రంగారెడ్డి జిల్లా శుభారంభం | Rangareddy district grand opening hociey tournment | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా శుభారంభం

Published Fri, Dec 27 2013 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

Rangareddy district grand opening hociey tournment

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర పైకా మహిళల హాకీ టోర్నమెంట్‌లో తొలి రోజు రంగారెడ్డి జిల్లా, వైఎస్‌ఆర్ కడప జట్లు శుభారంభం చేశాయి. జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ స్టేడియంలో గురువారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 7-0 స్కోరుతో శ్రీకాకుళంపై విజయం సాధించింది.
 
 
  రెండో మ్యాచ్‌లో వైఎస్‌ఆర్ కడప 5-0తో మెదక్‌పై గెలిచింది. ప్రారంభ వేడుకలకు  రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారిణుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఎన్.ముఖేష్ కుమార్, శాప్ డిప్యూటీ డెరైక్టర్లు జి.ఎ.శోభ, జి.వెంకటరమణ, రాష్ట్ర పైకా సలహాదారుడు డాక్టర్ ఎన్.సి.మోహన్, హైదరాబాద్ జిల్లా క్రీడాధికారి ఎ.అలీమ్ ఖాన్, జి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
 
  లీగ్ ఫలితాలు
 ప్రకాశం 6-0తో ఆదిలాబాద్‌పై, విశాఖపట్నం 2-0తో కర్నూలుపై, తూర్పు గోదావరి 4-0తో నెల్లూరుపై, అనంతపురం 7-0తో కరీంనగర్‌పై, చిత్తూరు 5-0తో వరంగల్‌పై గెలుపొందాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement