కాంటినెంటల్ జట్టు గెలుపు | Continental Team victory | Sakshi
Sakshi News home page

కాంటినెంటల్ జట్టు గెలుపు

Jan 26 2014 12:25 AM | Updated on Mar 19 2019 9:20 PM

మిధాని బౌలర్ సంతోష్ (5/42) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు.

జింఖానా, న్యూస్‌లైన్: మిధాని బౌలర్ సంతోష్ (5/42) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దీంతో మిధాని జట్టు 6 వికెట్ల తేడాతో ఈసీఐఎల్ జట్టుపై గెలిచింది. ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన ఈసీఐఎల్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. రోహిత్ అగర్వాల్ (47) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బరిలోకి దిగిన మిధాని నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి గెలిచింది.
 
 అరుణ్ కుమార్ 31 పరుగులు చేశాడు. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కాంటినెంటల్ జట్టు 8 వికెట్ల తేడాతో గౌడ్స్ ఎలెవన్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గౌడ్స్ ఎలెవన్ 182 పరుగుల వద్ద చేతులెత్తేసింది. సాయినాథ్ (56) అర్ధ సెంచరీతో రాణిం చగా... నాగరాజు (45) మెరుగ్గా ఆడాడు. కాంటినెంటల్ జట్టు బౌలర్ సాత్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన కాంటినెంటల్ జట్టు రెండే వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి నెగ్గింది. శశిధర్ రెడ్డి (75) అర్ధ సెంచరీతో చెలరేగగా... వినీత్ రెడ్డి 42 పరుగులు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement