గెలుచుకుంది. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (హెచ్డీఎస్ఏ) ఆధ్వర్యంలో ఈ మీట్ జింఖానా మైదానంలో శుక్రవారం జరిగింది. ఈ పోటీల విజేతలకు హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీఎస్ఏ అధికారి అలీమ్ ఖాన్ పతకాలను అందజేశారు. ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 బాలికల విభాగం: 50 మీ:1. కె.వైష్ణవి, 2.కవిత, 3.మోనిక, శ్రుతి. అండర్-10 బాలుర విభాగం: 50 మీ: 1.హర్షవర్ధన్, 2.హర్ష వర్మ, 3.యశ్వంత్. లాంగ్జంప్: 1.యశ్వంత్, 2.అరుణ్ కుమార్, 3.హర్షవర్ధన్. 100 మీ: 1.పి.కేశవ్, 2.సి.వంశీకృష్ణ, 3.ఆదిత్య. పురుషుల: 100 మీ: 1.ప్రతీక్, 2.శేఖర్, 3.దినేష్. 800 మీ: 1.శేఖర్, 2.బాలాజీ, 3.కేశవ్. లాంగ్జంప్: 1.లవుడు, 2.అజిత్, 3.అజిత్. -
చెస్ విజేత గౌతమ్
జింఖానా, న్యూస్లై న్: డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో బాలుర అండర్-16 విభాగంలో గౌతమ్ టైటిల్ సాధించాడు. మదర్ చెస్ అకాడమీ నిర్వహించిన ఈ పోటీల్లో గౌతమ్ ప్రథమ స్థానంలో నిలువగా, భార్గవ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అండర్-12 విభాగంలో సాయి సూరజ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో శ్రీరామ్ నిలిచాడు. బాలికల విభాగంలో నాగప్రసన్న విజేతగా నిలువగా, వినీత రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. బాలుర అండర్-10 విభాగంలో కార్తికేయ మొదటి స్థానంలో, అరవింద్ రెండో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో అమూల్య టైటిల్ దక్కించుకుంది. శ్రీశుభ ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర అండర్-8 విభాగంలో శ్రీఅనిల్ అగ్రస్థానంలో నిలువగా... రెండో స్థానాన్ని అవినాష్ సొంతం చేసుకున్నాడు. బాలికల విభాగంలో రిషిత టైటిల్ గెలుచుకోగా, వర్షిత రెండో స్థానంలో నిలిచింది. -
స్నేహిత్కు పతకం ఖాయం
ఇండియా ఓపెన్ టీటీ జింఖానా, న్యూస్లైన్: ఇండియా జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ క్యాడెట్ డబుల్స్ విభాగంలో స్నేహిత్ జోడి పతకం ఖాయం చేసుకుంది. భారత్ ‘బి’ జట్టుగా బరిలోకి దిగిన స్నేహిత్, హరికృష్ణ జోడి సెమీస్కు చేరింది. గోవాలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ‘బి’ 3-2తో భారత్ ‘సి’పై విజయం సాధించింది. తొలి సెట్లో 13-15 పరాజయం పాలైన భారత్ ‘బి’ 11-8తో రెండో సెట్ను దక్కించుకుంది. మూడో సెట్లో 9-11 వెనుకబడినప్పట్టికీ మిగతా సెట్లలో 11-7, 11-8 తేడాతో నెగ్గి మ్యాచ్ను గెలుచుకుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలో హరికృష్ణ మెయిన్ డ్రాలోకి ప్రవేశించాడు. గ్రూప్-3లో ఆడుతున్న హరికృష్ణ తొలుత 3-0తో సిద్ధాంత్ సునీల్పై, రెండో మ్యాచ్లో 3-0తో రొసారియో వెస్లీపై నెగ్గాడు. అయితే మూడో మ్యాచ్లో 2-3తో స్వీడన్కు చెందిన కార్ల్సన్ ఫిలిప్ చేతిలో ఓడాడు. ప్రస్తుతం హరికృష్ణ గ్రూపులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
స్నేహిత్కు కాంస్యం
ఇండియా ఓపెన్ టీటీ జింఖానా, న్యూస్లైన్: గ్లోబల్ జూనియర్ అండ్ క్యాడెట్ ఇండియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో స్నేహిత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో తొలి పతకాన్ని అందుకున్నాడు. భారత్-బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్నేహిత్ డబుల్స్లో జీత్ చంద్రతో కలిసి బరిలోకి దిగాడు. గోవాలో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్-బి 0-3తో సింగపూర్ చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో భారత్ 3-2తో స్వీడన్పై నెగ్గగా; రెండో మ్యాచ్లో 1-3తో భారత్-ఏ చేతిలో పరాజయం చవిచూసింది. మూడో మ్యాచ్లో భారత్-బి 2-3తో భారత్-సిపై గెలిచి ఫైనల్కు అర్హత సాధించింది. -
బీడీఎల్, డీసీ మ్యాచ్ డ్రా
చెలరేగిన ఆకాశ్ భండారి, రాజన్ ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జింఖానా, న్యూస్లైన్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్లో భాగంగా బీడీఎల్, డెక్కన్ క్రానికల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. గురువారం మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 317/4తో మూడో రోజు ఆటను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆకాశ్ భండారి (99) సెంచరీ అవకాశం కోల్పోగా... సందీప్ రాజన్ (72 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఫలితంగా డీసీ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. అంతకుముందు బీడీఎల్ తమ తొలి ఇన్నింగ్స్లో 389 పరుగులకు ఆలౌటైంది. దీంతో డెక్కన్ క్రానికల్కు 22 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్తో డెక్కన్ క్రానికల్ 8 పాయింట్లు సాధించగా, బీడీఎల్ 4 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఎన్స్కాన్స్తో ఆంధ్రా బ్యాంక్ మ్యాచ్ డ్రా ఎన్స్కాన్స్, ఆంధ్రా బ్యాంక్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. మ్యాచ్ మూడో రోజు గురువారం రెండో ఇన్నింగ్స్ప్రారంభించిన ఎన్స్కాన్స్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అరుణ్ దేవా (92), హిమాలయ్ అగర్వాల్ (55), హబీబ్ అహ్మద్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఆంధ్రా బ్యాంక్ జట్టుకు రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు అవకాశం లభించలేదు. అంతకుముందు ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్లో 337 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచిన ఆంధ్రా బ్యాంక్కు 10 పాయింట్లు దక్కగా, ఎన్స్కాన్స్ 5 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. -
చెలరేగిన విహారి
ఆంధ్రా బ్యాంక్ 337 ఎన్స్కాన్స్ 295 ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జింఖానా, న్యూస్లైన్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్మన్ విహారి (168 బంతుల్లో 111; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్లో భాగంగా ఎన్స్కాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో బుధవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా బ్యాంక్ 337 పరుగులు చేసి ఆలౌటైంది. నవీన్ రెడ్డి (88) అర్ధ సెంచరీతో రాణించగా, అమోల్ షిండే (40) ఫర్వాలేదనిపించాడు. అంతకుముందు ఎన్స్కాన్స్ జట్టు తొలిఇన్నింగ్స్లో 295 పరుగులు చేసి ఆలౌటైంది. హిమాలయ్ అగర్వాల్ (86), తన్మయ్ అగర్వాల్ (56), మెహదీ హసన్ (50) అర్ధసెంచరీలు చేశారు. అబ్దుల్ ఖాదర్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆంధ్రా బ్యాంక్ జట్టుకు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రాహుల్ సింగ్ మెరుపు సెంచరీ బీడీఎల్తో జరుగుతున్న మ్యాచ్లో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్మన్ రాహుల్ సింగ్ ( 66 బంతుల్లో 101; 23 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు సెంచరీతో విజృంభించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి డెక్కన్ క్రానికల్ 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఆకాశ్ బండారి (54 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రవీందర్ (49) మెరుగ్గా ఆడాడు. అంతకుముందు తొలిరోజు బ్యాటింగ్ చేసిన బీడీఎల్ 332 పరుగుల వద్ద ఆలౌటైంది. సుమంత్ (135), వెంకట్ (105) సెంచరీలతో కదంతొక్కారు. -
చెలరేగిన రవితేజ, నవీన్
జింఖానా, న్యూస్లైన్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్మెన్ రవితేజ (118 బంతుల్లో 172; 22 ఫోర్లు, 5 సిక్సర్లు), నవీన్ రెడ్డి (188 బంతుల్లో 150; 21 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. అద్భుతమైన బ్యాటింగ్తో ఇద్దరూ పరుగుల వరద పారించారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బుధవారం రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 330/8తో బరిలోకి దిగిన ఈఎంసీసీ మరో పరుగు చేయకుండానే మిగతా రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. అనంతర ం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్మెన్ రవితేజ, నవీన్ రెడ్డిలు బ్యాట్లు ఝుళిపించడంతో జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 424 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆంధ్రా బ్యాంక్ 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. విహారి (45), అర్జున్ యాదవ్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు. రాణించిన పవన్, కుషాల్ డెక్కన్ క్రానికల్తో జరుగుతున్న మ్యాచ్లో పవన్ కుమార్ (86 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్లు), కుషాల్ జిల్లా (119 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఎస్బీహెచ్ జట్టు భారీ స్కోరు చేసింది. రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 159/6తో ఆట కొనసాగించిన ఎస్బీహెచ్ 321 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఎస్బీహెచ్కు 155 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డెక్కన్ క్రానికల్ బౌలర్ సందీప్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆకాశ్ భండారి (59), సందీప్ రాజన్ (53 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగగా... షాదాబ్ తుంబి 42 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. -
రాణించిన భార్గవానంద్, వెల్ఫ్రెడ్
జింఖానా, న్యూస్లైన్: పోస్టల్ జట్టు బౌలర్లు భార్గవానంద్ (5/17), లెస్లీ వెల్ఫ్రెడ్ (4/18) చక్కని బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఎఫ్సీఐ జట్టుపై గెలుపొందింది. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఎఫ్సీఐ 68 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ రెండే వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. చంద్రకాంత్ 30 పరుగులు చేశాడు. మరో మ్యాచ్లో ఇండియన్ ఎయిర్లై న్స్ జట్టు 5 వికెట్ల తేడాతో నేషనల్ ఇన్సూరెన్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన నేషనల్ ఇన్సూరెన్స్ 101 పరుగులకే చేతులెత్తేసింది. ఇండియన్ ఎయిర్లైన్స్ బౌలర్లు సత్యనారాయణ 4 వికెట్లు తీసుకోగా... ప్రభు కిరణ్, సతీష్ కుమార్ తలా మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నేషనల్ ఇన్సూరెన్స్ 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. దీపక్ (37 నాటౌట్), జతిన్ మెహతా (34) మెరుగ్గా ఆడారు. నేషనల్ ఇన్సూరెన్స్ బౌలర్ సిద్ధు 3 వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్లో వీఎస్టీ జట్టు 3 వికెట్ల తేడాతో ఏపీ హైకోర్ట్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. మొదట వీఎస్టీ 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. పాల్ సింగ్ 33 పరుగులు చేశాడు. ఏపీ హైకోర్ట్ బౌలర్ విజయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఏపీ హైకోర్ట్ 7 వికెట్లకు 108 పరుగులు చేసింది. పండరీనాథ్ (43) ఫర్వాలేదనిపించాడు. వీఎస్టీ బౌలర్ అనీసుద్దీన్ 3 వికెట్లు పడ గొట్టాడు. -
ఫైనల్లో సంస్కృతి, సంజన
ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ జింఖానా, న్యూస్లైన్: ఆస్టర్ మైండ్స్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-12 బాలికల విభాగంలో సంస్కృతి, సంజన ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో సంస్కృతి 8-0తో ప్రాచిపై గెలుపొందగా, సంజన 8-2తో శ్రీహర్షితపై నెగ్గి తుది పోరుకు సిద్ధమైంది. అండర్-14 బాలికల విభాగంలో సంస్కృతి 6-2తో సృజనపై నెగ్గి సెమీస్కు చేరుకుంది. మరో మ్యాచ్లో లాస్య 6-1తో అవంతికా రెడ్డిపై, సంజన 6-1తో అర్చిత రెడ్డిపై గెలుపొందారు. బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో శశిప్రీతమ్ 7-6 (7/5)తో వరుణ్ కుమార్పై గెలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాడు. తనతో పాటు చెన్నాడి సాహిల్ 7-4తో అర్జున్ రెడ్డిపై, తనిష్క్ 7-6తో సుహిత్ రెడ్డిపై నెగ్గి సెమీస్కు చేరుకున్నారు. అండర్-12 బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో అన్నే ఆకాశ్ 7-5తో శశిధర్పై, కార్తీక్ నీల్ 7-2తో అనికేత్పై, తన్మయ్ 7-6తో కౌషిక్ కుమార్ రెడ్డిపై గెలిచారు. అండర్-10 విభాగంలో కార్తీక్ నీల్ 7-2తో ముకుంద్ రెడ్డిని ఓడించగా, సిద్ధార్థ్ రెడ్డి 7-0తో జయ్ కృష్ణపాల్పై గెలిచాడు. రుషికేశ్ 7-0తో యశ్వంత్ చౌదరిని, వర్షిత్ కుమార్ 7-6తో ప్రతినవ్ను ఓడించారు. -
చెస్ చాంపియన్ షణ్ముఖ తేజ
జింఖానా, న్యూస్లైన్: హైదరాబాద్ చాలెంజర్స్ చెస్ సెల క్షన్ టోర్నీలో షణ్ముఖ తేజ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. చిక్కడపల్లిలోని హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఈ టోర్నీలో బిపిన్ రాజ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మిధుష్ మూడో స్థానంలో, పూజాంజలి నాలుగో స్థానంలో నిలిచారు. వీరు మేలో జరగనున్న ఏపీ స్టేట్ చాంలెంజర్స్ పోటీల్లో హైదరాబాద్ జిల్లా తర ఫున పాల్గొంటారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం (ఏపీసీఏ) జనరల్ సెక్రటరీ కన్నా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఏ నిర్వాహక కార్యదర్శి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ కుర్రాడి సత్తా
మాంచెస్టర్లో శిక్షణకు ఎంపిక జింఖానా, న్యూస్లైన్: ఎయిర్టెల్ రైజింగ్ స్టార్స్ అండర్-16 ఫుట్బాల్ ప్రతిభాన్వేషణలో భాగంగా మాంచెస్టర్ యునెటైడ్ సాకర్ స్కూల్లో శిక్షణ పొందేందుకు హైదరాబాద్కు చెందిన కె.రాకేశ్ అర్హత సాధించాడు. గోవాలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల ఫైనల్ ట్రయల్స్లో 23 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ఆరు నెలల పాటు జరిగిన ఈ పోటీల్లో కోల్కత, ఢిల్లీ, ముంబై, గోవా, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల నుంచి గోల్కీపర్తో కలుపుకుని మొత్తం 11 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆటగాళ్ల శారీరక, మానసిక స్థితి, వారి క్రమశిక్షణ, ఆటతీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని మాంచెస్టర్ యునెటైడ్ కోచ్లు లామి సొనోల, కెవిన్ కొనెల్, డేవ్ చాప్మాన్, ఆడమ్ హిల్టన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. ఈ 11 మంది ఆటగాళ్లు వారం రోజుల పాటు ఇంగ్లండ్లోని మాంచెస్టర్ సాకర్ స్కూల్లో అక్కడి అకాడమీ జట్టుతో పాటు శిక్షణ పొందుతారు. -
ఫైనల్లో లయోలా, భవాన్స్
జింఖానా, న్యూస్లైన్: బీఎఫ్ఐ-ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ కాలేజి బాస్కెట్బాల్ లీగ్ బాలుర విభాగంలో లయోలా అకాడమీ, భవాన్స్ జట్లు ఫైనల్లోకి చేరుకున్నాయి. సికింద్రాబాద్లోని వైఎంసీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్లో లయోలా అకాడమీ 72-41తో ఏవీ కాలేజిపై విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి లయోలా ఆటగాళ్లు ఆధిక్యమే లక్ష్యంగా దూసుకెళ్లారు. ఒక దశలో లయోలా 26-11తో ముందంజలో ఉంది. అయితే ఏవీ కాలేజి ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించి లయోలా జట్టును కొంత మేరకు ప్రతిఘటించగలిగారు. అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి లయోలా 40-32తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండో అర్ధ భాగంలో లయోలా క్రీడాకారులు గణేశ్ (17), ఉదయ్ (17), చంద్రహాస్ (12), బాషా (11) విజృంభించడంతో జట్టుకు విజయం చేకూరింది. ఏవీ కాలేజి జట్టులో శ్యామ్సన్ (13), బాలాజీ (12), కిరణ్ (10) రాణించారు. మరో సెమీఫైనల్లో భవాన్స్ జట్టు 59-52తో సెయింట్ మార్టిన్స్పై గెలుపొందింది. ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 25-20తో భవాన్స్ కాలేజి ముందంజలో ఉంది. ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న భవాన్స్ చివరి వరకు అదే తీరును కొన సాగించింది. సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు జోనా (17), సంతోష్ (12), విశాల్ (10) ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. భవాన్స్ క్రీడాకారులు రోహన్ (23), విష్ణు (13), హేమంత్ (8) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇతర ఫలితాలు బాలికల విభాగం సెమీఫైనల్స్ లయోలా అకాడమీ : 44 ( అక్షిత 14, స్నేహ 11, రమా 10); సెయింట్ మార్టిన్స్: 26 (మనీష 10, ఐశ్వర్య 14). ప్రభుత్య వ్యాయామ విద్య కళాశాల: 48 (ప్రీతి 18, భవ్య 14, అమిత 14); సీవీఎస్ఆర్ సీఓఈ: 27 ( సుమలత 10, సౌమ్య 8, ప్రత్యూష 7). -
ఎండీ ఎలెవన్ జట్టు గెలుపు
జింఖానా, న్యూస్లైన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) నిర్వహించిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ క్రి కెట్ మ్యాచ్లో మేనేజింగ్ డెరైక్టర్స్ (ఎండీ) ఎలెవన్ జట్టు విజేతగా నిలిచింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఎండీ ఎలెవన్ జట్టు 16 పరుగుల తేడాతో చీఫ్ జనరల్ మేనేజర్స్ (సీఎంజీ) ఎలెవన్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎండీ ఎలెవన్ 131 పరుగులు చేసి ఆలౌటైంది. వెంకటేశ్ రెడ్డి (38), మురళి (15) ఫర్వాలేదనిపించారు. సీఎంజీ ఎలెవన్ బౌలర్ జ్యోత్ ఘోష్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన సీఎంజీ ఎలెవన్ 115 పరుగులకే కుప్పకూలింది. నిగమ్ (48), శామ్సన్ (15) చక్కని ఆట తీరు కనబరిచారు. ఎండీ ఎలెవన్ బౌలర్ వాసుకి 3 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ని దక్కించుకోగా... వెంకటేశ్ రెడ్డి ‘బెస్ట్ ఫీల్డర్’ టైటిల్ని సొంతం చేసుకున్నాడు. సీఎంజీ ఎలెవన్ క్రీడాకారుడు నిగమ్ ‘బెస్ట్ బ్యాట్స్మన్’ టైటిల్ని గెలుచుకోగా... జ్యోత్ ఘోష్ ‘బెస్ట్ బౌలర్’ టైటిల్ని కైవసం చేసుకున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. భగవంత రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
ఫైనల్లో మిష్గాన్, అవంతిక
జింఖానా, న్యూస్లైన్: ఏపీఎల్టీఏ ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలికల సింగిల్స్ విభాగంలో మిష్గాన్ ఒమర్, అవంతిక రెడ్డి ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్లో మిష్గాన్ 7-1తో స్మృతి బాసిన్పై, అవంతిక రెడ్డి 7-4తో రాయల సంజనపై విజయం సాధించారు. అండర్-12 బాలుర విభాగంలో రాహుల్ చందన ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొయినాబాద్లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో రాహుల్ 7-2తో కౌశిక్ కుమార్ రెడ్డిపై విజయం సాధించాడు. మరో సెమీఫైనల్లో అన్నే ఆకాశ్ 7-0తో భాస్కర్ మోహన్ రాయ్పై నెగ్గి తుది పోరుకు సిద్ధమయ్యాడు. మరోవైపు బాలికల విభాగం క్వార్టర్ఫైనల్లో రాయల సంజన 7-2తో సుమనను ఓడించి సెమీస్కు చేరుకుంది. స్మృతి బాసిన్ 7-6 (7/4 )తో ఇషికా అగర్వాల్పై గెలవగా... అవంతిక రెడ్డి 7-4తో రాయల సృజనపై గెలుపొందింది. అయితే సంజన సిరిమల్లతో జరిగిన మ్యాచ్లో వేద వర్షిత వాకోవర్ ఇచ్చింది. ఇతర ఫలితాలు బాలుర అండర్-10 సెమీఫైనల్స్: ఆయుష్ భట్ 7-1తో యశ్వంత్పై, దాసరి అభిరామ్ 7-6 (7/2)తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలిచారు. అండర్-14 సెమీఫైనల్స్: సాహి 7-5తో అఖి ల్ని, శశి ప్రీతమ్ 7-4తో నిషాద్ను ఓడించారు. బాలికల అండర్-10 సెమీఫైనల్స్: తనుషితా రెడ్డి 7-4తో వేద వర్షితపై, సంజన సిరిమల్ల 7-2తో నేహపై నెగ్గారు. -
ఫైనల్లో మెదక్, నిజామాబాద్
జింఖానా, న్యూస్లైన్: అంతర్ జిల్లా అండర్-14 వన్డే క్రికెట్ టోర్నీలో మెదక్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెదక్ 64 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన మెదక్ 221 పరుగులు చేసి ఆలౌటైంది. అబ్దుల్ గఫూర్ (45), ఉదయ్ కిరణ్ (37) ముఖేశ్ (37) ఫర్వాలేదనిపించారు. అనంతరం బరిలోకి దిగిన కరీంనగర్ 157 పరుగులకే కుప్పకూలింది. సాయి వినయ్ (34) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. మరో సెమీఫైనల్లో నిజామాబాద్ జట్టు 81 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట నిజామాబాద్ 8 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. హర్షవర్ధన్ (89), అఫ్రోజ్ ఖాన్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత బరిలోకి దిగిన ఆదిలాబాద్ 180 పరుగుల వద్ద ఆలౌటైంది. హిమతే జ్ (51 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. నిజామాబాద్ బౌలర్ అనిరుధ్ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు. రాణించిన త్రిశాంక్, అజీమ్ ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ వాండరర్స్ బౌలర్లు త్రిశాంక్ గుప్తా (5/32), అజీమ్ (5/32) చెరో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలుచూపించారు. దీంతో ఆ జట్టు 156 పరుగుల భారీ తేడాతో మహబూబ్ కాలేజి జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట హైదరాబాద్ వాండరర్స్ 240 పరుగులు చేసి ఆలౌటైంది. భవేశ్ (58) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఓవైసీ (43) మెరుగ్గా ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబ్ కాలేజి 84 పరుగులకే చేతులెత్తేసింది. -
రన్నరప్ హైదరాబాద్
జింఖానా,న్యూస్లైన్: సీనియర్ మహిళల ఎలైట్ సూపర్ లీగ్ ట్వంటీ 20 టోర్నీలో హైదరాబాద్ జట్టు రన్నరప్గా నిలిచింది. పంజాబ్తో గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. వాణి 36 పరుగులు చేసింది.హైదరాబాద్ బౌలర్లలో డయానా డేవిడ్ రెండు వికెట్లు పడగొట్టగా... మమత, కావ్య తలా ఓ వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. షాలిని (22 నాటౌట్), మమత (20 నాటౌట్), సింధుజ (18), స్నేహ (17) ఫర్వాలేదనిపించారు. ఈ విజయంతో మొత్తం 8 పాయింట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలువగా... మరోవైపు 12 పాయింట్లు సాధించిన రైల్వేస్ జట్టు విజేతగా నిలిచింది. -
సెయింట్ మార్టిన్స్ గెలుపు
జింఖానా, న్యూస్లై న్: బీఎఫ్ఐ-ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్బాల్ లీగ్లో సెయింట్ మార్టిన్స్ జట్టు 38-31తో బిట్స్ పిలాని జట్టుపై నెగ్గింది. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 12-7తో సెయింట్ మార్టిన్స్ ముందంజలో ఉంది. అనంతరం రెండో అర్ధ భాగంలో బిట్స్ పిలాని ప్లేయర్లు... ప్రత్యర్థిని ఎదుర్కునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ సెయింట్ మార్టిన్స్ క్రీడాకారిణులు మనీషా (17), దివ్యవాణి (10), ఐశ్వర్య (8)ల జోరును మాత్రం అడ్డుకోలేకపోయారు. బిట్స్ పిలాని జట్టులో మేహ (14), అపూర్వ (10) రాణించారు. మరో మ్యాచ్లో సీవీఎస్ఆర్ కాలేజి 40-28తో గోకరాజు రంగరాజు కాలేజిపై విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి సీవీఎస్ఆర్ క్రీడాకారిణులు ప్రత్యూష (18), శ్రేష్ఠ (15) దూకుడును ప్రదర్శించారు. గోకరాజు రంగరాజు జట్టు సభ్యులు సీవీఎస్ఆర్ను ప్రతిఘటించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ చివరి వరకు సీవీఎస్ఆర్ అమ్మాయిలు అదే ఆటతీరును కొనసాగించి విజయాన్ని దక్కించుకున్నారు. గోకరాజు రంగరాజు జట్టులో మృణాళిని (18) చక్కని ప్రతిభ కనబరిచింది. ఇతర ఫలితాలు పురుషుల విభాగం: బిట్స్ పిలాని: 30 (ఇషాన్ 16, కాకా 10); సీవీఎస్ఆర్ కాలేజి: 20 (జెన్ని 6, ఫైజల్ 6). ఏవీ కాలేజి: 51 (శామ్సన్ 20, బాలాజి 14, సాయి 13); అవంతి డిగ్రీ కాలేజి: 37 (జశ్వంత్ 17, అక్రమ్ 11). -
విజేత చెన్నై లయోలా
జింఖానా, న్యూస్లైన్ : ఫాదర్ బాలయ్య స్మారక క్రీడల్లో భాగంగా జరిగిన బాస్కెట్బాల్ టోర్నమెంట్లో చెన్నై లయోలా జట్టు విజేతగా నిలిచింది. లయోలా కాలేజిలో బుధవారం జరిగిన ఫైనల్లో చెన్నై లయోలా 80-65తో లయోలా అకాడమీ (హైదరాబాద్)పై గెలిచింది. ఆట ప్రారంభంలో చెన్నై లయోలా కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ... లయోలా అకాడమీ ఆటగాళ్లు గణేశ్, ఉదయ్, డేవిడ్ ప్రతిఘటించారు. అయినా మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 35-32తో చెన్నై లయోలా ముందంజలో నిలిచింది. అనంతరం విజృంభించిన చెన్నై లయోలా ఆటగాళ్లు కార్తికేయన్ (23), ఆంటో (23) చక్కటి ఆటతీరుతో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జట్టును ముందంజలో ఉంచేందుకు దోహదపడ్డారు. చివరి వరకు లయోలా అకాడమీ క్రీడాకారులు జోస్ (15), చంద్రహాస్ (14) ఎదుర్కునేందుకు ప్రయత్నించిన ప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో లయోలా అకాడమీ రన్నరప్తో సరిపెట్టుకుంది. అనంతరం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో ఏవీ కాలేజి 56-45తో సెయింట్ మార్టిన్స్పై గెలుపొందింది. సాక్రెడ్ హార్ట్కు వాలీబాల్ టైటిల్ వాలీబాల్ ఫైనల్లో సాక్రెడ్ హార్ట్ (తిరుపత్తూర్) జట్టు 25-22, 25-21, 21-25, 25-20తో జమాల్ మహ్మద్ (తిరుచ్చి) జట్టుపై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో జమాల్ మహ్మద్ జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ సాక్రెడ్ హార్ట్ జట్టు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మూడో సెట్లో జమాల్ మహ్మద్ ఆటగాళ్లు సాక్రెడ్ హార్ట్ జట్టును కంగుతినిపించారు. అనంతరం నాలుగో సెట్లో తేరుకున్న సాక్రెడ్ హార్ట్ చాకచక్యంగా వ్యవహరించి టైటిల్ను దక్కించుకుంది. తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో లయోలా అకాడమీ 24-25, 18-25, 19-25, 25-15, 15-10తో ఆంధ్రా లయోలా కాలేజిపై గెలిచింది. విజేతలకు గ్రేట్ స్పోర్ట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్. అనిల్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. -
ఫైనల్లో పోస్టల్
జింఖానా, న్యూస్లైన్: కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో పోస్టల్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో పోస్టల్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో హెచ్యూసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్యూసీసీ 116 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 120 పరుగులు చేసింది. క్రాంతి కుమార్ (59 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... విజయ్ కుమార్ 31 పరుగులు చేశాడు. అంతర్ జిల్లా అండర్-14 వన్డే టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో నిజామాబాద్ జట్టు 166 పరుగుల తేడాతో నల్గొండ జట్టుపై గెలుపొందింది. మొదట నిజామాబాద్ 264 పరుగులు చేసి ఆలౌటైంది. అనికేత్ రెడ్డి (97), అఫ్రోజ్ ఖాన్ (57) అర్ధ సెంచరీలతో చెలరేగారు. నల్గొండ బౌలర్ గోవింద్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నల్గొండ 98 పరుగులకే చేతులెత్తేసింది. నిజామాబాద్ బౌలర్లు అనికేత్ రెడ్డి, సుచిత్ చెరి మూడు వికెట్లు తీసుకున్నారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు ఆదిలాబాద్: 205 (హిమతేజ 42, రోహన్ 35; సుజిత్ 3/33); వరంగల్: 130 (సుకృత్ 35; హర్షద్ 5/36). ఖమ్మం: 95 (సిద్ధార్థ్ రెడ్డి 6/31); కరీంనగర్: 100/3 (శ్రీకిరణ్ 40 నాటౌట్). -
ఫైనల్లో షణ్ముఖ అంజన్
జింఖానా, న్యూస్లైన్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్-13 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సాయి షణ్ముఖ అంజన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కడపలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ అంజన్ 21-16, 21-9తో మన రాష్ట్రానికే చెందిన రితిన్పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో టాప్ సీడ్ మైస్నమ్ మియరబా (మణిపూర్) 21-12, 21-12తో మూడో సీడ్ వరుణ్ దేవ్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. మరో వైపు బాలికల డబుల్స్ విభాగం సెమీఫైనల్లో వైష్ణవి రెడ్డి- పుల్లెల గాయత్రి జోడి 17-21, 21-16, 22-24తో రిచా ముక్తిబోద్ (కర్ణాటక) -సిమ్రాన్ (మహారాష్ట్ర) జోడి చేతిలో ఓటమి చవిచూసింది. మరో సెమీఫైనల్లో దీత్య జగదీశ్- మేధ శశిధరణ్ (కర్ణాటక) జోడి 23-21, 21-13తో జోషి దివ్యాన్షి-షిఫాలి గౌతమ్ (ఉత్తరప్రదేశ్) జోడిపై నెగ్గింది. ఇతర ఫలితాలు: అండర్-15 బాలుర విభాగం: లక్ష్యసేన్ (ఉత్తరప్రదేశ్) 21-10, 21-14తో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)పై, రాహుల్ భరద్వాజ్(కర్ణాటక) 13-21, 21-11, 21-16తో ఓరిజిత్ చాలిహపై గెలిచారు. బాలికల విభాగం: పూర్వ బార్వె (మహారాష్ట్ర) 21-16, 22-20తో పూజ దేవ్లేకర్ (మహారాష్ట్ర)పై, అశ్విన్ భట్ (కర్ణాటక) 21-18, 21-19తో రియా ఆరోల్కర్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు. బాలికల డబుల్స్: అశ్విన్ భట్-మిథుల జంట (కర్ణాటక ) 21-19, 23-21తో రియా అరోల్కర్-పూర్వ బార్వె (మహారాష్ట్ర) ద్వయంపై నెగ్గింది. -
లయోలా అకాడమీ హవా
జింఖానా, న్యూస్లైన్: ఫాదర్ బాలయ్య స్మారక ఆలిండియా ఇంటర్ కాలేజి బాస్కెట్బాల్ టోర్నీలో లయోలా అకాడమీ జట్టు 59-25తో జమాల్ మహ్మద్ (తిరుచ్చి) జట్టుపై గెలుపొందింది. లయోలా కాలేజిలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో లయోలా అకాడమీ ఆటగాళ్లు బాషా (17), ఉదయ్ (14), గణేశ్ (12) రాణించారు. దీంతో అతి తక్కువ సమయంలోనే లయోలా అకాడమీ 18 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు జమాల్ మహ్మద్ క్రీడాకారులు ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మ్యాచ్ అఖరి నిమిషం వరకు తమ జోరును కొనసాగించిన లయోలా ఆటగాళ్లు జట్టును 34 పాయింట్ల ఆధిక్యంలో నిలిపారు. మరో మ్యాచ్లో లయోలా (చెన్నై) 81-57తో ఎన్సీ లా కాలేజి (నాందేడ్)పై గెలిచింది. ఆట ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో ఒక దశలో లయోలా 49-43తో ముందంజలో ఉంది. అనంతరం లయోలా జట్టులో ముకుంద్ (23), ఆంటో (17) చక్కని ఆట తీరును ప్రదర్శించి జట్టుకు విజయాన్ని అందించారు. ఎన్సీ లా కాలేజి క్రీడాకారుల్లో రంజిత్ (14), అమల్ (10) రాణించారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు: ఏవీ కాలేజి (హైదరాబాద్): 69 (శామ్ 19, విజయ్ 12, సాయి 14); ఆర్జేజే (ముంబై): 57 (ప్రఫుల్ 15, అకాంక్ష్ 10). -
రవితేజ, నవీన్ శతకాల హోరు
జింఖానా, న్యూస్లైన్: బ్యాట్స్మెన్ రవితేజ (115), నవీన్ రెడ్డి (101) సెంచరీలతో కదం తొక్కడంతో ఆంధ్రాబ్యాంక్ జట్టు 6 వికెట్ల తేడాతో డెక్కన్ క్రానికల్ జట్టుపై విజయం సాధించింది. హెచ్సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ క్రానికల్ 9 వికెట్ల న ష్టానికి 302 పరుగులు చేసింది. రాహుల్ సింగ్ (147) సెంచరీతో విజృంభించగా... షాబాద్ (39), సుందర్ కుమార్ (34 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆంధ్రాబ్యాంక్ బౌలర్ కనిష్క్ నాయుడు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన ఆంధ్రాబ్యాంక్ నాలుగే వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి నెగ్గింది. మరో మ్యాచ్లో ఎస్బీహెచ్ జట్టు 17 పరుగుల తేడాతో ఎన్స్కాన్స్ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన ఎస్బీహెచ్ 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అహ్మద్ ఖాద్రీ (45), కుషాల్ (42), శ్రీహరి రావు (38 నాటౌట్) మెరుగ్గా ఆడారు. ఎన్స్కాన్స్ బౌలర్ రోహన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఎన్స్కాన్స్ 211 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇబ్రహీం ఖలీద్ (59) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఎస్బీహెచ్ బౌలర్ రవికిరణ్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. -
రెండో రౌండ్లో సాత్విక్
జింఖానా, న్యూస్లైన్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్-15 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ సాయి రాజ్ మెయిన్ డ్రా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. కడపలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన మొదటి రౌండ్లో నాలుగో సీడ్ సాత్విక్ సాయి రాజ్ 21-9, 21-11తో కరణ్ నేగి (హిమాచల్ప్రదేశ్)పై విజయం సాధించాడు. శ్రీదత్తాత్రేయ రెడ్డి 21-12, 21-11తో అఫ్రాజ్ మహ్మద్ (ఢిల్లీ)పై గెలుపొందాడు. అయితే మరో వైపు హర్ష 4-21, 2-21తో ప్రాకార్ (మధ్యప్రదేశ్) చేతిలో, ఖదీర్ మొయినుద్దీన్ మహ్మద్ 15-21, 8-21తో ఆకాశ్ ఠాకూర్ (బీహార్) చేతిలో పరాజయం పాలయ్యారు. బాలికల విభాగంలో అక్షిత 21-18, 17-21, 21-18తో మణిదీప (పశ్చిమబెంగాల్)పై, తనిష్క్ 21-13, 21-13తో సిమ్రాన్ సింగ్ (మహారాష్ట్ర)పై గెలిచి రెండో రౌండ్కు చేరుకున్నారు. ఇతర ఫలితాలు అండర్-13 బాలుర విభాగం: సాయి చరణ్ 21-14, 21-18తో తుషార్ భండారి (ఉత్తరప్రదేశ్)పై, పవన్ కృష్ణ 22-20, 21-14తో తుహిన్ చేతియా (అస్సాం)పై, రితిన్ 20-22, 21-17, 21-7తో వికాస్ యాదవ్ (ఢిల్లీ)పై, శ్రీకర్ 21-11,21-4తో హ్రిశవ్ బారువా (అస్సాం)పై, సాయి షణ్ముఖ అంజన్ 21-8, 21-7తో ఇషాన్ మిట్టల్ (మధ్యప్రదేశ్)పై విజయం సాధించారు. బాలికల విభాగం: వైష్ణవి రెడ్డి 21-14, 21-17తో జోషి దివ్యాన్షు (ఉత్తరప్రదే శ్)పై, వెన్నెలశ్రీ 14-21, 21-19, 21-16తో అనుప్రభ (తమిళనాడు)పై, గాయత్రి 21-7, 21-14తో రోషిణి వెంకట్ (కర్ణాటక)పై, మేఘ 21-13, 15-21, 21-13తో తన్వి ఇక్బాల్ (మేఘాలయ)పై, నిషిత వర్మ 21-7, 21-12తో అదితి వర్మ (మధ్యప్రదేశ్)పై గెలుపొందారు. -
మెయిన్ డ్రాకు కృష్ణప్రసాద్
జింఖానా, న్యూస్లైన్: అఖిల భారత సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నీలో అండర్-15 బాలుర సింగిల్స్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కృష్ణప్రసాద్ మెయిన్ డ్రాకు చేరుకున్నాడు. కడపలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో కృష్ణప్రసాద్ 15-10, 15-13తో హర్యానాకు చెందిన తరుణ్పై గెలుపొందాడు. మరో మ్యాచ్లో శ్రీకృష్ణ సాయి కుమార్ 15-12, 15-12తో నవనీత్ (ఏపీ) పై నెగ్గగా... శ్రీ దత్తాత్రేయ రెడ్డి 15-10, 9-15, 15-12తో జయరాజ్ (అస్సాం)పై గెలిచాడు. అయితే మరో వైపు బషీర్ 12-15, 13-15తో ఆకాశ్ (బీహార్) చేతిలో, చంద్రజ్ పట్నాయక్ 12-15, 13-15తో అమన్ రైక్వార్ (మధ్యప్రదేశ్) చేతిలో పరాజయం పాలయ్యారు. బాలికల విభాగంలో షబానా బేగం 15-10, 15-13తో శివాని (కర్ణాటక)ని ఓడించి మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. ఇతర ఫలితాలు: అండర్-13 బాలుర విభాగం: సాయి చరణ్ 15-10, 15-8తో జయంత్ సిసోడియా (మధ్యప్రదేశ్)పై, అనిరుధ్ పర్వత రె డ్డి 15-7, 15-10తో భవ్య అగర్వాల్ (మహారాష్ట్ర)పై నెగ్గారు. అండర్-15 బాలుర డబుల్స్: వరప్రసాద్- ఎం తరుణ్ జోడి 21-13, 21-11తో సాయి రోహిత్-ఆకాశ్ చంద్రన్ జోడిపై, విష్ణువర్ధన్- శ్రీకృష్ణ సాయి కుమార్ జోడి 15-12, 16-14, 15-12తో నవనీత్-తరుణ్ కుమార్ జోడిపై గెలిచారు. -
విజేత టీకేఆర్ఈసీ
జింఖానా, న్యూస్లైన్: జేఎన్టీయూహెచ్ జోన్-ఎ క్రికెట్ టోర్నీ ఫైనల్లో తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి (టీకేఆర్ఈసీ) విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీకేఆర్ఈసీ కాలేజి 7 వికెట్ల తేడాతో తీగల కృష్ణారెడ్డి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి (టీకేఆర్సీఈటీ) జట్టుపై విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన టీకేఆర్సీఈటీ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. నందు (31) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. టీకేఆర్ఈసీ బౌలర్ వ ంశీ 2 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన టీకేఆర్ఈసీ 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. వంశీ (96) అర్ధ సెంచరీతో రాణించాడు. టీకేఆర్సీఈటీ బౌలర్ అనిరుధ్ ఒక వికెట్ తీసుకున్నాడు. -
నిఖిల్దీప్ శ్రమ వృథా
జింఖానా, న్యూస్లైన్: ఈఎంసీసీ బౌలర్ నిఖిల్దీప్ (5/52) చక్కని బౌలింగ్తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసినప్పటికీ ఆ జట్టుకు విజయం చేకూరలేదు. హెచ్సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో డెక్కన్ క్రానికల్ జట్టు 149 పరుగుల భారీ తేడాతో ఈఎంసీసీ జట్టుపై విజయం సాధించింది. తొలుత డెక్కన్ క్రానికల్ 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (76), రాజన్ (50), రాహుల్ సింగ్ (58) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఈఎంసీసీ 158 పరుగులకే చేతులెత్తేసింది. సూర్యతేజ (95 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. డెక్కన్ క్రానికల్ బౌలర్ షబాబ్ తుంబి 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్లో ఎన్స్కోన్స్ బౌలర్ రోహన్ 5 వికెట్లు పడగొట్టి బీడీఎల్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. తొలుత బీడీఎల్ 191 పరుగులకు కుప్పకూలింది. యతిన్ రెడ్డి (50) అర్ధ సెంచరీతో రాణించగా... సంతోష్ (40), సుమంత్ (30) ఫర్వాలేదనిపించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఎన్స్కోన్స్ వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసి నెగ్గింది. తన్మయ్ అగర్వాల్ (84 నాటౌట్), ఇబ్రహీం ఖలీద్ (50 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించగా... అజ్మత్ ఖాన్ 34 పరుగులు చేశాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు ఎస్బీహెచ్: 316/8 (అనిరుధ్ సింగ్ 49, సుమంత్ 47, కుషాల్ 54, ఆకాశ్ 41); ఏఓసీ: 272 (సచిన్ 49, పెంటారావు 129; ఆల్ఫ్రెడ్ అబ్సొలేమ్ 4/34, ఆకాశ్ బండారి 4/47). ఆంధ్రాబ్యాంక్: 242/6 (నవీన్ రెడ్డి 48, రవితేజ 67, విహారి 48, అభినవ్ కుమార్ 36 నాటౌట్); ఎస్సీఆర్ఎస్ఏ: 165 (బాషా 51, లలిత్ మోహన్ 3/37). -
రాజశేఖర్కు స్వర్ణం
జింఖానా, న్యూస్లైన్: అంతర్ కళాశాలల తైక్వాండో చాంపియన్షిప్ పురుషుల 87 కేజీల విభాగంలో ఏవీ కాలేజి విద్యార్థిరాజశేఖర్ స్వర్ణ పతకం సాధించగా, కిరణ్ కుమార్ (అరోరా కాలేజి) కాంస్యంతో సంతృప్తిపడ్డాడు. బుధవారం జరిగిన ఈ పోటీల్లో 80 కేజీల కేటగిరీలో కిరణ్, సాయి కిరణ్ (అవంతి కాలేజి) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు. నిఖిల్ (అరోరా) కాంస్యం దక్కించుకున్నాడు. 74 కేజీల విభాగంలో నరసింహ (పల్లవి కాలేజి) స్వర్ణ పతకాన్ని, నవీన్ (అరోర) కాంస్య పతకాన్ని సాధించారు. విజేతలకు ఓయూ ఐసీటీ కార్యదర్శి డాక్టర్ బి. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఇతర మ్యాచ్ల ఫలితాలు 54 కేజీ: 1. ప్రదీప్ కుమార్ (అరోర), 2. రవి (అవంతి), 3. విక్రమ్, 4. లాలూ ప్రసాద్ (ఎస్ఏపీ కాలేజి). 58 కేజీ: 1. నరేష్ (ఎస్ఏపీ కాలేజి), 2. హర్ష (అరోరా), 3. భరత్ (మహూబియా కాలేజి). 63 కేజీ: 1. గోవింద్ శర్మ (భవాన్స్), 2. సుధీర్ (అవంతి), 3. సంతోష్ కుమార్ (వెస్లీ కాలేజి), 4. సాయి కిరణ్ (అరోరా). 68 కేజి: 1. ప్రవీన్ (ఏవీ కాలేజి), 2. మహేష్ (అరోరా), 3. మహేందర్ (అవంతి), 4. నిరుపమ్ రెడ్డి (పీజీ లా కాలేజి). -
రాణించిన సచిన్
జింఖానా, న్యూస్లైన్: బ్యాటింగ్లో సచిన్ (77 నాటౌట్) రాణించడంతో ఏఓసీ జట్టు హెచ్సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో విజయాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఇండియా సిమెంట్ జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండి యా సిమెంట్ 213 పరుగులు చేసింది. అసదుద్దీన్ (52) అర్ధ సెంచరీతో రాణించగా... షాకీర్ (32), ఫయాజ్ అహ్మద్ (36), సంగ్రామ్ (33) ఫర్వాలేదనిపించారు. అనంతరం బరిలోకి దిగిన ఏఓసీ మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి నెగ్గింది. సచిన్తో పాటు ఆర్కే పాండే (59) అర్ధ సెంచరీతో చెలరేగాడు. మరో మ్యాచ్లో ఆంధ్రాబ్యాంక్ జట్టు 5 వికెట్ల తేడాతో ఆర్ దయానంద్ జట్టుపై విజయం సాధించింది. మొదట ఆర్ దయానంద్ 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. నిమేష్ (77) రాణించాడు. తర్వాత ఆంధ్రాబ్యాంక్ 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. రవితేజ (54), నవీన్ (61), అభినవ్ కుమార్ (42) మెరుగ్గా ఆడారు. మరో మ్యాచ్లో బీడీఎల్ జట్టు 9 వికెట్ల తేడాతో ఎవర్గ్రీన్ జట్టుపై నెగ్గింది. మొదట ఎవర్గ్రీన్ 180 పరుగులు చేయగా... బీడీఎల్ ఒక వికెట్ కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. -
చెలరేగిన స్రవంతి నాయుడు
జింఖానా, న్యూస్లైన్: స్రవంతి నాయుడు (49 నాటౌట్), సింధుజా రెడ్డి (23 నాటౌట్) రాణించడంతో ఆలిండియా సీనియర్ మహిళల టి20 టోర్నీలో హైదరాబాద్ జట్టు 43 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలిచింది. బుధవారం జింఖానాలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర 19.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు అనన్య ఉపేంద్ర, కావ్య చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదం చేశారు. ఈ గెలుపుతో హైదరాబాద్కు 4 పాయింట్లు లభించాయి. ఆకట్టుకున్న మిథాలీ మరో మ్యాచ్లో రైల్వేస్ జట్టు 9 వికెట్ల తేడాతో హర్యానాపై నెగ్గింది. మొదట హర్యానా 20 ఓవర్లలో 5 వికెట్లకు 50 పరుగులు చేసింది. ఎఎన్ తోమర్ (22) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత రైల్వేస్ 10.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్ (39 నాటౌట్) ఆకట్టుకుంది. రైల్వేస్కు 4 పాయింట్లు దక్కాయి. -
హైదరాబాద్ విజయం
జింఖానా, న్యూస్లైన్: అఖిల భారత సీనియర్ మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో హర్యానాతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించింది. జింఖానా మైదానంలో ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి మ్యాచ్లో హైదరాబాద్ 45 పరుగుల తేడాతో హర్యానా జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. స్రవంతి నాయుడు 22 పరుగులు చేసింది. హర్యానా బౌలర్లు మాన్సి జోష్, ప్రీతి బోస్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన హర్యానా 19.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు కావ్య 3, డయానా 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో హైదరాబాద్ కు 4 పాయింట్లు దక్కాయి. రెండో మ్యాచ్లో ఒడిశా జట్టు 22 పరుగులతో మహారాష్ట్రను ఓడించింది. ఏఓసీ సెంటర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బరిలోకి దిగిన ఒడిశా 97 పరుగులకు ఆలౌటైంది. స్మిత (35), ఎంపీ మెహత (23) ఫర్వాలేదనిపించారు. మహారాష్ట్ర బౌలర్ విద్య 3 వికెట్లు చేజిక్కించుకుంది. తర్వాత బరిలోకి దిగిన మహారాష్ట్ర జట్టు 18 ఓవర్లలో 75 పరుగులకే చేతులెత్తేసింది. మందన (37) మెరుగ్గా ఆడింది. ఒడిశా బౌలర్ రోషనార ప్రవీణ 2 వికెట్లు తీసుకుంది. -
ఆంధ్రప్రదేశ్కు కాంస్య పతకం
జింఖానా, న్యూస్లైన్: జాతీయ మహిళల పైకా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ జట్టు కాంస్య పతకం సాధించింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు గురువారం ముగిశాయి. హ్యాండ్బాల్ ఈవెంట్లో మూడో స్థానం కోసం జరిగిన పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టు... ఉత్తర్ప్రదేశ్ జట్టుపై గెలిచింది. అయితే అంతకుముందు జరిగిన ఫైనల్లో పంజాబ్ జట్టు... హర్యానా జట్టుపై నెగ్గి స్వర్ణ పతకం గెలుచుకుంది. హర్యానా రజతంతో సరిపెట్టుకుంది. మార్చ్పాస్ట్లో మణిపూర్ విజేతగా నిలవగా... ఆంధ్రప్రదేశ్ రన్నరప్గా నిలిచింది. హాకీ పోటీల్లో ప్రథమ స్థానంలో హర్యానా, వరుసగా రెండు, మూడు స్థానాల్లో మధ్యప్రదేశ్, ఒరిస్సా జట్లు నిలిచాయి. లాన్ టెన్నిస్లో హర్యానా విజేతగా నిలవగా... చండీగఢ్ రెండో స్థానాన్ని, ఢిల్లీ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఓవరాల్ చాంపియన్షిప్ను 20 పాయింట్లు సాధించిన హర్యానా గెలుచుకుంది. విజేతలకు హైదరాబాద్ కలెక్టర్ ముఖేశ్ కుమార్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. -
సెయింట్ పీటర్స్ విజయం
జింఖానా, న్యూస్లైన్: జేఎన్టీయూహెచ్ జోన్-ఏ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో సెయింట్ పీటర్స్ కాలేజి 8 వికెట్ల తేడాతో వర్ధమాన్ కాలేజిపై గెలుపొందింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన వర్ధమాన్ కాలేజి 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. శ్రీకాంత్ 23 పరుగులు చేశాడు. సెయింట్ పీటర్స్ బౌలర్ అజయ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన సెయింట్ పీటర్స్ కాలేజి రెండే వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి నెగ్గింది. సుమిత్ (61) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో మ్యాచ్లో టర్బో ఇంజినీరింగ్ కాలేజి (టీఐఎస్టీ) 7 వికెట్ల తేడాతో జేఎన్టీయూహెచ్పై గెలిచింది. మొదట బరిలోకి దిగిన టీఐఎస్టీ 80 పరుగులు చేసి ఆలౌటైంది. సచిన్ 18 పరుగులు చేశాడు. జేఎన్టీయూహెచ్ బౌలర్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన జేఎన్టీయూహెచ్ మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి గెలిచింది. అమీర్ (30) ఫర్వాలేదనిపించాడు. టీఐఎస్టీ బౌలర్ 3 వికెట్లు పడగొట్టాడు. -
విజేతలు అహ్మద్, సవిత
జింఖానా, న్యూస్లైన్: అంతర్ జిల్లా క్యారమ్ చాంపియన్షిప్ పురుషుల విభాగంలో ఎండీ అహ్మద్, మహిళల విభాగంలో సవితా దేవి విజేతలుగా నిలిచారు. ఖమ్మంలోని జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించిన ఈ పోటీల్లో బుధవారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో అహ్మద్ 22-15, 25-7, 27-13తో నవీన్పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్లో అహ్మద్ 25-20, 14-25, 25-4తో దినేష్ బాబుపై, నవీన్ 21-4, 10-25, 25-22తో వసీమ్పై గెలుపొందారు. మహిళల విభాగం ఫైనల్లో సవిత 18-20, 22-9, 25-15తో పద్మజపై నెగ్గి టైటిల్ని కైవసం చేసుకుంది. వెటరన్ విభాగంలో మార్టిన్ మెనెజెస్ 25-6, 25-17తో మోహన్ మురళిపై గెలిచి టైటిల్ సాధించాడు. విజేతలకు డీఎస్పీ పి. బాలకృష్ణా రావు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి ఎం. వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
సెయింట్ మార్టిన్స్ గెలుపు
జింఖానా, న్యూస్లైన్: బీఎఫ్ఐ-ఐఎంజీ బాస్కెట్బాల్ లీగ్లో సెయింట్ మార్టిన్స్ కాలేజి 52-51తో సీవీఎస్ఆర్ కాలేజిపై విజయం సాధించింది. సికింద్రాబాద్లోని వైఎంసీఏలో జరిగిన ఈ మ్యాచ్లో ఆట ప్రారంభం నుంచి సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు విశాల్ (20), సంతోష్ చక్కటి సమన్వయంతో ఆడటంతో ఒక సమయంలో 18-6తో జట్టు ముందంజలో ఉంది. అయితే వెంటనే తేరుకున్న సీవీఎస్ఆర్ ఆటగాళ్లు ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 26-20తో సెయింట్ మార్టిన్స్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. అనంతరం సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు చెలరేగడంతో జట్టు మళ్లీ 44-33తో ముందంజలో నిలిచింది. సీవీఎస్ఆర్ క్రీడాకారులు కృష్ణ (15), వివేక్ (13), మహేష్ (13) ప్రతిఘటించినప్పటికీ ఫలితం దక్కలేదు. సెయింట్ మార్టిన్స్ క్రీడాకారులు విశాల్తో పాటు జోన (12), సాయి (9) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మహిళల విభాగంలో సీవీఎస్ఆర్ కాలేజి 32-22తో సెయింట్ ఆన్స్ కాలేజిపై గెలిచింది. మ్యాచ్ ప్రథ మార్ధం ముగిసే సమయానికి 17-11తో సీవీఎస్ఆర్ ముందంజలో ఉంది. సీవీఎస్ఆర్ జట్టు క్రీడాకారిణులు ప్రత్యూష (15), స్పందన (9) చాకచ క్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. సెయింట్ ఆన్స్ క్రీడాకారిణులు దివ్య (13), కీర్తి (9) రాణించారు. -
కాంటినెంటల్ జట్టు గెలుపు
జింఖానా, న్యూస్లైన్: మిధాని బౌలర్ సంతోష్ (5/42) నిప్పులు చెరిగే బౌలింగ్తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దీంతో మిధాని జట్టు 6 వికెట్ల తేడాతో ఈసీఐఎల్ జట్టుపై గెలిచింది. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట బరిలోకి దిగిన ఈసీఐఎల్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. రోహిత్ అగర్వాల్ (47) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బరిలోకి దిగిన మిధాని నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి గెలిచింది. అరుణ్ కుమార్ 31 పరుగులు చేశాడు. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో కాంటినెంటల్ జట్టు 8 వికెట్ల తేడాతో గౌడ్స్ ఎలెవన్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గౌడ్స్ ఎలెవన్ 182 పరుగుల వద్ద చేతులెత్తేసింది. సాయినాథ్ (56) అర్ధ సెంచరీతో రాణిం చగా... నాగరాజు (45) మెరుగ్గా ఆడాడు. కాంటినెంటల్ జట్టు బౌలర్ సాత్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన కాంటినెంటల్ జట్టు రెండే వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి నెగ్గింది. శశిధర్ రెడ్డి (75) అర్ధ సెంచరీతో చెలరేగగా... వినీత్ రెడ్డి 42 పరుగులు చేశాడు. -
సెయింట్ మార్టిన్స్ గెలుపు
బాస్కెట్బాల్ కాలేజి లీగ్ జింఖానా, న్యూస్లైన్: బీఎఫ్ఐ ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్బాల్ కాలేజి లీగ్లో సెయింట్ మార్టిన్స్ జట్టు గెలుపొందింది. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్లో సెయింట్ మార్టిన్స్ 41-16తో సీవీఎస్ఆర్ కాలేజిపై నెగ్గింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి 21-9తో సెయింట్ మార్టిన్స్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు విశాల్ (16), ప్రీతమ్ (11) చివరి వరకు అదే తీరులో కొనసాగి జట్టుకు విజయాన్ని అందించారు. సీవీఎస్ఆర్ జట్టులో కృష్ణ (5), ఫైజల్ (4) ఫర్వాలేదనిపించారు. మరోైవె పు మహిళల విభాగంలో సైతం సీవీఎస్ఆర్ జట్టుకు పరాజయం తప్పలేదు. లయోలా అకాడమీ జట్టు 36-26తో సీవీఎస్ఆర్ జట్టుపై నెగ్గింది. ప్రథమార్ధంలో 18-10తో లయోలా అకాడమీ ముందంజలో ఉంది. రెండో అర్ధ భాగంలో సీవీఎస్ఆర్ క్రీడాకారిణి ప్రత్యూష (20) విజృంభించినప్పటికీ... లయోలా అకాడమీ ఆటగాళ్లు రమా మిశ్రా (12), అక్షిత (10), మౌనిక (6) చాకచక్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. -
సెంచరీతో చెలరేగిన ప్రసాద్
జింఖానా, న్యూస్లైన్: చార్మినార్ సీసీ బ్యాట్స్మన్ ప్రసాద్ (116) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 124 పరుగుల తేడాతో ఆక్స్ఫర్డ్ బ్లూస్ జట్టుపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చార్మినార్ సీసీ 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మహ్మద్ ముజీబ్ (96) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆక్స్ఫర్డ్ బ్లూస్ బౌలర్ బారన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంత రం బరిలోకి దిగిన ఆక్స్ఫర్డ్ బ్లూస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీపాంకర్ (106) సెంచరీతో కదం తొక్కాడు. చార్మినార్ సీసీ బౌలర్ అహ్మద్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. మరో మ్యాచ్లో అంబర్పేట్ జట్టు రెండు వికెట్ల తేడాతో కేంబ్రిడ్జ్ జట్టుపై విజయం సాధించింది. మొదట కేంబ్రిడ్జ్ జట్టు 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. రజాక్ (61), ఇలియాస్ (39) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన అంబర్పేట్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి నెగ్గింది. మహ్మద్ నోమన్ (51), రాకేష్ (64) అర్ధ సెంచరీలతో రాణించారు. కేంబ్రిడ్జ్ బౌలర్ జావేద్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు: ఎస్బీఐ: 189/8 (విన్సెంట్ 43, ఇఫ్తికార్ 32); ఖల్సా: 148 (రాజ్ ఠాకూర్ 31; సంతోష్ 3/21, రంగనాథ్ 3/24). కాంటినెంటల్: 194 (రోహిత్ రెడ్డి 45, శశిధర్ 67, ప్రణీత్ రెడ్డి 31; సాయి తేజ 3/32); సాయిసత్య: 138 (నిఖిల్ జైస్వాల్ 50). -
ముందంజలో శివ నాగరాజు
జింఖానా, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ 0-7 కేటగిరీలో శివ నాగరాజు ముందంజలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ గోల్ఫ్ సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్, కంట్రీ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీలో శివ నాగరాజు 74 గ్రాస్ స్కోర్తో ముందంజలో కొనసాగుతున్నాడు. నరేష్ (76) రెండో స్థానంలో, హరిధర్ రెడ్డి (78) మూడో స్థానంలో ఉన్నారు. 8-12 కేటగిరీలో సంతోష్ 69 నెట్ స్కోరుతో ఆధిక్యంలో నిలిచాడు. అయితే తనతో పాటు అశోక్ రెడ్డి (69) సమాన స్కోరుతో రెండో స్థానంలో ఉండగా, ప్రవీణ్ (70) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 13-18 కేటగిరీలో అగ్రస్థానంలో ఉమేష్ గుప్తా(60), మనోజ్ (63), హుస్సేన్ (65) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే 0-7 కేటగిరీలో 10 మంది, 0-8, 13-18 కేటగిరీల్లో మొత్తం 20 మంది ఆటగాళ్లు ఫైనల్ రౌండ్కు అర్హత సాధించారు. -
సత్తా చాటిన స్నేహ
జింఖానా, న్యూస్లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి స్నేహ సత్తా చాటింది. సికింద్రాబాద్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో రె ండో సీడ్ స్నేహ 6-4, 6-1తో హర్యానా క్రీడాకారిణి ఆషిమా గార్గ్పై విజయం సాధించి క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. ఇస్కా తీర్థ 6-3, 6-1తో అరంటాక్సా అండ్రెడి (ఢిల్లీ)పై నెగ్గగా, ఇస్కా అక్షర 6-1, 6-2తో మన రాష్ట్రానికే చెందిన శరణ్య నాగ్పాల్పై గెలుపొందింది. వైష్ణవి 6-0, 6-0తో విక్టోరియపై గెలవగా, నయనికా రెడ్డి 6-2, 6-1తో వానియా దంగ్వాల్ (ఢిల్లీ) చేతిలో ఓటమి చవిచూసింది. వైభవి త్రివేది (గుజరాత్) 6-3, 6-1తో ఆర్తి (తమిళనాడు)పై, అమృతా ముఖర్జీ (పశ్చిమ బెంగాల్) 6-0, 6-0తో నికు అమిన్ (గుజ రాత్)పై, రియా భాటియా (ఢిల్లీ) 6-2, 6-2తో శ్వేత (తమిళనాడు)పై నెగ్గి క్వార్టర్స్ఫైనల్స్కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ షేక్ అబ్దుల్లా (ఏపీ) 6-2, 6-4తో పృథ్వి (తమిళనాడు)పై, శరణ్ రెడ్డి (ఏపీ) 7-6, 6-3తో ఆనంద్ (ఢి ల్లీ)పై, విజయ్ కణ్ణన్ (తమిళనాడు) 6-2, 6-2తో రోహిత్ సార్వతే (ఏపీ), వినోద్ శ్రీధ ర్ (తమిళనాడు) 6-1, 6-2తో సాయితేజస్ (ఏపీ), సూరజ్ దేశాయ్ 6-3, 4-6,6-4తో నిఖిల్ సాయి (ఏపీ)పై, లక్షిత్ సూద్ (ఉత్తరప్రదేశ్) 6-1, 4-6, 6-3తో సురభ్ సింగ్ (ఢిల్లీ)పై, అంకిత్ సచిదేవ్ (ఢిల్లీ) 6-3, 6-2తో సూరజ్ (కర్ణాటక)పై గెలుపొందారు. -
క్లాసిక్ జట్టు గెలుపు
జింఖానా, న్యూస్లైన్: హెచ్సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో క్లాసిక్ జట్టు 13 పరుగుల తేడాతో విజయనగర్ జట్టుపై విజయం సాధించింది. తొలుత క్లాసిక్ జట్టు 216 పరుగుల వద్ద ఆలౌటైంది. బాబర్ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతర ం విజయనగర్ జట్టు 203 పరుగులు చేసి ఆలౌటైంది. క్లాసిక్ జట్టు బౌలర్లు హైదర్ 4 ,యూసుఫ్ 3 వికెట్లు తీసుకున్నారు. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ ఐఏఎఫ్: 174 (దీపక్ యాదవ్ 40; రమేష్ 5/38, అక్షయ్ 3/53); నేషనల్ ఇన్సూరెన్స్: 145 (శర్మ 38). విద్యుత్ సౌధ: 146/8 (అలీ 32, సురేష్ బాబు 31, శ్రీనివాస్ 35; విజయ్ కుమార్ 3/20, శేఖర్ 4/45); ఈసీఐఎల్: 134/9 (విజయ్ కుమార్ 34; జగన్నాథ్ 5/50). వీఎస్టీ: 148 (ప్రియారాజ్ 69; శ్రీనివాస్ 7/58); ఐఐసీటీ: 149/5 (థామస్ 34, శ్రీనివాస్ 54). -
టి20 టోర్నీకి మహిళా ప్రాబబుల్స్ ఎంపిక
జింఖానా, న్యూస్లైన్: సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు హైదరాబాద్ ప్రాబబుల్స్ జాబితాను హెచ్సీఏ వెల్లడించింది. ఈ టోర్నీ వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనుంది. ఎంపికైన ఆటగాళ్లు సోమవారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో హాజరు కావాలని హెచ్సీఏ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాబబుల్స్ జాబితా డయానా డేవిడ్, స్రవంతి నాయుడు, షాలిని, మమత, కావ్య, అరుంధతి రెడ్డి, సునీతా ఆనంద్, స్నేహ, ప్రణీష, మౌనిక, శ్రావణి, గీత, లావణ్య, సింధూజ రెడ్డి, సౌమ్య, రేవతి, రాగశ్రీ, విద్య, హిమాని, రచన, ప్రణీతి రెడ్డి, పల్లవి, హర్ష, ఏక్త, సౌజన్య, రమ్య, వినయశ్రీ, సంగీత, అనన్య, కీర్తన. -
బిట్స్ పిలాని విజయం
జింఖానా, న్యూస్లైన్: బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ లీగ్లో బిట్స్ పిలాని జట్టు విజయం సాధించింది. సికింద్రాబాద్లోని వైఎంసీఏలో జరుగుతున్న ఈ లీగ్లో పురుషుల విభాగంలో బిట్స్ పిలాని జట్టు 49-45తో అవంతి డిగ్రీ కాలేజి జట్టుపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బిట్స్ పిలాని ఒక సమయంలో 16-6తో ముందంజలో ఉండగా... అవంతి కాలేజి ఆటగాళ్లు రవీన్ (17), సమీర్ (13) ప్రతిఘటించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 25-20తో బిట్స్ పిలాని ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. బిట్స్ పిలాని క్రీడాకారులు స్వార్నిమ్ (20), ఇషాన్ (12) చివరి నిమిషంలో చాకచక్యంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని చేకూర్చారు. మరో వైపు మహిళల విభాగంలో బిట్స్ పిలాని జట్టుకు చుక్కెదురైంది. సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి 47-26తో బిట్స్ పిలాని జట్టుపై గెలుపొందింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 21-9తో సెయింట్ ఫ్రాన్సిస్ జట్టు ముందంజలో ఉంది. అనంతరం బిట్స్ పిలాని జట్టు ఆటగాళ్లు అపూర్వ (13), శ్రీవాణి (9), మేహ (4) చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. సెయింట్ ఫ్రాన్సిస్ క్రీడాకారులు సిమి (20), ఝాన్సీ (12), శ్రేయ (7) జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. -
నిషాంత్ మెరుపు సెంచరీ
జింఖానా, న్యూసైలైన్: పోస్టల్ జట్టు బ్యాట్స్మన్ నిషాంత్ యాదవ్ (119) సెంచరీతో విజృంభించడంతో ఆ జట్టు 170 పరుగుల తేడాతో డెక్కన్ వాండరర్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. హెచ్సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పోస్టల్ మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. విజయ్ కుమార్ (49), అజయ్ కుమార్ (35 నాటౌట్) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన డెక్కన్ వాండరర్స్ 136 పరుగులకే కుప్పకూలింది. ఇమ్రోస్ (56) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. పోస్టల్ బౌలర్లు అజయ్ కుమార్, సురేష్, సూర్యకిరణ్, భార్గవ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. మరో మ్యాచ్లో షాలీమార్ జట్టు 7 వికెట్ల తేడాతో గ్రీన్టర్ఫ్ జట్టుపై గెలుపొందింది. మొదట గ్రీన్ టర్ఫ్ మూడు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. అబ్దుల్లా (84 నాటౌట్), అక్షయ్ (68) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ చేసిన షాలీమార్ మూడే వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసి నెగ్గింది. పవన్ కుమార్ (59 నాటౌట్), అలీముద్దీన్ (57 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించగా... శంతన్ (43), శామ్యూల్ రాజ్ (39) చక్కని ఆట తీరు కనబరిచారు. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ వీఎస్టీ: 95 (వాహీద్ 5/20); ఎన్ఎఫ్సీ: 96/5 (రాజు 55; వర్మ 3/26). బీహెచ్ ఈఎల్: 146 (రఫీఖ్ ఖాన్ 35, శ్రీబాబు 45, సతీష్ 31; పన్నాలాల్ 5/23); హెచ్ఏఎల్: 79 (శశి 3/15, శ్రీబాబు 3/3). -
విజేత ఉస్మానియా యూనివర్సిటీ
జింఖానా, న్యూస్లైన్: సెంట్రల్ జోన్ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో ఉస్మానియా జట్టు విజేత గా నిలిచింది. ఈ విజయంతో ఈ నెల 24వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ జోనల్స్కు అర్హత సాధించింది. వరంగల్లోని కాకతీయ యూనివ ర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో ఉస్మానియా జట్టు 110 పరుగుల తేడాతో బరకతుల్లా యూనివర్సిటీపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చే సిన ఉస్మానియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నిఖిత (91) అర్ధ సెంచరీతో అజేయంగా నిలువగా... ఏక్తా సక్సేనా (45), పల్లవి (21) మెరుగ్గా ఆడారు. బరకతుల్లా బౌలర్లు దివాంగి 3, వర్ష 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన బరకతుల్లా 33 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ఉస్మానియా బౌలర్లు ప్రణీష, కావ్య చెరో 3 వికెట్లు తీసుకోగా... మౌనిక 2 వికెట్లు చేజిక్కించుకుంది. -
చక్రవర్తికి టైటిల్
జింఖానా, న్యూస్లైన్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నీ ఓపెన్ కేటగిరీలో చక్రవర్తి రెడ్డి టైటిల్ని గెలుచుకున్నాడు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ఆదివారం జరిగిన ఫైనల్లో చక్రవర్తి రెడ్డి(6)... ప్రభాత్ (5)పై గెలుపొందాడు. రమణ కుమార్ (5)... రాజు (4)పై నెగ్గి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. జూనియర్స్ కేటగిరీలో వర్షిత, అభినవ్, మేఘరనాశ్రమ్ 6 రౌండ్లకు గాను 5.5 పాయింట్లు సాధించడంతో టై బ్రేక్కు దారితీసింది. టై బ్రేక్లో వర్షిత్ మొదటి స్థానంలో నిలవగా... అభినవ్, మేఘనాశ్రమ్ వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. మిగతా ఫలితాలు: అండర్-14 బాలురు: 1. చేతన్ రాథోడ్, 2.ప్రణీత్; బాలికలు: 1. హరిలాస్య, 2. సాయిశృతి. అండర్-12 బాలురు: 1. మేఘనాశ్రమ్, 2. శ్రీకర్; బాలికలు: 1. మోహిని అశోక్, 2. సాధన. అండర్-10 బాలురు: 1. అభినవ్, 2. ప్రధమ్; బాలికలు: 1. సాహిత్య, 2. అంజలి. అండర్-8 బాలురు: 1. రుత్విక్ రోహన్, 2. ప్రశాంత్; బాలికలు: 1. రచిత, 2. అనూషా రెడ్డి. అండర్-6 బాలురు: 1. ప్రణయ్ వెంకేటేశ్, 2. శ్రీకర్; బాలికలు: 1. సేవిత విజు, 2. నిత్య రాజు. -
చాంప్ తీగల కృష్ణారెడ్డి కాలేజి
జింఖానా, న్యూస్లైన్: ఎస్ఆర్ చాంపియన్స్ ట్రోఫీ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజీ క్రికెట్ టోర్నీలో తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్) కాలేజీ విజేతగా నిలిచింది. వరంగల్లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీకేఆర్ 7 వికెట్ల తేడాతో ముఫకంజా కాలేజీపై నెగ్గింది. మొదట బ్యాటింగ్కు దిగిన ముఫకంజా కాలేజీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జుబేద్ (56) అర్ధ సెంచరీతో రాణించాడు. టీకేఆర్ బౌలర్ సాకేత్ 6 వికెట్లు పడగొట్టగా, చైతన్య రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన టీకేఆర్ 13 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి గెలిచింది. వంశీ (60) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రోహిత్ రెడ్డి (46) మెరుగ్గా అడాడు. సాకేత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. రెండు, మూడు స్థానాల కోసం జరిగిన పోరులో ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు 7 వికెట్ల తేడాతో విద్యాజ్యోతి కాలేజీపై విజయం సాధించింది. తొలుత బరిలోకి దిగిన విద్యాజ్యోతి కాలేజి 15 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. శివ దీప్ (33), కిరణ్ (26) ఫర్వాలేదనిపించారు. ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి బౌలర్లు రోహిత్, సందీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. త ర్వాత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి మూడే వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి నెగ్గింది. క్రాంతి కిరణ్ (50) అర్ధ సెంచరీతో అజేయంగా నిలివగా... సందీప్ 31 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్రాంతి కిరణ్కు దక్కింది. టీకేఆర్ ఆటగాళ్లు రోహిత్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును, వంశీ వర్ధన్రెడ్డి బెస్ట్ ఆల్రౌండర్ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ ఫీల్డర్గా ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ క్రీడాకారుడు అరవింద్, బె స్ట్ బౌలర్గా అధిల్ ఎంపికయ్యారు. ముగింపు కార్యక్రమానికి ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండో రౌండ్లో నిరంజన్ గెలుపు
జింఖానా, న్యూస్లైన్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో ఓపెన్ కేటగిరీలో నిరంజన్ వరుస రౌండ్లలో గెలిచాడు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో శనివారం జరిగిన గేమ్లో నిరంజన్ (2)... మురళీకృష్ణ(1)పై విజయం సాధించాడు. రాజు (2)... చిరంజీవి (1)పై నెగ్గగా, చంద్రశేఖర్ (1)... చక్రవర్తి రెడ్డి (2) చేతిలో ఓటమి చవిచూశాడు. వినయ్ కుమార్ (1)... రాఘవ శ్రీవాస్తవ్ (2) చేతిలో, హర్షిత్ కృష్ణ (1)... ప్రభాత్ (2) చేతిలో ఓటమి పాలయ్యారు. జూనియర్స్ కేటగిరీ మూడో రౌండ్లో ఆశ్రీత్ రామ్ (1)... అభినవ్ (2) చేతిలో కంగుతిన్నాడు. అనూషా రెడ్డి (1)... లిఖితా రెడ్డి (2) చేతిలో, ప్రశాంత్ (1)... అరిహంత్ చేతిలో పరాజయం పొందారు. -
రాణించిన ఖలీద్
జింఖానా, న్యూస్లైన్: బాయ్స్టౌన్ జట్టు బ్యాట్స్మన్ అబ్దుల్ ఖలీద్ ఖురేషి (156) సెంచరీతో విజృంభించడంతో ఆ జట్టు 86 పరుగుల తేడాతో సటన్ జట్టుపై విజయం సాధించింది. హెచ్సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ లీగ్లో శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బాయ్స్టౌన్ 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అబ్దుల్ సిద్దిఖీ (33) ఫర్వాలేదనిపించాడు. సటన్ బౌలర్లు నీలేష్ , జనార్ధన్ రెడ్డి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సటన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. జనార్ధన్ రెడ్డి (65) అర్ధ సెంచరీతో రాణించాడు. బాయ్స్టౌన్ బౌలర్లు అఫ్సర్ 3, సైఫ్ ఉల్ హసన్ రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఏపీ సివిల్ సర్వీసెస్ జట్టు బౌలర్ భాను కిరణ్ (5/17) చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 117 పరుగుల భారీ తేడాతో పరిశ్రమ్ భవన్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఏపీ సివిల్ సర్వీసెస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చే సింది. వెంకటేశ్ (64) అర్ధ సెంచరీతో చెలరేగగా... సుబ్రమణ్యం (33), అనిల్ కుమార్ (36), రంజిత్ (31) చక్కటి ఆటతీరు కనబరిచారు. అజమ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన పరిశ్రమ్ భవన్ 125 పరుగులకే చేతులెత్తేసింది. ఏపీ సివిల్ సర్వీసెస్ బౌలర్ శ్రీరామ్ రెండు వికెట్లు తీశాడు. -
చెస్ చాంపియన్ రామకృష్ణ
జింఖానా, న్యూస్లైన్: సైబర్ చెస్ అకాడమీ నిర్వహించిన ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో రామకృష్ణ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్స్లో భరత్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా... నాగ శశాంక్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో వినీత టైటిల్ సాధించింది. నేహ రెండో స్థానాన్ని దక్కించుకుంది. జగ్మాంజర్ చెస్ టోర్నమెంట్ ఫైనల్స్లో రోహిత్ యాదవ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆర్ ఎస్ శరణ్ రెండో స్థానంలో, మేఘనాశ్రమ్ మూడో స్థానంలో నిలిచారు. అండర్-8 విభాగంలో సాయి రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలవగా... ప్రశాంత్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. అండర్-14 విభాగంలో అభిజిత్ రెడ్డి విజేతగా నిలవగా... రెండో స్థానాన్ని సాయి రోచిష్ కైవసం చేసుకున్నాడు. అండర్-12 విభాగంలో మొదటి స్థానాన్ని అనిరుధ్, రెండో స్థానాన్ని తేజస్ సొంతం చేసుకున్నారు. అండర్-6 విభాగంలో సాయి చాణిక్య, అండర్-10 విభాగంలో శ్రీకర్ టైటిల్ గెలుచుకున్నారు. -
రాణించిన కళ్యాణ్
జింఖానా, న్యూస్లైన్: కేయూసీఈటీ జట్టు బౌలర్ కళ్యాణ్ (4/13) చక్కని బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఎస్ఆర్ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో కేయూసీఈటీ జట్టు 7 వికెట్ల తేడాతో జయముఖి ఐటీఎస్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బరిలోకి దిగిన జయముఖి జట్టు... కళ్యాణ్ ధాటికి 73 పరుగులకే కుప్పకూలింది. సత్యం 22, హర్ష 18 పరుగులు చేశారు. అనంతరం బరిలోకి దిగిన కేయూసీఈటీ మూడే వికెట్లు కోల్పోయి నెగ్గింది. రాజ్కుమార్ 33 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. జయముఖి బౌలర్ అనిల్ ఒక వికెట్ తీసుకున్నాడు. బౌలింగ్లో చక్కని ప్రతిభ చూపిన కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరో మ్యాచ్లో ఎస్వీఎస్ఐటీ జట్టు 8 పరుగుల తేడాతో జీఎన్ఐటీ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్వీఎస్ఐటీ 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. మున్నర్ (34), ప్రతీక్ (28 నాటౌట్) మెరుగ్గా ఆడారు. జీఎన్ఐటీ బౌలర్లు భరత్, పవన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జీఎన్ఐటీ 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. మనోజ్ 33 పరుగులు చేయగా... 38 పరుగుల చేసి అజేయంగా నిలిచిన జీవీకే మనోజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు అపెక్స్ ఇంజినీరింగ్ కాలేజి: 78 (జీవన్లాల్ 38; హరీష్ 3/11); విజయ ఇంజినీరింగ్ కాలేజి: 79 (రాజ మణి 40 నాటౌట్; ప్రసాద్ 1/14). వీఆర్ఈసీ: 109 (శ్రవణ్ 44; పవన్ 3/16); సీఎంఆర్ఈసీ: 110/9 (శ్రీధర్ 16; శ్రవణ్ 2/19, యోగేందర్ 2/11). ఎన్ఐటీ: 111 (అఖిల్ 18, హరీష్ 2/17, వంశీ 2/16); రామప్ప ఇంజినీరింగ్ కాలేజి: 111 (వంశీ 32, రామ్ కిషోర్ 2/33). ప్రసాద్ ఇంజినీరింగ్ కాలేజి: 90 (ప్రదీప్ 31; శ్రీధర్ 3/10, కార్తీక్ 3/19); ఎస్వీఐటీ: 92 (విజ్ఞాన్ 42, గౌతమ్ 34; రంజిత్ 1/13). గీతాంజిలీ ఇంజినీరింగ్ కాలేజి: 157 (హరి 33, తరుణ్ 30; ఉదయ్ 2/33, చందు 2/15). ఎంఎల్ఆర్: 109/9 (వినోద్ 34, వివేక్ 19; కళ్యాణ్ 2/19). -
అబ్దుల్ అజీమ్కు 6 వికెట్లు
జింఖానా, న్యూస్లైన్: అపెక్స్ సీసీ బౌలర్ అబ్దుల్ అజీమ్ (6/19) తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 167 పరుగుల భారీ తేడాతో అభినవ్ కోల్ట్స్ జట్టుపై విజయం సాధించింది. హెచ్సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన అపెక్స్ సీసీ 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. సయ్యద్ పాషా అలీ (42), మీర్ జాఫర్ అలీ (44), సయ్యద్ అన్వర్ (30) మెరుగ్గా ఆడారు. అనంతరం బరిలోకి దిగిన అభినవ్ కోల్ట్స్... అజీమ్ ధాటికి 63 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్లో బౌలర్ సోహైల్ (5/25) విజృంభించడంతో యంగ్ సిటిజన్ జట్టు 51 పరుగుల తేడాతో కాస్మోస్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. మొదట బరిలోకి దిగిన యంగ్ సిటిజన్ జట్టు 147 చేసి ఆలౌటైంది. సోహైల్ 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కాస్మోస్ జట్టు బౌలర్ కరన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కాస్మోస్ 96 పరుగుల వద్ద చేతులెత్తేసింది. ఇతర మ్యాచ్ల స్కోర్లు డబ్ల్యూఎంసీసీ: 160/7 (ప్రదీప్ 35, వంశీ యాదవ్ 35); షాలిమార్ సీసీ: 161/7 (కృష్ణ ప్రసాద్ 48). పీకేసీసీ: 135 (జయేష్ 32); భారతీయ: 138/2 (శ్రవణ్ కుమార్ 51, జనార్ధన్ 35 నాటౌట్ ). హెచ్యూసీసీ: 216 (మహ్మద్ అతీఖ్ 34, రమేష్ 33); తారకరామ: 155 (సతీష్ 30, రమాకాంత్ 52, ఖలీముద్దీన్ 3/9, అద్వైత్ ఆర్యన్ 3/29, మహ్మద్ ఒమర్ 3/30). బీహెచ్ఈఎల్: 112 (ఉదయ్ కుమార్ 5/21); ఎంపీ యంగ్మెన్: 113/2 (బాలాజి 40 నాటౌట్, అలీమ్ 37 నాటౌట్). ఎఫ్సీఐ: 178 (అరవింద్ 56, అక్బర్ 33, కృష్ణ 3/42); ఏకలవ్య: 179/5 (విశాల్ 41, మాథ్యూస్ 30 నాటౌట్; చంద్రశేఖర్ 3/20). క్లాసిక్: 132 (రఫీ 39, షాదాబ్ 4/26); హైదరాబాద్ పేట్రియట్స్: 106 (రఫీ 4/15). డెక్కన్ వాండరర్స్: 212/6 (మహ్మద్ అజీముద్దీన్ 37, వాసిఫ్ 30, ఇమ్రోస్ 53); ఎలెవన్ మాస్టర్: 210 (నరేష్ 30, రాజ్ కుమార్ 49). ఎ-ఇనిస్టిట్యూషన్ వన్డే లీగ్ ఐఏఎఫ్: 193/8 (సందీప్ 57, కిషన్ 42, రెహమాన్ 41; శ్యామ్ 3/53, గోవింద్ రెడ్డి 3/61); హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ: 78 (దహియా 4/35, దీపక్ 3/17). -
‘ప్లేట్’ నాకౌట్కు హైదరాబాద్
జింఖానా, న్యూస్లైన్: కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 11 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ గెలుపుతో హైద రాబాద్ ప్లేట్ నాకౌట్ దశకు అర్హత దక్కించుకుంది. అగర్తలాలో మూడు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 108 ఓవర్లలో 366 పరుగులు చేసి ఆలౌటైంది. తన్మయ్ అగర్వాల్ (178 బంతుల్లో 103; 15 ఫోర్లు), రాహుల్ సింగ్ (169 బంతుల్లో 100;17 ఫోర్లు) సెంచరీలతో విజృంభించగా... అనిరుధ్ (141 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. త్రిపుర బౌలర్లు మురాసింగ్, సర్కార్ చెరో 3, దేయ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన త్రిపుర 48.1 ఓర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. ఘోష్ (39) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. చైతన్య రెడ్డి 3, జయసూర్య, రోషన్ రఘురామ్, శ్రవణ్ కుమార్ తలా రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. ఫాలోఆన్ ఆడిన త్రిపుర తన రెండో ఇన్నింగ్స్లో 73.5 ఓవర్లలో 215 పరుగులు చే సి ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 11 పరుగుల ఆధిక్యంతో హైదరాబాద్ గెలుపు దక్కించుకుంది. దేయ్ (53) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఘోష్ (41), సూత్రధార్ (43) మెరుగ్గా ఆడారు. హైదరాబాద్ బౌలర్లు జయసూర్య 2, రోషన్ రఘురామ్, తన్మయ్ అగర్వాల్ చెరో 3 వికె ట్లు తీసుకున్నారు. -
రాణించిన నిరూప్, అయూబ్
జింఖానా, న్యూస్లైన్: గ్రీన్ టర్ఫ్ బౌలర్లు నిరూప్ (4/26), అమర్ అయూబ్ (4/20) గోల్కొండ సీసీ జట్టుకు చుక్కలు చూపిం చారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హెచ్సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన గోల్కొండ సీసీ 88 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన గ్రీన్ టర్ఫ్ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి నెగ్గింది. ముజాఫర్ అలీ ఖాన్ 38 పరుగులు చేశాడు. మరో మ్యాచ్లో పోస్టల్ జట్టు 129 పరుగుల తేడాతో ఆర్కే పురం జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన పోస్టల్ 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. నిషాంత్ (92), నర్సింగ్ (50 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆర్కే పుర ం 110 పరుగులకే ఆలౌటైంది. పోస్టల్ బౌలర్ సాగర్ 3 వికెట్లు తీశాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు విజయానంద్: 113 (జమీర్ 3/39, అంబాదాస్ 3/20); నవజీవన్ ఫ్రెండ్స్: 85 (అనీష్ రెడ్డి 3/24). రెడ్ హిల్స్: 164 (అద్నాన్ 37, అఫ్రోజ్ 34; మజీద్ సుల్తాన్ 3/29); ఎలిగెంట్: 143 (ఆజింక్యా పాటిల్ 43; అంజద్ 3/43). హైదరాబాద్ ప్యాంథర్స్ ఎలెవన్: 260/9 (జీషన్ అలీ ఖాన్ 31, హైదర్ 45, ఆసిఫ్ మొహమ్మద్ 40, జీషాన్ 32 నాటౌట్; బాలు 4/55); ఆర్బీఐ: 124 (షేక్ నియమతుల్లా 34; సయ్యద్ ఇమ్రాన్ 3/33). డెక్కన్ వాండరర్స్: 202 (అజీముద్దీన్ 65, మెహబూబ్ 48; హాజి 4/24); సౌతెండ్ రేమండ్స్: 139 (ఇమ్రోస్ 3/7). -
ఫైనల్స్లో గీతాంజలి స్కూల్
జింఖానా, న్యూస్లైన్: బీఎఫ్ఐ ఐఎంజీ రిలయన్స్ స్కూల్ బాస్కెట్బాల్ లీగ్లో గీతాంజలి స్కూల్ జట్టు ఫైనల్కు చేరింది. వైఎంసీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్స్లో గీతాంజలి 50-41తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్పై విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 21-15తో గీతాంజలి జట్టు ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ప్రత్యర్థి నుంచి కొంత పోటీ ఎదురైనప్పటికీ భార్గవ్ (23), ఒమర్ (14), సహర్ష్ (9) చాకచక్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టులో ప్రతీక్ (11), సుమిరన్ (10), అత్రేయ (8) రాణించారు. మరో మ్యాచ్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ 52-38తో చిరెక్ పబ్లిక్ స్కూల్పై గెలుపు దక్కించుకుంది. బాలికల విభాగం ఫలితాలు: చిరెక్ పబ్లిక్ స్కూల్: 52 (సన్హిత 16, నటాషా 14, సబ్రీన్ 10, దృష్టి 5); ఢిల్లీ పబ్లిక్ స్కూల్: 42 (శ్రీత 15, నేహ 11, యోగిత 11). సెయింట్ పాయిస్ హైస్కూల్: 33 (మౌనిక 12, పూజ నాయుడు 13, తేజస్విని 4); ఫ్యూచర్ కిడ్స్: 32 (మేఘన 12, హారిక 10, ప్రణవి 8). -
క్వార్టర్స్లో అపోలో, షాదాన్
జింఖానా, న్యూస్లైన్: మెడికల్ కాలేజిల క్రీడోత్సవాల్లో భాగంగా ఆతిథ్య అపోలో, షాదాన్ జట్లు ఫుట్బాల్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. మంగళవారం జూబ్లీహిల్స్లోని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్ఆర్)లో జరిగిన బాలుర విభాగంలో అపోలో (ఏఐఎంఎస్ఆర్) జట్టు 2-0 తేడాతో ఉస్మానియా జట్టును ఓడించింది. అలాగే షాదాన్ మెడికల్ కాలేజి 2-1 తేడాతో భాస్కర మెడికల్ కాలేజిపై నెగ్గింది. అలాగే డెక్కన్ కాలేజి 4-0-తో మెడిసిటీపై నెగ్గి క్వార్టర్స్ చేరింది. క్రికెట్ మ్యాచ్ల్లో ఉస్మానియా.. మెడిసిటీపై, గాంధీ.. మల్లారెడ్డిపై, అపోలో.. కామినేనిపై, భాస్కర.. డెక్కన్పై నెగ్గాయి. బాలికల బాస్కెట్బాల్ మ్యాచ్లోనూ అపోలో జట్టు గాంధీ జట్టుపై విజేతగా నిలిచింది. 19 వరకు జరిగే ఈ పోటీల్లో వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల శాఖ కార్యదర్శి కృష్ణ బాబు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఎస్ఆర్ కోశాధికారి ఏపీవీ రెడ్డి, డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
సెమీస్లో చిరెక్ జట్లు
జింఖానా, న్యూస్లైన్: బీఎఫ్ఐ ఐఎంజీ రిలయన్స్ స్కూల్ బాస్కెట్బాల్ లీగ్లో బాలుర, బాలికల విభాగాల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్లు సెమీస్లోకి ప్రవేశించాయి. బాలుర విభాగంలో మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్స్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 32-26తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్పై విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 13-8తో చిరెక్ పబ్లిక్ స్కూల్ ముందంజలో ఉంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఆటగాళ్లు కునాల్ (14), శివసాయి వర్మ (8) శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. చిరెక్ పబ్లిక్ స్కూల్ క్రీడాకారులు హిమేష్ (10), విశాల్ (8), స్టీవెన్ (6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బాలికల క్వార్టర్ఫైనల్స్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు 37-24తో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజిపై గెలుపొందింది. మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 24-9తో ఆధిక్యంలో ఉన్న చిరెక్ పబ్లిక్ స్కూల్కు రెండో అర్ధ భాగంలో ప్రత్యర్థి నుంచి కొంత పోటీ ఎదురైనప్పటికీ సబ్రీన్ (10), సన్హిత (10), దృష్టి (6) అల వోకగా దూసుకెళ్ళడంతో జట్టుకు విజయం చేకూరింది. సెయింట్ ఆన్స్ జట్టులో జాయ్ (4), శారద (4), సదియ (4), పల్లవి (4) చక్కటి ఆట తీరు కనబరిచారు. మిగిలిన ఫలితాలు బాలికల విభాగం: సెయింట్ పాయిస్ హైస్కూల్: 23 (తేజస్విని 10, శ్రీజ 6, మౌనిక 4); హోలీ ఫ్యామిలి: 8 (వినీష 4, జనని 2, శైలజ 2). ఫ్యూచర్ కిడ్స్: 21 (హారిక 10, ప్రణవి 7); సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి: 8 (కరుణ 2). బాలుర విభాగం: ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్: 44 (కార్తీక్ 15, రావల్ 9, విభు 6); ఇండస్ వరల్డ్ స్కూల్: 28 ( సూర్య 8, నితిన్ 7). గీతాంజలి స్కూల్: 29 (ఒమర్ 10, భార్గవ్ 10, సాహర్ష్ 7); డీఆర్ఎస్ ఇంటర్నేషనల్: 19 (వికాస్ 12). -
పవన్ విజృంభణ
జింఖానా, న్యూస్లైన్: కాకతీయ జట్టు బౌలర్ పవన్ కుమార్ (6/37) విజృంభించడంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఎస్ఎన్ గ్రూప్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఎన్ గ్రూప్ 103 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ మూడే వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. అజయ్ (42) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్లో నవజీవన్ ఫ్రెండ్స్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్లో రణ ధీర్ (88), బౌలింగ్లో అంబాదాస్ (5/68) రాణించారు. దీంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సాక్రెడ్ హర్ట్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సాక్రెడ్ హర్ట్ 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జమీల్ (81) అర్ధ సెంచరీతో రాణించాడు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నవజీవన్ ఫ్రెండ్స్ 5 వికెట్ల కోల్పోయి 206 పరుగులు చేసింది. వినయ్ 45 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు భారతీయ: 237 (సోమశేఖర్ 72, ప్రజ్వల్ 40, శ్రీకాంత్ నాయుడు 49; గుప్త 7/53); మహ్మద్ సీసీ: 198 (గుప్త 57; సోమశేఖర్ 3/15, అశోక్ కుమార్ 6/43). గగన్ మహల్ సీసీ: 143 (సాగర్ 32; మహబూబ్ అలీ 3/28. ముఖీత్ 5/35); యూత్ సీసీ: 144/5 (అనిరుధ్ రెడ్డి 36, అరుణ్ 40 నాటౌట్). తిరుమల: 196 (అశ్విన్ మానే 45; ఖాదర్ 3/43, సయ్యద్ సోహైల్ 3/14); డెక్కన్ బ్లూస్: 113 (సోహైల్ 39; అశ్విన్ మానే 5/32). -
విజేత ఏఓసీ
జింఖానా, న్యూస్లైన్: ఓపెన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో ఏఓసీ జట్టు విజేతగా నిలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్లో ముంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏఓసీ జట్టు 75-72తో ఎస్సీఆర్ జట్టుపై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. తుది పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 39-37తో ఏఓసీ ఆధిక్యంలో నిలిచింది. ముందు నుంచి దూకుడుగా ఆడిన జలీల్ (30), సత్యనారాయణ (12), నాగరాజు (11) చివరి వరకు అదే ఆటతీరును ప్రదర్శించారు. ఎస్సీఆర్ క్రీడాకారులు నిహాల్ యాదవ్ (23), మురళి (19) చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. విజేతలకు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అడిషనల్ కంట్రోలర్ ఎస్.అన్నపూర్ణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి బీడీఎల్ మాజీ సీనియర్ జనరల్ మేనేజర్ కృష్ణ, ఏపీ బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
చెస్ చాంప్ భరత్కుమార్
జింఖానా, న్యూస్లైన్: బ్రిలి యంట్ ఓపెన్ చెస్ టోర్నీ ఓపెన్ ఈవెంట్లో మల్లారెడ్డి కాలేజి విద్యార్థి భరత్ కుమార్ టైటిల్ గెలుచుకున్నాడు. దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జరిగిన ఓపెన్ ఈవెంట్ ఫైనల్స్లో భరత్ కుమార్ (6) చక్రవర్తి రెడ్డి (5.5)పై విజయం సాధించాడు. దీప్తాంశ్ రెడ్డి (5.5) సందీప్ నాయుడు (5.5)తో డ్రా చేసుకున్నాడు. రాఘవ్ శ్రీవాస్తవ్ (5) నాగ శశాంక్ (4)పై, చేతన్ శర్మ (5) మల్లేష్ (4)పై, హిందూజ రెడ్డి(5) భుసన్ (4.5)పై నెగ్గారు. జూనియర్ కేటగిరీలో సాయి నాగ సంహిత (6) బిపిన్ రాజ్ (5)పై, సుదర్శన్ రెడ్డి (6) వర్షిత (4.5)పై, అభినవ్ చంద్ర (5) శ్రీకర్ (4)పై గెలుపొందారు. ముదాబిర్ (4.5) నాగ విజయ్ కీర్తి (4.5)తో, ప్రణీత్ (4.5) జైతిరేష్ (4.5)తో గేమ్ డ్రా చేసుకున్నారు. టోర్నీ ఉత్తమ మహిళగా వి.సాహితి, ఉత్తమ వెటరన్గా ఎన్.రామ్ మోహన్ రావు నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఉపాధ్యక్షుడు మేజర్ శివప్రసాద్, కార్యదర్శి కన్నారెడ్డి బహుమతులు అందజేశారు. -
మల్లికార్జున్ మెరుపు శతకం
జింఖానా, న్యూస్లైన్: స్టార్లెట్స్ బ్యాట్స్మన్ మల్లికార్జున్ (146) మెరుపు సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 244 పరుగులు భారీ తేడాతో కాంకార్డ్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్లెట్స్ 356 పరుగులకు ఆలౌటైంది. హర్ష (73) అర్ధ సెంచరీతో రాణించాడు. కాంకార్డ్ సీసీ బౌలర్ నితిన్ 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన కాంకార్డ్ సీసీ 112 పరుగులకే కుప్పకూలింది. శ్రీనివాస్ (74) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. స్టార్లెట్స్ సీసీ బౌలర్లు సాయి అనూప్ రెడ్డి, సాయి తేజ చెరో 4 వికెట్లు తీసుకున్నారు. మరో మ్యాచ్లో బ్యాటింగ్లో జితేందర్ గౌడ్ (101), సందీప్ కుమార్ (102) బౌలింగ్లో అరవింద్ (6/10) రాణించడంతో అంబర్పేట్ సీసీ జట్టు 278 పరుగుల భారీ తేడాతో ఎల్ఎన్సీసీ జట్టు గెలుపు దక్కించుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన అంబర్పేట్ సీసీ 7 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రాజ్కుమార్ (78) అర్ధ సెంచరీతో రాణించగా... ముబాషీర్ (48) మెరుగ్గా ఆడాడు. ఎల్ఎన్సీసీ బౌలర్లు జితేష్ 3, అజయ్ 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఎల్ఎన్సీసీ... అరవింద్ ధాటికి 79 పరుగులకే చేతులెత్తేసింది. ఇతర మ్యాచ్ల స్కోర్లు... ఆర్కె పురం: 243/9 (శుభమ్ 87, విజయ్ కుమార్ 35; వినోద్ 3/53, కిరణ్ 3/61, హ ర్షిత్ 2/48); సదరన్ స్టార్స్ : 61 (అరుణ్ కుమార్ 5/26, రమేష్ 5/28). హెచ్జీసీ: 221 (రణధీర్ 110, సాయి చరణ్ 46; అబ్బాస్ 2/41, మహేష్ 2/54); యంగ్ మాస్టర్స్ సీసీ: 225 (సయ్యద్ అజ్మద్ 79, ఉజైర్ 53; భరత్ ముంద్ర 4/60, శ్రవణ్ నాయుడు 3/55). రుషిరాజ్ : 257 (ఎండీ ఖాజా నిజాముద్దీన్ 85, అలీమ్ 53; అద్వైత్ ఆర్యన్ 4/60); హెచ్యూసీసీ: 119 (పాషా 5/36, రషీద్ 5/29). -
24 నుంచి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ
జింఖానా, న్యూస్లైన్: రాఘవ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ నిర్వహించనున్నారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజి ఈ టోర్నీకి వేదిక కానుంది. 2000 కన్నా తక్కువ రేటింగ్ కలిగిన వారి కోసం ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో పాల్గొనేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది ఆటగాళ్లకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతి, 15 మంది నాన్ రేటింగ్ ఆటగాళ్లకు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఆటగాళ్లకు ఉచిత భోజన సదుపాయంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు టోర్నీ నిర్వాహక కార్యదర్శి, రాఘవ్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్యామ్ సుందర్ తెలిపారు. ప్రతిభావంతులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎంట్రీ ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు 22లోగా తమ ఎంట్రీలను రిజిష్టర్ చేసుకోవాలి. మరిన్నివివరాలకు శ్యామ్ సుందర్ (9866966904)ను సంప్రదించవచ్చు. -
జగన్నాథ్కు 8 వికెట్లు
జింఖానా, న్యూస్లైన్: విద్యుత్ సౌధ బౌలర్ జగన్నాథ్ (8/20) తన బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో వీఎస్టీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన వీఎస్టీ... జగన్నాథ్ బౌలింగ్కు 50 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన విద్యుత్ సౌధ రెండే వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరో మ్యాచ్లో ఎంసీహెచ్ 163 పరుగుల భారీ తేడాతో నేషనల్ జట్టుపై గెలుపొందింది. ఇతర మ్యాచ్ల స్కోర్లు హెచ్జీసీ: 156 (సాయి చరణ్ 46; సందేశ్ 5/18); వాకర్ టౌన్: 156/6 (ప్రశాంత్ 70, తేజొ 31; చరణ్ 4/51) సెయింట్ సాయి: 176/9 (జితేందర్ 58; సుధాకర్ 3/46, అభినయ్ 4/28); విజయ్ సీసీ: 169/9 (సుధాకర్ 50; మార్షల్ 5/24). -
విజయ్ సింగ్ విజృంభణ
జింఖానా, న్యూస్లైన్: వీనస్ సైబర్టెక్ బౌలర్ విజయ్ సింగ్ (5/66), వంశీ రెడ్డి (3/13) తమ బౌలింగ్తో ఎంసీసీ జట్టు బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పట్టించారు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో వీనస్ సైబర్టెక్ జట్టు 128 పరుగుల తేడాతో ఎంసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలి రోజు బ్యాటింగ్ చేసిన వీనస్ సైబర్టెక్ 226 పరుగులు చే సింది. రెండో రోజు బరిలోకి దిగిన ఎంసీసీ 98 పరుగులకే కుప్పకూలింది. హెచ్సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో ఆల్ సెయింట్స్ జట్టు బ్యాట్స్మెన్ మధుకుమార్ (76), అదిష్ (61) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో ఆ జట్టు 40 పరుగుల తే డాతో గౌతమ్ మోడల్ హైస్కూల్పై గెలుపొందింది. మొదట ఆల్ సెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గౌతమ్ మోడల్ హైస్కూల్ బౌలర్ జైదేవ్ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బరిలోకి దిగిన గౌతమ్ మోడల్ హైస్కూల్ 170 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ గౌడ్ 34, రతన్ రాజ్ 32 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఆల్ సెయింట్ బౌలర్ శివకుమార్ 3 వికెట్లు తీసుకున్నాడు. -
రాణించిన అభిమాన్
జింఖానా, న్యూస్లైన్: వీనస్ సైబర్ టెక్ బ్యాట్స్మన్ అభిమాన్ (75) అర్ధ సెంచరీతో రాణించాడు. ఎంసీసీ జట్టుతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్లో గురువారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వీనస్ సైబర్ టెక్ 226 పరుగులకు ఆలౌటైంది. వంశీ రెడ్డి (45 నాటౌట్), ప్రదీప్ (30) మెరుగ్గా ఆడారు. ఎంసీసీ బౌలర్ రాజా వెంకటేశ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఎంసీసీ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో బౌలర్ విజయ్ (4/28) తన బౌలింగ్తో వీపీ విల్లోమెన్ జట్టును కట్టడి చేసినప్పటికీ సాగర్ ఎలెవన్ జట్టుకు పరాజయం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన సాగర్ ఎలెవన్ 156 పరుగులకు కుప్పకూలింది. ఖాను మెహర్ (57 నాటౌట్) అర్ధ సెంచరీతో ఆజేయంగా నిలవగా... విజయ్ నాయక్ 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. త ర్వాత బరిలోకి దిగిన వీపీ విల్లోమెన్ 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. -
నార్త్ జోన్ గెలుపు
జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్ జింఖానా, న్యూస్లైన్: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగిన మ్యాచ్లో నార్త్ జోన్ జట్టు 3 వికెట్ల తేడాతో వెస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించింది. అంబర్పేట మైదానంలో గురువారం మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. విద్యాసాగర్ 26, జగదీశ్వర్ రెడ్డి 22 పరుగులు చేశారు. కార్తీక్ 4, ఆనంద్ 2 వికెట్లు తీశారు. తర్వాత బరిలోకి దిగిన నార్త్ జోన్ 14 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. అనిల్ 26, అదిల్ 24 పరుగులు చేశారు. జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ బౌలర్లు జ్ఞానేశ్వర్, మల్లికార్జున్ చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. మరో మ్యాచ్లో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ జట్టు పరుగు తేడాతో జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. రాజారామ్ 26, రఘు 24, ప్రవీణ్చంద్ర 20 పరుగులు చేశారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ బౌలర్లు ర మేష్ 3, రవీందర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ 14.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. -
హైదరాబాద్, కర్ణాటక మ్యాచ్ డ్రా
జింఖానా, న్యూస్లైన్: విజయ్ మర్చంట్ ట్రోఫీలో హైదరాబాద్, కర్ణాటక మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. హైదరాబాద్ బౌలర్లు చెలరేగి కర్ణాటకను రెండు ఇన్నింగ్స్లోనూ తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో ఫాలోఆన్లో పడిన కర్ణాటక బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. ఆదిత్య రెడ్డి (39) రాణించాడు. అంతకుముందు 90/3 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 94.1 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్కు 162 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయ్యప్ప (35), బద్రీ (61) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో చందన్ సహాని 4, వర్మ, సోహైల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హైదరాబాద్కు 3, కర్ణాటకకు 1 పాయింట్ లభించింది. -
రాముకు 6 వికెట్లు
జింఖానా, న్యూస్లైన్: కాకతీయ జట్టు బౌలర్ రాము 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. దీంతో కాకతీయ జట్టు 6 వికెట్ల తేడాతో హెచ్యూసీసీ జట్టుపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్యూసీసీ 161 పరుగులకు కుప్పకూలింది. ఆరిఫ్ (67) అర్ధ సెంచరీతో రాణించగా... శుభమ్ 31 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మరో మ్యాచ్లో గౌలిపుర జట్టు 177 పరుగుల భారీ తేడాతో చీర్ఫుల్ చాంప్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గౌలిపుర 7 వికెట్లకు 226 పరుగులు చే సింది. విరించి యాదవ్ (60), సాయి మోహిత్ (38) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన చీర్ఫుల్ చాంప్స్ 8 వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. భరత్ 3 వికె ట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ స్పోర్టింగ్ ఎలెవన్: 185; కొసరాజు: 186/5 (అజయ్ పట్వారి 85 నాటౌట్, సాయి చరణ్ 70). -
హైదరాబాద్కు 3 పాయింట్లు
జింఖానా, న్యూస్లైన్: కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 36 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బుధవారం మూడో రోజు బరిలోకి దిగిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. జింఖానాలో జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆటలో జమ్మూ కాశ్మీర్ రెండో ఇన్నింగ్స్లో 83.4 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. బాండే (57), జైద్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా... ఫణి (41), సమద్ (35), శర్మ (31) రాణించారు. జయసూర్య 4, మిలింద్ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ 567/6 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, జమ్మూ కాశ్మీర్ 322 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్కు 3, జమ్మూ కాశ్మీర్కు 1 పాయింట్ దక్కింది. -
ఆధిక్యంలో వరుణ్
జింఖానా, న్యూస్లైన్: ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా నిర్వహిస్తున్న ‘బి’ కేటగిరీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుణ్ సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో వరుణ్ (3 పాయింట్లు) పశ్చిమ బెంగాల్కు చెందిన షౌన్ చౌదరి (2)పై విజయం సాధించాడు. విశ్వనాథ్ ప్రసాద్ (3) మన రాష్ట్రానికే చెందిన భరత్ కుమార్ రెడ్డి (2)పై గెలిచాడు. ఈ విజయాలతో వరుణ్, విశ్వనాథ్ ప్రసాద్ ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు టాప్ సీడ్ లోకేష్ (తమిళనాడు) గోవాకు చెందిన అమేయతో డ్రా చేసుకున్నాడు. ప్రేమ్ రాజ్ (2) తమిళ నాడు ఆటగాడు రతన్వేల్ (3) చేతిలో, కళ్యాణ్ కుమార్ (2) ఢిల్లీకి చెందిన ఆన్ష్ గుప్తా (3) చేతిలో ఓటమి చవిచూశారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు రమణ బాబు (3)... లక్ష్మీ కృష్ణ భూషణ్ (2)పై, బైవాబ్ మిశ్రా (3)... హృతికేష్ (2)పై, శ్రీకాంత్ (3)... ఖాన్ (2)పై, నవీన్ ఎస్. హెగ్డే (3)... ప్రజ్ఞానంద్ (2)పై, శైలేష్ ద్రవిడ్ (3)... సర్బోజిత్ పాల్ (2)పై, రుతుజా బక్షీ (3)... భవిక్ భారంబే (2)పై, సమ్మద్ జయకుమార్ (3)... శ్రద్దాంజలి జేన(2)పై, భరత్ కళ్యాణ్ (3)... అమినిస్మాయిల్ ఖాద్రీ (2)పై, హేమంత్ రామ్ (3)... కుషాగ్ర మోహ న్ (2)పై, విజయ్ ఆనంద్ (3)... ఆదిత్య (2)పై నెగ్గారు. మాజీద్ (2.5)... జితేంద్ర (2.5)తో, కాంతిలాల్ దేవ్ (2.5)... రాఘవ్ శ్రీవాస్తవ్ (2.5)తో, తమల్ చక్రవర్తి (2.5)... అభిషేక్ (2.5)తో, విశ్వేశ్వర్ (2.5)... వినాయక్ కులకర్ణి (2.5)తో, శరణ్య (2.5)... రూప్ సౌరవ్ (2.5)తో డ్రా చేసుకున్నారు. -
విజేత భారతీయ విద్యాభవన్
జింఖానా, న్యూస్లైన్: ఆలిండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టేబుల్ టెన్నిస్ టోర్నీలో అండర్-14 బాలుర టీమ్ టైటిల్ను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్, జూబ్లీహిల్స్) కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో తొలిసారిగా రాష్ట్రానికి చెందిన సీబీఎస్ఈ జట్టుకు స్వర్ణం రావడం విశేషం. బెంగాల్లోని దుర్గాపూర్లో జరిగిన టీమ్ చాంపియన్షిప్ ఈవెంట్ ఫైనల్లో బీవీబీపీఎస్ 3-1తో డాన్ బాస్కో స్కూల్ (అస్సాం)పై విజయం సాధించింది. మొదటి సింగిల్స్లో స్నేహిత్ 11-5, 11-5, 13-11తో మిన్మోయ్పై గెలిచాడు. రెండో సింగిల్స్లో మితుల్ అగర్వాల్ 6-11, 8-11, 4-11తో అలీకో చేతిలో ఓటమి పాలయ్యాడు. మూడో సింగిల్స్లో వరుణ్ శంకర్ 11-8, 11-4, 11-9తో బేబ్రాజ్పై గెలిచాడు. దీంతో బీవీబీపీఎస్ జట్టుకు 2-1తో ఆధిక్యం లభించింది. అనంతరం జరిగిన రివర్స్ సింగిల్స్లో సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర నంబర్వన్ ఆటగాడైన స్నేహిత్ 11-7, 11-7, 3-11, 11-6తో సునాయాసంగా అలీకోను ఓడించి 3-1తో టైటిల్ను అందించాడు. ఈ టోర్నీలో అండర్-14 బాలుర వ్యక్తిగత విభాగంలో స్నేహిత్కు కాంస్యం దక్కింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో స్నేహిత్ 3-1తో రామ్ జైన్(రాజస్థాన్)పై నెగ్గాడు. -
విజేతలు ఆదిత్య, మిరిక జైస్వాల్
జింఖానా, న్యూస్లైన్: ఏఐటీఏ టాలెంట్ సీరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆదిత్య కల్లెపల్లి, మిరిక జైస్వాల్ టైటిళ్లు సాధించారు. త్రినైన ఇన్ఫార్మాటిక్స్ లిమిటెడ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర అండర్-14 విభాగం ఫైనల్లో ఆదిత్య 4-6, 6-4, 6-4తో ప్రలోక్ ఇక్కుర్తిపై గెలిచి విజేతగా నిలిచాడు. తొలి సెట్లో ఓడిన ఆదిత్య తర్వాతి సెట్లలో విజృంభించి ఆడాడు. ప్రలోక్ గ ట్టి పోటీనిచ్చాడు. బాలికల టైటిల్ పోరులో మిరిక జైస్వాల్ 6-3, 6-7 (2/7), 6-4తో ధృతి కపూర్పై చెమటోడ్చి నెగ్గింది. తొలి సెట్ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన మిరికకు రెండో సెట్లో పరాజయం ఎదురైంది. దీంతో నిర్ణాయక మూడో సెట్లో పుంజుకొని ఆడిన మిరిక సెట్ను, మ్యాచ్ను కైవసం చేసుకుంది. -
నిప్పులు చెరిగిన రిషబ్
జింఖానా, న్యూస్లైన్: సెయింట్ ఆండ్రూస్ బౌలర్లు రిషబ్ (5/80), అలంకృత్ (3/14) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్లో సెయింట్ ఆండ్రూస్ 131 పరుగుల భారీ తేడాతో సెయింట్ జోసెఫ్ హైస్కూల్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ ఆండ్రూస్ 5 వికెట్లకు 239 పరుగులు చేసింది. సంపత్ (74), సిద్ధార్థ్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా... వైష్ణవ్ (47) మెరుగ్గా ఆడాడు. అన ంతరం బరిలోకి దిగిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 108 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యూష్ (53) మినహా మిగతావారు చేతులెత్తేశారు. మరో మ్యచ్లో మెదక్ వికెట్ తేడాతో సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ హైస్కూల్పై గెలుపొందింది. మొదట సెయింట్ మార్క్స్ 107 పరుగుల వద్ద ఆలౌటైంది. మెదక్ బౌలర్ అజ్మతుల్లా 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత మెదక్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. సెయింట్ మార్క్స్ బౌలర్ కపిల్ వ్యాస్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు కాల్ పబ్లిక్ స్కూల్: 210/3 (పి.సిద్ధార్థ్ 51, సూర్యతేజ 52, సాత్విక్ 46); కరీంనగర్: 213/5 (రిత్విక్ సూర్య 63, రోహన్ 55 నాటౌట్). ఎ-డివిజన్ వన్డే లీగ్ ఎలిగెంట్: 182/9 (తౌసిఫ్ ఖాన్ 66, మాజిద్ 48; ధీరజ్ 4/47); కన్స్ల్ట్: 120 (మహీందర్ 50; అజయ్ రెడ్డి 7/46).