జింఖానా, న్యూస్లైన్: బాయ్స్టౌన్ జట్టు బ్యాట్స్మన్ అబ్దుల్ ఖలీద్ ఖురేషి (156) సెంచరీతో విజృంభించడంతో ఆ జట్టు 86 పరుగుల తేడాతో సటన్ జట్టుపై విజయం సాధించింది. హెచ్సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ లీగ్లో శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బాయ్స్టౌన్ 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
అబ్దుల్ సిద్దిఖీ (33) ఫర్వాలేదనిపించాడు. సటన్ బౌలర్లు నీలేష్ , జనార్ధన్ రెడ్డి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సటన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. జనార్ధన్ రెడ్డి (65) అర్ధ సెంచరీతో రాణించాడు. బాయ్స్టౌన్ బౌలర్లు అఫ్సర్ 3, సైఫ్ ఉల్ హసన్ రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు.
ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఏపీ సివిల్ సర్వీసెస్ జట్టు బౌలర్ భాను కిరణ్ (5/17) చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 117 పరుగుల భారీ తేడాతో పరిశ్రమ్ భవన్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఏపీ సివిల్ సర్వీసెస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చే సింది. వెంకటేశ్ (64) అర్ధ సెంచరీతో చెలరేగగా... సుబ్రమణ్యం (33), అనిల్ కుమార్ (36), రంజిత్ (31) చక్కటి ఆటతీరు కనబరిచారు. అజమ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన పరిశ్రమ్ భవన్ 125 పరుగులకే చేతులెత్తేసింది. ఏపీ సివిల్ సర్వీసెస్ బౌలర్ శ్రీరామ్ రెండు వికెట్లు తీశాడు.
రాణించిన ఖలీద్
Published Sat, Jan 11 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement