rangareddy district
-
పోలీస్ స్టేషన్లోనే రక్షణ కరువు.. గుట్టు చప్పుడు కాకుండా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ కరువైంది. స్టేషన్లోనే అందరూ చూస్తుండగానే గొంతు కోసిన వైనం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిస్సింగ్ కేస్ క్లోజింగ్ కోసం వెళ్లిన ప్రేమికులకు ప్రాణహాని జరిగింది.పోలీస్ స్టేషన్ రిసెప్షన్లోనే అమ్మాయి తరపు బంధువు.. యువకుడి గొంతు కోసేశాడు. దీంతో గొంతుకు నాలుగు కుట్లు పడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన పోలీసులు.. ఇంటికి పంపేశారు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇంకా బయట మా పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆ ప్రేమ జంట వాపోతున్నారు. -
కట్టుకున్న భర్తను కాదని ప్రియుడితో ..
మేడ్చల్ రూరల్: కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల 10న ఉదయం మేడ్చల్ పట్టణంలోని కిందిబస్తీలో ఓ ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెంది పడిఉన్నట్లు స్థానికుల సమాచారంతో తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి స్వస్థలం మెదక్ జిల్లా ఎస్ కొండాపూర్ తండాకు చెందిన నునావత్ రమేశ్(30)గా గుర్తించారు. గత కొంతకాలంగా మేడ్చల్లో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, భార్య లలిత(28)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా వికారాబాద్ జిల్లా నీటూరు నర్సాపూర్కు చెందిన నర్సింహ్మ మేడ్చల్లో నివాసం ఉంటూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను లలితతో సన్నిహితంగా మెలిగాడు. లలిత తరచూ నర్సింహతో ఫోన్లో మాట్లాడడం, కలుస్తుండడం చూసిన భర్త రమేశ్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య లలిత ఎలాగైనా భర్త అడ్డు తొలగించికోవాలని భావించి ప్రియుడు నర్సింహతో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది.ఈ నెల 9న రమేశ్ మద్యం మత్తులో గొడవకు దిగగా..లలిత పథకం ప్రకారం ప్రియుడిని ఇంటికి పిలుచుకుంది. రాత్రి 10.30 గంటల సమయంలో వచ్చిన నర్సింహ్మ 11 గంటల సమయంలో రమేష్ మెడకు టవల్ చుట్టి గొంతు నులిమి లలిత సాయంతో అంతమొందించాడు. రమేశ్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న ఇద్దరు తెల్లవారుజామున కిందిబస్తీలోని ఓ ఖాళీ ప్రదేశంలో పడేసి వెళ్లి ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. 10న ఉదయం సంఘటన స్థలిని, మృతుడి ఒంటిపై గాయాలను గుర్తించిన పోలీసులు మొదట భార్య లలితను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బుధవారం వారిని రిమాండ్కు తరలించారు. -
ఆ జిల్లాల బీజేపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ
తెలంగాణలో జిల్లా సారథుల ఎంపికపై భారతీయ జనతాపార్టీ అచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్ (Hyderabad) శివార్లలో స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల నియామకంపై విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ రూరల్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, మేడ్చల్ అర్బన్, వికారాబాద్, హైదరాబాద్ గోల్కొండ, భాగ్యనగర్ జిల్లాలను పెండింగ్లో పెట్టింది. తమ వర్గానికి చెందిన నేతలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని సీనియర్లు పట్టుబట్టడం కూడా వీటి వాయిదా కారణంగా కనిపిస్తోంది.ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు నియోకవర్గం పరిధిలో ఉన్న రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులుగా తన వర్గీయులను నియమించాలని ఓ కీలక నేత పట్టుబడుతుండగా, రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ జిల్లా (Medchal District) పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని మరో నాయకుడు తన సన్నిహితుడికి అవకాశం కల్పించాలంటూ మొండికేస్తున్నారు. దీంతో ఈ జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియకు మరికొన్నాళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి గ్రామీణ అధ్యక్ష బాధ్యతలు తనకే అప్పగించాలంటూ ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా నేత ఒత్తిడి చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంటరీ స్థానం పరిధి పార్టీ సంస్థాగత జిల్లా రంగారెడ్డి రూరల్లో అధికంగా ఉన్నందున మాకే అవకాశం ఇవ్వాలని అక్కడి నాయకులు పట్టుబడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా లంకల దీపక్రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా లంకల దీపక్రెడ్డి (Lankala Deepak Reddy), మేడ్చల్ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బుద్ది శ్రీనివాస్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుండుగోని భరత్గౌడ్ (gundagoni bharath goud)ను నియమిస్తూ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అనుచరుడిగా చెబుతున్నారు. భరత్ గౌడ్ గతంలో బీజేవైఎం రాష్త్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంపీ డా.లక్ష్మణ్ అనుచరుడిగా పేరుంది.చదవండి: 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకంస్టేట్ కౌన్సిల్ సభ్యుల నియామకం.. మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో స్టేట్ కౌన్సిల్ సభ్యుడిని ఎన్నుకుంటారు. అందులో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి శేషసాయి, సనత్నగర్ నుంచి సురేష్ రావల్, సికింద్రాబాద్ నుంచి గణేష్ ముదిరాజ్, కంటోన్మెంట్ రాయల్ కుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో అంబర్పేట్ నియోజకవర్గం నుంచి నర్సింగరావు యాదవ్, ఖైరతాబాద్ నుంచి నగేష్, జూబ్లీహిల్స్ శ్రీనివాస్రెడ్డి, నాంపల్లి అనిల్కుమార్లకు అవకాశం కల్పించగా, మేడ్చల్ నియోజకవర్గం నుంచి అచ్చని నర్సింహకు స్టేట్ కౌన్సిల్లో స్థానం లభించింది. -
త్వరలోనే ‘ఆ పది’కి ఉప ఎన్నికలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాబాద్: బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఈ నెల 26 నుంచి రైతులందరికీ ఎకరానికి రూ.17,500, కౌలు రైతులకు రూ.15,000, భూమిలేని రైతు కూలీలకు రూ.12,000 ఇవ్వాలనే డిమాండ్తో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు దీక్ష’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేవెళ్ల సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆ పది నియోజకవర్గాల్లోనూ త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది.అప్పట్లో కాంగ్రెస్ తరఫున వాదించిన న్యాయవాది ఆర్య సుందరం ఈ ఉప ఎన్నికలపై కూడా వాదిస్తున్నారు. కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేందుకు ఆ స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్లో అనేక మంది సిద్ధంగా ఉన్నారు’అని తెలిపారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గల్లాపట్టి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ సహా సీఎం రేవంత్రెడ్డిపై 420 కేసు నమోదు చేయాలని అన్నారు. ఇక్కడ ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే.. అన్నీ చేసినట్లు ఢిల్లీలో సీఎం గప్పాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తామంటుండు కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందని కేటీఆర్ విమర్శించారు. ‘నాడు కేసీఆర్ రైతులకు నాట్లు వేసేటప్పుడు పైసలు ఇస్తే.. నేడు రేవంత్ ఓట్లప్పుడు మాత్రమే ఇస్తా అంటుండు. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి..తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇవ్వలేక పోయిండు. 1.60 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ.30 వేలు బాకీ పడింది. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ముందు తమ బాకీ తీర్చాలని అడగండి’అని పిలుపునిచ్చారు. 21న నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామని, ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ ఈ దీక్షలు కొనసాగుతాయని కేటీఆర్ ప్రకటించారు. ఈ రైతు దీక్షలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం
-
రంగారెడ్డి: రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్లాల్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో నిన్న సాయంత్రం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. -
అతనికి ఉరే సరి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అత్యంత పాశవికంగా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దినేశ్కు ఉరిశిక్షే సబబని చెప్పింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన ఈ కేసులో నిందితుడు దినేశ్కుమార్ను రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో దోషిగా తేల్చింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై దినేశ్ హైకోర్టులో సవాల్ చేయగా, ట్రయల్ కోర్టు నిర్ణయం సబబేనంటూ.. ఉరిశిక్షను ఖరారు చేస్తూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పీల్ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంది. ఇలాంటి కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షలు పడితేనే.. బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందని చెప్పింది. దినేశ్ అప్పీల్పై జస్టిస్ శామ్ కోషి, జస్టిస్ సాంబశివరావు నాయుడు విచారణ చేపట్టారు. కేసు పూర్వాపరాలు...హైదరాబాద్లోని అల్కాపురి టౌన్షిప్లో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్కు చెందిన దినేశ్ అక్కడే సెంట్రింగ్ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో కలిసిమెలిసి ఉండేవాడు. 2017, డిసెంబర్ 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి ఐదేళ్ల కుమార్తెకు చాక్లెట్ల ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బండరాయితో మోది హత్య చేశాడు.నేరం అంగీకరించిన నిందితుడుచిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. చిన్నారి చివరిసారిగా దినేశ్తో కనిపించిందనే ఆధారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దుస్తులకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. దినేశ్ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసులో వేగంగా విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021, ఫిబ్రవ రిలో దినేశ్ను దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష విధించింది. తలారి లేడు.. ఉరి కంబమూ లేదు..రాష్ట్రంలోని జైళ్లలో ఎక్కడా నేరస్తులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు తలారి లేడు.. కంబమూ లేదు. రాష్ట్ర పరిధిలో ఉరిశిక్ష అమలు జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైనే అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోని ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలో ఉరి తీసేందుకు వీలు ఉండేది. అయితే ముషీరాబాద్ జైలు తీసేసిన తర్వాత ఉరి అమలు చేసే వీలు లేకుండాపోయింది. చర్లపల్లిలో స్థలం ఉన్నా.. నిర్మాణం చేపట్టలేదు. అలాగే తలారి కావాల్సి వస్తే ఇతర ప్రాంతాల నుంచో లేదా ఇక్కడే ఎవరన్నా ముందుకొస్తే వారికి శిక్షణ ఇప్పించో అమలు చేయాల్సిన పరిస్థితి. దినేశ్కు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది.‘అమానుషమైన దారుణాలకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఇలాంటి మరణ శిక్షల ద్వారా తెలియజేయాలి. అయితే, మరణశిక్షపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరణశిక్షకు బదులుగా మారేందుకు అవకాశం ఇచ్చేలా జీవితఖైదు విధిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి వారు బాధితురాలి తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. తమ ఐదేళ్ల కుమార్తె తప్పిపోయిన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు మొదటిసారిగా ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు, ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలతో నగ్నంగా పడి ఉండటాన్ని చూసినప్పుడు ఎంత విలవిలలాడిపోయారో ఎవరికీ తెలియదు. చిన్నారి తలపై బండరాళ్లతో కొట్టారు. నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా ఆ దృశ్యం తల్లిదండ్రుల మదిలో మెదులుతూనే ఉంటుంది’ –హైకోర్టు ధర్మాసనం -
ప్రూట్ పూల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో పండ్ల తోటల సాగు క్రమేపీ పెరుగుతోంది. అన్ని రకాల పండ్లతోటలు సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితు లు భిన్నంగా ఉన్నా..వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తూ యువరైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. డ్రాగన్ ప్రూట్, కర్జూర, అవకాడో, యాపిల్ ఇలా వివిధ పండ్ల తోటలు జిల్లాలో సాగవుతున్నాయి. పులిమామిడిలో ‘యాపిల్’ ⇒ యాపిల్ అనగానే హిమాచల్ప్రదేశ్, కశీ్మర్ మాత్రమే గుర్తొస్తాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోనూ యాపిల్ తోటలు ఉన్నాయి. కందుకూరు మండలం పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనాకేంద్రం ఆశ్రమ నిర్వాహకులు 2021 డిసెంబర్లో హిమాచల్ప్రదేశ్ నుంచి హరిమన్–99 రకానికి చెందిన 170 మొక్కలు తెప్పించి, 30 గుంటల్లో నాటారు. మరో నాలుగు అన్నారకం మొక్క లు కూడా నాటారు. ప్రస్తుతం ఒక్కో మొక్క నుంచి వంద నుంచి రెండు వందల పండ్ల వరకు దిగుబడి వచ్చింది. సాధారణంగా మంచు, చలి ఎక్కువగా ఉండే ప్రదేశంలోనే ఈ యాపిల్ పంట పండుతుంది. కానీ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని దిగుబడి వస్తుండటం విశేషం. దెబ్బగూడలో ‘అవకాడో’ ⇒ సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. కందుకూరు మండలం దెబ్బ గూడకు చెందిన రమావత్ జైపాల్ జిల్లాలోనే తొలిసారిగా అవకాడో పండ్ల తోట సాగుచేశారు. ఆయన మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ఎకరం పది గుంటల్లో 220 అవ కాడో మొక్కలు నాటారు. మొక్క నాటే సమయంలో గుంతలో యాప పిండి, గులికల మందు వాడాడు. ఆ తర్వాత డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించాడు. చీడపీడల సమస్యే కాదు పెట్టుబడికి పైసా ఖర్చు కూడా లేకపోవడం ఆ యువరైతుకు కలిసి వచి్చంది. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి కాపు కొచ్చాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచి్చంది.తుక్కుగూడలో ద్రాక్ష సాగు..⇒ నిజాం నవాబుల బ్యాక్యార్డ్(ఇంటి వెనుక గార్డెన్)ల్లో ద్రాక్షతోటలు సాగయ్యేవి. ధనవంతుల పెరట్లో మాత్రమే ఈ తోటలు కనిపిస్తుండటంతో వీటికి ‘రిచ్మెన్ క్రాప్’గా పేరొచి్చంది. ఆ తర్వాత టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారి ద్రాక్షపంటను సాగు చేశారు. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచి్చంది. సాధారణంగా సమ శీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి చరిత్ర సృష్టించారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరం గ్రేప్స్ రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. పంట భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తుండటంతో 2005 నుంచి ద్రాక్ష పంట క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్క తుక్కుగూడ వేదికగా మాత్రమే ద్రాక్ష సాగవుతోంది.ఈ ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. జిల్లాలోని యాచారం, కందుకూరు, అబ్దుల్లాపూర్ మెట్, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగవుతోంది.15 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నా పదిహేను ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒక్కసారి మొక్క నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీ సాగు చేశాను. తాజాగా ’మాణిక్ చమాన్’ వెరైటీ ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా దిగుబడిని సాధించాను. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 25 కేజీల వరకు దిగుమతి వస్తుంది. ఎకరా పంటకు కనీసం ఆరు లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చుపోను రూ.3 లక్షలు మిగులుతుంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, తుక్కుగూడవిదేశాల నుంచి తిరిగొచ్చి.. మేం ముగ్గురం అన్నదమ్ములం. మాకు 47 ఎకరాల భూమి ఉంది. మాది మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక మళ్లీ వెనక్కి తిరిగొచ్చా. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అవకాడో సాగు చేయాలనుకున్నా. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసుకోకుండా..వ్యవసాయం చేస్తున్నాడేంటి? అని అంతా నవ్వుకున్నారు.ఏదో ఒక పండ్లతోట సాగు చేయాలని భావించి మొక్కల కొనుగోలుకు జడ్చర్ల నర్సరీకి వెళ్లాను. అక్కడ అవకాడో మొక్కలు చూశా. అప్పటికే ఆ పండు గురించి తెలుసు కాబట్టి..ఆ పంటను సాగుచేశా. మొక్క నాటిన తర్వాత పైసా ఖర్చు చేయలేదు. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచి్చంది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి పండ్లు కొనుగోలు చేశారు. – రమావత్ జైపాల్, యువరైతు -
రైతుబంధు, రైతుబీమా నిధులు పక్కదారి!
కొందుర్గు: రైతుబంధు, రైతుబీమా నిధులను దారి మళ్లించిన కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఒక ఏఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా రైతుబీమా డబ్బులు, 130 మంది రైతుబంధు డబ్బులు పక్కదారి పట్టినట్లు తెలిసింది. రైతుబీమాకు సంబంధించి క్లెయిమ్ చేసే సమయంలో నామినీ వివరాలు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సదరు ఏఈవో తన ఖాతా, కుటుంబసభ్యుల ఖాతా, బంధువులు, స్నేహితుల ఖాతా నంబర్లను ఎడిట్ చేసి బీమా కంపెనీకి పంపినట్లు సమాచారం. ఒకే ఖాతాకు వరుసగా డబ్బులు జమ అవుతున్నాయని అనుమానం వచ్చిన బీమా కంపెనీవారు వ్యవసాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల సూచన మేరకు హైదరాబాద్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఏఈవోను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైతుబంధు డబ్బులను కూడా ఇలాగే నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేసినట్లు ప్రచారం జరుగుతోంది. రైతుబంధు, రైతుబీమా కలిపి సుమారు రూ.2 కోట్ల వరకు కాజేసినట్లు సమాచారం. హైదరాబాద్ కర్మన్ఘాట్లోని మరో ఇంట్లో కూడా విచారణ జరిపినట్లు సమాచారం. సదరు ఏఈవో కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడంలేదు. -
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో భారీ పేలుడు
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో భారీ పేలుడు సంభవించింది. స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో భారీ శద్ధంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాల అయ్యాయి. పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. చదవండి: చందాలేసుకుని టికెట్లు కొంటారు.. కానీ, రైలెక్కరు..! -
ఆ చాక్లెట్లు తిని మత్తులోకి జారి!
కొత్తూరు: స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో విక్రయిస్తున్న చాక్లెట్లు తిని విద్యార్థులు మత్తులోకి జారుకోవడం, వింత వింతగా ప్రవర్తిస్తున్న దృష్టాంతాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగుచూశాయి. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో లభించే చాక్లెట్లను తరచూ కొని తింటున్న పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్ల వల్లనే అని తేలింది. వీటిని మొదట పాన్ డబ్బాల వ్యాపారులు ఉచితంగా విద్యార్థులకు అందించారని, క్రమంగా వాటికి బానిసలైన విద్యార్థులకు ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయుల సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు మంగళవారం సదరు పాన్ డబ్బాలపై దాడిచేయగా స్వల్ప మొత్తంలో చాక్లెట్లు లభించాయి. అయితే ఈ చాక్లెట్లలో ఏముందనేది తెలియరాలేదని చెబుతున్నారు. హెచ్ఎం అంగోర్ నాయక్ను వివరణ కోరగా విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. -
‘ధరణి’ పోర్టల్లో దొంగలు పడ్డారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో దొంగలు పడ్డారు. జిల్లా కలెక్టర్ సహా తహసీల్దార్లంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా.. సదరు వెబ్సైట్ను పర్యవేక్షిస్తున్న ఇద్దరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ తంతులో భారీగా భూములు చేతులు మారినట్లు తెలుస్తోంది. కలెక్టర్ పరిశీలన, అనుమతి లేకుండా దరఖాస్తులకు ఆమోదం (డిజిటల్ సంతకంతో) తెలిపినట్లు సమాచారం. ఇలా నిషేధిత జాబితాలో ఉన్న 98 దరఖాస్తులను ఈ తరహాలో జాబితా నుంచి తొలగిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ అంశంపై పోలీసులు కూడా విచారణ ప్రారంభించినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. సాంకేతికతను అడ్డుపెట్టుకుని నడిపిన ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన ఇద్దరు ఉద్యోగులకు ఇంటిదొంగలు ఎవరైనా సాయపడ్డారా? ఈ భూ బాగోతంలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. 28 రోజుల్లో 98 దరఖాస్తులకు ఆమోదం ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అప్పటి జిల్లా కలెక్టర్ హరీశ్పై కేంద్ర ఎన్నికల కమిషన్ అక్టోబర్ 11న వేటు వేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్తగా భారతీ హోళికేరి కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే జిల్లా ఎన్నికల అధికారిగా ఆమె బిజీగా మారారు. ధరణి పోర్టల్కు వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టి.. పూర్తిగా ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీకరించారు. ఇదే అదనుగా భావించిన ధరణి సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. జిల్లాలో పలు చోట్ల ఉన్న భూదాన్ భూములను పట్టా భూములుగా మారుస్తూ ఆమోదముద్ర వేసినట్లు తేలింది. నిజానికి ఏదైనా ధరణి దరఖాస్తును ఆమోదించాలన్నా.. తిరస్కరించాలన్నా.. క్షేత్రస్థాయి రిపోర్టులే కీలకం. కానీ అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్యన ఎలాంటి రిపోర్టులు లేకుండానే సుమారు వంద అర్జీలకు ఆమోదం లభించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం కోర్టు కేసులు, అసైన్డ్, భూదాన్, మ్యూటేషన్లు, పాసు పుస్తకాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన వివాదాస్పద భూ సమస్యల అప్లికేషన్లకు పోర్టల్లో ఆమోదం రావడంపై కొందరు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఇంటి దొంగలే ఈ ఉదంతానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు ధరణి సమన్వయకర్త నరేశ్, ఆపరేటర్ మహేశ్లను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇందులో కేవలం సమన్వయకర్త, ఆపరేటర్ల పాత్ర మాత్రమే ఉందా? లేక జిల్లా ఉన్నతాధికారులు, ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రేటర్ ఓటు బీఆర్ఎస్కే..
సాక్షి, హైదరాబాద్, సాక్షి, మేడ్చల్ జిల్లా, సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ నగరంలో అధికార బీఆర్ఎస్ సత్తా చూపింది. కోర్సిటీ(పాత ఎంసీహెచ్) పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఏడింట సిట్టింగ్లుండగా, తిరిగి వాటిని కైవసం చేసుకుంది. ముషీరాబాద్ (ముఠాగోపాల్), అంబర్పేట(కాలేరు వెంకటేశ్), ఖైరతాబాద్(దానం నాగేందర్), జూబ్లీహిల్స్(మాగంటి గోపీనాథ్), సనత్నగర్(తలసాని శ్రీనివాస్యాదవ్), సికింద్రాబాద్(పద్మారావు)నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఈసారి ఆయన కుమార్తె లాస్యనందితకు టికెట్టివ్వగా ఆమె గెలుపొందారు. గ్రేటర్ పరిధిలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు డి.సు«దీర్రెడ్డి(ఎల్బీనగర్), ప్రకాశ్గౌడ్(రాజేంద్రనగర్), అరికపూడి గాం«దీ(శేరిలింగంపల్లి), సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం) తిరిగి గెలుపొందారు. మేడ్చల్ జిల్లాలో 5 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మేడ్చల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి రెండోసారి గెలుపొందగా, కుత్బుల్లాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మూడోసారి ఘనవిజయం సాధించి హాట్రిక్ కొట్టారు. కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు కూడా మూడో సారి గెలుపొంది,హాట్రిక్ సాధించారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేసిన బండారి లక్ష్మారెడ్డి గెలుపొందారు. అలాగే, మల్కాజిగిరిలో కూడా చామకూర మల్లారెడ్డి స్వయాన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి మొదటి సారి విజయం సాధించారు. రంగారెడ్డిలో కారు హవా.. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు గానూ ఐదు చోట్ల బీఆర్ఎస్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మహేశ్వరం నుంచి పోటీచేసిన మంత్రి సబితారెడ్డి మూడోసారి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కాలె యాదయ్య మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఎల్బీనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్రెడ్డి, రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున షాద్నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి 40వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. వికారాబాద్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్! వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. నాలుగు నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లా మొత్తం క్లీన్స్వీప్ చేయడంతో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో సంబరాలు మిన్నంటాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలకంగా ఉన్న పైలెట్ రోహిత్రెడ్డి తాండూరులో బుయ్యని మనోహర్రెడ్డి చేతిలో ఓడిపోయారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ ఈసారి గెలుపు బావుటా ఎగరేశారు. పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డిపై గెలుపొందారు. -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు
సాక్షి, ఉమ్మడి రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు సాగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ హవా సాగుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ విజయతీరాలకు చేరువలో ఉంది. రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్కుమార్, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ (స్వల్ప ఆధిక్యం, 60 ఓట్లు) వెనుకంజలో ఉన్నారు. -
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత
-
రసవత్తరం రంగారెడ్డి
రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న జిల్లా ఇదే. పల్లె, పట్నం కలబోత జిల్లాగా శరవేగంగా విస్తరిస్తూ ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. మొదట్లో టీడీపీ, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ జిల్లా రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్కు అండగా నిలిచింది. ఈ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు అధికార బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, మళ్లీ పట్టు బిగించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. ప్రచారంలో జెట్ స్పీడులో కారు ఇక్కడ మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా, 2014లో టీఆర్ఎస్ ఏడు స్థానాల్లో విజయం సాధించగా, ఆరు స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 2018 నాటికి టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. 14 స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకోగా, కేవలం మూడు స్థానాలే హçస్తగతమయ్యాయి. ఆ తర్వాత మహేశ్వరం నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి గెలుపొందిన దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, తాండూరు నుంచి గెలుపొందిన పైలెట్ రోహిత్రెడ్డి కూడా చేయిచ్చి ..కారెక్కారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కొనసాగారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధిష్టానం ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడంతో పార్టీ బీ ఫాం తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లు, అవినీతి వంటి ఆరోపణలున్నాయి. ఇక ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడంతో ఆయన ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. మల్కాజిగిరి హన్మంతరావు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ అంతర్గత కుమ్ములాటలకు తోడు కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టి పోటీ ఎదరవుతుండటంతో అధికార పార్టీ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. చేరికలతో ‘చేతి’కి జీవం తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుస పరాజయాలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్కు కీలక నేతల చేరికలు మళ్లీ జీవం పోశాయి. తుక్కుగూడ వేదికగా ఇటీవల నిర్వహించిన పార్టీ విజయోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంతరావు, తాండూరులో డీసీసీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, షాద్నగర్లో చౌల ప్రతాప్రెడ్డి సహా పలువురు జెడ్పీటీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మహేశ్వరంలో చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నంలో సిద్ధంకి కృష్ణారెడ్డి, శేరిలింగంపల్లిలో జగదీశ్వర్గౌడ్ చేరికలు ఆ పార్టీకి జీవం పోశాయి. గత ఎన్నికల్లో పార్టీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత పార్టీని వీడిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టార్గెట్గా మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని బరిలోకి దించింది. ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ను రంగంలోకి దింపింది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన మల్రెడ్డి రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దింపింది. కారు దిగి హస్తం గూటికి చేరిన కసిరెడ్డిని కల్వకుర్తి నుంచి, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డిని తాండూరు నుంచి రంగంలోకి దింపి అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. బీజేపీ ఫోకస్ ఉమ్మడి జిల్లాపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014లో ఉప్పల్ మినహా ఇతర నియోజకవర్గాల్లో గెలువలేక పోయింది. 2018 లోనూ కారు ధాటికి తట్టుకోలేక పోయింది. అర్బన్ ఓటర్లే లక్ష్యంగా ఈ సారి పావులు కదుపుతోంది. పార్టీ జాతీయ సమావేశాలు కూడా జిల్లా వేదికగా నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు జిల్లాలో పర్యటించి పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, కల్వకుర్తి, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి, నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పార్టీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సొంత గడ్డగా భావించే మహేశ్వరం నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. రాజకీయాస్తాలుగా 111జీఓ, ధరణి సమస్యలు రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, గృహలక్మి, పథకం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఖాళీ స్థలాల పంపిణీ, జీఓ నంబర్ 58 ,59, 118(ఆక్రమిత ప్రభుత్వ స్థలాల, సీలింగ్ భూముల క్రమబద్దీకరణ), కొత్త పరిశ్రమలు, ఐటీ, ఉపాధి అవకాశాలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు మాత్రం జంట జలాశయాల పరిరక్షణకు తీసుకొచ్చిన 111 జీఓ ఎత్తివేత అంశంతో పాటు ధరణి సమస్యలు, ఫార్మాసిటీ, పారిశ్రామిక వాడల్లోని భూ బాధితులకు నష్టపరిహారం చెల్లింపులు, అబ్దుల్లాపూర్మెట్ మైన్స్ తవ్వకాలు వంటి అంశాలను రాజకీయ ఎజెండాగా ఎంచుకుంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా నుంచి ధరణి ఫోర్టల్కు 1.95 లక్ష లకుపైగా దరఖాస్తులు అందగా, మెజారిటీ దరఖాస్తులు వివిధ కారణాలతో పరిష్కారానికి నోచుకోకుండా పోయాయి. కాంగ్రెస్, బీజేపీలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాకపోవడం కూడా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. - శ్రీశైలం నోముల -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
-
‘రంగారెడ్డి’లో నాన్లోకలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు.. ఉద్యోగ నియామకాల్లో కొన్నేళ్లుగా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఆ జిల్లా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భాగం కావడం వల్ల ఇతర జిల్లాల వారూ రంగారెడ్డి జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగరీత్యా దీర్ఘకాలం ఇక్కడే స్థిరపడడంతో వారి పిల్లలూ స్థానికులుగా గుర్తింపు పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ప్పుడు ఆంధ్ర, రాయలసీయ జిల్లాలకు చెందినవారు అప్పట్లో ఉద్యోగాలు పొంది ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతున్నారు. తాతల కాలం నుంచి రంగారెడ్డి జిల్లాలో పుట్టి పెరిగిన స్థానికులకు నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలంగాణలో హెచ్ఆర్ఏ ఎక్కువ ఇచ్చే జిల్లాల్లో రంగారెడ్డి కూడా ఉంది. ఈ కారణంగా స్థానికేతరులు కూడా సీనియారిటీ ప్రాతిపదికన ఈ జిల్లానే ఎంచుకుంటున్నారు. గత ఏడాది అమలు చేసిన 317 జీఓ తర్వాత స్థానికులకు సరైన అవకాశాలే లేకుండాపోయామని ఆ జిల్లావాసులు చెబుతున్నారు. ఉదాహరణకు స్కూల్అసిస్టెంట్ బయోసైన్స్లో రంగారెడ్డికి, మహబూబ్నగర్లోని 64 మండలాల నుంచి కేడర్కు మించి కేటాయించారు. ఇతర సబ్జెక్టుల్లో కూడా కేడర్కు మించి టీచర్ల కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉంటే స్పౌజ్ కోటాతో సమస్య మరింత జటిలమైంది. భర్త, లేదా భార్య ఈ జిల్లాలో పనిచేస్తున్నట్టు చూపించి దాదాపు 400మంది ఇదే జిల్లాకు వచ్చారు. దీర్ఘకాలం వీరు కొనసాగడం వల్ల ఖాళీలు లేకుండా పోయాయి. దీంతో టెట్, జాతీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు పాసైన స్థానికులకు ఉద్యోగాలు పొందే అవకాశమే లేకుండా పోయింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై... ఈ నెల 19 వరకు స్టే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ.. డీఈవో, డీఎస్ఈతో పాటు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అధికారులు ఇతర జిల్లాలకు చెందిన టీచర్లను కూడా రంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తున్నారని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ టి.శ్రీనివాస్రెడ్డి సహా పలువురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని, కేడర్ను మించిపోతే ఈ జిల్లాకు చెందిన తాము నష్టపోతామని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి బదిలీలు చేపడుతున్నారు. దీనిపై పిటిషనర్ల అభ్యంతరాలకు కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అయితే తుది సీనియారిటీ జాబితాను జారీ చేయకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం లేదని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. లంచ్మోషన్లో పిటిషన్ వచ్చినందున వివరాలు తెలుసుకోవడానికి ఈనెల 19 వరకు సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తూ, అప్పటివరకు బదిలీలు, పదోన్నతులు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. -
కాంగ్రెస్కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయా? కారు దిగాలనుకున్న నేతలు రూట్ మార్చారా? కాంగ్రెస్కు హ్యాండిచ్చినట్లేనా? అధికార పార్టీ వ్యూహాలకు హస్తం పార్టీ కంగు తినిందా ? అసలు కారు దిగాలనుకున్న నేతలేవరు ? ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను వారు ఎందుకు కాదనుకుంటున్నారు ? హైదరాబాద్ మహానగరం చుట్టూ విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు బిగించాలని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కారు పార్టీ ఓవర్ లోడ్ కావడంతో కొందరైనా కిందికి దిగకపోతారా అని ఎదురు చూసింది. ఇప్పటివరకు అంటువంటి సంకేతాలే వచ్చాయి. దీంతో హస్తం పార్టీని పటిష్టం చేసుకోవచ్చని నాయకులు భావించారు. జిల్లాలో అసంతృప్తితో ఉన్న గులాబీ నేతలకు పార్టీ అధినాయకత్వం కారులోనే సర్ధుబాటు చేస్తోంది. గత కొంతకాలంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి... కాంగ్రెస్ గూటికి వెళ్తారని ప్రచారం జరిగింది. ఇందుకోసం తెరవెనక మంత్రాంగం భారీగా జరిగిందని కార్యకర్తల గుసగుసలు వినిపించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు జారకుండా.. సీఎం కేసీఆర్ చకచకా పావులు కదిపినట్లు సమాచారం అసంతృప్తితో రగిలిపోతున్న నేతలతో మంత్రి కేటీఆర్ చర్చించారు. అసమ్మతి నేతల రాజకీయ ఉనికికి ఇబ్బంది లేకుండా కేటీఆర్ పరిష్కార మార్గాలను చూపించడంతో వారంతా చల్లబడ్డట్లు ప్రచారం సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పట్నం మహేందర్ రెడ్డికి.. బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. తాండూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోవడం.. పట్నం మహేందర్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో పట్నం చేసేది లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా గులబీ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి పట్నం మహేందర్రెడ్డికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపెట్టడంతో చల్లబడ్డట్లు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఆయన కోడలు తీగల అనితారెడ్డికి బీఆర్ఎస్ తరపున జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా అవకాశమిచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ గూటికి చేరి మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కించుకున్నారు. సబిత కారెక్కడం.. తీగలకు ఇబ్బందిగా మారింది. తీగల కృష్ణారెడ్డి అనేకమార్లు మంత్రి సబితారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. చదవండి: బీఆర్ఎస్ టికెట్ల లొల్లిలో రాసలీలల ట్విస్ట్! వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. అసంతృప్తితో ఉన్న తీగల కాంగ్రెస్ కు వెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు. పార్టీ హైకమాండ్ సర్ది చెప్పడం, తీగలకు ఆల్టర్ నేట్ సొల్యూషన్ చూపెట్టడంతో కారులోనే ఉండాలని ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే గులాబీ పార్టీ అభ్యర్థుల చిట్టా కూడా లీకైంది. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని చెబుతున్నారు. సర్దుబాట్లన్నీ పూర్తయ్యాకే జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి జాబితా అధికారికంగా ప్రకటిస్తే గాని కారులో ఉండేదెవరో దిగేదెవరో తేలుతుంది. ప్రస్తుతానికి గులాబీ నేతల మధ్య సర్దుబాట్లు బాగానే ఉన్నా.. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తారా ? వెన్నుపోట్లు పొడుచుకుంటారా ? అన్నది చూడాలి. -
‘చెలిమి’కి అంకురం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా వ్యవస్థలో శాస్త్రీయతను జోడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వివిధ రూపాల్లో విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకునేలా ‘చెలిమి’ విద్యార్థుల్లో వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’అనే కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. పిల్లలు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము సమాయత్తం చేసుకొనేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లోని అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఏయే రంగాల్లో రాణిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయ మదింపు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకురం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు. మంచి భవిష్యత్ను అందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బి.వినోద్కుమార్ అన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
మరో రూ.3,318 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తైవాన్కు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ గ్రూప్ రాష్ట్రంలో మరో రూ.3,318 కోట్ల (400 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత్లో ఫాక్స్కాన్ ప్రతినిధి వీ లీ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ను ధ్రువీకరిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. ‘ఫాక్స్కాన్తో తెలంగాణ బంధం వేగంగా పురోగమిస్తోంది. పరస్పర ఒప్పందంలో పేర్కొన్న అంశాలను ఇరువురం వేగంగా అమలు పరుస్తున్నాం. ఈ నేపథ్యంలో గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా రూ.4,562 కోట్ల (550 మిలియన్ డాలర్లు) పెట్టుబడి హామీని ఫాక్స్కాన్ నెరవేర్చింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలనే ప్రతిపాదననను ‘ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ’ (ఎఫ్ఐటీ) ఆమోదించినట్లు బోర్డు చైర్మన్ లూ సంగ్ చింగ్ కూడా మరో ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎయిర్పాడ్స్తోపాటు మొబైల్ ఫోన్ల ఇతర విడిభాగాల తయారీలో ఫాక్స్కాన్కు దిగ్గజ సంస్థగా పేరుంది. ఇది మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్కు ప్రధాన విడిభాగాల సరఫరాదారుగా ఉంది. ఫాక్స్కాన్ తొలి విడతలో రూ.1,244 కోట్లు (150 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. కొంగరకలాన్లో 196 ఎకరాల్లో ఏర్పాటు ఇప్పటికే కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫాక్స్కాన్ తెలంగాణలోనూ కార్యకలాపాలు ప్రారంభించే ఉద్దేశంతో గత మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఫాక్స్కాన్కు 196 ఎకరాలు కేటాయించింది. గత మే 15న ఫాక్స్కాన్ యూనిట్కు శంకుస్థాపన జరగ్గా ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, ఎల్ఈడీ విద్యుద్దీపాలు, వాననీటిని ఒడిసి పట్టి ఇతర అవసరాలకు వాడుకోవడం, సిబ్బందికి బస వంటి అనేక ప్రత్యేకతలు ఈ క్యాంపస్లో ఉంటాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుండగా, ఫాక్స్కాన్ యూనిట్ ఏర్పాటు ద్వారా స్థానికంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. -
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని వి. శ్రీనివాస్ గౌడ్ ,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ,స్థానిక గౌడ కులస్తులు నేతలతో కలిసి ఆవిష్కరించారు . రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తాలో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు అన్ని కులాలను మతాలను సమానంగా ఆదరిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్తులకు కూడా కొకపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు.అదేవిధంగా రైతన్నల లాగే,గౌడన్నలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. ఎక్కడికో వెళ్లి గియకుండా,గౌడన్నలకు దగ్గరగా ఉండాలనే చెరువు కట్ట మీద ఈత చెట్లు పెట్టినట్లు,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలకే ఉందన్నారు.ఆదాయం పెంచుకోవాలని మంత్రి సూచించారు.కుల వృత్తుల వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.నాడు భయం భయంగా ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునేవారని,నేడు నగరం నడి బొడ్డున నీరా కేఫ్ లు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉంటున్నారన్నారు..బీసీ ల్లోని కుల చేతి వృత్తుల వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొగల్ పాలకుల దౌర్జన్యాలకు , నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరాఠయోధుడు చత్రపతి శివాజీ సమకాలికులు తెలుగు గడ్డపైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లు తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసి గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి లను అధికారికంగా నిర్వహించడంతోపాటు చారిత్రక ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు మతాలకు వృత్తుల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలను రద్దుచేసి గౌడ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి చెట్లను నాటుతున్నమన్నారు కల్లుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలకు ఔషధ గుణాలున్న నీరాను అందిస్తున్నామన్నారు. గీత కార్మికులు సాహసపేతమైన వృత్తిని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి కల్లు, నీరాను అందించి ఎంతో భయంకరమైన క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధమైన రోగాల బారి నుండి ప్రజలను కాపాడుతున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు వీటితోపాటు వైన్ షాప్ లలో 15శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. -
పోలీసుల బ్రెయిన్.. అదిరిన ప్లాన్.. కాపాడిన ట్రాఫిక్ క్రేన్..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్లో మొరాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సాయంతో అంబులెన్స్ను అక్కడి నుంచి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయేంద్ర ప్రసాద్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం ఓ అంబులెన్స్లో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాత్రి 9 గంటల సమయంలో హబ్సిగూడ చౌరస్తా వద్దకు అంబులెన్స్ మొరాయించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నల్లకుంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై నిరంజన్, ఏఎస్ఐ వెంకటేశ్వర రావును అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది అంబులెన్స్ను తోసుకుంటూ సిగ్నల్స్ వద్ద నుంచి ముందుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్లో చూడగా 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్పై ఉన్నాడు. చలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఎలాగైనా యువకుడిని ఆస్పత్రికి తరలించాలనే తపనతో వెంటనే ట్రాఫిక్ క్రేన్కు అంబులెన్స్ కట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అది సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వరకు చేరుకోగానే మరో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. గాయపడిన యువకుడిని అందులోకి మార్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుకు నెటిజనులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
575 కోట్ల పెట్టుబడి 1,600 మందికి ఉపాధి
షాబాద్: రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో రూ.575 కోట్ల పెట్టుబడితో జపాన్కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్కు, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ కంపెనీ ఏర్పాటుకు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 1,600 మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పారు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యో గ యువతకు కంపెనీల్లో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే కంపెనీల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకోవడం జరిగిందని, వారి అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలోపెట్టుబడులు అభినందనీయం ‘తయారీ రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. నిజానికి అక్కడ సహజ వనరులు తక్కువ. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలబడింది. ఉన్న కొద్దిపాటి వనరులను ఉపయోగించుకుని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తి, నాణ్యత అంశంలో అందరికంటే ముందుంది. పారిశ్రామిక ఉత్పత్తిలో తమ సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక జపాన్ వస్తువు ఉంటుంది. అలాంటి దేశానికి చెందిన రెండు ప్రముఖ కంపెనీలు రంగారెడ్డి జిల్లాలో పెట్టుబడులు పెట్టడం అభినందనీయం..’ అని కేటీఆర్ చెప్పారు. మరిన్ని పెట్టుబడులకు సహకరించండి ‘స్థానిక నాయకులు, ప్రజల చొరవతో ఇక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. టెక్స్టైల్స్ మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాల దాకా విభిన్నమైన కంపెనీలు ఈ ప్రాంతాన్ని తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందనవెళ్లి ఎదుగుతుంది..’ అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా సహకరించాల్సిందిగా జపాన్ కాన్సులేట్ను కోరుతున్నానని కేటీఆర్ చెప్పారు. జపాన్ కంపెనీల కోసం అవసరమైతే ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధమని అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నవ వధువు ఆత్మహత్య.. పెళ్లయిన కొన్ని రోజులకే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్పల్లిలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్త వేధింపులు తాళలేక ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్కు చెందిన చంద్రశేఖర్తో కవితకు వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పోటి మాటలు భరించలేక కవిత తనువు చాలించింది. మైలార్దేవ్పల్లి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అశ్లీల చిత్రాలకు బానిసై నా భర్త.. -
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
మంచి పని కోసం క్రీడలను నిర్వహించడం.. ఇదీ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తలపెట్టిన కార్యక్రమం. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తొలిసారిగా ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్షిప్ 2023 ను నిర్వహించింది. దీని ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్లోని కస్టమ్-బిల్ట్ రేస్ ట్రాక్లో ఈ మోటార్ ఫెస్ట్ నిర్వహించింది. ఈ రేసులో ఎంతో మంది టాప్ రేసర్లు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని శ్రీ సత్య సాయి ఆస్పత్రిలో ఈనిర్మాణం చేపడతారు. దీనికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్ విజయవంతం చేసింది రోటరీ క్లబ్. -
కాసుల యావ.. కోతల హవా: ఎడాపెడా ‘ప్రైవేటు’ సిజేరియన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్యుల కాసుల కక్కుర్తి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అధిక ఫీజుపై ఆశతో ఎడాపెడా ‘కోత’లు పెడుతున్నారు. దీనికితోడు మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే కొందరు భార్యాభర్తల ఆలోచన.. తమ బిడ్డ పురిటి నొప్పులు భరించ లేదనే కొందరు తల్లిదండ్రుల ఆందోళన.. సిజేరియన్లు పెరిగిపోయేందుకు దోహదపడుతోంది. సాధారణ ప్రసవాల్లో తక్కువ రక్తస్రావంతో పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కేవలం వారం రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. అదే సిజేరియన్లతో అధిక రక్తస్రావం సమస్యతో పాటు వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి సిజేరియన్లు నివారించేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులు, ఆ పని చేయకుండా వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. వీధి చివర్లో ఉన్న నర్సింగ్ హోమ్లో సాధారణ ప్రసవానికి రూ.35 వేల నుంచి 40 వేలలోపే ఖర్చు అవుతుంది. అదే సిజేరియన్ అయితే రూ.80 వేల నుంచి రూ.లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఇక కార్పొరేట్ ఆస్పత్రి అయితే ఆ స్థాయిలోనే సాధారణ, సిజేరియన్ డెలివరీ ఫీజులు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి...కడుపు కోతలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నాచితకా నర్సింగ్హోమ్లు మొదలు కార్పొరేట్ ఆస్పత్రుల దాకా ఇష్టారాజ్యంగా మారిపోయిందనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లు ఒకింత ఎక్కువగానే ఉండటం గమనార్హం. గణాంకాలే నిదర్శనం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ మధ్య మొత్తం (ఇళ్లలో, అంబులెన్సుల్లో జరిగినవి మినహాయించి) 16,321 ప్రసవాలు జరగ్గా ఇందులో సిజేరియన్లు 6,287 ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల విషయానికొస్తే.. మొత్తం 10,990 ప్రసవాలు జరిగితే అందులో 8 వేలకు పైగా సిజేరియన్లే కావడం గమనార్హం. అంతకుముందు 2021–22లో 19,183 ప్రసవాలు జరిగితే అందులో సిజేరియన్లు 13,895 ఉండటం ప్రైవేటు ఆస్పత్రుల తీరుకు అద్దంపడుతోంది. తల్లుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా క్షేత్రస్థాయిలో సిజేరియన్ల సంఖ్య తగ్గక పోగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలి కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. కానీ చాలామంది వైద్యులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు కూడా వివిధ కారణాలతో సిజేరియన్ కోరుకుంటున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సహజ ప్రసవాల ద్వారా జన్మించిన శిశువుకు వెంటనే ముర్రుపాలు అందుతాయి. అదే సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డ మూడు నాలుగు రోజుల పాటు పోతపాల పైనే ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా రోగనిరోధకశక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు వారాల తరబడి ఇంక్యుబేటర్, ఫొటోథెరపీ యూనిట్లలో ఉంచాల్సి వస్తుంది. – డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్టు -
వంట చేయడానికి వెళ్తూ.. రోడ్డుకు బలై..
మహేశ్వరం/వెల్దండ: శుభకార్యాలకు వంట చేస్తూ మెప్పు పొందిన నలుగురు యువకులు.. ఓ పెళ్లిలో వంట చేసి పెట్టారు. మరో శుభకార్యానికి వంట చేసేందుకు కారులో బయలుదేరారు. కానీ రోడ్డు ప్రమాదానికి బలైపోయారు. అతి వేగంగా దూసు కొచ్చిన డీసీఎం వీరి కారును ఢీకొట్టడంతో నలుగు రూ దుర్మరణం పాలయ్యారు. వ్యాన్ డ్రైవర్, క్లీన ర్లకు గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజా మున శ్రీశైలం జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేటు వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనితో నాలుగు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. వంట పని చేసేందుకు వెళ్తూ..: నాగర్కర్నూల్ జిల్లా వెల్డండ మండలం పోతేపల్లికి చెందిన బైకని యాదయ్య(34), ఎరుకలి చెన్న కేశవులు(35), ముంత శ్రీనివాసులు (30), లింగారెడ్డిపల్లికి చెందిన ఇమ్మరాశి రామస్వామి (32) నలుగురూ శుభ కార్యాల్లో వంట పనులు చేస్తుంటారు. నలుగురు కలిసి గురువారం సాయంత్రం హైదరాబాద్లోని బాలాపూర్లో ఓ పెళ్లికి వంట చేశారు. రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం తుమ్మ లపల్లిలో మరో పెళ్లిలో వంట చేయడానికి స్విఫ్ట్ కారులో బయలుదేరారు. వారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్రీశైలం జాతీయ రహ దారిపై తుమ్మలూరు గేటు సమీపంలో ప్రయాణిస్తుండగా.. కందు కూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న డీసీఎం వాహనం బలంగా స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయిపోగా.. డీసీఎం అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమా దంలో కారులోని రామస్వామి, యాద య్య, శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన చెన్నకేశ వులును 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో ప్రాణాలు వదిలాడు. డీసీఎం డ్రైవర్ షేక్ జానీ, క్లీనర్లకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నా రు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి కి తరలించారు. నలుగురి మృతితో రెండు గ్రామాలు విషాదంలో మునిగిపోయాయి. మృతుల బంధువుల ఆందోళన ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారి బంధువులు, పోతేపల్లి, లింగారెడ్డి పల్లి సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మహేశ్వరం పోలీస్స్టేషన్ ఎదుట, తర్వాత శ్రీశైలం జాతీయ రహదారి పై ధర్నాకు దిగారు. దీనితో సుమారు 3 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. కాగా మృతుల కు టుంబాలను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరా మర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్య తోపాటు ప్రభుత్వపరంగా అన్నిరకాలుగా ఆదుకుంటామ ని హామీ ఇచ్చారు. పోతేపల్లికి చెందిన సంజీవ్కుమార్ యాదవ్ బాధిత కుటుంబాలకు రూ.25వేల చొప్పున రూ.లక్ష ఆర్థి కసాయం అందజేశారు. ఇక బాధిత కుటుంబాలను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, బీజేపీ నేత ఆచారి పరామర్శించారు. అందరూ నిరుపేదలే.. తుమ్మలూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురివీ పేద కుటుంబాలే. వీరిలో యాదయ్య వ్యవసాయం చేస్తూ.. పెళ్లిళ్ల సీజన్లో వంట పనులు చేస్తుంటాడు. తనకు సహాయంగా చెన్నకేశవులు, శ్రీనివాసులు, రామస్వామిలను తీసుకెళ్తుంటాడు. యాదయ్యకు భార్య భాగ్యమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామస్వామికి భార్య కృష్ణమ్మతో పాటు ఒక కుమారుడు, కుమార్తె.. కేశవులుకు భార్య రజిత ఒక కుమార్తె, కుమారుడు.. శ్రీనివాసులుకు భార్య కృష్ణమ్మతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయినవారు మృతి చెందడంతో.. ఈ నాలుగు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. -
తమిళిసై వద్ద పెండింగ్లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్పర్సన్పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్పర్సన్కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
పాలమూరి చేతికి షాక్లు..చిన్నారెడ్డి రూటు ఎటు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియర్ నేత మీదే తిరుగుబాటు మొదలైంది. సీనియర్ స్వార్థపూరిత వ్యవహారాల్ని ఇంక సహించేది లేదంటూ గాంధీభవన్కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఒక్కసారిగా పార్టీలో అసమ్మతి రేగడంతో హైదరాబాద్ నాయకత్వం కూడా దిక్కులు చూస్తున్నట్లు సమాచారం. చిన్నారెడ్డి రూటు ఎటు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం ఓటర్లు విలక్షణ తీర్పును ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి గెలిచిన ప్రతినాయకుడు ఆయాపార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. మాజీమంత్రి, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమి తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవటం లేదని స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానంటూ చిన్నారెడ్డి ప్రచారం చేసుకుంటుండటం వారికి మింగుడు పడటం లేదు. ఈ ఎన్నిక లాస్ట్..! జిల్లా పార్టీకి నూతన అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ నియామకం పెద్దదుమారమే రేపింది. జడ్పీటీసీగాను.. రాష్ట్ర బీసీ సెల్లో పదవి అనుభవిస్తున్న వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వనపర్తిలో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో హాత్సే హాత్ జోడో అభియాన్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. అసమ్మతి నేతలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్లో సమావేశం కావటం కలకలం రేపింది. చిన్నారెడ్డి హాటావో...కాంగ్రేస్కు బజావో అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తే పార్టీ ఓడిపోతుందని.. ఆయనకు వ్యతిరేకంగా తామంతా పనిచేస్తామని అసమ్మతినేతలు హెచ్చరించటం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే చివరిసారి అని చెప్పటం చిన్నారెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి వాదులు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కలిసి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీటిస్తే సహకరించేదని కూడా తేల్చిచెప్పినట్టు సమాచారం. గాంధీభవన్ వద్ద నిరసన తెలిపిన నేతలు దిగ్విజయ్ సింగ్కు సైతం ఫిర్యాదు చేశారు. కొత్త చేతులకు ఎప్పుడు అవకాశం? వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి టికెట్ ఇవ్వాలని వనపర్తి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సీనియర్లు.. రేవంత్వర్గం అంటూ రచ్చకెక్కి అధిష్టానానికి తలనొప్పి తెప్పించారు. తాజాగా వనపర్తిలో ఇలాంటి ఘటనలు జరగటం హాట్ టాపిక్గా మారింది. తనకు వ్యతిరేకంగా గ్రూపులు కూడగడుతున్నట్టు ఆరోపిస్తున్న చిన్నారెడ్డి.. మాజీ డీసీసీ అధ్యక్షుడు శంకర్ప్రసాద్ను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు యువజన కాంగ్రెస రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి మద్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీద పడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోనేత నాగం తిరపతిరెడ్డి సైతం పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాని చిన్నారెడ్డి మాత్రం తాను పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చి పార్టీ గెలుస్తుందే ధీమాను కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్రెడ్డిని ఎదుర్కొవటం అంతా సులువు కాదని భావిస్తున్న పార్టీ నేతలకు తాజా విభేదాలు తలనొప్పిగా మారాయంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలపై నజర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. విచారణ పేరుతో ఇప్పటికే ఒకరి తర్వాత మరొకరికి నోటీసులు జారీ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తుండటంతో ఇన్నాళ్ల పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన బంధువులు, ముఖ్య అనుచరులు, వ్యాపార భాగస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం వీరిని చూస్తే చాలు ముఖం చాటేస్తున్నారు. ఈ కేసుల్లోకి తమను ఎక్కడ లాగుతారోననే భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరు నెలల క్రితం వరకు ఆయా నేతల దృష్టిలో పడేందుకు రోజంతా వారి ఇళ్లు, క్యాంపు ఆఫీసుల ఎదుట పడిగాపులుగాసిన వారు సైతం అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. విదేశాల్లో క్యాసినో గేమ్స్తో మొదలు.. మెయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వరకూ ఇలా ప్రతి కేసు జిల్లా నేతలకు, వారి ముఖ్య అనుచరులకు, ఆర్థిక బినామీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనీలాండరింగ్ కేసులో మంచిరెడ్డికి మనీలాండరింగ్కు పాల్పడిన అభియోగంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డికి ఆగస్టులో ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు తమ ఆఫీసుకు పిలిపించి 14 గంటలకుపైగా విచారించింది. 2014లో మంచిరెడ్డి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించారు. ఈ సమయంలో చేసిన ఖర్చులతో పాటు 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్మైన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టారనే అభియోగంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్లోనే ఉంది. సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై మనీలాండరింగ్ ఆరోపణ లు రావడం, ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారణకు సైతం హాజరు కావడంతో జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. అప్పటి వరకు ఆయన అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూసిన వారు ఆ తర్వాత మంచిరెడ్డి ఎదురుపడితే సైలెంట్గా సైడై పోతుండటం గమనార్హం. అక్రమ ఆస్తుల కేసులో మంత్రికి మెడికల్ కాలేజీల్లో ఫీజుల వసూలు, పన్నుల ఎగవేత వంటి పక్కా సమాచారంతో మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఇటీవల ఐటీ సోదాలు నిర్వహించింది. నవంబర్ 22న ఏకకాలంలో 50 బృందాలు బోయిన్పల్లిలోని ఆయన ఇల్లుతో సహా విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో సోదాలు చేపట్టింది. వరుసగా మూడు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో మంత్రి అల్లుడు, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, వ్యాపార భాగస్వాముల బ్యాంకు లావాదేవీల వివరాలు, లాకర్లు తెరిపించి పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు. ఈ సమయంలో మంత్రితో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆర్థిక అవకతవకల కోణంలో విచారించేందుకు ఈడీకి లేఖ రాసినట్లు ప్రచారం సాగుతోంది. అప్పటి వరకు మంత్రి వెంట మౌనంగా ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రస్తుతం ఆయనపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం మైనంపల్లి ఫాంహౌస్ వేదికగా ముఖ్యనేతలంతా భేటీ కావడం, మంత్రి వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పైలెట్ మెయినాబాద్ ఫాం హౌస్(ఎమ్మెల్యేల ఎర) కేసులో కీలక ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిపై ఈడీ దృష్టి సారించింది. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఇటీవలే పైలెట్కు నోటీసులు జారీ చేయగా, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత సోమవారం మధ్యాహ్నం విచారణ సంస్థ ముందు హాజరయ్యారు. ఏడు గంటల పాటు విచారించిన ఈడీ మరుసటి రోజు మళ్లీ హాజరు కావాల్సిందిగా సూచించింది. దీంతో రెండో రోజైన మంగళవారం కూడా ఆయన ఈడీ ముందుకు వెళ్లారు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపిన స్థిర, చర ఆస్తులు, ఆ తర్వాత ఆయన కూడబెట్టిన ఆస్తులు, విద్యార్హత, బ్యాంకు ఖాతాలు, పాస్పోర్టు, పాన్, ఆధార్ కార్డు వంటి వ్యక్తిగత వివరాలను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో ఆయనపై అనేక ఆరోపణలు రావడం, సిట్ విచారణ కొనసాగుతుండటం, మరో వైపు ఈ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండటం, ఇదే సమయంలో ఆయనకు ఈడీ నోటీసులు రావడం వంటి వరుస పరిణామాలు అధికార బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటి వరకు ఎమ్మెల్యేతో అంటకాగిన నేతలు, అనుచరులు, రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వాములు ప్రస్తుతం పైలెట్ వెంట వెళ్లేందుకు జంకుతున్నారు. (క్లిక్ చేయండి: ప్లాట్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త) -
ఆన్లైన్ గేమ్ ఆడి.. రూ.95 లక్షలు ఓడి
షాబాద్: తల్లిదండ్రులకు తెలియకుండా నష్టపరిహారం కింద వచ్చిన రూ.95 లక్షలతో ఆన్లైన్ గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు ఒక యువకుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గురువయ్యగౌడ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చన్వల్లి శ్రీనివాస్రెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్ధన్రెడ్డి నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గ్రామంలో శ్రీనివాస్రెడ్డి కౌలు చేస్తున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం తన అవసరాల కోసం తీసుకొని ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఈ డబ్బుతో శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద భూమి కొనేందుకు శ్రీనివాస్రెడ్డి దంపతులు ఒప్పందం చేసుకున్నారు. రెండు రోజుల్లో భూ లావాదేవీలు జరగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ ఖాతాలో ఉన్న డబ్బును కుమారుడి ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ క్రమంలో హర్షవర్ధన్రెడ్డి కింగ్ 567 అనే ఆన్లైన్ గేమ్ను డౌన్లోడ్ చేసుకుని ఆడాడు.. తన ఖాతాలోని రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సోదరుడు శ్రీపాల్రెడ్డి, కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సైబర్క్రైమ్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా
నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యాదగిరి ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా శేరిలింగంపల్లికి చేరుకున్నాడు. ఓ అపార్ట్మెంట్లో వాచ్మన్గా చేరాడు. భార్య అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లలో పనికి కుదిరింది. యాదగిరి నెలకు రూ.15 వేలు వేతనం, భార్యకు ఒక్కో ఫ్లాట్ నుంచి రూ.2,500 చొప్పున పది ఫ్లాట్ల నుంచి రూ.25 వేలు వస్తున్నాయి. ఇంటి యజమానులు ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలను ఉదయం, సాయంత్రం బయట తిప్పినందుకు రూ.5 వేలు, వారి వ్యక్తిగత వాహనాలను శుభ్రం చేసినందుకు నెలకు రూ.500–700 చొప్పున సంపాదిస్తున్నారు. ఇలా ఈ జంట సగటున రూ.50 వేలకుపైగా సంపాదిస్తోంది. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంటుగా మారిన ఒకప్పటి నిరుద్యోగి ప్రస్తుతం నెలకు రూ.లక్షకుపైగా సంపాదిస్తుండటం విశేషం. సాక్షి, రంగారెడ్డిజిల్లా: సగటు వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబైని మించిపోయింది. ముంబై వాసి వార్షికాదాయం రూ.6.43 లక్షలు ఉండగా, ఈ జిల్లా సగటు వ్యక్తి ఆదాయం రూ.6.59 లక్షలు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్డీపీఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, అహ్మదాబాద్, కోయంబత్తూరు, ఎర్నాకులం ఉన్నాయి. హైదరాబాద్ రూ.3.51 లక్షలు, మేడ్చల్ రూ.2.40 లక్షలు, వికారాబాద్ రూ.1.32 లక్షలుగా నమోదయ్యాయి. ఉపాధి అవకాశాలు.. రూ.లక్షల్లో వేతనాలు హైదరాబాద్ నగరంతో జిల్లా మిళితమై ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరం చుట్టూ 158.50 కిలోమీటర్ల పొడవు ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ విశాలమైన భూములు ఉండటం, తక్కువ వేతనాలకే కావాల్సిన మానవ వనరులు లభిస్తుండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ప్రతిష్టాత్మాక గూగుల్, యాపిల్, ఫేస్బుక్, ట్విట్టర్, అమేజాన్, మహేంద్ర, ఇతర టెక్సంస్థలు కేంద్ర కార్యాలయాలు తెరిచాయి. సుమారు ఏడు లక్షల మంది ప్రత్యక్షంగా, మరో పది లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరి నెలసరి వేతనాలు రూ.లక్షల్లో ఉండడంతో తమ ఆదాయాన్ని ఇళ్లు, భూములు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు ఆకుకూరలు, కాయగూరలు సాగు చేసుకుంటూ జీవనం సాగించిన రైతులు రాత్రికి రా త్రే కోటిశ్వరుల జాబితాలో చేరిపోయారు. చేతి నిండా డబ్బు ఉండటంతో ఖర్చుకు వెనకాడటం లేదు. నివాసయోగ్యమైన ప్రాంతం ఢిల్లీ, ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాలు జీవనయోగ్యమైన జాబితాలో ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇటు సమశీతోష్ణ పరంగానే కాకుండా అటు సురక్షితం కావడంతో కీలకమైన రక్షణ, ఎయిర్ఫోర్స్, మిలట్రీ శిక్షణ కేంద్రాలు, పరిశోధక కేంద్రాలు కొలువుదీరాయి. ప్రభుత్వం సిటిజన్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే పోలీస్ కంట్రోల్ టవర్లను నిర్మించి నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. సిటీలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ చీమచిటుక్కుమన్నా ఇట్టే గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా, కొత్త పారిశ్రామికవాడలు, టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీ వంటి అంశాలు కూడా జిల్లావాసుల సగటు ఆదాయం పెరుగుదలకు దోహదపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!) -
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మొయినాబాద్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో 5వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డి.దేవేందర్ బాబు.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదీ తాండూరు శాసనసభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం అధికార పరిధిలో లేని మేజిస్ట్రేట్ నమోదు చేయాల్సి ఉంది. సరూర్నగర్ పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య ఎమ్మెల్యేను కోర్టులో హాజరు పరిచారు. -
భూమి కోసం ప్రాణం తీశాడు
యాచారం: భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. తమ్మలోనిగూడకి చెందిన కర్రె మల్లయ్య(75)కు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. కొన్నేళ్ల క్రితం ఎకరా భూమిని విక్రయించి కొడుకు వెంకటయ్యకు రూ.30 లక్షలు, కూతురు సుగుణమ్మకు రూ.30 లక్షలు ఇచ్చాడు. మిగిలిన ఎకరా పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని వెంకటయ్య, భార్య మంగమ్మతో కలిసి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. భౌతిక దాడులకు సైతం పాల్పడ్డారు. తన ప్రాణం పోయేంత వరకు భూమిని ఇచ్చేది లేదని మల్లయ్య తేల్చి చెప్పాడు. దీంతో తండ్రిని మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్యాభర్తలు కలిసి మల్లయ్య మొహంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా చంపేశారు. ఆదివారం తెల్లవారుజామున ఏమీ తెలియనట్టు ‘అయ్యో.. మా నాన్న చనిపోయాడు’అంటూ విలపించాడు. తండ్రీకొడుకుల మధ్య భూవివాదం నడుస్తున్న సంగతి తెలిసిన గ్రామస్తులకు అనుమానం వచ్చి వెంకటయ్యను చితకబాదారు. పోలీసులు విచారించగా భూమి కోసం తండ్రిని హత్య చేసినట్టు అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. -
గేటు పడింది.. గుండె ఆగింది
షాద్నగర్ రూరల్: రైల్వేగేటు పడటంతో సకాలంలో ఆస్పత్రికి తరలించలేక ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన శ్రీశైలం (33)కు శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం షాద్నగర్కు తీసుకొస్తుండగా.. మార్గమధ్యలో చటాన్పల్లి వద్ద రైల్వే గేటు పడటంతో వారి వాహనం ఆగిపోయింది. దీంతో వారు షాద్నగర్ శివారు బైపాస్ నుంచి అన్నారం వై జంక్షన్ మీదుగా చుట్టూ తిరిగి షాద్నగర్కు తీసుకొచ్చారు. ఆస్పత్రికి చేరు కునేలోపే శ్రీశైలం మృతి చెందాడు. రైల్వే గేటు ప్రాణం తీసిందంటూ వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మరొకరికి ప్రాణనష్టం జరగకముందే రైల్వేగేట్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ధరణితోనే సమస్యలు
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి యాప్తో రైతులకు భూ సమస్యలు ఎదురవుతున్నాయని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు ‘భూమి’ సునీల్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏర్పాటు చేసిన భూ న్యాయ శిబిరంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయవాదులు, రెవెన్యూ నిపుణులు న్యాయ సలహాలు అందించారు. భూ సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని సునీల్ పేర్కొన్నారు. తెలంగాణలో రీసర్వే చేస్తేనే భూసమస్యలు పరిష్కారమవుతాయని, దీనికోసం ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమగ్ర సర్వే చేస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు. రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) ఉపాధ్యక్షుడు జీవన్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి.నిరూప్ రెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రైతు నాయకులు కోదండరెడ్డి, భూదా న్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫైనాన్స్ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
మొయినాబాద్: ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్వాసి మద్యపాగ అశోక్ (25) కొంతకాలం కిందట ఫైనాన్స్లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో ఫైనాన్స్ ప్రతినిధులు వేధించసాగారు. మనస్తాపం చెందిన అశోక్.. దీపావళి రోజున రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు ఇంట్లో చూసేసరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. -
గ్రేటర్ హైదరాబాద్లో కెనడా విల్లా
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లు సినిమాల్లో కనిపించిన చెక్క ఇళ్లు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేశాయి. అచ్చం కెనడా, అమెరికాలో కనిపించే ఇళ్ల తరహాలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నిర్మించారు. తుమ్మలూర్ రెవెన్యూ పరిధి హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పక్కన మ్యాక్ ప్రాజెక్ట్స్లో ఈ కెనడియన్ వుడ్ విల్లాలను నిర్మించారు. అధునాతన నిర్మాణ పద్ధతిలో, ఎక్కువ శాతం చెక్కను ఉపయోగించి నిర్మాణం పూర్తి చేశారు. అడవులకు వీలైనంత వరకు హాని కలిగించకుండా.. ప్రత్యేకంగా పెంచిన చెట్లనుంచి చెక్క సేకరించి నిర్మాణం కోసం వాడారు. ఈ కెనడియన్ వుడ్ విల్లాను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కెనడా హైకమిషనర్ కెమెరాన్ మాకే హాజరయ్యారు. కెనడియన్ విల్లాల నిర్మాణం చేపడుతున్న మ్యాక్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ తమ ప్రాజెక్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ 2021లో ప్రారంభం కాగా కేవలం 12నెలలోనే ఇళ్ల నిర్మాణం పూర్తికావడం విశేషమని తెలిపారు. బ్రిటిష్ కొలంబియా కెనడా ధృవీకరించిన కలపతో విల్లాను నిర్మించామని తెలిపారు. కెనడియన్ వుడ్తో మ్యాక్ ప్రాజెక్ట్ కలిసి భాగస్వామ్యం కావడం విశేషమన్నారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు శివారు ప్రాంతాలకు విస్తరిస్తోందని, బంగారు భవిష్యత్తుకు విల్లాలను కొనుగోలు చేయడమే మంచిదన్నారు. చదవండి: (వన్ప్లస్ దివాలీ సేల్.. కళ్లు చెదిరే డీల్స్) -
పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా?: సీఎం కేసీఆర్
-
Ground Report: మంత్రి సబిత ఇంటికి వెళ్తే.. ఆ పార్టీ నాయకులకు చిక్కులే!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలైంది. ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లాను శాసించిన నేతలు ఇప్పుడు తమ నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. టోటల్గా జిల్లాను లీడ్ చేసే నేతలు ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. ఒకరి ఇలాకాలో మరొకరు వేలు పెడితే... అగ్గిమీద గుగ్గిలంలా భగ్గుమంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిన రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై స్పెషల్ రిపోర్ట్. అధికార పార్టీలో ఎవరికి వారే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించినా... నేతల మధ్య సమన్వయలోపం ఇబ్బందికరంగా మారింది. వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సొంత క్యాడర్ ఉంది. నేరుగా మంత్రితో మాట్లాడే చొరవ ఉన్న నేతలు ఉన్నారు. ఇది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. నేరుగా మంత్రి దగ్గరకు వెళ్లే నేతలను ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. మంత్రి ఇంటికి వెళ్లగానే ఎమ్మెల్యేలు కాల్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని పలువురు ఎంపీపీ, జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డిది మరో దారి. తమ కుటుంబ రాజకీయ ప్రత్యర్థి సబితా రెడ్డి జిల్లాలో మంత్రిగా ఆధిపత్యం చలాయించడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఎంపీ రంజిత్ రెడ్డి కూడా జిల్లాపై పట్టు కోసం, సొంత క్యాడర్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా... ఎమ్మెల్యేలు మాత్రం అడ్దుకుంటూనే ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో జడ్పీ ఛైర్పర్సన్ సునీతారెడ్డికి, ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరి పంచాయతీ ప్రగతిభవన్కు చేరడంతో కొంత సద్దుమణిగింది. మేడ్చల్ జడ్పీ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డికి, మంత్రి మల్లారెడ్డికి అంతర్గతపోరు ఆగడంలేదు. మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత్రావు, వివేక్, భేతి సుభాష్రెడ్డి ఎవరికివారుగానే కొనసాగుతున్నారు. కాంగ్రెస్కు మాజీలే మిగిలారు ఇక కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో నిస్సత్తువగా మారిపోయింది. టీపీసీసీ ఇచ్చే ఆదేశాలు అమలు చేసేందుకు జిల్లా నేతలు సిద్ధంగా లేరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల తరువాత జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంత కాలంగా రాష్ట్ర స్థాయి నేతల నుంచి.. కింది స్థాయి వరకు నాయకులను నిస్సత్తువ ఆవహించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పుడు పార్టీలో లేరు. అందరూ మాజీలు మాత్రమే మిగిలారు. వారిలో కూడా ఏ ఒక్కరూ క్రియాశీలంగా పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయకులు లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి. గత ఎన్నికల్లో టీడీపీకి వదిలేసిన రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాడర్ చిన్నాభిన్నామైంది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి. పార్టీకి రాజీనామా లేఖ ఇచ్చారు. కానీ ఇంకా ఆమోదించలేదు. చేవెళ్ల నుంచి పోటీ చేసిన రత్నం.. మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. గెలిచినవారిని నిలుపుకోలేకపోయింది. ఇక మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి.. పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తయారు చేసుకోలేకపోయారు. కమలనాథుల పరిస్థితి అంతంతే.. ఉమ్మడి జిల్లాలో కమలనాథుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నాయకులు పని చేస్తుంటే... జిల్లా నేతల మధ్య సమన్వయం లోపించిందనే వార్తలు వస్తున్నాయి. కాషాయపార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక నజర్ పెట్టింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటికే తొలిదశ సెర్చ్ పూర్తయింది. వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో నేతల మధ్య కొత్త వివాదం తలెత్తింది. రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులుగా ఎల్బీ నగర్కు చెందిన సామ రంగారెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బొక్క నర్సింహారెడ్డి మధ్య సమన్వయం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రాజేంద్రనగర్, మహేశ్వరం రెండూ నియోజకవర్గాలు సగం అర్బన్లో, మరో సగం రూరల్లో ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఎవరు పనిచేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు సంపాదిస్తే చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలవవచ్చని బీజేపీ భావిస్తోంది. అందుకుతగ్గ స్థాయిలో లెక్కలు వేస్తున్నారు కమలనాథులు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి గతంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు జనార్ధన్రెడ్డి పోటీ చేసి.. రెండు లక్షల ఓట్లు సంపాదించారు. బలమైన అభ్యర్థిని బరిలో దింపితే చేవెళ్ల నుంచి గెలుస్తామని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఇక మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని బీజేపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ నుంచి ఎంపీ వరకు ఎన్నిక ఏదైనా తానే బరిలో దిగుతానంటారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బలమైన నేతను దించడానికి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి లాంటి నేతను బీజేపీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్లో కూన శ్రీశైలంగౌడ్ బీజేపిలో చేరడంతో కొంత బలం చేకూరిందని చెప్పవచ్చు. -
సడన్ బ్రేక్.. ఒకదాని వెనుక మరోటి ఢీ.. వరుసగా 9 వాహనాలు ధ్వంసం
సాక్షి, షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వివరాలివీ.. మహబూబ్నగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న తొమ్మిది వాహనాలు ఒకదానికికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు క్రాసింగ్ ఉండటంతో వాహనాలు కొంతమేర నిదానంగా వెళ్తున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. (క్లిక్: కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?) ఓవర్టేక్ చేయబోయి.. అదుపు తప్పిన బైక్.. వ్యక్తి దుర్మరణం చేవెళ్ల: ముదు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బైక్పై ఉన్న వ్యక్తి అదుపుతప్పి కిందిపడిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు.. చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఎల్వేర్తి నరేశ్(30) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం బైక్పై ఆలూరు నుంచి గేట్కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న బోలేరోను ఓవర్టేక్ చేయబోతుడంగా బైక్ ఆదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అతడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సంతోష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (క్లిక్: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రేమకథ) -
నార్సింగిలో విషాదం: ఫంక్షన్కు వచ్చి స్విమ్మింగ్పూల్లో పడిపోయిన బాలుడు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ స్విమ్మింగ్పూల్లో పడి శ్యామ్ అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వచ్చిన శ్యామ్... స్విమ్మింగ్పూల్ వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడకు చెందిన శ్యామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. (చదవండి: మహిళా సర్పంచ్కు వరకట్న వేధింపులు) -
‘కారు’లో లుకలుకలు.. ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే ..!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్‡్ష మంత్రాన్ని ఆచరించి.. సంఖ్యాబలం లేకున్నా పురపాలికలను చేజిక్కించుకున్న ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గెలిచిన పార్టీలకు ఝలక్ ఇస్తూ కారెక్కిన నేతలు.. ఇప్పుడు సొంతగూటి బాట పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం తుక్కుగూడ పురపాలక సంఘం చైర్మన్, తాజాగా బడంగ్పేట నగరపాలక సంస్థ మేయర్ గులాబీకి గుడ్బై చెప్పడం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్/మేయర్ పదవులను దక్కించుకునేందుకు తగినన్నీ సీట్లు రాకపోవడం టీఆర్ఎస్ను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీల విజేతలకు వల విసరడం ద్వారా మేజిక్ ఫిగర్ను చేరుకోగలిగింది. ఈ క్రమంలోనే బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా గెలిచిన మదన్మోహన్కు తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అదే తరహాలో బడంగ్పేటలో పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలవడమేగాకుండా.. తన మద్దతుదారులను కూడా భారీ సంఖ్యలో గెలిపించగలిగారు. దీంతో ఈ కార్పొరేషన్ ప్రత్యర్థుల వశంకాకుండా పావులు కదిపిన మంత్రి సబితారెడ్డి.. కాంగ్రెస్ కార్పొరేటర్లను టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం ద్వారా మేయర్ పదవిని పారిజాతకు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో వలసనేతలకు గులాబీ అగ్రనేతలతో మనస్పర్థలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మదన్మోహన్ కాషాయతీర్థం పుచ్చుకోగా.. తాజాగా బడంగ్పేట మేయర్, మరో నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలు మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ నేతలను ఆత్మరక్షణలో పడేశాయి. దీనికితోడు మీర్పేట నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా కొందరు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిబట్లలోనూ అదే సీను.. తుక్కుగూడ, బడంగ్పేట పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీలోనూ చోటుచేసుకు న్నాయి. ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నా.. పార్టీని చీల్చి అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ కొత్త హరితకు చైర్పర్సన్ గిరిని కట్టబెట్టడం ద్వారా టీఆర్ఎస్ ఖాతాలో ఈ పురపాలికను వేసుకోగలిగింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో ఏర్పడ్డ అభిప్రాయబేధాలతో హరిత..‘కారు’ దిగి హస్తం గూటికి చేరారు. ఇదిలావుండగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ రాజకీయాలు వేడెక్కాయి. కౌన్సిలర్లు, చైర్పర్సన్ మధ్య గ్రూపులుగా విడిపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ కూడా పలువురు కౌన్సిలర్లు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. -
అసైన్డ్పై రియల్ కన్ను! ఎకరాకు రూ.20 లక్షలకు చెల్లింపు, ధరణిలోనూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసైన్డ్ భూములపై కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. వీటిని అమ్మడం, కొనడం నేరమని తెలిసినా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వీటిని స్వాధీనం చేసుకోవచ్చని స్థానికంగా ప్రచారం చేస్తూ.. రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొల్లగొట్టే కుట్రకు తెరలేపారు. రెవెన్యూ శాఖలోని లొసుగులకు తోడు అధికార పార్టీ పెద్దల అండదండలు వీరికి కలిసొస్తోంది. న్యాయపరమైన చిక్కులు, అధికారులతో ఏ సమస్యలు ఎదురైనా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. రిజిస్ట్రేషన్కు ముందే అసైన్డ్దారుల పేరుతో ఎన్ఓసీ సంపాదించి రూ.కోట్లు విలువ చేసే భూములను చవక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వీరిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేసి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ అగ్రిమెంట్ సమయంలో అసైన్డ్ దారులకు వ్యాపారులునగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో చెల్లిస్తుండటం గమనార్హం. అబ్దుల్లాపూర్మెట్లో.. పెద్దఅంబర్పేట్లోని సర్వే నంబర్ 244లో నాలుగెకరాలు, సుర్మాయిగూడ సర్వే నంబర్ 128లో వంద ఎకరాలకుపైగా, బాటసింగారం సర్వే నంబర్ 10లో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూములపై వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, అనుచరుల కన్నుపడింది. రెవెన్యూలోని లొసుగులను అడ్డుపెట్టుకుని అసైన్డ్ దారుని పేరుతోనే ఎన్ఓసీ పొందేందుకు యత్నిస్తున్నారు. అగ్రీమెంట్లు చేసుకుని, కొంత అడ్వాన్స్ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. అబ్దుల్లాపూర్మెట్ కొత్త పోలీసు స్టేషన్ వెనుకభాగంలో సర్వే నంబర్ 283లోని 350పైగా ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు ఖాళీగా ఉంది. దీనిపై రియల్టర్ల కన్ను పడింది. మహేశ్వరంలో.. మహేశ్వరం మండలం మహబ్బుత్నగర్లో రంగనాథసాయి పేరిట 9.06 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వం వీటిని 1988లోనే సీలింగ్ భూములుగా గుర్తించి, స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్కు అప్పగించింది. ఆ తర్వాత ఇందులోని ఆరెకరాలను అప్పటి ఆర్డీఓ ఉత్తర్వుల (ఎ/ 6345/1987) మేరకు 1989 జనవరిలో భూమిలేని ఆరుగురు పేదలకు అసైన్ చేశారు. మరో 3.06 ఎకరాలను ఇద్దరు ఎక్స్ సర్వీస్మెన్లకు కేటాయించారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దీని విలువ ధర రూ.60 కోట్ల పైమాటే. విలువైన ఈ భూమిపై ఓ ప్రముఖ సంస్థ కన్నుపడింది. పక్కనే ఉన్న తమ భూమిలో అసైన్డ్ భూములను కలిపేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం కూడా తీసుకుంది. ఈ విషయం బ్యాంకు, రెవెన్యూ అధికారులకు తెలిసి ఒత్తిడి చేయడంతో.. తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి చెల్లించింది. కానీ సదరు భూమి మాత్రం ఇప్పటికీ సంస్థ ఆధీనంలోనే ఉండటం, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం విశేషం. ఇబ్రహీంపట్నంలో చెర్లపటేల్గూడ రెవెన్యూలోని సర్వే నంబర్ 710లో 83 ఎకరాల భూమిని 70 మందికి అసైన్ చేశారు. కొంత సాగుకు అనుకూలంగా ఉండగా, మరికొంత ప్రతికూలంగా ఉంది. ఈ భూమిని దక్కించుకునేందుకు కొంత మంది రియల్టర్లు యత్నిస్తున్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులు ఈ భూములపై కన్నేశారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారు. పొల్కపల్లి, దండుమైలారం, రాయపోలు రెవెన్యూ పరిధిలో కూడా అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యాచారంలో.. మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తక్కెళ్లపల్లి, మా ల్, మంతన్గౌరెల్లి రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూము లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కుర్మిద్ద, తాడిపర్తి, నానక్నగర్, నక్కర్తమేడిపల్లిలోని సుమారు పది వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సేకరించింది. బాధితులకు రూ.8 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చింది. ఫార్మాసిటీ భూ సేకరణను బూచిగా చూపిస్తున్న రియల్టర్లు మిగిలిన గ్రామాల్లోని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. రైతుకు ఎకరాకు రూ.17 లక్షలు చెల్లిస్తూ, మరో రూ.2 లక్షలు మధ్యవర్తులు కమీషన్గా తీసుకుంటున్నారు. ఇప్పటికే 60– 70 ఎకరాలకు అడ్వాన్స్లు కూడా చెల్లించినట్లు సమాచారం. మొండిగౌరెల్లిలో సర్వే నంబర్ 19లో 575.30 ఎకరాలు ఉండగా, సర్వే నంబర్ 68లో 625.20 గుంటలు, సర్వే నంబర్ 127లో 122.22 ఎకరాల భూమి ఉంది. వీటిపై నగరానికి చెందిన కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. ఈటల వ్యవహారంతో కలకలం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ ఆధీనంలో (మెదక్ అచ్చంపేట) ఉన్న ఎనిమిది సర్వే నంబర్లలో 85.19 ఎకరాల అసైన్డ్ భూమిని 65 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో జిల్లాలోని అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మన జిల్లాలోని 26 మండలాల పరిధిలో 321 గ్రామాల్లో 6,471.03 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, 5,440 మందికి 6,198.11 ఎకరాలు అసైన్ చేశారు. వీటిలో ఇప్పటికే చాలా భూములు పరాధీనమయ్యాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన రియల్టర్ల నుంచి మళ్లీ భూములు స్వాధీనం చేసుకునేందుకు అనేక మంది యత్నిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసిన రియల్టర్లలో ఆందోళన మొదలైంది. అమ్మడం, కొనడం నేరం అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం నేరం. వీటిని రిజిస్ట్రేషన్ చేయలేము. అమ్మిన రైతులతో పాటు కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –వెంకటాచారి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
అమ్మను కొడుతుండు.. కాపాడండి
ఇబ్రహీంపట్నం రూరల్: ‘సార్ మా నాన్న తాగొచ్చి అమ్మను ఇష్టమొచ్చినట్టు కొడుతుండు. జర మీరే కాపాడాలి’ అంటూ ముగ్గురు చిన్నారులు పోలీసులను వేడుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ నరేందర్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన పంతంగి రాజీవ్, పద్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు దీపు (10), శివరామకృ ష్ణ (7), లక్ష్మీకాంత్ (6) సంతానం. ఆదిభబట్ల టీసీఎస్ కాలనీలో ఉంటున్నారు. రాజీవ్ నిత్యం తాగొచ్చి పద్మను వేధించే వాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. అడ్డొచ్చిన వృద్ధులైన పద్మ తల్లిదండ్రులపైనా చేయిచేసుకున్నాడు. దీంతో ముగ్గురు పిల్లలు ఆదిబట్ల పోలీస్స్టేషన్కు వచ్చి తండ్రిపై ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ.. పోలీసులను ఇంటికి పంపారు. నిందితుడు రాజీవ్ను స్టేషన్కు తీసుకొచ్చారు. మద్యం సేవించి ఉండటంతో రాజీవ్కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
కుర్మల్ గూడలో కుటుంబం ఆత్మహత్య
-
అంతా ‘హస్త’వ్యస్తం!.. ఎవరికి వారే యమునా తీరే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పరిస్థితి జిల్లాలో ‘హస్త’వ్యస్తంగా తయారైంది. ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటలా ఉన్న జిల్లా ప్రస్తుతం చిన్నాభిన్నమైంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు దెబ్బతీస్తున్నాయి. మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో పార్టీకి మంచి పట్టు ఉన్నప్పటికీ స్థానిక నేతల్లో అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్కు మినహా మిగిలిన నియోజకవర్గాలకు ఇన్చార్జిలు లేకపోవడంతో కీలకమైన సమయంలో కేడర్ను సమన్వయం చేయలేకపోతున్నారు. ప్రజా సమస్యలపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపునకు జిల్లా అధ్యక్షుడు సహా ఒకరిద్దరు నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. చదవండి👉: గవర్నర్ వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారు: సీఎం కేసీఆర్ ఇబ్రహీంపట్నంలో.. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలీస్తే ఇక్కడ క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉంది. ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు ఆ పార్టీ అభ్యర్థులే గెలుచుకున్నారు. మంచాల, అబ్దుల్లాపూర్మెట్ జెడ్పీటీసీలు సహా అబ్దుల్లాపూర్మెట్ ఎంపీపీ కూడా ఆ పార్టీ అభ్యర్థే. ఇక్కడి నాయకులు రెండు వర్గాలుగా చీలిపోవడం తీరని నష్టాన్ని తెచ్చిపెడుతోంది. వీరిలో మల్రెడ్డి బ్రదర్స్ టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్గంలో ఉంటే.. మిగిలిన వారు ఎంపీ కోమటిరెడ్డితో టచ్లో ఉంటున్నారు. ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు గైర్హాజరవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకొంటుండటం పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేశాయి. మహేశ్వరంలో.. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. మంత్రి సబితా రెడ్డి గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అధికారపార్టీలో చేరారు. ఆమెతో పాటే కేడర్ కూడా చాలా వరకు పార్టీని వీడింది. నియోజకవర్గ ఇన్చార్జి అంటూ ఇప్పటి వరకు ఎవరూ లేరు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకుడు దేప భాస్కర్రెడ్డి నియో జకవర్గంలో కలియతిరుగుతున్నారు. ఇద్దరి మధ్య పెద్దగా సయోధ్య లేనప్పటికీ సభ్యత్వ నమోదులో ఎవరికి వారే పోటీపడ్డారు. నియోజకవర్గంలో నా యకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో నిరాదరణకు గురైన కార్యకర్తలను కలుపుకొని వెళ్తే కానీ పార్టీ నిలబడలేని పరిస్థితి. చేవెళ్లలో.. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. గతంలో ప్రస్తుత మంత్రి సబితారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా తొలుత ఇదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన అధికార టీఆర్ఎస్లో చేరారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు అభిమానులు ఉన్నప్పటికీ.. నియోజవర్గస్థాయిలో కలుపుకొని వెళ్లే నేతలు లేకపోవడం పారీ్టకి మైనస్గా మారింది. ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ ఓటర్లకు పార్టీ కార్యకర్తలకు చేరువయ్యే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదనే విమర్శలున్నాయి. షాద్నగర్లో.. మాజీ ఎమ్మెల్యే చోళపల్లి ప్రతాప్రెడ్డి అధికారపార్టీలో చేరడంతో ఆయనతో పాటే కేడర్ కూడా కొంత వరకు ఆ పార్టీని వీడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఆయనకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసమీకరణలో ఆయన ఇతరులకంటే ముందున్నారనే గుర్తింపు ఉంది. అంతర్గతంగా నెలకొన్న వర్గ విభేదాలు పార్టీకి నష్టదాయకంగా మారాయి. కల్వకుర్తిలో.. నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఇన్చార్జి అంటూ లేరు. గతంతో పోలీస్తే ప్రస్తుతం పార్టీ బలహీనపడింది. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులై, ఢిల్లీకే పరిమితం కావడంతో లీడర్లు అందుబాటులో లేకుండా పోయారు. కడ్తాల్ మినహా ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. మాడ్గుల ఎంపీపీ, జెడ్పీడీసీలిద్దరూ కాంగ్రెస్ నుంచే గెలిచినా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదనే విమర్శ లేకపోలేదు. ఆ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుధీర్రెడ్డి ఆ తర్వాత పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో చేరడంతో ఆయనతో పాటే కొంత కేడర్ వెళ్లిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి కూడా ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఓటర్లు, కేడర్ను కలుపుకెళ్లే నేత లేకపోవడం పార్టీకి మైనస్ పాయింట్. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా చెప్పుకొంటున్న నలుగురు లీడర్లు మినహా క్షేత్రస్థాయిలో పారీ్టకి పెద్దగా పట్టు లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. -
కమలం వికసించేనా?.. కేడర్ ఉన్నా లీడర్ల మధ్య సఖ్యత కరువు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ వరుస విజయాలతో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణకు గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలో మాత్రం కమల వికాసం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి కేడర్ ఉన్నప్పటికీ లీడర్ల మధ్య సఖ్యత కొరవడింది. చదవండి: కామారెడ్డి: కాంగ్రెస్లో కుమ్ములాటలు.. రచ్చకెక్కిన విభేదాలు ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీకి సిద్ధమవుతుండటం.. ప్రజా సమస్యలపై సమష్టిగా కాకుండా ఎవరికి వారే కార్యక్రమాలు రూపొందిస్తుండడం.. అంతర్గత విభేదాలు బహిర్గతమవుతుండటం.. అధినాయకత్వం జిల్లాపై దృష్టి సారించకపోవడం.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలు పార్టీ వెను కబాటుకు కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, అధికార పారీ్టకి ఐదు చోట్ల గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, సమష్టిగా కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. కల్వకుర్తిలో.. జిల్లాలో మొదటి నుంచి పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం ఇదే. గ్రామం నుంచి మండల స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఉండనుంది. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీసీ కమిషన్ సభ్యుడి హోదాలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. నెలలో 20 రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో 12 బీజేపీ గెలిచినప్పటికీ.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అపవాదు పారీ్టకి లేకపోలేదు. షాద్నగర్లో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ కొంత బలపడినప్పటికీ.. ఎన్నికల్లో పోటీకి ఆశించిన ప్రజా మద్దతును కూడగట్టలేకపోయింది. మొదటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న శ్రీవర్ధన్రెడ్డి సహా మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తనయుడు మిథున్రెడ్డి, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్రెడ్డి టికెటు ఆశిస్తున్నారు. బూత్ లెవల్లో పార్టీ పటిష్టత కోసం పాటుపడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మారుమూల గ్రా మాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ మరింత బలపడాల్సిన అవసరం ఉంది. చేవెళ్లలో.. ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతోంది. ఇక్కడ అధికారపార్టీని ప్రభావితం చేయగలిగే లీడర్లు లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడు వస్తే తప్ప పట్టు సాధించలేని పరిస్థితి. మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేతలు సైతం అధికారపార్టీ అభ్యర్థితో పోటీపడలేకపోతున్నారు. ఇక్కడ పాగా వేయాలంటే కేడర్ శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో.. అంతర్గత కుమ్ములాటలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. ఏదైనా సమస్యపై అధిష్టానం పిలుపు ఇస్తే కానీ కేడర్ రోడ్డుపైకి రావడం లేదు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం కూడా పెద్దగా చేయడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో కొత్త అశోక్గౌడ్ పార్టీ తరఫున పోటీ చేసి 17 వేల ఓట్లు మాత్రమే సాధించారు. తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఒకటి రెండు సీట్లకే పరిమితమైంది. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేస్తే కానీ పోటీలో నిలబడలేని పరిస్థితి. రాజేంద్రనగర్లో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ బలపడింది. ప్రాబల్యమున్న ప్రాంతాలు మినహా అన్ని చోట్ల పట్టు సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు డివిజన్లు ఉండగా, వీటిలో మూడు గెలుచుకుంది. శంషాబాద్ పట్టణం.. మండలాల్లో కేడర్ పటిష్టంగా ఉంది. మైలార్దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, బుక్క వేణుగోపాల్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల లోక్సత్తా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోల్కర్రెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పారీ్టకి కలిసి వచ్చే అంశం. క్షేత్రస్థాయి లీడర్లు, కేడర్ కలిసికట్టుగా పని చేస్తే విజయానికి అవకాశం లేకపోలేదు. మహేశ్వరంలో.. జీహెచ్ఎంసీలోని ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లు సహా తుక్కుగూడ చైర్మన్ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లోనూ పార్టీ ప్రభావం చూపింది. కందుకూరు ఎంపీపీ కూడా ఆ పార్టీ అభ్యర్థే. మహేశ్వరం మండలం లోని పలు గ్రామాల్లోని ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, సీనియర్ నేత అందెల శ్రీరాములు యాదవ్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్గౌడ్ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు పుట్టిముంచే ప్రమాదం ఉందంటున్నారు. -
చెప్పుల్లేని విద్యార్థులు.. చలించిన మంత్రి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కంటపడ్డారు. ఆమె వెంటనే కాన్వాయ్ని ఆపి విద్యార్థులతో మాట్లాడి వారికి మంచినీళ్లు, చాక్లెట్లు, షూస్, స్నాక్స్ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం అటు నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి రోడ్డుమార్గంలో బయల్దేరారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండల్లో మామిడిపల్లి వద్ద పలువురు విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ మంత్రి కంటపడ్డారు. చలించిన మంత్రి వారిని దగ్గరికి పిలిచి ఆప్యాయంగా పలకరించారు. టీఆర్ఎస్ నేత నిమ్మల నరేందర్గౌడ్కు ఫోన్ చేసి, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వెంటనే ఆయన ఆయా విద్యార్థులకు షూస్ సహా స్నాక్స్, నీరు అందజేశారు. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. -
అప్పా–మన్నెగూడ రహదారి విస్తరణకు మోక్షం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎప్పుడెప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ఎన్హెచ్–63 (అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు.. 46 కి.మీ) నాలుగులేన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.956 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనుల కాంట్రాక్ట్ను సాగునీటి ప్రాజెక్టులు ఇతర నిర్మాణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెఘా ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ చేజిక్కించుకుంది. కేటాయించిన నిధుల్లో రూ.786 కోట్లు రహదారి నిర్మాణానికి ఖర్చు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని భూ సేకరణకు వెచ్చించనుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాలకు సర్వీసు రోడ్లు సైతం అందుబాటులోకి వస్తాయి. రోడ్డుకిరువైపులా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం మొత్తం 18 ప్రాంతాల్లో అండర్ పాస్లు రానున్నాయి. వీటిలో మొయినాబాద్ అండర్ పాస్ (100 మీటర్లు) పెద్దది. (క్లిక్: హైదరాబాద్లో ఫుట్పాత్ల వైశాల్యం ఎంతో తెలుసా?) ఈ రోడ్డు పనులు పూర్తయితే మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, వికారాబాద్ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణం సులభతరం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇదిలాఉండగా చేవెళ్ల సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ మర్రి, ఇతర వృక్షాలు ఉన్నాయి. వీటి తొలగింపుపై ఇప్పటికే పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎలా సంరక్షిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. (క్లిక్: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు) -
111 జీవో ఎత్తివేస్తే.. భూముల ధరలకు రెక్కలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీవో 111 ఎత్తివేత ప్రభావం భూముల విలువలపై దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల దృష్టి జీవో 111 ప్రాంతాలపై పడనుండడం జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర ప్రాంతాల భూలావాదేవీలపై ప్రభావం చూపనుంది. ఈ జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. జీవో పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో అప్పుడే భూముల ధరలకు రెక్కలు రాగా అవి చుక్కలనంటుతాయనే చర్చ జరుగుతోంది. శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్ మండలాల్లో ప్రస్తుతం గరిష్టంగా ఎకరం ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతుండగా సమీప భవిష్యత్తులోనే అది రూ.15–20 కోట్ల వరకు పెరగనుందని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం గజం రూ.లక్షకు పైగా పలుకుతున్న కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, నార్సింగి (ఐటీ కారిడార్) వంటి ప్రాంతాలతో పాటు రాజధాని నలుదిక్కులా ఉండే ఇతర శివార్లలో కొంత స్తబ్దత నెలకొనే అవకాశముందని అంటున్నారు. అడ్డగోలు ధరలకు తాత్కాలికంగా కళ్లెం జీవో పరిధిలో 84 గ్రామాలు ఉండగా వీటి పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉంది. ఇందులో 18,332 ఎకరాలు ప్రభుత్వ, 9,235 ఎకరాల అసైన్డ్, 2,660 ఎకరాల సీలింగ్, 1,256 ఎకరాల భూదాన, ఇలా.. మొత్తం 31,483 ఎకరాల ప్రభుత్వ భూము లు ఉన్నాయి. 111 జీవో ఎత్తివేయడం, సవ రించడం వల్ల ఆ భూములన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ భూములను చేజిక్కిం చుకుని తమ సంస్థలను నెలకొల్పాలని జాతీయ, అంతర్జాతీయ ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు భావిస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు కాగా, అదే 111 జీవో పరిధిలోని భూ విస్తీర్ణం 538 చ.కి.మీ.గా ఉంది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం కంటే.. జీవో ఎత్తివేత, సవరణల కారణంగా అందుబాటులోకి వచ్చే భూవిస్తీర్ణమే అధికం అన్నమాట. న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఓ ప్రణాళిక బద్ధంగా, పర్యావరణహితంగా సరికొత్త మాస్టర్ప్లాన్తో ప్రభుత్వం ముందుకెళ్తే..హైదరాబాద్ లాంటి మరో అద్భుత, అహ్లాదకరమైన నగరం కళ్ల ముందు ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు పెద్దయెత్తున భూమి అందుబాటులోకి రానుండటంతో ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో అడ్డగోలుగా పెరుగుతున్న భూముల ధరలకు తాత్కాలికంగా కళ్లెం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూముల అమ్మకంపై రైతుల్లో పునరాలోచన జీవో కారణంగా ఈ జోన్ పరిధిలోని నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ..గతకొంత కాలంగా ఫాం హౌస్ల పేరుతో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాఫీగానే సాగుతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో శిఖం భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఇప్పటికే ఇక్కడ అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 426 లే అవుట్లలో 10,907 ఇళ్లు, గ్రామాల్లో 4,527 ఇళ్లు, 1,920 వాణిజ్య భవనాలు వెలిశాయి. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు అప్పుడప్పుడు స్పందించి అక్రమ నిర్మాణాలు కూల్చివేసినా.. ఆగకపోగా మరింత పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు స్థానికుల డిమాండ్ నేపథ్యంలో ఈ జీఓను ఎత్తి వేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించడంతో భూములకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూములు అమ్ముకోవడం కంటే..మరికొంత కాలం ఎదురు చూడటమే ఉత్తమని రైతులు భావిస్తున్నారు. అడ్వాన్సులు తీసుకున్న కొందరు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. గతంలో ఒక్కో డాక్యుమెంట్ రైటర్ రోజుకు సగటున 10–15 రాస్తే..ప్రస్తుతం ఒకటి, రెండు డాక్యుమెంట్లకే పరిమితమవుతుండటం ఇందుకు నిదర్శనం. -
సాక్షి ఎఫెక్ట్: హెచ్ఎండీఏ భూముల పరిశీలన
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎండీఏ స్థానిక అధికారుల తీరుపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పాటు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు శుక్రవారం ఆరా తీసినట్లు సమాచారం. ప్రైవేట్ వెంచరు పరిధిలోకి వెళ్లిన భూమి వివరాలను పూర్తిగా నివేదించాలని అధికారులను కోరినట్లు తెలిసింది. పట్టణంలోని సర్వేనంబరు 626/1 ఉన్న హెచ్ఎండీఏకు 360 ఎకరాల భూమి ఉండగా అందులో పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్లో 5.15 ఎకరాల భూమి, రైతుల ఆధీనంలో మరో 6.29 ఎకరాల భూమి ఉన్నట్లు తాజాగా రెవిన్యూశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. ఈ విషయమై శుక్రవారం ‘సాక్షి’ ‘ఆ స్థలం సర్కారుదే’ అన్న శీర్షికతో వచ్చిన కథనం అటు అధికార వర్గాల్లో.. ఇటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పరిశీలించిన అధికారులు మున్సిపల్, రెవిన్యూ అధికారులు మరో మారు హెచ్ఎండీఏ స్థలాన్ని పరిశీలించారు. హెచ్ఎండీఏ స్థలంలో ఉన్న రహదారితో పాటు ఓ వ్యక్తికి సంబంధించిన ప్రహరీ, మరో వ్యక్తి ఇంటికి సంబంధించి ఓ పిల్లర్తో పాటు ఓ గది కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ అధికారులకు వివరించారు. త్వరలో హెచ్ఎండీఏ అధికారులు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ లేదా ఎదైనా ఇతర సరిహద్దులను ఏర్పాటు చేసి విలువైన స్థలాలను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!) -
ఆ స్థలం సర్కారుదే.. వెలుగులోకి కబ్జా పర్వం
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయల విలువజేసే హెచ్ఎండీఏ భూ కబ్జా గుట్టు రట్టయింది. ఆరోపణలు, ఫిర్యాదులు వాస్తవమేనని సర్వే తేల్చిచెప్పింది. శంషాబాద్ పట్టణం నడిబొడ్డున చేసిన అక్రమ వెంచర్లో 5.15 ఎకరాల హెచ్ఎండీఏ భూమి అన్యాక్రాంతమైనట్లు తేలింది. దాదాపు రూ.50 కోట్ల పైచిలుకు విలువ చేసే ఈ భూమి అన్యాక్రాంతంపై హెచ్ఎండీఏ నిండా నిర్లక్ష్యం వహించినా స్థానికులు పోరు చేసి వాస్తవాలను బయటికి రప్పించారు. అసలేం జరిగింది? ► శంషాబాద్ పట్టణంలోని సర్వేనంబరు 626బై1 హెచ్ఎండీఏకు సంబంధించి 360 ఎకరాల భూమి ఉంది. ఓఆర్ఆర్ నిర్వాసితులతో పాటు విమానాశ్రయంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఇక్కడ ప్లాట్లు కేటాయించడంతో పాటు ఖాళీ స్థలాలున్నాయి. దీని పక్కనే ఆరేళ్ల క్రితం సర్వేనంబరు 551 నుంచి 600 వరకు సర్వే ఉన్న భూమిలో భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. దీని పక్కనే హెచ్ఎండీఏకు సంబంధించిన సర్వే నంబరు 626బై1ని ఆనుకుని ఉంది. ► ఇది పూర్తిగా గుట్ట ప్రాంతంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉండేవి. కార్పొరేట్ స్థాయి వ్యక్తులు వెంచర్లు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు స్థానిక నేతలే ఇందులో భారీగా క్రయ విక్రయాలు దగ్గరుండి మరీ చూసుకున్నారు. క్రమంగా అభివృద్ధి చేసిన వెంచర్లో పురాతన దేవాలయాలను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న హెచ్ఎండీఏ 5.15 ఎకరాల భూమిని కూడా అందులో కలిపేసుకున్నారు. ► ఈ స్థలంలో రహదారులు వేసి అభివృద్ధి కూడా చేశారు. ఇందులో అధికార పార్టీ నేతల నుంచి కొందరు హెచ్ఎండీఏ మాజీ అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. ఇదే సర్వేనంబరు హెచ్ఎండీఏకు సంబంధించిన మరో 6.29 ఎక రాల భూమిలో రైతులు కబ్జాలో కొనసాగుతున్నారు. ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదంగానే ఉంది. (క్లిక్: దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం) నిండా నిర్లక్ష్యం ► పునరావాసం కింద కేటాయించిన స్థలాలతో పాటు హెచ్ఎండీఏ మిగులు స్థలాలపై ఆది నుంచీ నిండా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇదే అదనుగా ఇప్పటికే కొందరు నకిలీ దస్తావేజులతో ఒకే ప్లాటు నలుగురైదుగురికి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆర్డీఓ జారీ చేసినట్లు నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆర్డీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అక్రమార్కులను కటకటాల్లోకి పంపారు. ► ఇటీవల హెచ్ఎండీఏ భూమి కబ్జాపై స్థానికులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా సీఎంఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిసెంబరు 29 రెవిన్యూ అధికారులు సర్వే పనులు షురూ చేశారు. రెండు రోజుల క్రితం సర్వే పూర్తి చేసి అధికారులకు నివేదిక అందించారు. కబ్జా జరిగింది వాస్తవమేనని తేల్చారు. త్వరలోనే సంబంధిత భూమిని స్వాధీనం చేసుకునేందుకు హెచ్ఎండీఏ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) కబ్జా వాస్తవమే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని సర్వేనంబరు 626బై1 ఉన్న హెచ్ఎండీఏకు సంబంధించిన 360 ఎకరాలతో పాటు సమీపంలో ఉన్న స్థలాను సర్వే పూర్తి చేశాం. హెచ్ఎండీకు సంబంధించిన 5.15 ఎకరాల భూమి వెంచర్లో కలిసినట్లు తేలింది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలకు సూచించాం. సర్వే నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశాం. – జనార్దన్రావు, శంషాబాద్ తహసీల్దార్ -
బీర్ పీనా.. దూద్ దేనా !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు మోతాదుకు మించి బీర్దాణా (బీర్ తయారు చేయగా మిగిలిన వ్యర్థాల లిక్విడ్) తాగిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. పరోక్షంగా పాలు తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు రైతులు అధిక పాల దిగుబడి కోసం కడుపునిండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కుసుమ నూనె తీయగా మిగిలిన కిల్లి, తవుడు, కందిపొట్టు, మొక్కజొన్నతో తయారు చేసిన సంప్రదాయ దాణా వాడుతుంటారు. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్లో ఈ దాణా ధరలు రెట్టింపవడంతో వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కొంతమంది పక్కదారిపట్టారు. ధర తక్కువ బీర్ తయారీ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా సరఫరా చేస్తున్న బీర్దాణాను డ్రమ్ముకు రూ.900 నుంచి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. సంప్రదాయదాణాలో ఐదు శాతానికి మించి బీర్దాణా వాడకూడదు. కానీ తక్కువ ధర.. 20–30 శాతం పాలు ఎక్కువగా ఇస్తుండడంతో రైతులు ఒక్కో పశువుకు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున వాడుతున్నారు. పశువుల ఆరోగ్యానికి ఇది హానికరమని వైద్యులు హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా పశువుల జీవితకాలం పదిహేనేళ్ల నుంచి పదేళ్లకు పడిపోతోంది. ఎనిమిది నుంచి పది ఈతలు ఈనాల్సిన గేదెలు నాలుగైదు ఈతలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్యపరిస్థితి క్షీణించి, త్వరగా మృత్యువాత పడుతున్నాయి. పశువుల పాకలోని డ్రమ్ముల్లో బీర్ లిక్విడ్ డిమాండ్ ఎక్కువ కావడంతో.. పశువైద్యశాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లా లో 1,88,182 పశువులు ఉండగా, వీటిలో 1,22, 58 7 గేదెజాతివి ఉన్నాయి. విజయ, మదర్ డెయి రీలు 8,570 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. గ్రేటర్ వాసులకు రోజుకు కనీసం 25–30 లక్షల లీటర్ల పాలు అవసరమవుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల లీటర్లకు మించి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్లో లీటర్ పాలను రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దిగుబడికి, డిమాండ్కు మధ్య భారీ వ్యత్యాçసం ఉండడంతో రైతులు పశువుల నుంచి అధిక దిగుబడి సాధించేందుకు బీర్దాణాను వాడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,144 పాడిపశువులను 75 శాతం నుంచి 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. పశుగ్రాస సాగు కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 140.2 మెట్రిక్ టన్నుల విత్తనాలు సరఫరా చేశారు. సొంతంగా పొలం ఉన్న వారు గడ్డినిసాగు చేసినప్పటికీ.. పొలం లేనివారు పశువులకు ఆహారంగా బీర్దాణాను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల్లో ఇప్పటికే 417 చనిపోవడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు వస్తాయి సాధారణంగా మక్క, తవుడు, వేరుశశగ చెక్క, కందిపొట్టుతో తయారు చేసిన దాణాను పశువులకు వాడుతుంటారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చవుతుంది. బీర్దాణాకు లీటర్కు రూ.పదిలోపే దొరుకుతోంది. ఇందులో ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలల్లో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన పిల్లలకు జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. – డాక్టర్ శంకర్,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తలకొండపల్లి -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన రాచకొండ పోలీసులు
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు గురువారం చేధించారు. మట్టారెడ్డి గ్యాంగే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మట్టారెడ్డితో పాటు ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టారెడ్డి, మొహినుద్దీన్, నవీన్తోపాటు మరో ఇద్దురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డిని కాల్చి చంపింది సుపారీ గ్యాంగ్గా తేల్చారు. మోహినుద్దిన్ మట్టారెడ్డి వాచ్మెన్గా, నవీన్ శ్రీనివాస్రెడ్డి బినామీగా పోలీసులు గుర్తిచారు. -
టార్గెట్ శ్రీనివాస్రెడ్డా..?లేక రాఘవేందర్రెడ్డా..?
హైదరాబాద్/ఇబ్రహీంపట్నం : సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ హత్యలో ఏడెనిమిది మంది హంతకులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు కారు, ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి దగ్గర్లోనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో నిందితులు, వాహనాల రాకపోకలు ఏమైనా నిక్షిప్తమయ్యాయా? అనేదానిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల కాల్పుల్లో అల్మాస్గూడకు చెందిన నవారు శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎన్ రెడ్డి నగర్ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన కోమటిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మృతి చెందడంతో.. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిగా సాంకేతిక అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది. సెల్ఫోన్ టవర్ లొకేషన్, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల పాత్ర ఉందా? ► కాల్పులు జరిగిన ఘటనా స్థలానికి అత్యంత చేరువలో 10 నుంచి 15 గుడిసెలు ఉన్నాయి. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు. వెంచర్లోని రోడ్లు, డ్రైనేజీ వర్క్స్, గుంతలు తీయటం వంటి పనులు చేస్తుంటారు. మంగళవారం శివరాత్రి పండగ కావటం, ఉదయం 8 గంటల ప్రాంతంలోనే కాల్పులు జరగడంతో ఆ సమయంలో గుడిసె వాసులు అక్కడే ఉండి ఉంటారని.. అనుమానాస్పద వ్యక్తులు వెంచర్లోకి రావటం, తూటాల శబ్దం వంటివి ఏమైనా గమనించారా? కాల్పులను ప్రత్యక్షంగా చూశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ► గుడిసెవాసుల్లోని 20 మంది మహిళలు, పురుషులను పోలీసులు బుధవారం విచారించారు. మంగళవారం శ్రీనివాస్ రెడ్డి మృతదేహం వద్ద జాగిలంతో పరిశీలించిన డాగ్ స్క్వాడ్ను బుధవారం మరోసారి రంగంలోకి దింపారు. ఘటన జరిగిన రోజు నేరుగా ఇబ్రహీంపట్నం రోడ్ వైపు పరుగెత్తిన జాగిలం.. బుధవారం మాత్రం మృతదేహం పడిన చోటే తిరిగింది. వెంచర్ బయటికి వెళ్లకపోవడం గమనార్హం. భూ వివాదాలే కారణం.. కానీ.. ► భూ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆ తగాదా కర్ణంగూడలోని 10 ఎకరాల భూమి విషయంలోనా లేక వేరే ఏమైనా భూ తగాదాలా, సెటిల్మెంట్లా? అనేవి తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. దీంతో రియల్టర్ల హత్యకు సుపారీ ఎవరు ఇచ్చారనేది పోలీసులకు సవాల్గా మారింది. ప్రతి రోజు ఉదయం శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కర్ణంగూడలోని తమ పొలానికి వచ్చి కాసేపు గడుపుతారనే సమాచారం తెలిసిన వ్యక్తే హత్యకు పథకం రచించి ఉంటాడని, అతనే హంతకులకు వారి సమాచారం అందించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ► శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డి ఘటనా స్థలానికి రాకముందే హంతకులు అక్కడ కాపు కాస్తున్నా రని తెలిసింది. మృతులు ఇద్దరికీ ఆయుధ లైసెన్స్లు లేవని, స్వాధీనం చేసుకున్న బుల్లెట్, షెల్స్ ఆధారంగా హంతకులు రెండు తుపాకులు వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. లాఅండ్ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఇంటలిజెన్స్ వంటి ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. స్థిర చరాస్తులపై దర్యాప్తు.. ► భూ వివాదాలు, సెటిల్మెంట్లే హత్యకు కారణ మని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో స్థిర, చరాస్తులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో రియల్టర్ మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ కృష్ణ, ప్రధాన అనుచరులు హఫీజ్, నవీన్లను రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. శ్రీనివాస్రెడ్డికి నమ్మిన బంటైన కృష్ణ.. చిన్నతనం నుంచి శ్రీనివాస్ వెంటే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ► చర్లపటేల్గూడలోని పదెకరాలు కొనుగోలు చేసిన శ్రీనివాస్రెడ్డి.. ఆ భూమిని కృష్ణ పేరు మీదనే డెవలప్మెంట్కు తీసుకున్నట్లు సమాచారం. ఎప్పుడూ చుట్టూ అనుచరులు, సెక్యూరి టీతో ఉండే శ్రీనివాస్రెడ్డిని మీర్పేట నయీంగా పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ► పట్నంతో పాటు అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్పేట, అనాజ్పూర్, హయత్నగర్లో పెద్ద మొత్తంలో సెటిల్మెంట్లు చేస్తుంటాడని తెలిసింది. తుర్కయాంజాల్లో పెద్ద డీల్తో పాటు వనస్థలిపురంలో స్థలంవివాదంపై కోల్కతా వెళ్లి సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం. ఉప్పందించిందెవరో..? ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని కర్ణంగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడలేదు. ఇక్కడ చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా తమ అనుచరులు లేకుండా శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డి సైట్ వద్దకు వస్తున్నట్లు దుండగులకు ఎవరు ఉప్పందించారనేది కీలకంగా మారింది. ఈ విషయం తేలితే కేసు మిస్టరీని సులువుగా ఛేదించే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. సుపారీ గ్యాంగ్ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్పెషల్ టీంలతో దర్యాప్తు జంట హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్ఓటీ, ఐటీ సెల్, సీసీఎస్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ ఇలా వేర్వేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్టీంకు లభించిన ఆధారాలు, బుల్లెట్లను పరిశీలిస్తున్నారు. కాల్పులకు వాడిన తుపాకులు, బుల్లెట్లు అక్రమంగా కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న గుడిసెవాసులను, లేక్ విల్లాలో పనిచేస్తున్న కూలీలను పోలీసులు బుధవారం విచారించారు. కాల్పుల శబ్దం వినబడిందా? ఈ గొడవను మీరు చూశారా..? దుండగులను మీరు గుర్తు పట్టగలరా..? అనే కోణంలో వారిని విచారించారు. టార్గెట్ ఒక్కరేనా..? దుండగులు ఒక్కరినే టార్గెట్ చేసి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డి ఒకే వాహనంలో ఉండటంతో దుండగులు ఇద్దరినీ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఎవరిని టార్గెట్ చేసింది ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. వీరి లక్ష్యం భూదందా, సెటిల్మెంట్లలో సిద్ధహస్తుడైన శ్రీనివాస్రెడ్డా..? లేక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చిన రాఘవేందర్రెడ్డా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత కేసులను పరిశీలిస్తున్నారు. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. కాల్పుల ఘటనను కిరాయి హంతకుల సుపారి హత్యగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణ చేశారు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక హత్య కేసులో రాఘవేందర్రెడ్డి నిందితుడని, శ్రీనివాస్రెడ్డిపై సైతం పలు కేసుల్లో ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా పలు లాండ్ అగ్రిమెంట్స్, డెవలప్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఎనిమిది స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మట్టారెడ్డితో పాటు శ్రీనివాస్రెడ్డి అనుచరులు.. హఫీజ్, కృష్ణలను పోలీసులు విచారిస్తున్నారు. నేడు(బుధవారం) పలువురు భూమి యజమానులను పోలీసులు విచారించనున్నారు. లేక్ వ్యూ విల్లాస్ యజమానులను వద్ద సైతం పోలీసులు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస్రెడ్డి అనుచరులు కృష్ణా, అఫీజ్లపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదస్పద లేక్ విల్లా డెవలప్మెంట్ డ్రైవర్ కృష్ణ పేరుతో అగ్రిమెంట్ ఉన్నట్లు గుర్తించారు. హఫీజ్ పేరు మీద అబ్ధుల్లాపూర్మెట్లో కొంత భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
భూమిపై గురిపెట్టి.. నోట్లో గన్ పెట్టి
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం రూరల్: నగరశివారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూవివాదం ఇద్దరు రియల్టర్ల దారుణ హత్యకు దారితీసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాస్రెడ్డి (38), కోమటిరెడ్డి రాఘవేందర్రెడ్డి (40)లు తమ వాహనంలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. అల్మాస్గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన రాఘవేందర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణలతో కలిసి సందర్శించారు. హతులిద్దరికీ నేరచరిత్ర ఉండటంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. నోట్లో గన్ పెట్టి..: శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి తమ స్కార్పియో వాహనంలో కర్ణంగూడలోని లేక్విల్లా అర్చిడ్స్కు చేరుకున్నారు. అక్కడ ఓ స్థల వివాదంపై నల్లగొండకు చెందిన మట్టారెడ్డితో మాట్లాడిన అనంతరం తిరుగుముఖం పట్టారు. కొన్ని మీటర్ల దూరం ప్రయాణించారో లేదో గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో వీరిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్రెడ్డి తలలో రెండు బుల్లెట్లు, రాఘువేందర్రెడ్డి ఛాతి భాగంలో ఒక తూటా వెళ్లాయి. శ్రీనివాస్రెడ్డి కారు దూకి పారిపోతుండగా.. దుండగులు ఆయనను పట్టుకొని తుపాకీని నోట్లో పెట్టి కాల్చినట్లు తెలుస్తోంది. రాఘువేందర్ రెడ్డి కారులో పారిపోతుండగా వాహనం అదుపుతప్పింది. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో కారులోనే సుమారు అరగంటపాటు కొట్టుమిట్టాడినట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు రాఘువేందర్ను బీఎన్రెడ్డి నగర్లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఘటనాస్థలంలో పోలీసులకు ఒక బుల్లెట్ లభ్యం కాగా.. కారులో రెండు బుల్లెట్ షెల్స్ లభించాయి. శ్రీనివాస్రెడ్డి అనుచరులుగా భావిస్తున్న హఫీజ్, కృష్ణతోపాటు మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. భూ వివాదమే కారణమా? ఇబ్రహీంపట్నం పరి«ధిలోని చర్లపటేల్గూడ రెవెన్యూ పరి«ధిలో ఇరవై ఏళ్ల క్రితం కొంతమంది రైతులు నల్లగొండ జిల్లాకు చెందిన ఇంద్రారెడ్డి అనే రియల్టర్కు కొంత భూమిని విక్రయించారు. ఆయన ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు విక్రయించగా.. వాళ్లు లేక్విల్లా ఆర్చిడ్స్ పేరుతో సుమారు 200–300 మంది కొనుగోలుదారులకు విక్రయించారు. ఒక్కో ప్లాట్ 1,111 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ధరణి వచ్చాక ఆ భూమి తిరిగి ఇంద్రారెడ్డి పేరుపై ఉన్నట్లు చూపించింది. రైతుబంధు పథకం కూడా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలో ఇంద్రారెడ్డి నుంచి పదెకరాల స్థలాన్ని శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో ముగ్గురి మధ్య వివాదం తలెత్తింది. ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని భావించి శ్రీనివాస్రెడ్డి పదెకరాల పొలం చదును చేసి బోర్లు వేసి వ్యవసాయ భూమిగా మార్చాడు. మట్టారెడ్డి, ఇంద్రారెడ్డిలు శ్రీనివాస్రెడ్డితో రాజీ పడాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఇంద్రారెడ్డి, మట్టారెడ్డి సోమవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. న్యాయవాది హత్య కేసులో దోషి రాఘవేందర్ రెడ్డి భార్య స్వాతిరెడ్డి హైకోర్టులో అడ్వొకేట్గా పనిచేస్తున్నారు. 2004లో ఓ మహిళా న్యాయవాది హత్య కేసులో రాఘవేందర్ రెడ్డి (ఏ–2) నిందితుడిగా ఉన్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నేరంలో రాఘవేందర్కు కోర్టు జీవితకాలం శిక్ష విధించగా, శిక్ష అనంతరం ఇటీవలే రాఘవేందర్ బయటకు వచ్చినట్లు సీపీ చెప్పారు. ఇదిలాఉండగా.. రెండు నెలల క్రితం మీర్పేట పోలీస్స్టేషన్లో శ్రీనివాస్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైందన్నారు. శ్రీనివాస్ రెడ్డి సొంత బావనే కేసు పెట్టాడని, బావ మీద శ్రీనివాస్ రెడ్డి కూడా కేసు పెట్టాడని వివరించారు. కేసును చాలెంజ్గా తీసుకున్నాం: రాచకొండ సీపీ జంట హత్యల కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ టీమ్లో లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ కేసును చాలెంజ్గా తీసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. మృతులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఇతరత్రా వివరాలను రాబట్టేందుకు సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. చివరిసారిగా మృతులు ఎవరితో మాట్లాడారు? సంఘటనాస్థలం వద్ద ఎవరెవరి సెల్ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? ఎవరికి సుపారీ ఇచ్చారు? తుపాకీ ఎక్కడిది? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం వెతికే పనిలో పడ్డారు. -
డాడీ భయంగా ఉంది.. ఇంటికొచ్చేలా చూడండి
యాచారం: ‘డాడీ భయంగా ఉంది. బాంబుల మోతతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నా. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. నన్ను ఎలాగైనా ఇంటికి రప్పించు ప్లీజ్’ అని ఉక్రెయిన్లో చిక్కుకున్న వైద్య విద్యార్థి తన తండ్రితో అన్న మాటలివి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్గౌరెల్లికి చెందిన కాటిక వెంకటయ్య, సుగుణ దంపతుల కుమార్తె కాటిక వెన్నెల వైద్య విద్యను అభ్యసించేందుకు మూడు నెలల కిందట ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడి వినిస్తియా యూనివర్సిటీలో చదువుకుంటోంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో భయాందోళన చెందుతోంది. ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో తిండీ నిద్ర లేకుండా పోతోందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీరుమున్నీరైంది. ప్రాణాలతో బతికి వస్తామోలేదో డాడీ, మమ్మీ అంటూ బోరున విలపించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వెన్నెలను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన 300 మంది విద్యార్థులం వినిస్తియా యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం నుంచి సహకారం లేదని, వెళ్లిపోండి.. జాగ్రత్తగా ఉండండి.. బాంబులు ఎప్పుడైనా పడొచ్చని హెచ్చరిస్తున్నట్లు విలపిస్తూ చెప్పింది. -
సడన్ బ్రేక్ వేసిన లారీ డ్రైవర్.. కిందకు దూసుకెళ్లిన కారు.. ఎస్ఐ మృతి
పహాడీషరీఫ్: ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్.. సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న కారు, ముందున్న లారీ కిందకు దూసుకెళ్లి వాహనాన్ని నడుపుతున్న ఎస్ఐ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున జరిగింది. మహబూ బ్నగర్ జిల్లా ధర్మ పూర్ గ్రామానికి చెందిన పల్లె మాస య్యగౌడ్ కుమారుడు పల్లె రాఘవేందర్ (37) రైల్వే ఎస్ఐగా పని చేస్తు న్నారు. శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూ రులోని బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్టులో నివసించే స్నే హితుడు బాబురెడ్డిని కలిసేందుకు మహబూబ్నగర్ నుంచి తన స్విప్ట్ డిజైర్ కారులో బయ లుదేరారు. శనివారం తెల్లవారుజామున శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనకాల ఉన్న ఎస్ఐ రాఘవేందర్ తన కారును నియంత్రించ లేకపోవ డంతో ఒక్కసారిగా లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. -
సీఎం కేసీఆర్తో ఎలాంటి విభేదాల్లేవు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘సీఎం కేసీఆర్తో మాకు ఎలాంటి విభేదాల్లేవు. సహస్రాబ్ది సమారోహంలో నిరంతరాయ విద్యుత్, మంచినీటి సరఫరా, పోలీసు భద్రత, ఇతర ఏర్పాట్లన్నీ ఆయన సహకా రం వల్లే అందాయి. ఆయనతో విభేదాలు అన్న పదమే కరెక్ట్ కాదు’ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్స్వామి స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల వల్లే ఆయన సమతామూర్తి సందర్శనకు రాలేక పోయారన్నారు. శుక్రవారం ముచ్చింతల్ శ్రీరామ నగరంలో మీడియాతో చినజీయర్ మాట్లాడారు. సమారోహానికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. రాజకీయాల్లో మాత్రమే స్వపక్షం, విపక్షం అనేవి ఉంటాయని, భగవంతుని సన్నిధిలో అలాంటి వాటికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. రామానుజాచార్యుల సహ స్రాబ్ది సమారోహానికి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతోపాటు సాధారణ భక్తులందరినీ ఆహ్వానించామని చెప్పారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ప్రధాని చేతుల మీదుగా చేయిం చాలని 2016లోనే కమిటీ తీర్మానించిందని, ఆ విషయం సీఎం కేసీఆర్ సహా ప్రముఖులందరికీ తెలుసని ఓ ప్రశ్నకు సమా దానంగా చెప్పారు. కేసీఆర్తో కానీ, ఇతర నేతలతో కానీ తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కార్య క్రమానికి తొలి వలంటీర్గా తానే వ్యవహరిస్తానని స్వయంగా కేసీఆరే చెప్పారని గుర్తు చేశారు. 108 మూర్తులకు ఒకేసారి... 108 దివ్యదేశాల్లోని మూర్తులకు శనివారం శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు చినజీయర్ చెప్పారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ‘రామానుజా చార్యుల దర్శనానికి వెళ్లే సోపాన మార్గంలో 14 మెట్లపై 108 దివ్యదేశాల్లోని మూర్తు లకు శాంతి కళ్యాణం నిర్వహిస్తాం. ఒక్కో మెట్టుపై 7 నుంచి 9 పెరుమాళ్లకు కల్యాణం జరుపుతాం. ఇప్పటివరకు ఒక్కో ఆలయంలో ఒకరు లేదా ఇద్దరు మూర్తులకు మాత్రమే కల్యాణం నిర్వహించ డం చూశాం. కానీ చరిత్రలోనే తొలిసారిగా ఇక్కడి పెరుమాళ్లందరికీ ఒకే సమయంలో.. ఒకే వేదికపై కల్యాణం నిర్వ హిస్తుండటం చాలా అరుదైన అంశం. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని స్వయంగా వీక్షించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికీ కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కరోనా తగ్గింది.. అదే అద్భుతం ‘ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న రెండు రకాల వైరస్లలో ఒకటి కరోనా కాగా, రెండోది అసమాన తలు, విభేదాలు. 12 రోజులపాటు ఐదు వేల మంది రుత్వికులతో యజ్ఞాలు, పూజలు చేయించ డం వల్ల ప్రజలకు మంచే జరిగింది. ప్రస్తుతం కరోనా తగ్గిపోయింది. ఇదంతా యాగ ఫలమే. కార్యక్రమం ప్రారంభానికి ముందు రోజుకు 25 వేల కరోనా కేసులు నమోదైతే.. ఆ తర్వాత రెండో రోజే వాటి సంఖ్య రెండు వేలకు పడిపోయింది. ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా హోమ పూజా ఫలితమే’ అని చినజీయర్ స్పష్టం చేశారు. సమతావాదం, సామ్యవాదం అనేది పాశ్చాత్యుల నుంచి వచ్చినట్లు అంతా భావిస్తున్నారని, నిజానికి వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు ఈ సమానత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. రేపటి నుంచి సువర్ణమూర్తి దర్శనం ►ఈ నెల 20 నుంచి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రామాను జుల 120 కేజీల సువర్ణమూర్తిని దర్శించు కునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చినజీయర్ తెలిపారు. సమతామూర్తి సంద ర్శనకు వచ్చే భక్తులకు ఆలయ విశిష్టతలను వివరించేందుకు నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూ నికేషన్ (ఎన్ఆర్సీ) వ్యవస్థ ఏర్పాటు చేశా మని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సువర్ణమూర్తి చుట్టూ ఉన్న స్తంభాల ముందు నిలబడి.. వాటిపై ఉన్న ఛాయాచిత్రాల ప్రాముఖ్య తను తెలుసుకోవచ్చన్నారు. డైనమిక్ ఫౌంటెయిన్, ఆగు మెంటెడ్ రియాల్టీ షో, త్రీడీ మ్యాపింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ సేవలన్నీ అందుబాటులోకి వచ్చాక నిర్వహణ భారాన్ని బట్టి, సేవలకు ధరలను నిర్ణయిస్తామన్నారు. -
తాళం వేస్తే చాలు.. ఇదేమి తలాంగు తకధిమి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీలో గుండ్ల శేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీలు జరిగాయి. ఇంటికి తాళం వేస్తే చాలు చోరీలు జరుగుతున్నాయి. ఒకే ఇంట్లో రెండుసార్లు వరుస చోరీలు జరుగుతుండటంతో ఈ చోరులు పోలీసులకు సవాల్ విసురుతున్నట్టు ఉంది. ఫిబ్రవరి 9న ఇదే ఇంట్లో చోరీ జరిగినట్టు షాద్ నగర్ పట్టణ సిఐ నవీన్ కుమార్ ఇదివరకే మీడియాకు తెలిపారు. బాధితుడు శేఖర్ గౌడ్ పనిమీద భార్యతో పాటుగా ఇటీవల హైదరాబాద్ వెళ్లాడు. గత బుధవారం ఉదయం తిరిగి షాద్ నగర్ లోని తన ఇంటికి వచ్చే చూసే సరికి ఇంటి డోర్ తాళం పగల గొట్టబడి ఉన్నదని పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా కబోర్డులో ఉన్న బంగారం 2.5 తులాలు, 6 గ్రాముల వెండి ఆభరణాలు దొంగలించుకొని పోయారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రారంభానికి ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రెడీ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేధా గ్రూప్ నెలకొల్పిన ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఇది ఒకటని తెలిపారు. త్వరలో రైల్ కోచ్ల తయారీ, రవాణాకు సిద్ధమవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్ కోచ్ల తయారీని సుసాధ్యం చేసిన మేధా బృందాన్ని అభినందిస్తూ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫొటోలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ పంచుకున్నారు. ఈ ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీకి కొండకల్లో మంత్రి కేటీఆర్ 2020 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. వేయికోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన ఫ్యాక్టరీలో స్థానికంగా 2,200 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ లోకోమోటివ్ డిజైనింగ్లో పేరొందిన మేధా సర్వో గ్రూప్ భారతీయ రైల్వేకు అతిపెద్ద ప్రొపల్షన్ సరఫరాదారుగా ఉంది. కొండకల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో కోచ్లు, మెట్రో రైళ్లు, మోనోరైల్ తదితరాల తయారవుతాయి. ఏటా 500 కోచ్లు, 50 లోకోమోటివ్ల తయారీ సామర్థ్యం ఈ యూనిట్కు ఉంది. -
Statue Of Equality: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి అంకురార్పణ జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకులను సమతామూర్తి ఆశీనులైన భద్రవేదికకు చేరుకునే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన 108 మెట్లలో మొదటి మెట్టు వరకు అనుమతించనున్నారు. అటు నుంచి యాగశాలకు ఆనుకుని ఉన్న ప్రవచన మండపానికి అనుమతించనున్నారు. ఇక్కడి నుంచే యాగశాలను దర్శించుకునేందుకు సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. భద్రవేదికపై ఆశీనులైన 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి మూడో అంతస్తుపై ఉన్న ప్రధాన విగ్రహం వరకు సందర్శకులను అనుమతించనున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కేజీల సువర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 13న తొలి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 54 అంగుళాలు ఉన్న సువర్ణమయ నిత్య ఉత్సవమూర్తిని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతించనున్నారు. అప్పటి వరకు వీరంతా బయటి నుంచే వీక్షించి వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఈ ప్రాంగణంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాల వీక్షణ, ఆరాధనకు కూడా ఆ తర్వాతే అనుమతించనున్నారు. అప్పటి వరకు ఆయా ఉత్సవమూర్తులను బయటి నుంచే సందర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ శ్రీరామానుజాచార్యల విగ్రహావిష్కరణకు ఈ నెల 5న ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మంగళవారం శ్రీరామనగరాన్ని సందర్శించారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆయన కేంద్ర భద్రతా బలగాలతో సమావేశం కానున్నారు. ప్రారంభానికి ముందే అవస్థలు ఇదిలా ఉంటే ఉత్సవాల ప్రారంభానికి ముందే రుత్వీకులు, వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సందర్శకులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంగణానికి 15 వేల మందికిపైగా చేరుకోగా, పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రేటర్ జిల్లాల నుంచి రోజుకు సగటున 50 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాలంటీర్లు, రుత్వీకులు, ప్రభుత్వ ఉద్యోగులను అంచనా వేయడంలో నిర్వాహకులు ఇప్పటికే కొంత విఫలమయ్యా రు. ఆయా నిష్పత్తి మేరకు అన్నప్రసాదాలను తయారు చేసినా వారికి అందజేయక పోవడంతో ఇక్కడికి వచ్చిన వారికి పస్తులు తప్పడం లేదు. భారీ స్వాగత తోరణాలు వేడుకలకు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు ఆయా మార్గాల్లో భారీ కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాలను సర్వంగసుందరంగా తీర్చిదిద్దా రు. అన్ని మార్గాల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) -
తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎవరెన్ని కుట్రలు చేసినా రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని అన్ని నియోజ కవర్గాలను అభివృద్ధి చేసి తీరుతాం’అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం, మంత్రుల పర్యటనలను అడ్డుకోవడం సరికాదని, దమ్ము ఉంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో పోటీ పడాలి’ అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ‘అధికారం ఎవరి సొత్తు కాదని, మీరు దేశంలో అధికారంలో ఉన్నారు. ఈ ఏడున్నరేళ్లలో రాష్ట్రం కోసం చేశారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా’అని నిలదీశారు శనివారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ, జల్పల్లి, మీర్పేట్, బడంగ్పేట్ పుర/నగర పాలికల పరిధిలో రూ.371.09 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బడంగ్పేట్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. గతేడాది అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు నగరంలో అనేక కాలనీలు మునిగి పోయాయని, ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినా అరపైసా కూడా ఇవ్వలేదని, గుజరాత్లో వరదలొస్తే ప్రధాని మోదీ తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. మోదీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి సహకరిం చకపోగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజ కీయ లబ్ధిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదు.. మన ఊరు– మనబడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్లతో 26 వేల పాఠశాలను సంస్క రించుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేసి 950 గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య ను అందిస్తున్నామని చెప్పారు. కేంద్రం మాత్రం రాష్ట్రానికి కొత్తగా ఒక్క నవోదయ పాఠశాలను కూడా కేటాయించలేదని విమర్శించారు. దేశవ్యా ప్తంగా 16 ఐఐఎంలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని మండిపడ్డారు. ప్రభు త్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశామని, కేసీఆర్ కిట్టు వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 50 శాతం పెరిగాయని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
సీపీఎం రాష్ట్ర మహాసభలు..హాజరుకానున్న ఏచూరి, ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వేదికగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) మూడో రాష్ట్రమహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభలు శనివారం ప్రారంభంకానున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిసహా పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు అతిథులుగా హాజరుకానున్నారు. సభలు జరిగే ప్రదేశంసహా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ప్రధాన వీధులన్నింటినీ ఎర్రతోరణాలతో అలంకరించారు. బొంగుళూరు గేటు, విజయవాడ హైవే, మహేశ్వరం ప్రధాన రహదారుల వెంట భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సభలకు జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అతిథులకు భోజనాలు, వసతిని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్తోపాటు సమీపంలోని పలు అతిథిగృహాల్లో కల్పించనున్నారు. చర్చకు వచ్చే ప్రధాన అంశాలివే... ప్రభుత్వ మిగులు భూముల పంపిణీ, జిల్లాలో పరిశ్రమల స్థాపన పేరుతో బలవంతపు భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న తీరు, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో పెరుగుతున్న నిరుద్యోగం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, కేంద్రం తీసుకొస్తున్న సాగు వ్యతిరేక చట్టాలు, భవిష్యత్తులో వాటి పర్యవసానాలు వంటి కీలక అంశాలపై ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
మోసం చేసిన ఏజెంట్! ఒమన్లో చిక్కుల్లో పడ్డ భారతీయ మహిళ !
ట్రావెల్ ఏజెంట్లు చేసిన మోసంతో ఓ మహిళ దేశం కాని దేశంలో ఇక్కట్ల పాలైంది. చేతిలో డబ్బులు లేక అక్కడ యజమాని పెట్టే కష్టాలు భరించలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూసింది. చివరకు విదేశాంగ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ మహిళకు అండగా నిలిచారు. మారుమూల ప్రాంతానికి మస్కట్లో ఉద్యోగం ఉందంటూ మాయమాటలు చెప్పిన ఓ ట్రావెల్ ఏజెంట్ రంగారెడ్డి జిల్లాలోని షహీన్ నగర్కి చెందిన ఓ మహిళను విమానం ఎక్కించాడు. మస్కట్కి కాకుండా ఒమన్లోని మారుమూల ప్రాంతమైన సిర్కి ఆ మహిళను పంపాడు. అక్కడ ఉద్యోగం బదులు ఒకరి ఇంట్లో పని మనిషిగా కుదిర్చాడు. ఈ ఘటన 2021 నవంబరులో జరిగింది. నిత్యం హింసే రోజుకు 18 గంటల పాటు పని చేసినా యజమాని సంతృప్తి చెందకపోవడంతో నిత్యం ఆమెను హింస పెట్టేవాడు. దీంతో తనను ఇండియా పంపివ్వాలంటూ ఆ మహిళ వేడుకోగా.. తనకు రెండు లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తే తప్ప విముక్తి లేదంటూ ఖరాఖండీగా ఆ యజమాని చెప్పాడు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఫోన్ ద్వారా జరిగిన మోసం కుటుంబ సభ్యులకు తెలిపింది. నిఘా పెట్టాలి ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంధ సంస్థల ద్వారా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మస్కట్, ఒమన్లలో ఉన్న భారత అధికారులు.. సదరు యజమానితో మాట్లాడి సమస్యకి పరిష్కారం చూపారు. చివరకు 2022 జనవరి 18న ఆ మహిళ సురక్షితంగా ఇండియా చేరుకుంది. ట్రావెల్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీసారి సరైన సమయంలో సహాయం అందకపోవచ్చని.. కాబట్టి చిక్కుల్లో పడవద్దంటూ సూచించారు. ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో హుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అబుదాబి ఎయిర్పోర్టు డ్రోన్ ఎటాక్.. యూఏఈ స్పందన -
మొండెం దొరికింది.. తల మిస్టరీ వీడింది
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో మెట్టు మహంకాళిమాత పాదాల వద్ద 2 రోజుల క్రితం లభ్యమైన వ్యక్తి తల మిస్టరీ వీడింది. రంగారెడ్డి జిల్లా తుర్కంజయాల్ వద్ద శిరస్సు లేని మొండెం లభించింది. ఇళ్ల మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై హత్య జరిగిన నాలుగు రోజులు తర్వాత శిరస్సు లేని మొండెం లభ్యమైంది. ఇది నాలుగురోజుల క్రితం హత్యకు గురైన సూర్యాపేట జిల్లా పాలకీడు మంండలం శూన్యపహాడ్ తండాకు చెందిన జహేందర్ నాయక్దిగా గుర్తించారు. అయితే పోస్టుమార్టం తర్వాత పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఛాలెంజింగ్గా తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అమీర్పేట: భర్తకు బెయిల్ ఇప్పిస్తానని.. ఓయో లాడ్జికి రప్పించి) -
ఆలనాపాలనా చూడలేక..
బాలానగర్: బిడ్డ ఆలనా.. పాలనా చూడాల్సిన కన్న తల్లి చనిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కూతురిని పెంచడం భారంగా భావించి.. బాధ్యతలు విస్మరించిన ఆ తండ్రి చిన్నారిని నదిలోకి తోసేసి కడతేర్చిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూరారం గ్రామానికి చెందిన రావుల రాజుకు, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం దేవల్లికి చెందిన మంజులతో వివాహమైంది. ఇద్దరూ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. పెద్ద కూతురు పూజ షాద్నగర్లో ఏడో తరగతి, చిన్న కూతురు రూప గ్రామంలోనే నాలుగో తరగతి చదువుతుండగా రాజు మధ్యలోనే వారి చదువు మాన్పించాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తలు ఇంట్లో తరచూ గొడవ పడుతుండేవారు. చిన్నకూతురు స్నేహ పుట్టిన రెండు నెలలకే ఇంట్లో కింద పడి నడుము దెబ్బతినడంతో ఆరేళ్లు దాటినా ఇంకా నడవలేకపోతోంది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నడవలేని స్థితిలో ఉన్న స్నేహ తనకు భారంగా మారుతుందని భావించి.. మంగళవారం తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారిని తీసుకెళ్లి గ్రామ సమీపంలో ఉన్న దుందుభినదిలో తోసి వచ్చాడు. ఇంట్లో స్నేహ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు రాజును నిలదీశారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజును అదుపులోకి తీసుకుని విచారించడంతో పాపను దుందుభినదిలో తోసి వేసినట్లు ఒప్పుకున్నాడు. జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. స్నేహ మృతదేహం తేలుతూ కనిపించింది. ఈ సంఘటనపై పాప బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దేవుడా ఎందుకీ కడుపుకోత.. నేనేం పాపం చేశా..
సాక్షి, రంగారెడ్డి(మొయినాబాద్): ‘దేవుడా ఎందుకీ కడుపుకోత.. ఒకేసారి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్తావా..? నేనేం పాపం చేశా..’ అని ఓ మాృతమూర్తి గర్భశోకంతో తల్లడిల్లింది. వరుసగా రెండు రోజులు వారి అంత్యక్రియలు నిర్వహించడం హృదయాలను కలచివేసింది. అక్కాచెల్లెళ్లు తమ చిన్నాన్న కూతురితో కలసి క్రిస్మస్ వేడుకలకు శనివారం రాత్రి స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు సోమవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. చిన్నాన్న కూతురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల కడుపుకోతను చూసి బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: (పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో) వివరాలు.. మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లికి చెందిన మోర వెంకటేశ్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్ మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా స్నేహితులతో కలసి వేడుక చేసుకునేందుకు శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో వెంకటేశ్ కూతుళ్లు ప్రేమిక (16), సౌమ్య (20), వారి చిన్నాన్న కూతురు అక్షయ స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో అతివేగంతో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో ప్రేమిక అక్కడికక్కడే మృతి చెందగా, సౌమ్య, అక్షయ తీవ్రంగా గాయపడ్డారు. సౌమ్య చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా.. అక్షయ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. సౌమ్య మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..) వరుసగా రెండు రోజులు అంత్యక్రియలు ఒకే కుటుంబంలో వరుసగా రెండు రోజులు చెల్లి, అక్కా అంత్యక్రియలు జరిగాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ‘దేవుడా ఎందుకు కడుపుకోత మిగిల్చావ్.. ఇద్దరు బిడ్డలను ఒకేసారి తీసుకెళ్లావా..?’ అంటూ ఆ తల్లి రోదనలు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. కాగా, నిందితుడు, అత్తాపూర్కు చెందిన సంపత్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) మంత్రి సబిత, ఎమ్మెల్యే యాదయ్య పరామర్శ సౌమ్య అంత్యక్రియలకు సోమవారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. సౌమ్య మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
నలుగురు విద్యార్థులకు కరోనా
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం కరోనా కలకలం రేపింది. విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలలో 6నుంచి 10 తరగతులకు చెందిన 128 మంది విద్యార్థులు ఉండగా సోమవారం 29 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇందులో నలుగురు వైరస్ బారిన పడినట్లు తేలిందని నందిగామ పీహెచ్సీ డాక్టర్ పాల్గుణ తెలిపారు. దీంతో వీరి స్వగ్రామాలైన మోత్కులగూడ, మొదళ్లగూడ, వీర్లపల్లి, మామిడిపల్లిలో ఆందోళన నెలకొంది. మిగతా వారికి మంగళవారం టెస్టులు చేస్తామన్నారు. -
వృద్ధురాలిపై పైశాచికం: మద్యం తాగించి.. లైంగిక దాడికి పాల్పడి..
సాక్షి, అబ్దుల్లాపూర్మెట్: ఓ వృద్ధురాలు హత్యకు గురికాగా, ఆమెకు మద్యం తాగించి లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో భర్త తోపాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తారామతిపేటకు చెందిన ఇరగదిండ్ల ఆండాలు (58), ఆమె భర్త ఈదయ్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమారుడు మల్లేశ్ హయత్నగర్లో ఉంటూ అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేవాడు. కాగా మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణ.. మల్లేశ్కు ఫోన్ చేసి మీ అమ్మ ఇంట్లో చనిపోయి ఉందని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని సమాచారమిచ్చాడు. మల్లేశ్ ఇంటికి వచ్చి చూడగా ఆండాలు విగతజీవిగా పడి ఉంది. ఆమె చేతిపై, భుజాలు, మెడపై కమిలిపోయి బలమైన గాయాలు ఉన్నాయి. చదవండి: కుక్క చేసిన పని.. రెండు కుటుంబాల మధ్య గలాటా తన తల్లి హత్యపై తండ్రి ఈదయ్య, అదే గ్రామానికి చెందిన బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్లపై అనుమానం ఉందని మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ స్వామి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, మృతురాలు ఆండాలుకు ఈదయ్య మూడో భర్త అని స్థానికులు తెలిపారు. అత్యాచారం చేసి ఆపై హత్య చేశారా? ఆండాలుతో పాటు ఆమె భర్త ఈదయ్య, బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్ సోమవారం రాత్రి మద్యం సేవించారని స్థానికుల ద్వారా తెలిసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్, సురేశ్ ఆండాలుపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్ర«థమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులకు ఈదయ్య సహకరించాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆండాలు హత్య కేసులో అనుమానితులు ఈదయ్య, శ్రీకాంత్, సురేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అండాలును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
తన కాపురంలో చిచ్చు పెడుతోందని చెల్లెలి భర్తే..
పహాడీషరీఫ్: వదిన తన కాపురంలో చిచ్చు పెడుతోందంటూ అనుమానించి ఆమె కుమారుడిని హత్య చేశాడో కిరాతకుడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సి.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన సినీ ఆర్టిస్ట్ మహేశ్వరి, రాజు దంపతులకు శ్రీతనా, తేజస్వీ కుమార్తెలు ఉన్నారు. భర్త రాజు చనిపోవడంతో మహేశ్వరి.. వినోద్కుమార్రెడ్డిని రెండో వివాహం చేసుకుంది. వీరికి లక్ష్మీనర్సింహ అలియాస్ లక్ష్మి (4) సంతానం. ఇదిలా ఉండగా మహేశ్వరి చెల్లెలు లక్ష్మీ తన భర్త వీరేశ్తో గొడవపడి శ్రీరాం కాలనీలోని తల్లిగారింటి వద్దే ఉంటోంది. బొల్లారంలో నివాసం ఉండే వీరేశ్.. భార్యను తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తన భార్య కాపురానికి రాకుండా మహేశ్వరి లేనిపోని మాటలు నేర్పుతోందంటూ ఆమెపై వీరేశ్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరి ఇంటికి వచ్చాడు. లక్కీని శ్రీరాం కాలనీలోని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత లక్కీ ఇంటికి వచ్చాడా అని మహేశ్వరి తల్లిగారింటికి ఫోన్ చేసి ఆరా తీయగా రాలేదని తెలిసింది. వీరేశ్కు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానంతో వెంటనే మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేశారు. డయల్ 100కు ఫోన్తో వెలుగులోకి.. శ్రీరాం కాలనీ ఇందిరాగాంధీ సొసైటీ ప్రాంతంలోని డంపింగ్ యార్డు సమీపంలో ఓ పాడుబడిన గది వద్ద బాలుడి మృతదేహం ఉండటాన్ని గమనించిన పారిశుధ్య కార్మికులు డయల్ 100కు కాల్ చేశారు. పోలీసులు పరిశీలించగా బాలుడి మెడ చుట్టూ వైరు చుట్టి నులమడంతో పాటు తలను బండకేసి బాది హత్య చేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
డబ్ల్యూడీసీడబ్ల్యూ, రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్(డబ్ల్యూడీసీడబ్ల్యూ).. రంగారెడ్డి జిల్లా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 27 ► పోస్టుల వివరాలు: లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్–01, అవుట్రీచ్ వర్కర్(మేల్)–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–02, సా మేనేజర్–01, సోషల్ వర్కర్–01, ఆయా –17, చౌకీదార్–03, ఏఎన్ఎం–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, పీజీ డిగ్రీ(ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం) ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వేతనం: నెలకు రూ.6000 నుంచి రూ.21000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: జిల్లా సంక్షేమ అధికారి, రంగారెడ్డి జిల్లా, వెంగళరావు నగర్–500038. ► దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021 ► వెబ్సైట్: https://wdcw.tg.nic.in -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: వాతావరణ మార్పుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ‘క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్’ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడారు. కాప్–26 సదస్సు నిరాశ పరిచిందని, పర్యావరణవాదుల ఆశలను నీరుగార్చిందని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ పాలసీ నిపుణుడు దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో రసాయన ఎరువులను వాడటం వల్ల, భూమిలో కర్బన శాతం పెరిగి, ఆహార పంటల్లో పోషక విలువలు తగ్గుతున్నాయని చెప్పారు. దీంతో మనిషి జీవన ప్రమాణ రేటు తక్కువగా ఉంటుందన్నారు. తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలపై రైతులు దృష్టి సారించాలని, వర్షాధార పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల జీవనశైలి, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. గ్లాస్గో నగరంలో నిర్వహిస్తున్న కాప్–26 సదస్సులో చర్చించిన అంశాలను, క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకుపోవాలనే లక్ష్యంతో స్థానిక ఎర్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీజీఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతీఒక్కరు కనీసం ఐదు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయిభాస్కర్రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, ధర్మసేవ ట్రస్ట్ చైర్మన్ నిశాంత్రెడ్డి, మదన్మోహన్రెడ్డి, ఉపేందర్రెడ్డి, వికాస్, నాగరాజు, అర్చన, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, సిటీ కాలేజీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా..
షాద్నగర్: ఆర్టీసీ బస్సు తమ వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో చోటు చేసుకుంది. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి షాద్నగర్ మీదుగా వనపర్తికి వెళ్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వాహనంలోని వ్యక్తులు బస్సును ఓవర్ టేక్ చేసి బెంగళూరు హైవేపై మధ్యలో నిలిపేశారు. కొందరు వ్యక్తులు వాహనంలోనుంచి దిగి ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా.. అంటూ ఊగిపోయారు. బస్సు దిగి కిందికి రావాలంటూ బూతు మాటలతో విరుచుకుపడి కర్రతో డ్రైవర్పై దాడికి యత్నించారు. దీంతో వాహనాలు కొద్ది సేపు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటున్న వ్యక్తులు జాతీయ రహదారిపై హల్చల్ చేస్తున్న దృశ్యాలను అటువైపు నుంచి వెళ్తున్న ప్రయాణికులు చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులని సమాచారం. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. పక్కా ప్లాన్తో
సాక్షి, పూడూరు (రంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను చంపేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన శేఖర్, మాధవి వివాహేతర సంబంధం నెరుపుతున్నారు. చదవండి: (మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు...) ఈవిషయమై వెంకటయ్య పలుమార్లు భార్య మాధవిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగానే అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్ పథకం పన్నారు. ఈక్రమంలో మాధవి ప్రియుడితో కలిసి గురువారం రాత్రి గ్రామానికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి పత్తి పంటలో వెంకటయ్యను చంపేశారు. వెంకటయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. చదవండి: (టిక్టాక్ భార్గవ్కు మళ్లీ రిమాండ్) -
ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో
మహేశ్వరం: కాబోయే భార్య అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్కు పాల్పడి ఆమె ఆత్మహత్యకు కారకుడైన కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవాడు. కార్తీక్కు మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో ఏడాది కిందట వివాహం నిశ్చయమైంది. అప్పటి నుంచి రామ్ కార్తీక్ ఆస్ట్రేలియా నుంచి నిత్యం ప్రగతితో వీడియో కాల్స్, వాట్సాప్ ద్వారా మాట్లాడేవాడు. ఈ సందర్భంగా ఫోన్లో ప్రగతి నగ్న వీడియోలు, ఫొటోలను రికార్డు చేశాడు. ఆరు నెలల కిందట కార్తీక్ స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక కూడా ప్రగతితో చనువుగా తిరిగాడు. కొంతకాలం తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టిన కార్తీక్.. పెళ్లికి బంగారం, నగదుతో పాటు ప్లాట్, భూమి ఇవ్వాలని ప్రగతి, ఆమె తల్లిపై పలుమార్లు ఒత్తిడి తెచ్చాడు. తాను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నానని.. వేరే సంబంధమైతే ఇంతకన్నా అధిక కట్నం ఇచ్చేవారని, తాను అడిగినన్ని కట్నకానుకలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ప్రగతి అశ్లీల వీడియోలు, ఫొటోలను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. చదవండి: (‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా') ఇదిలా ఉండగా అక్టోబర్ 21న నిశ్చితార్థం ఉండగా, 17వ తేదీన పెద్దల మధ్య కట్నకానుల విషయంలో గొడవ జరగడంతో సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కార్తీక్ తన ఫొటోలు, వీడియోలు బయటపెడితే జీవితం నాశనం అవుతుందని భావించిన ప్రగతి అక్టోబర్ 18న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ప్రగతి, రామ్ కార్తీక్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించగా ఫొటోలు, వీడియోలు, కార్తీక్ బ్లాక్మెయిల్ విషయం వెలుగు చూసింది. ప్రగతి ఆత్మహత్యకు రామ్ బ్లాక్ మెయిల్ కారణమని నిర్ధారించిన పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
కేసీఆర్ది దొంగల పాలన
యాచారం/చింతపల్లి: తెలంగాణలో కేసీఆర్ పాలన దొంగల పాలనగా తయారైందని.. అధికారంలోకి రావడం కోసం అనేక హామీలిచ్చి తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్ గ్రామాల మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల సరిహద్దులో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాజన్న రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. కేసీఆర్ ఏడేళ్ల పాలన నియంత పాలనగా మారిందన్నారు. 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి, మహిళలకు వడ్డీలేని రుణాలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యమకారుడని కేసీఆర్కు అధికారం ఇస్తే నీళ్లు ఫాంహౌస్కు, నిధులు కేసీఆర్ ఇంటికి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని దుయ్యబట్టారు. వేల కోట్ల కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో షర్మిల పాదయాత్ర 12 రోజులు సాగింది. రాజన్న బిడ్డగా ఆశీర్వదించండి.. రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, రాజన్న బిడ్డగా తనను ఆశీర్వదించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కోరారు. ఆమె చేపట్టిన పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వరనగర్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అధికారం ఇస్తే రాజన్న పాలనను అందిస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, సురేశ్రెడ్డి, సత్యవతి పాల్గొన్నారు. -
కేసీఆర్ ఉప ఎన్నికల ముఖ్యమంత్రి
శంషాబాద్: ‘కేసీఆర్ తెలంగాణకు సీఎంలా పనిచేస్తలేడు.. ఉప ఎన్నికల ప్రాంతాలకు మాత్రమే సీఎంగా పనిచేస్తుండు. దళితబంధు హుజూరాబాద్లోనే ఎందుకు పెట్టారు? ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు?’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నిం చారు. ఎన్నికల కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆ తర్వాత వాటిని నిలిపేయడం కేసీఆర్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. మూడోరోజు పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల శంషాబాద్లోని రాళ్లగూడదొడ్డి, ఇంద్రానగర్, మధురానగర్ కాలనీల మీదుగా పాదయాత్ర చేశారు. అనంతరం శంషాబాద్లోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ‘నా పాదయాత్రపై విమర్శలు చేసిన కేటీఆర్ రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగిస్తాను. సమస్యలుంటే మీరు రాజీనామాలు చేస్తారా?’అని సవాల్ విసిరారు. మహానేత వైఎస్సార్ది సుపరిపాలన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన చేసి చూపెట్టారన్నారు. ఐదేళ్లలో పన్నులు పెంచకుండా రాష్ట్ర ప్రజలకు మంచి చేసి మార్గదర్శకులుగా నిలిచారని షర్మిల అన్నారు. మళ్లీ అలాంటి పరిపాలన రావాలంటే ప్రజలు చైతన్యవం తులై టీఆర్ఎస్ గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు వేసినట్లేనన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం పాదయాత్ర గొల్లపల్లి మీదుగా పోశెట్టిగూడ వరకు చేరుకుంది. కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, ఏపూర్తి సోమన్న, శంషాబాద్ నేతలు అక్రమ్ఖాన్ ఉన్నారు. జనాన్ని పలకరిస్తూ ముందుకు.. శంషాబాద్ రూరల్: షర్మిల చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’పాద యాత్ర శుక్రవారం మూడో రోజు మండలంలోని కాచారం నుంచి ప్రారంభమైంది. సుల్తాన్పల్లి చౌరస్తా, నర్కూడ, రాళ్లగూడ మీదుగా సాయంత్రం శంషాబాద్కుS చేరుకుంది. దాదాపు 10 కి.మీటర్ల దూరం వరకు సాగిన యాత్రలో దారి పొడవునా జనాన్ని పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. -
రంగారెడ్డి జిల్లాలో మూడోరోజు వైఎస్ షర్మిల పాదయాత్ర
-
రాష్ట్రంలో జ్వరపీడితులు 13 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఊరూ, వాడా అనే తేడా లేకుం డా జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ ఇంట చూసినా ఒక్కరన్నా ఏదోరకమైన జ్వరంతో మంచంపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జ్వర లక్షణాలున్నవారు లక్షల్లో ఉన్నారు. రోజురోజుకూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాలపై వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న సర్వేలో అనేక కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో గతనెల నుంచి ఇప్పటివరకు అంటే ఆరువారాల్లో 1.62 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు సర్వేలో నిర్ధారణ అయింది. ఇవిగాక జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు వచ్చేవారిని కలుపుకుంటే 2 లక్షల జ్వరం కేసులు ఉండొచ్చని అంచనా. అత్యధి కంగా హైదరాబాద్లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేల మంది జ్వరాల బారినపడినట్లు అంచనా. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా 13 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కరోనాతో జ్వరాలు నమోదు కాగా, జూలై నుంచి అటు కరోనా, ఇటు వైరల్ జ్వరాలు నమోదవుతున్నాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా, డెంగీ, చికున్గున్యా, టైఫాయిడ్, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఐదు వేల డెంగీ కేసులు...? రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నా యి. ఈ ఏడాది నమోదైన డెంగీ కేసుల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ల్లోనే అత్యధికం. 2020లో 2,173 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 8నాటికి 4,714 కేసులు న్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ తర్వాత నమోదైన వాటిని కలుపుకుంటే దాదాపు ఐదువేల డెంగీ కేసులు ఉంటాయని అంచనా. అత్యధికంగా హైదరాబాద్లో 1,188 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 8 వరకు 632 మలే రియా కేసులు నమోదయ్యాయి. 2019లో 1,168... 2020లో 664 నమోదయ్యాయి. బయటకు రానివి ఇంతకుమించి ఉంటాయని వైద్యనిపుణులు అంటు న్నారు. మరోవైపు పలు ఆసుపత్రులు డెంగీ బాధి తులను ఫీజుల రూపేణా పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఇవీ కారణాలు... రాష్ట్రంలో పలు చోట్ల పారిశుధ్య నిర్వహణ సరిగా లేక దోమలు విజృంభిస్తున్నాయి. పగటిపూట కుట్టే దోమలతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. మలే రియా కేసులూ వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ దోమలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. డెంగీ, మలేరియా కేసులు మరింతగా నమోదయ్యే అవకాశాలున్నాయి. నిర్లక్ష్యం తగదు.. ప్రస్తుతం గొంతునొప్పి, జ్వరంతో అనేకమంది ఆసుపత్రులకు వస్తున్నారు. గతంలో డెంగీ, కరోనా కేసులు అధికంగా రాగా, ఇప్పుడు డెంగీ కేసులే ఎక్కువ ఉంటున్నాయి. డెంగీకి, కరోనా లక్షణాలకు మధ్య తేడాను గుర్తించవచ్చు. డెంగీలో 102–103 జ్వరం కూడా ఉంటుంది. పారాసిటమాల్ మాత్ర వేసినా అది తగ్గదు. కరోనాలో మాత్ర వేశాక తగ్గుముఖం పడుతుంది. 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినప్పుడు మాత్రం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. అప్పుడు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. -
తెలంగాణలో దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యం గా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి కుండపోత కురవగా.. ఉమ్మడి మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోనే వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షంతో హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. చెరువులు, నాలాలు పొంగిపొర్లడంతో పలు కాలనీలు, రహదారులు జలమయం అయ్యాయి. పలుచోట్ల రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే దసరా సెలవులతో ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. శనివారం సాయంత్రం 4గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో అత్యధికంగా 10.05 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్లో 9.83, హైదరాబాద్ జిల్లా అంబర్పేట్లో 9.65, సూర్యాపేట జిల్లా నాగారంలో 9.53 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నేడూ వానలు: బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనితో ఆదివారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలూ పడొచ్చని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వాన.. హైరానా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా కురిసిన వాన రైతులను పరుగులు పెట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలాల్లో ధాన్యం తడిసి పోయింది. వాన నీటిని తొలగించి, ధాన్యం ఎత్తేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. బోధన్, మోర్తాడ్, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి తదితర మండలాల్లో వరి పంట నేలకొరిగింది. జడ్చర్లలో నాలాలో పడి యువకుడి మృతి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం కుండపోత వానతో పలు కాలనీలు నీటమునిగాయి. వంట సామగ్రి, నిత్యవసర సరుకులు, ఇతర వస్తువులు తడిపోవడంతో జనం ఆందోళనలో మునిగిపోయారు. సిగ్నల్గడ్డ–నేతాజీ రోడ్డు జలమయమై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాల్మీకినగర్కు చెందిన రాఘవేందర్ (35) అనే వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి చనిపోయాడు. అచ్చంపేట, నాగర్కర్నూల్లో సైతం భారీ వర్షం కురిసింది. -
ఆ ప్లాట్ల వేలం ఆపండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని భూముల వేలంపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పుప్పాలగూడలోని 11.02 ఎకరాల భూమిపై హక్కులు లేకపోయినా.. సంరక్షకుడిగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాందిశీకుల భూములను వేలం వేయడాన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆ భూమిని వేలం వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ భూమిలో ఉన్న ప్లాట్ నంబర్లు 25 నుంచి 30 వరకు వేలం వేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సర్వే నంబర్ల జిమ్మిక్కులతో పిటిషనర్లను వేధింపులకు గురిచేయడం సరికాదని, పిటిషనర్లకు చెందిన భూమిని వేలం వేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. పుప్పాలగూడ సర్వే నంబర్ 301లోని 11.02 ఎకరాల భూమిని 2006, జూలై 31న తాము కొనుగోలు చేశామని, అయినా హెచ్ఎండీఏ ఆ భూముల్ని వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందంటూ లక్ష్మీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ తరఫున సి.నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. కాందిశీకుల చట్టం కింద నవలాల్మాల్ ప్రజ్వానీ అనే కాందిశీకునికి ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు రాష్ట్రపతి 1950లో ఉత్తర్వులు జారీచేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ప్రజ్వానీ వారసుల నుంచి పిటిషనర్లు భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. 42 ఎకరాల వేలానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయినా నిబంధనలకు విరుద్ధంగా 99 ఎకరాలకు నోటిఫికేషన్ జారీచేశారని మరో న్యాయవాది నివేదించారు. పిటిషనర్ల భూములు సర్వే నంబర్ 302లో ఉన్నాయని, వేలం వేస్తున్న భూములపై పిటిషనర్లకు ఎటువంటి హక్కులు లేవని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరీందర్ పరిషద్ వాదనలు వినిపించారు. ఒకే ప్లాట్ రెండు సర్వే నంబర్లలో ఉన్నట్లుగా పేర్కొన్నారని, ఇదేలా సాధ్యమని ధర్మాసనం హరీందర్ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఔటర్పై కారు దగ్ధం ఒకరు సజీవ దహనం
శంషాబాద్ రూరల్: రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న హోండా అమేజ్ (ఏపీ27–సీ0206) కారు నానక్రాంగూడ టోల్గేటు వద్ద రాత్రి 7.09 గంటలకు ప్రవే శించింది. అక్కడి నుంచి శంషాబాద్ మీదుగా పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే కారులో మంటలు చెలరేగాయి. కారు నడుపుతున్న వ్యక్తి కారును రోడ్డు పక్కకు పార్కు చేసేలోపే మంటలు పూర్తిగా వ్యాపించడంతో సజీవ దహనం అయ్యాడు. ఘటన సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియరాలే దు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వ్యవసాయ బావి
చేవెళ్ల: మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో ఆదివారం చోటు చేసుకుంది. రామన్నగూడ గ్రామానికి చెందిన నడిమొళ్ల శ్రీనివాస్, లత దంపతులకు ఒక కూతురు, మూడేళ్ల కుమారుడు హర్షిత్ ఉన్నారు. ఎప్పటిలాగే ఆదివారం మధ్యాహ్నం హర్షిత్ ఆడుకునేందుకు వెళ్లాడు. ఇంటి వెనుకే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. పొలానికి వెళ్లే రోడ్డుకు సమీపంలో వ్యవసాయ బావి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో బావి పూర్తిగా నిండింది. ఆడుకుంటానని వెళ్లిన బాలుడు ఎం తకీ ఇంట్లోకి రాకపోవడంతో ఆందోళన చెం దిన తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి వ్యవసాయ బావిలో వెతికా రు. అప్పటివరకు కళ్ల ముందే ఆడు కుంటున్న కుమారుడు బావిలో శవ మై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. -
చున్నీ బిగించి చంపి.. లోయలో తోసి..
మన్ననూర్/షాబాద్: ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసిన సంఘటన నల్లమలలో ఆలస్యంగా వెలుగు చూసింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేశగూడెంకు చెందిన మాణిక్యరావు(35), శోభారాణికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా యాదయ్యతో శోభారాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలసి ఆమె పక్కా ప్లాన్ వేసింది. ఆరోగ్యం బాగా లేదని ఈ నెల 13న భర్తతో కలసి షాద్నగర్ ఆస్పత్రికి వచ్చింది. ఆ తర్వాత మామిడిపల్లిలో కల్లు తాగి.. అటవీ ప్రాంతంగా ఉన్న షాబాద్ మండలం తుమ్మన్గూడ గ్రామం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే యాదయ్యకు ఫోన్ చేయడంతో అటవీ ప్రాంతం మార్గమధ్యలోకి వచ్చాడు. ఇద్దరూ కలసి మాణిక్యరావును కుమ్మరిగూడ ప్రాంత చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి చున్నీని మెడకు బిగించి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే అటవీప్రాంతంలో ఉంచి వచ్చారు. 14వ తేదీ తెల్లవారుజామున ఓ కారును అద్దెకు తీసుకుని మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టి కారు డిక్కీలో వేసుకున్నారు. వీరికి యాదయ్య స్నేహితులు శ్రీశైలం, వినోద్ సహకరించారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలోని ఓ మూలమలుపు వద్ద రోడ్డుపై నుంచి మృతదేహాన్ని లోయలోకి విసిరేశారు. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని ఈ నెల 24న బంధువులతో కలసి ఆమె షాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భార్య శోభారాణి, ఆమె ప్రియుడి యాదయ్యపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. వీరికి సహకరించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రెండు వారాల క్రితం హత్య జరగడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే ఉన్నాయి. దీంతో అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించారు. -
పట్టాదారు పేరు తహసీల్దార్ ఆఫీసు.. తండ్రి పేరు కొందుర్గు
కొందుర్గు: సాధారణంగా వ్యవసాయ భూములకు పట్టాదార్లుగా రైతులు ఉంటారు. వారి పేర్లపై ఎంత భూమి ఉంది, ఖాతా నంబరు, తండ్రి పేరు వంటి వివరాలను రికార్డుల్లో పొందుపరుస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా జిల్లేడ్చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామంలో రెవెన్యూ రికార్డులు విచిత్రంగా ఉన్నాయి. ధరణి పోర్టల్లో పెద్దఎల్కిచర్ల లోని సర్వేనంబర్ 32/ఉ2లో 1–14 ఎకరాల భూమి తహసీల్దార్ ఆఫీసు పేరుపైన ఉంది. పట్టాదారు పేరు నమోదు చేయాల్సిన స్థానంలో తహసీల్దార్ ఆఫీసు అని ఉంది. తండ్రిపేరు స్థానంలో కొందుర్గు అని నమోదు చేశారు. ఇక ఈ భూమికి ఫ్యాన్సీ ఖాతా నంబర్ 2222 ఇచ్చారు. దీంతో అధికారుల పనితీరుపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
నేడే ‘దళిత, గిరిజన దండోరా మహాసభ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత, గిరిజన దండోరా మహాసభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. ఇప్పటికే మహేశ్వరం మండలం రావిర్యాలలో భారీ సెట్టింగ్లతో సభావేదికను ఏర్పాటు చేశాయి. ఆ మేరకు జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి చాటేందుకు ఆయా విభాగాల ఇన్చార్జీలు సర్వశక్తులొడ్డుతున్నారు. మండలాల వారీగా ఇన్చార్జీల ను నియమించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. సభాస్థలి వద్ద మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ముఖ్యమైన నేతలు కూర్చొనే విధంగా, రెండో వేదికపై మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులకు కేటాయించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం ప్రధాన మార్గం సహా దాని చుట్టూ సోనియా, రాహుల్గాంధీ, రేవంత్రెడ్డిల భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభాస్థలికి చేరుకునే మార్గాల్లో కటౌట్లతోపాటు పార్టీ జెండాలను నెలకొల్పారు. మహాసభను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కోరారు. టీఆర్ఎస్ ఏడున్నరేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకే సభను నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. నిజానికి, ఇబ్రహీంపట్నంలో సభను నిర్వహించనున్నట్లు రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించడం, దీనిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభ్యంతరం చెప్పడంతో సభాస్థలిని రావిర్యాలకు మార్చిన విషయం తెలిసిందే. ఈ దండోరాకు భారీగా నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో వారి వాహనాలను సభాస్థలికి కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: సీఐ దంపతుల దుర్మరణం
సాక్షి, అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ, ఆయన భార్య మృతి చెందారు. నగరంలోని సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుందరి లక్ష్మణ్ (39) కొత్తపేటలో నివాసముంటున్నారు. లక్ష్మణ్ రెండు రోజులక్రితం తన భార్య ఝాన్సీ(34), కుమారుడు సాహస, కూతురు ఆకాంక్షతో కలసి సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలోని ఝాన్సీ పుట్టింటికి వెళ్లారు. కూతురు ఆకాంక్షను ఝాన్సీ తల్లిదండ్రుల వద్ద వదిలి శుక్రవారం రాత్రి తమ స్విఫ్ట్ కారులో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. కారును ఝాన్సీ నడుపుతుండగా లక్ష్మణ్ ముందు సీటులో, కుమారుడు సాహస వెనక సీటులో కూర్చున్నారు. అర్ధరాత్రి వీరు ప్రయాణిస్తున్న కారు అబ్దుల్లాపూర్మెట్ శివారులోని ఇనాంగూడ గేట్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన లక్ష్మణ్, ఝాన్సీ కారులోనే మృతిచెందగా, సాహసకు స్వల్పగాయాలయ్యాయి. ‘మా అమ్మనాన్నలను కాపాడండి’ అంటూ సాహస ఏడుస్తూ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపే ప్రయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలిచారు. చదవండి: (దారుణం: పెళ్లికి నిరాకరించిందని..) -
పెళ్లయిన రెండు నెలలకే అనంతలోకాలకు..
మంచాల: బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో నవ దంపతులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని బోడకొండ గ్రామానికి చెందిన జాటోత్ లక్ష్మణ్ (28)కు అదే మండలం దాద్పల్లి తండాకు చెందిన శైలజ(21)తో జనవరి 9న వివాహం జరిగింది. గురువారం మహా శివరాత్రి సందర్భంగా గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారు. అనంతరం బంధువుల పిలుపు మేరకు యాదాద్రి జిల్లా, కడీలబాయి తండా సమీంలోని హజ్రత్ గాలిబ్ షాహిద్ పీర్ దర్గా ఉర్సుకు బయలుదేరారు. జాపాల సమీపంలోని పోచమ్మ ఆలయ ప్రాంతం వద్ద ఉన్న మలుపులో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటలో లక్ష్మణ్, శైలజ తలలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై సురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హెల్మెట్ లేనందునే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతుల తలకు హెల్మెట్ లేనందునే ప్రాణాలు కోల్పోయారని మంచాల ఎస్సై సురేష్ అన్నారు. వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. చదవండి: కారుతో ఢీకొట్టి.. ఆపై గొంతు కోసి టీచర్ హత్య దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య -
బ్యుటిషియన్ ఆత్మహత్య
-
బ్యుటిషియన్ ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆకతాయి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన గదిలో సీలింగ్కు ఉరివేసుకుని తనువు చాలించింది. వివరాలు.. లక్ష్మిగూడకు చెందిన లీజ(19)ను అష్రాష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా అతడిని మందలించారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. అష్రాఫ్ ప్రవర్తనతో విరక్తి చెందిన లీజ తీవ్ర నిర్ణయం తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందింది. కాగా పోస్ట్మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా అష్రాఫ్ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. తను చనిపోయిన తర్వాత కూడా సుమారు ఫోన్లో సుమారు 35 మిస్డ్ కాల్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిని బట్టి అష్రాఫ్ లీజను ఎంతగా వేధిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చని, అతడికి కొంతమంది బడా నాయకులు అండదండలు ఉన్నందువల్లే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
‘రేట్లు’ పెంచేశారు.. అంతా వారి ఇష్టారాజ్యమే..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కె.శ్రీను స్థానికంగా ఓ వెంచర్లో 160 గజాల ఓ ప్లాటు కొనుగోలు చేశాడు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్లాటు విలువ రూ.1.20 లక్షలు. ఈ ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల రూపంలో రూ.8,100 చెల్లించాడు. అయితే ఈ ప్లాటు రిజిస్ట్రేషన్ చేయించినందుకు మధ్యవర్తికి చెల్లించిన ఫీజు రూ.6,500. డాక్యుమెంట్ ప్రిపరేషన్తో పాటు త్వరగా పని పూర్తి చేయించినందుకు ఈ మొత్తం చెల్లించినట్లు శ్రీను చెబుతున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్కు చెందిన సి.రమేశ్ మండల పరిధిలో 150 చదరపు గజాల ఖాళీ స్థలం కొనుగోలు చేశాడు. రెండ్రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కార్యాలయం సమీపంలోని మధ్యవర్తిని సంప్రదించాడు. నిబంధనల ప్రకారం సదరు ప్లాటుకు స్టాంపు డ్యూటీతో పాటు ఇతర ఫీజుల కోసం రూ. 10,200 చెల్లించాడు. డాక్యుమెంట్ ప్రిపరేషన్ తదితర ప్రక్రియల కోసం రూ.5 వేలు మీడియేటర్కు చెల్లించడంతో రిజి్రస్టేషన్ కార్యాలయంలో అరగంటలో ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించిన ఫీజులో దాదాపు సగభాగం మీడియేటర్కు చెల్లించుకోవాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర (నాన్ అగ్రికల్చర్) ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మధ్యవర్తులు దోచుకుంటున్నారు. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కూడా ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించాలనుకున్నా... ఆధార్, ఇతర సమాచార సేకరణకు హైకోర్టు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజి్రస్టేషన్కు పాత విధానాన్నే కొనసాగిస్తోంది. దీంతో గత నాలుగు నెలలుగా నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు జోష్ వచ్చింది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటున్న మధ్యవర్తులు... ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్పైనా పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పాత విధానం రిజిస్ట్రేషన్లలో డాక్యుమెంట్ తయారీ మొదలు.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫైల్ మూవ్మెంట్, డాటా ఎంట్రీ, ఫొటో క్యాప్చర్, సంతకాల ప్రక్రియ వరకు అంతా మధ్యవర్తుల కనుసన్నల్లోనే నడుస్తుండడంతో అమ్మకం, కొనుగోలుదారులు నేరుగా కార్యాలయంలో సంప్రదించే పరిస్థితి లేకుండా పోయింది. (చదవండి: ఓటీపీ చెబితేనే రేషన్) ‘రేట్లు’పెంచేశారు... పాత రిజిస్ట్రేషన్ విధానంలో డాక్యుమెంట్ ప్రిపరేషన్ ప్రక్రియ అమ్మకం, కొనుగోలుదారుకు కాస్త ఇబ్బందే. ఈ క్రమంలో కార్యాలయం సమీపంలో ఉన్న మధ్యవర్తులను (డాక్యుమెంట్ రైటర్లను) ఆశ్రయించక తప్పదు. దాంతో ప్రభుత్వానికి చెల్లించే వివిధ రకాల డ్యూటీల మొత్తానికి దాదాపు సమాన ఫీజును మీడియేటర్లు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు రిజి్రస్టేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి రూ.5 వేలు ఫీజు చెల్లిస్తే... మధ్యవర్తికి కూడా రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోంది. స్టాంపు డ్యూటీ రూ.10 వేలు ఉంటే... మీడియేటర్కు రూ.6,500 చొప్పున లేదా వారు చెప్పినంత చెల్లించాల్సిందే. ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో ఉన్న మీడియేటర్లంతా ఉమ్మడిగా ధరలు నిర్ధారించి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వసూళ్ల ప్రక్రియ ఏళ్లుగా ఉన్నప్పటికీ... ప్రభుత్వం తాజాగా వ్యవసాయేతర ఆస్తులకు ధరణి పోర్టల్లో రిజి్రస్టేషన్ల విధానాన్ని నిలిపివేసి పాత పద్ధతికి గ్రీన్ సిగ్నల్ ఇచి్చనప్పటి నుంచి వసూళ్ల తీరు మారింది. ఇదివరకు రూ.2 వేలు తీసుకునే మీడియేటర్... ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నాడు. అన్నిచోట్లా ఇదేరకమైన దోపిడీ కనిపిస్తోంది. గత నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో నష్టపోయిన మీడియేటర్లు... ఇప్పుడు ఈ రకంగా ‘రేట్లు’ పెంచేసి ఆదాయాన్ని భర్తీ చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. జాడలేని నిఘా... రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పని జరగదనే విషయం తెలిసిందే. అయితే ఈ మీడియేటర్ల ఆగడాలను పట్టించుకునే వారే లేరు. మీడియేటర్ల వసూళ్లకు చెక్పెట్టని ఎస్ఆర్ఓ అధికారులు... మరింత ప్రోత్సహిస్తుండడంతో తిరుగులేకుండా పోతోంది. ఎందుకంటే మధ్యవర్తుల వసూళ్లలోంచి... అధికారులకు ప్రతి డాక్యుమెంట్పై నిరీ్ణత మొత్తం ముడుతుందనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ధరణి పోర్టల్ రిజి్రస్టేషన్లలో మధ్యవర్తుల ప్రమేయం దాదాపు లేదు. పోర్టల్ తెరిచి దరఖాస్తును పూరించి సబి్మట్ చేసి స్లాట్ తేదీని ఎంపిక చేసుకుంటే రిజి్రస్టేషన్ సులువుగా పూర్తయ్యేది. వ్యవసాయ భూముల రిజి్రస్టేషన్ అంతా ధరణి ద్వారా జరుగుతుండడంతో అమ్మకం, కొనుగోలుదారులకు మధ్యవర్తుల బెడద తప్పింది. మా దృష్టికి రాలేదు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. లీగలైజ్డ్ డాక్యుమెంట్ రైటర్స్పై చర్యలు తీసుకునే అంశం మా పరిధిలో ఉంటుంది. కానీ ఇక్కడ లీగలైజ్డ్ రైటర్స్ లేరు. ఇది పూర్తిగా కార్యాలయం బయట జరిగే అంశం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అంశంపై సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తా. – మధుబాబు, సబ్ రిజిస్ట్రార్, ఇబ్రహీంపట్నం -
భార్య ఫుల్ సపోర్ట్తో భర్త చోరీలు
యాచారం: జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి తన భార్య సహకారంతో చోరీల బాటపట్టాడు. జైలుకు వెళ్లివచ్చినా అతడి తీరు మారలేదు. మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరు గుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా గుట్టురట్టయింది. శనివారం యాచారం ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ కేసు వివరాలను ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ లింగయ్యతో కలిసి వెల్లడించారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు కడ్తాల్ మండలం మైసిగండి తండాకు చెందిన సభావత్ పాండు, గుజ్రి దంపతులు కొంతకాలంగా నగరంలోని చంపాపేట్ మారుతీనగర్లో నివాసముంటున్నారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవరైన పాండు చోరీలను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలబాటపట్టాడు. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై చౌదర్పల్లి గేట్ వద్ద అతడు శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అతడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించి అతడి నుంచి రూ. 12.45 లక్షల విలువచేసే బంగారు, వెండి నగలతోపాటు రూ. 30 నగదు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. చోరీల చిట్టా ఇదీ.. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన పాండు 2001లో ఆమనగల్లులో రెండు చోరీలు, 2009లో వనస్థలిపురంలో రెండు చోరీలు, 2012లో మళ్లీ ఆమనగల్లులో రెండు చోరీలు, 2014లో యాచారం మండల కేంద్రంలో ఒక చోరీ, 2018లో మరోమారు, 2020లో కంచన్బాగ్, కందుకూరులో మరో రెండు చోరీలకు ప్పాడ్డాడు. పలు చోరీల్లో అరెస్టు అయి జైలుకు వెళ్లి వచ్చినా పాండు తీరు మారలేదు. భార్య పూర్తి సహకారం... జల్సాలకు అలవాటుపడిన పాండుకు చోరీల్లో అతని భార్య గుజ్రి పూర్తి సహకారం అందిస్తూ వచ్చింది. నగలను విక్రయించి ఆమె భర్తకు డబ్బు లు ఇచ్చేది. అదేవిధంగా కొట్టేసిన బంగారు నగలను కొనుగోలు చేస్తూ శాలిబండలోని శాంతిలాల్ జ్యువెలర్స్ యజమాని ఉత్తమచంద్ కోటరీ, చంపాపేట్లోలోని నంది జ్యువెలర్స్ యజమాని ప్రకాశ్చౌదరి కూడా పాండుకు సహకరించారని పోలీసుల విచా రణలో తెలిసింది. పాండును అరెస్టు చేసి శనివారం రిమాండ్కు పంపించగా.. చోరీలకు సహకరించిన అతడి భా ర్య గుజ్రితో పాటు వ్యాపారులు ఉత్తమచంద్ కోటరీ, ప్రకాశ్చౌదరిపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వీరు ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు డీసీపీ సన్ప్రీత్సింగ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు. -
రంగారెడ్డి జిల్లా: ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో చోరీ యత్నం
-
బీజేపీ: ఆపరేషన్ ఆకర్ష్..
సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలపై కాషాయదళం దృష్టి సారించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్కు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఈ సీనియర్ నేత.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కమల తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందు కూడా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నెగ్గడంతోపాటు తాజాగా రెండు రోజుల క్రితం వెలువడిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయంగా స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఊపుమీదున్న బీజేపీలో ఆయన చేరిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీకి చెందిన పలువురు నాయకులు.. చంద్రశేఖర్తో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. బీజేపీలో చేరికకు ఆయన సుముఖంగా ఉన్నప్పటికీ.. కొంత సమయం కావాలని కాషాయదళ నేతలను కోరినట్లు వార్తలు వినిపించాయి. తన అనుయాయులు, పార్టీ శ్రేణులు, సన్నిహితులతో చర్చించి వారి అభీష్టాన్ని తెలుకుంటానని చెప్పినట్లు సమాచారం. మూడు నాలుగు రోజుల్లో మాజీ మంత్రి చేరికపై స్పష్టత వస్తుందని కమల నేతలు చెబుతున్నారు. ఎలాగైనా పార్టీలో చేరతారన్న ధీమాతో వారు ఉన్నారు. ఈయన రాకతో వికారాబాద్లో బీజేపీ మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్కు కష్టకాలమే.. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతగిలిన కాంగ్రెస్ను.. సీనియర్ నేతల వలసలు మరింత ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ పార్టీ జిల్లాను శాసించిన స్థాయి నుంచి.. ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నాయకత్వ లేమి, అధిష్టానానికి నాయకులకు మధ్య సమన్వయం కొరవడటం తదితర కారణాల వల్ల హస్తం చతికిల పడుతూ వస్తోంది. ఈ వైఫల్యాల వల్లే నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే తరహాలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కమలం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న చంద్రశేఖర్కు సీఎం కేసీఆర్ సన్నిహితుడనే పేరుంది. అయితే గులాబీ పార్టీలో ఇమడలేకపోయిన ఆయన కాంగ్రెస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడారు. ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి.. ఓటమిపాలైన చంద్రశేఖర్ తిరిగి హస్తం గూటికి చేరారు. సొంత నియోజకవర్గమైన వికారాబాద్ని కాదని పొరుగున ఉన్న చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. దీనిపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్థానిక నేతనైన తనను కాదని వికారాబాద్లో మాజీ మంత్రి ప్రసాద్కుమార్కు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోందని మథన పడ్డారు. ఈ పరిణామాలన్నీ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు మార్గం చూపుతున్నాయని తెలుస్తోంది. మొత్తంగా ఈ పార్టీకి భవిష్యత్ లేదన్న నిర్ణయానికి వచ్చిన ఈయన ప్రత్యామ్నాయంగా కమలం చెంతకు చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పక్కా వ్యూహంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరి నేతలపై దృష్టి సారించిన కమలనాథులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీల్లో పదవులు అలంకరించిన మాజీలు, క్రియాశీలక నేతలతోపాటు టీఆర్ఎస్లో ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అధికార పార్టీలో అధికంగానే ఉంది. ఇటువంటి నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆశావహులతో టచ్లోకి వెళ్లాలని బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. మొత్తానికి వీలైనంత వేగిరంగా జిల్లాలో టీఆర్ఎస్కు దీటుగా కమలదళాన్ని సిద్ధం చేసి ఎన్నికలను ఎదుర్కోవాలన్నది బీజేపీ వ్యూహంగా చెప్పవచ్చు. -
రంగారెడ్డి: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం
-
లారీని ఢీకొన్న కారు, ఏడుగురు మృతి
సాక్షి, రంగారెడ్డి: మరికొద్ది సేపట్లో సోదరుని ఇంటికి చేరుకుంటున్నామన్న పాతబస్తీవాసుల సంతోషాన్ని విధి చిన్నచూపు చూసింది. బోర్వెల్ లారీ మృత్యువు రూపంలో వచ్చి వారి ఆనందాలను ఆవిరయ్యేలా చేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంతో పాతబస్తీ కాలాపత్తర్లోని మక్కా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కందవాడ బస్స్టేజీ సమీపంలో బోర్వెల్ లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. మిగతా వారిలో ఇద్దరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. హైదరాబాద్లోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన ఎండీ ఆసిఫ్ఖాన్(48), అతని భార్య పౌజియా(45) దంపతులు. నబియా బేగం సోదరి నజియా భాను (36) పక్షవాతానికి కర్ణాటక రాష్ట్రంలోని గుర్మట్కల్ వద్ద చికిత్సలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కర్ణాటకకు వెళ్లేందుకు పాతబస్తీ నుంచి ఇన్నోవా కారులో బయలుదేరారు. చేవెళ్ల మల్కాపూర్ వద్ద ఉండే సోదరుని ఇంటికి వెళ్లి... అక్కడి నుంచి వెళుదామని అనుకున్నారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) వీరితోపాటు ఆసిఫ్, నబియాల కూతురు మహేక్ సానియా(18), కుమారుడు ఆయాన్ఖాన్, ఆసిఫ్ తమ్ముడు అన్వర్ఖాన్, చెల్లెళ్లు ఆర్షియాబేగం(30), బావలు ఖాలీద్(50), తయాబ్ఖాన్, వీరి పిల్లలు ఆయేషా(5), నిసార్ (7) ఉన్నారు. ఉదయం 5 గంటల సమయంలో వీరు హైదరాబాద్లోని ఇంటి నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం చేవెళ్ల మండలంలోని కందవాడ బస్టేజీ సమీపంలోకి రాగానే.. మూలమలుపు వద్ద ఎదురుగా చేవెళ్ల వైపు నుంచి వస్తున్న బోర్వెల్ లారీని ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఉన్నవారు అందులోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. ఇన్నోవాలో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా.. వీరిలో ఐదేళ్ల ఆయేషాతోపాటు ఆసిఫ్, పౌజియా, మహేక్సానియా, నజియా, ఆర్షియా అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఖాలీద్ మరణించాడు. ప్రస్తుతం అయాన్ఖాన్, తయాబ్ఖాన్ చికిత్స పొందుతున్నారు. ఏడేళ్ల నిసార్, అన్వర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో మూడు కుటుంబాల్లో విషాదం అలముకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇన్నోవాలో చిక్కుకుపోయిన మృతదేహాలను తీసి ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. -
ప్రియుడి గదిలో బాలిక ఆత్మహత్య
అత్తాపూర్: పెళ్లి విషయంలో మాటామాటా పెరిగి ప్రేమికుడి గదిలో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. పాండురంగానగర్ ప్రాంతానికి చెందిన నర్సింహులు కుమార్తె (17) వికారాబాద్కు చెందిన శ్రీకాంత్తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. శ్రీకాంత్ హైదర్గూడలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కాగా తరచూ శ్రీకాంత్ దగ్గరకు వస్తుండే ప్రవీణ గురువారం కూడా అలాగే వచ్చింది. పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్ను కోరడంతో అతను కొంత సమయం కావాలన్నాడు. ఈ విషయంలో కాసేపు ఇద్దరు గొడవపడ్డారు. అనంతరం శ్రీకాంత్ బయటకు వెళ్లిన సమయంలో ప్రవీణ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం) కల్వర్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరికి తీవ్రగాయాలు బొంరాస్పేట: మద్యం మత్తులో బైక్నడుపుతూ కల్వర్టును ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వడిచర్లకు చెందిన వడ్ల విఠల్(40), మంగలి వేణు(30) సాయంత్రం కొడంగల్ నుంచి ద్విచక్రవాహనంపై గ్రామానికి తిరిగి వస్తుండగా రేగడిమైలారం శివారులోని బాపనోనిబావి సమీపంలోని కల్వర్టును ఢీకొట్టారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిలో విఠల్ పరిస్థితి విషమంగా ఉందని ఆయన్ను వెంటనే పరిగి ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్నందునే ప్రమాదం జరిగిందని ఎస్సై శ్రీశైలం తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం
కొడంగల్: ఓ తల్లి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. హృదయ విదారకంగా మారిన ఈ ఘటన కొమ్మూరు, ఏపూర్, హస్నాబాద్ గ్రామాల్లో విషాదం నింపింది. బంధువుల కథనం ప్రకారం .. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (28)ను నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్పతో పదేళ్ల కిందట వివాహం చేశారు. పెళ్లి నాటి నుంచి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వారు పలుమార్లు కోస్గి, హస్నాబాద్ తదితర గ్రామాలకు పని నిమిత్తం వచ్చేవారు. వారికి రజిత (8), అనిత (6), రాజు (4) ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తాయి. అత్తింట వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందింది. గురువారం రోజు కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. ఇంటి సమస్యలతో సతమతమైన ఆమెకు బతుకు భారంగా అనిపించింది. బతకడం ఇష్టం లేక కొమ్మూరు గ్రామం నుంచి కోస్గికి వచ్చి అక్కడి నుంచి హస్నాబాద్కు చేరుకుంది. హస్నాబాద్ గ్రామ శివారులో ఉన్న చెరువు దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్లింది. రజిత, రాజు చేతులను చున్నితో కట్టి చెరువులో తోసింది. (చదవండి: ఆన్లైన్ గేమ్.. అప్పులు తీర్చలేక యువకుడు బలి) ఈ విషయం గమనించిన మరో కూతురు అనిత అక్కడి నుంచి పారిపోయింది. హస్నాబాద్ గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు విషయం చెప్పింది. గ్రామస్తులు అక్కడకు చేరుకునే లోపు ఎల్లమ్మ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి రాజు మృత దేహం ఒడ్డుకు వచి్చంది. తల్లి కూతుళ్ల శవాలు కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగి్నమాపక సిబ్బంది సహకారంతో వెతికారు. చెరువులో చెట్టుకు తగిలి ఉన్న రెండు మృతదేహలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎల్లమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. కొడంగల్ ఎస్ఐ ప్రభాకర్రెడ్డి, బొంరాస్పేట ఎస్ఐ శ్రీశైలం, రెవెన్యూ, అగి్నమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: సీతక్క
సాక్షి, రాజేంద్రనగర్: మహిళలకు, మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకోవడం కాదు.. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మైనారిటీ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మొయినాబాద్ మండలం హిమాయత్సాగర్లో ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఓ మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక సోదరి రాజేంద్రనగర్ బుద్వేల్ గ్రీన్ సిటీలో ఆశ్రమం పొందుతుండటంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: (యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య ) ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. హిమాయత్నగర్కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు మైనార్టీ కుటుంబానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. నాలుగేళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకొని అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి ఉరి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లుతోపాటు ఆర్థిక సహాయం చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మృతురాలి సోదరికి ఉన్నత చదువుతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఘటనపై జిల్లా మంత్రితోపాటు హోంమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు టీఆర్ఎస్ నేత కావడంతో అతడిని రక్షించేందుకు ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు. మైనార్టీల పక్షాన పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకొనే ఓవైసీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కనీసం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. నిందితుడు టీఆర్ఎస్ నేత కావడంతో మజ్లిస్ మిన్నకుండిపోయిందని విమర్శించారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. హర్యానాలో జరిగిన ఓ సంఘటనపై ట్వీట్ చేసిన ఓవైసీ తన ఇంటి పక్కనే మైనారిటీ బాలికపై జరిగిన అఘాయిత్యం విషయంలో స్పందించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. తాము వాస్తవ పరిస్థితిని తెలుసుకునే యత్నం చేస్తుంటే అరెస్టులు చేస్తూ నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క బాలిక సోదరికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ల శారద, మాజీ మంత్రి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నేతలు ఇందిరారెడ్డి, శోభన, వర్రి లలిత్ ఉన్నారు. విచారణ వేగవంతం మొయినాబాద్(చేవెళ్ల): బాలిక అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపిన పోలీసు ఉన్నతాధికారులు కేసు విచారణను వేగవంతం చేశారు. మంగళవారం శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్రెడ్డి మొయినాబాద్ ఠాణాకు వచ్చారు. నిందితుడు మధుయాదవ్ గత పరిస్థితులు, కేసుల వివరాలను తెలుసుకున్నారు. మొయినాబాద్ మండలం హిమాయత్నగర్కు చెందిన బాత్కు మధుయాదవ్ ముందు నుంచి వివాదాస్పదంగా ఉండేవాడు. రియల్ వ్యాపారం చేస్తూ పలు భూములను వివాదాస్పదంగా మార్చడంతోపాటు సొంత బంధువులకు చెందిన భూమిని కూడా కబ్జాచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలోనే స్థానిక పోలీసులు అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ వివరాలన్నీ తెసుకున్న డీసీపీ ప్రకాష్రెడ్డి ఘటన జరిగిన గదిలోని ఆనవాళ్లు, బాలిక సోదరి వెల్లడించిన విషయాలతో మధుయాదవ్ చేసిన దురాఘతాలపై తెలుసుకున్నారు. అదేవిధంగా ఘటన జరిగిన రోజున మొయినాబాద్ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపైనా డీసీపీ ప్రకాష్రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే కేసు విచారణాధికారిగా ఇన్స్పెక్టర్ జానయ్యను తప్పించి రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్చక్రవర్తికి అప్పగించారు. మరిన్ని వివరాల సేకరణ కోసం నిందితుడిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఐపై వేటుకు పెరుగుతున్న డిమాండ్ బాలిక మృతి కేసులో మొయినాబాద్ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. దీనికి తోడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాసంఘాల నాయకులు సైతం ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో హోంమంత్రి మహమూద్అలీ, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సైతం సైబరాబాద్ సీపీ సజ్జనార్తో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. -
మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్రెడ్డి
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది.(బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేశ్వర్రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీశాఖకు లేఖ రాసిన ఏసీబీ మరోవైపు తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కోటి 10 లక్షల రూపాయల పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవరు అన్న కోణంలో ఏసీబీ కేసును విచారిస్తుంది. ఈ ఘటనపై గురువారం ఏసీబీ ఐటి శాఖకు లేఖ రాసింది. మనీ ట్రాన్స్ సెక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలపాలంటూ ఐటిశాఖను లేఖలో కోరింది. నాగరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై కూపీ లాగుతున్న ఏసీబీ .. విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!) ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ కి ఫిర్యాదు చేయాలి. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నాగరాజు కు మధ్యవర్తిత్వం వహించిన ఆంజిరెడ్డి ,శ్రీనాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను పరీశీలిస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం. అంటూ తెలిపారు. -
వెల్స్పన్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామంలో వెల్స్పన్ ఫ్లోరింగ్ యూనిట్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. శనివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గుజరాత్కు చెందిన కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం. ఈ కంపెనీ రూ. 2వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా స్ధానిక యువతకు ఉద్యోగవకాశాలు కల్పించబడతాయి. ఈ పారిశ్రామిక క్లస్టర్లో మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. 3600 ఎకరాల్లో ఇక్కడ పారిశ్రామిక పార్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చందనవెళ్లి పారిశ్రామిక పార్క్కి అవసరమైన మౌలిక వసతులు, రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ చొరవతో షాబాద్ మండలం చందనవెళ్లిలో ఇంత పెద్ద సంస్థ ఏర్పాటు అయ్యింది. ఇక్కడి ప్రజలు కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ భవిష్యత్తు ఆశదీపంగా కనిపిస్తున్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ నేడు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఎక్కడికెళ్లినా తెలంగాణకు పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అందరూ దీనిని మన కంపెనీ గా భావించాలి. పారిశ్రామిక అభివృద్ధితో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. (కరుణించిన కేసీఆర్) రూ.2వేల కోట్ల పెట్టుబడులతో సంస్థ ఏర్పాటు చేయటం, రానున్న కాలంలో మరిన్ని సంస్థలు రానుండటంతో వచ్చే 5 ఏళ్ల కాలంలో షాబాద్ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోనూ అతి పెద్ద ఫార్మా సిటీ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది' అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు కాలే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఎల్సీ మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏలు నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి,డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి , జీవన్ రెడ్డి, బాల్క సుమన్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు బాల మల్లు, నాగేందర్ గౌడ్, కలెక్టర్ అమయ్ కుమార్, కంపెనీ సీఈఓ గోయెంక్ పాల్గొన్నారు. -
కోతులు.. తీరనున్న వెతలు
తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. ఈ కోతులు ఆహారం కోసం ఇళ్ల మీదికి వచ్చి, వీటి దాడిలో గాయపడిన వారు చాలా మంది ఉన్నారు. కోతుల బెడదను నుంచి విముక్తి చేయడానికి తుక్కుగూడ మున్సిపల్ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. ఈ కోతులను పటేందుకు మున్సిపల్ వార్షిక బడ్జెట్లో రూ. 5 లక్షల కేటాయించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోతులను పట్టే ప్రత్యేక టీమ్ సభ్యులకు ఈ పనులు అప్పగించారు. వీరు గత నెల 12వ తేదీ నుంచి కోతులను పట్టే కార్యక్రమం ప్రారంభించారు. 189 కోతుల పట్టివేత.. మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ, రావిర్యాల, మంఖాల్, సర్ధార్నగర్, ఇమూమ్గూడ, శ్రీనగర్కాలనీ, దేవేందర్నగర్కాలనీలో మున్సిపల్ సిబ్బంది దాదాపుగా 500 పైగా కోతులు ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రత్యేక టీమ్ సభ్యులు నెల రోజుల నుంచి ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు 189 కోతులను పట్టుకున్నారు. కోతులను పట్టుకోవడానికి ప్రత్కేక టీమ్ సభ్యులు వివిధ ఆహార పదార్ధాలను ఎర చూపుతున్నారు. ఆహారం కోసం వచ్చిన వాటిని పడుతున్నారు. పట్టుకున్న కోతులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా సురక్షితంగా బోనులో ఉంచుతూ వివిధ రకాల పండ్లు, ఇతరు వస్తువులను ఆహారంగా అందిస్తున్నారు. పట్టిన కోతులను శ్రీశైలం అటవి ప్రాంతంలో వదిళివేస్తున్నారు. ఇప్పటì కే రెండు దఫాలుగా కోతులను ఈ అటవిలో వదలివేశారు. ఒక్కో కోతికి మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక టీమ్ సభ్యులకు రూ. ఒక వేయి అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ మున్సిపాలిటీలో ప్రస్తుతం కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో కోతుల పట్టి వాటి నుంచి తమకి విముక్తి లభించేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా వార్డుల ప్రజలు కొరుతున్నారు. మరో వారంలో పూర్తి మున్సిపల్ పరిధిలోని తుక్కుగూడ, రావిర్యాల, మంఖాల్, ఇమామ్గూడ, శ్రీనగర్కాలనీలో ఇప్పటికే ఒక దఫా కోతులను ప్రత్యేక టీమ్ సభ్యులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు 189 కోతులను పట్టి వాటిని శ్రీశైలం అడవిలో వదలివేశారు. మరో వారం రోజులో మున్సిపల్ వ్యాప్తంగా కోతులు పట్టే కార్యక్రమం పూర్తి అవుతుంది.– ఆర్.జ్ఞానేశ్వర్ మున్సిపల్ కమిషనర్ తుక్కుగూడ -
ఠాణా ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
మొయినాబాద్ (చేవెళ్ల): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఠాణా ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వెండి పట్టాలు పోయాయని తాను ఇచ్చిన ఫిర్యాదు విషయం తెలుసుకునేందుకు బుధవారం స్టేషన్కు వెళ్లిన ఆమెను పోలీసులు బెదిరించి వెళ్లగొట్టడంతో మనస్తాపంతో ఒంటికి నిప్పంటించుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తూజగూడలో నివాసముంటున్న సంపంగి బాల్రాజ్, సుగుణ(32) దంపతులు వడ్డెర పని చేసి జీవనం సాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సుగుణకు చెందిన 20 తులాల వెండి పట్టాలు ఇంట్లోంచి పోయాయి. ఈ విషయమై ఆమె అదే రోజు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. తన తండ్రి రెండో భార్య ఎల్లమ్మపై అనుమానం ఉందని పేర్కొంది. పోలీసులు ఎల్లమ్మను పిలిపించి విచారించగా తాను పట్టాలు తీయలేదని చెప్పింది. అయితే, ఈ విషయంలో సుగుణ, ఎల్లమ్మ గొడవపడ్డారు. గొడవలు వద్దని, చోరీపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పి ఇద్దరినీ పంపించారు. కాగా బుధవారం కేసు విషయం ఎంత వరకు వచ్చిం దని తెలుసుకునేందుకు సుగుణ ఠాణాకు వెళ్లిం ది. పోలీసులు ఆమెను లోపలికి రానివ్వకుండా బెదిరించి బయటి నుంచే వెళ్లగొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బయటకొచ్చి ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు, పోలీసులు మం టలను ఆర్పారు. తీవ్ర గాయాలైన సుగుణను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తల్లి వెంటే ముగ్గురు పిల్లలు... కేసు విషయం తెలుసుకునేందుకు ఠాణాకు వచ్చిన సుగుణ తన ఇద్దరు కొడుకులు, ఓ కూతురును తీసుకొచ్చింది. పిల్లల ముందే ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో వారు పెద్దగా కేకలు పెడుతూ రోదించారు. అనం తరం తల్లిని ఆస్పత్రికి తరలించడంతో పిల్లలు పోలీస్స్టేషన్ ఆవరణలోనే బిక్కుబిక్కుమంటూ కూర్చోవడం స్థానికులను కలిచివేచింది. డీజిల్ ఎక్కడిది..? సుగుణ డీజిల్ ఎక్కడి నుంచి తెచ్చుకుందనే విష యం అంతు చిక్కడం లేదు. పోలీసులు బెదిరిం చిన తర్వాత బయటకు వెళ్లిన ఆమె డీజిల్ తెచ్చు కుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుందా...? లేక ముందుగానే తనతో డీజిల్ తెచ్చుకుందా.. అనే విషయం తెలియడం లేదు. ఈ విషయమై పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు. ఠాణా ఎదుటున్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణ చేస్తున్నామని చెప్పాం.. వెండి పట్టాలు పోయాయని నాలుగు రోజుల క్రితం సుగుణ ఫిర్యాదు ఇచ్చింది. సవతి తల్లి ఎల్లమ్మపై అనుమానం ఉందని చెప్పడంతో ఆమెనూ విచారిం చాం. బుధవారం సుగుణ మళ్లీ ఠాణాకు వచ్చింది. కేసు విచారణ జరుపుతున్నామని చెప్పి పంపించాం. బయటకు వెళ్లిన కొంతసేపటికి ఠాణా పక్కన తహసీల్దార్ కార్యాలయం గేటు సమీపంలో ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించాం. – జానయ్య,మొయినాబాద్ ఇన్స్పెక్టర్ -
నాన్న వచ్చాడు.. నవ్వులు తెచ్చాడు!
షాద్నగర్ రూరల్: పేదరికం ఓడిపోయింది.. మమకారమే గెలిచింది.. పిల్లలపై ఉన్న ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతను కాదనుకోలేక ఆ తండ్రి మనసు మార్చుకున్నాడు. శిశువిహార్కు తరలించిన చిన్నారులను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిని కోల్పోయి, తండ్రికి దూరమై అనాథలుగా శిశువిహార్కు వెళ్లిన చిన్నారులపై కథనం ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన విషయం తెలిసిందే. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం) మమకారమే గెలిచింది షాద్నగర్ పట్టణంలో ఉండే గణేశ్, శ్రీలత దంపతులకు పిల్లలు శ్రీగాయత్రి(4), హన్సిక (17 నెలలు) ఉన్నారు. శ్రీలత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో పిల్లల బాగోగులు చేసుకునేందుకు గణేశ్కు భారంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన అతడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. చిన్నారుల ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో శుక్రవారం వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించడంతో శిశువిహార్కు తరలించిన విషయం తెలిసిందే. హాస్టల్కు వెళ్లేటప్పుడు చిన్నారుల పరిస్థితి అందరి మనసులను కదిలించిన విషయం విదితమే. (మహిళల రక్షణ కోసం ‘స్త్రీ’) ‘నాన్న నేను మళ్లీ వస్తా.. అమ్మ బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుండె.. ఆమె గుండెనొప్పితో చనిపోయింది.. అందుకే నేను మా చెల్లి హాస్టల్కు వెళ్తున్నాం’ అని చిన్నారి శ్రీగాయత్రి చెప్పడంతో స్థానికులు, అధికారులు భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అయితే, భార్య మృతిచెందడం, పిల్లలు శిశువిహార్కు తరలివెళ్లడంతో ఒంటరిగా ఉన్న గణేశ్ మనసు చలించిపోయింది. పేదరికంలో ఉన్నా చిన్నారులను పోషించుకుంటానని భావించాడు. ఈనేపథ్యంలో మనసు మార్చుకున్న అతడు తన పిల్లలను తిరిగి అప్పగించాలని కోరుతూ శనివారం శిశువిహార్కు వెళ్లి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. చిన్నారులను తాను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో పేదరికం ముందు తండ్రికి పిల్లలపై ఉన్న మమకారమే గెలిచింది. స్పందింపజేసిన కథనం ‘అమ్మలేదు..నాన్న పోషించ లేడు’ అని సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ప్రజలను స్పందింపచేసింది. హాస్టల్కు వెళ్లేటప్పుడు చిన్నారి శ్రీగాయత్రి చెప్పిన మాటలు అందరి హృదయాలను ద్రవింపజేశాయి. దీంతో గణేశ్ మనసు మార్చుకొని శనివారం శిశువిహార్కు వెళ్లి తన కూతుళ్లు శ్రీగాయత్రి, హన్సికను తిరిగి ఇంటికి తీసురావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నా పిల్లలను బాగా చూసుకుంటాను.. ‘అనారోగ్యంతో నా భార్య కన్నుమూయటం, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పిల్లల పోషణ భారంగా మారింది. చిన్నారుల ఆలనాపాలనా చూసుకునేవారు లేకపోవడంతోనే వారిని శిశువిహార్కు అప్పగించాను. భార్య చనిపోవడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరి వాడినయ్యాను. నా పిల్లలపై ఉన్న మమకారం, ప్రేమే వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసింది. నా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాన’ని చిన్నారుల తండ్రి గణేశ్ వివరించాడు. -
బాలికను గర్భవతిని చేసి.. కులం పేరుతో..
రంగారెడ్డి, కొత్తూరు: ప్రేమపేరుతో బాలికను నమ్మించి గర్భవతిని చేసి ఓ యువకుడు వదిలేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ అంటూ వదిలేయడంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేందర్ (21), బాలిక ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమమాయలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట కుటుంబసభ్యులు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. బాలికను వివాహం చేసుకోనని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై సీఐ చంద్రబాబును వివరణ కోరగా బాలిక ఫిర్యాదు వాస్తవమేనన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
హతమార్చి.. ముఖం ఛిద్రం చేసి..
చేవెళ్ల: నుజ్జునుజ్జయిన ముఖం.. కల్వర్టు కింద రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహం.. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన యువకుడు ఇచ్చిన సమాచారంతో రంగారెడ్డి జిల్లా తంగడపల్లిలో ఈ దారుణోదంతం వెలుగుచూసింది. ‘దిశ’ఘటనలా ఉందంటూ జరిగిన ప్రచారం కలకలం రేపింది. ఎక్కడో హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లికి చెందిన యువకుడు శేరిల్ల నవీన్ ఉదయం ఏడు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్తుండగా, వికారాబాద్– హైదరాబాద్ రహదారిపై గల కల్వర్టు కింద మహిళ మృతదేహం కనిపించింది. ముఖం మొత్తం నుజ్జయి, నగ్నంగా పడి ఉన్న ఆమె గురించి వెంటనే అతను సర్పంచ్ భర్తకు తెలిపాడు. సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్ఐ రేణుకారెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు బండరాళ్లతో మోదటంతో ముఖం గుర్తుపట్టరాని విధంగా మారింది. మృతదేహం వద్ద ఓ నైలాన్ తాడు తప్ప మరే ఆధారాలు లభ్యం కాలేదు. మహిళ వివస్త్రగా పడి ఉండగా, ఆమె దుస్తులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు పరిసరాల్లో ఎక్కడా కనిపించలేదు. మృతదేహాన్ని వంతెన పైనుంచి తాడుతో కిందికి దించిన తరువాత ముఖంపై బండరాళ్లతో మోదినట్టుగా ఉంది. పక్కనున్న రాళ్లపై రక్తం అంటుకుని ఉండటంతో పోలీసులు ఈ అంచనాకు వచ్చారు. మహిళ ఒంటిపై రెండు బంగారు గాజులు, వేలికి బంగారు ఉంగరం, మెడలో బంగారు లాకెట్ ఉన్నాయి. ఘటన స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవని, అంటే వేరే ప్రాంతంలో లైంగికదాడికి పాల్పడి, హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు: డీసీపీ ఘటన జరిగిన తీరు.. మరో ‘దిశ’ఉదంతంలా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. మృతదేహాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు తెలుస్తోందని, లభ్యమైన బంగారు నగలను ల్యాబ్కు తరలిస్తామని చెప్పారు. ఘటనపై సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లను అప్రమత్తం చేశామన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించిన వాహనాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఓటీ అడిషనల్ డీజీపీ సందీప్కుమార్తో పాటు క్లూస్టీం సభ్యులు కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలు ఘటనా స్థలంలోనే తచ్చాడాయి. మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే భద్రపరిచారు. భయమేసింది.. మాది తంగడపల్లి. డ్రైవింగ్ చేస్తాను. ఉదయం 7 గంటలకు బహిర్భూమికని బైక్పై వచ్చాను. కల్వర్టు కింద తెల్లగా, బొమ్మలా ఏదో కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే మహిళ మృతదేహం.. ఒక్కసారిగా భయమేసింది. ఇటువంటివి ఇంతకుముందెప్పుడూ చూడలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి సర్పంచ్ భర్త సత్తయ్యగౌడ్కు చెప్పాను. అనంతరం పోలీసులు వచ్చి పరిశీలించారు. – శేరిల్ల నవీన్, తంగడపల్లి, ఘటనను మొదటగా చూసిన వ్యక్తి -
యువతి పై అత్యాచారం,హత్య
-
రంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన!
సాక్షి, రంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ మొహంపై కొందరు దుండగులు బండరాయితో మోదీ దారుణంగా హతమార్చారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహం బయటపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళపై అత్యాచారం జరిగి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మిస్సింగ్ కేసు ఆధారంగా కేసు విచారిస్తున్న పోలీసులు రాష్ట్రంలోని మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. రంగంలోకి ఐదు బృందాలు: శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈరోజు ఉదయమే ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాం. మహిళ ఒంటిపై దుస్తులు లేవు. వివస్త్రగా మృతదేహం పడిఉంది. ఆమె తలపై బండ రాయితో మోది చంపేశారు. అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుంది. కేసును ఛేదించేందుకు ఐదు బృందాలను రంగంలోకి దింపాం. అన్ని కమిషనరేట్ల పరిధిలో పోలీసుల్ని అలర్ట్ చేశాం. త్వరలోనే కేసు ఛేదిస్తాం. మృతురాలి వయసు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుంది. ఆమె ఒంటిపై బంగారు గొలుసు, చేతికి రింగ్, చెవులకు కమ్మలు ఉన్నాయి. -
ఆర్థికాభివృద్ధికి కేరాఫ్ రంగారెడ్డి, హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేంద్రమైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు.. వస్తు, సేవల ఉత్పత్తిలోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయి. దేశ, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి రేటును దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్పీడీపీ)గా మదిస్తారు. ఈ తరహాలోనే జిల్లాల ఆర్థికాభివృద్ధి రేటును జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)గా మదిస్తారు. ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో, సాధారణంగా ఒక ఏడాదిలో ఒక జిల్లాలోని భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అన్ని తుది వస్తువులు, సేవల మొత్తం ఆర్థిక విలువను జీడీడీపీగా పేర్కొంటారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా రూ.1,73,143 కోట్ల జీడీడీపీతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రూ.1,67,231 కోట్ల జీడీడీపీతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. కేవలం ఈ రెండు జిల్లాలే రూ.లక్ష కోట్లపైగా జీడీడీపీని కలిగి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికాభి వృద్ధి రేటును పరుగులు పెట్టించడంలో ఈ రెండు జిల్లాలదే ప్రధాన పాత్ర అని తాజా గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక, సామాజిక సర్వే నివేదికలోని జీడీడీపీ గణాంకాల పేర్కొంటున్నాయి. హైదరాబాద్ దేశానికే ఫార్మా రంగ రాజధానిగా పేరుగాంచింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు, తయారీ తదితర రంగాల పరిశ్రమలున్నాయి. వీటిల్లో అధిక శాతం హైద రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉండడంతో ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఏటా రూ.లక్షల కోట్లు విలువ చేసే వస్తు, సేవల ఉత్పత్తులు ఎగుమతి, రవాణా అవుతున్నాయి. హైదరా బాద్, రంగారెడ్డి జిల్లాల జీడీడీపీ మాత్రమే రూ.లక్షన్నర కోట్ల గీటురాయిను దాటి రూ.2 లక్షల కోట్ల దిశగా దూసుకుపోవడానికి ఈ పరిశ్రమలే ప్రధాన తోడ్పాటు అందిస్తున్నాయి. పెరుగుతున్న అసమానతలు.. జీడీడీపీతో పాటు తలసరి ఆదాయంలో సైతం ఈ 2 జిల్లాలు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు అందనంత దూరంలో ఉన్నాయి. రూ.5,78,978 తలసరి ఆదాయంతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలవగా, రూ.3,57,287తో హైదరాబాద్, రూ.2,21,025తో మేడ్చల్–మల్కాజ్గిరి ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా రూ.2 లక్షల తలసరి ఆదాయాన్ని కలిగి ఉండగకపోవ డం గమనార్హం. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రంలోని జిల్లాల మధ్య నెలకొన్న అసమానతలను ఈ గణాంకాలు అద్దంపడుతున్నాయి. జీడీడీపీ, తలసరి ఆదాయంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు, రాయితీ, ప్రోత్సాహాకాల విధానాల రూపకల్పన కోసం ఈ గణాంకాలు కీలకం కానున్నాయి. -
‘అభివృద్ధి’కి కలిసికట్టుగా పనిచేద్దాం
సాక్షి, రంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా గుమ్మడవెల్లి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని ఎంచుకుని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారని తెలిపారు.తాను గెలిచిన ప్రాంతంలో గ్రామాలు లేనందున దగ్గరలోనే ఏదో ఒక గ్రామం తీసుకోవాలని అనుకున్నానని తెలిపారు. ‘గుమ్మడవెల్లి గ్రామానికి కనెక్టివిటీ ఉన్నా జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. గ్రామ అభివృద్ధి కోసం మీతో కలిసి పని చేస్తా.. కుల,మతాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి’ అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తనపై వస్తున్న విమర్శలపై కిషన్రెడ్డి స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితులు వచ్చిప్పుడు ఢిల్లీ వెళ్తున్నానని తెలిపారు. ఢిల్లీలో లొల్లి జరుగుతుంటే తాను ఊర్లలో తిరుగుతున్నానని సోషల్ మీడియాలో చేస్తోన్న దుష్ప్రచారాన్నిఆయన తప్పుబట్టారు. గ్రామాభివృద్ధిలో లక్ష్యంగానే తాను ఈ సభలో పాల్గొనేందుకు వచ్చానని ఆయన తెలిపారు. ఎన్ఐఆర్డీ నేరుగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ను కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. అపోలో,కేర్,నిమ్స్, సరోజినీదేవి ఆసుపత్రుల నుంచి వైద్యులను రప్పించి వైద్యసేవలు అందేలా చూస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
‘బంగ్లా’ సినిమా చూద్దాం రండి
సాక్షి, శ్రీనగర్కాలనీ: సినిమా..సినిమా...ఈ మాధ్యమం ద్వారా విజ్ఞానాన్ని, వినోదాన్ని, విలువలను, వాస్తవాలను తెలుసుకోవచ్చు. ఒక్కో భాషకు, ఒక్కో ప్రాంతానికి భిన్నమైన సంస్కృతి–సంప్రదాయాలు ఉంటాయి. ప్రపంచంలోని సినిమాలను చూసి పలు భిన్న కోణాలను తెలుసుకోవాలనే తపన కొందరికి ఉంటుంది. అయితే తీరిక దొరకదు.. దొరికినపుడు సినిమాలు దొరకవు. అందుకే సినిమాలను చూపిస్తూ, సినిమా అభిమానుల మనోగతాన్ని తెలుసుకొని ఆ దిశగా హైదరాబాద్ ఫిలిం క్లబ్ తన ఆశయాలను కొనసాగిస్తోంది. విభిన్న సంస్కృతి– సంప్రదాయాలు, జీవనవిధానంతో కూడిన బంగ్లాదేశ్ ఫిలిం ఫెస్టివల్ను నగరవాసులకు అందిస్తున్నారు. 1999లో యునెస్కో ప్రాంతీయ భాషా చిత్రాలను పోత్సహించేందుకు ఫిబ్రవరి 21వ తేదీని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమీర్పేటలోని సారథి స్టూడియోలో హైదరాబాద్ ఫిలిం క్లబ్– సారథి స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో బంగ్లాదేశ్కు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. భావోద్వేగాలు మనుషుల మధ్య బంధాలు, సమాజంలోని ప్రధానాంశాలు, సుఖాలు, దుఃఖాలు, కళాత్మక జీవనాన్ని, సృజనాత్మకతను ప్రస్తావిస్తూ వైవిధ్యమెన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 21వ తేదీనుంచి నాలుగు రోజులపాటు 4 బంగ్లాదేశీ చిత్రాలను ప్రదర్శించనున్నారు. రోజూ సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన ఉంటుంది. ఇన్ స్ప్రింగ్ బ్రీజ్, కోమల రాకెట్, స్క్రీన్ ప్లే యువర్స్ ఢాకా, ఆల్ఫా సినిమాలను ప్రదర్శిస్తారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తాం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సందర్భంగా బంగ్లాదేశ్ ఫిలిం ఫెస్టివల్ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ ఫిలిం క్లబ్– సారథి స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ను నిర్వహిస్తున్నాం. అకాడమీ అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. æహైదరాబాద్ ఫిలిం క్లబ్ మొదలై 46 సంవత్సరాలు అయింది. భవిష్యత్లో తెలుగు ఫిలిం ఫెస్టివల్స్ను ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నిర్వహిస్తాం. – ప్రకాష్రెడ్డి, హైదరాబాద్ ఫిలిం క్లబ్ సెక్రటరీ -
మన ఆధ్యాత్మికత ప్రపంచానికి బహుమతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆందోళనలు, అనిశ్చితి, అభద్రతాభావం, శత్రుత్వా లతో నిండిన ప్రపంచంలో రామ చంద్ర మిషన్ వంటి సంస్థల బాధ్య తలు చాలా రెట్లు పెరిగాయని రాష్ట్ర పతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. కాన్హా శాంతివనం సంపూర్ణ జీవనానికి నమూనా వంటిదని ప్రశంసించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ ధ్యాన కేంద్రం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి గొప్ప ప్రదేశమని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో విస్తరించిన ఈ మిషన్ బలమైన ఆధ్యాత్మిక శక్తిగా మారిందని చెప్పారు. రామచంద్ర మిషన్ వ్యక్తిగత, సామాజిక మార్పును ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాజయోగ ధ్యానా నికి గల ప్రాచీన సంప్ర దాయాన్ని ఆధునిక ప్రపంచంలో మిషన్ ప్రోత్సహిస్తోందన్నారు. భారత ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదన్నారు. నంది గామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. వనం గ్లోబల్ హెడ్క్వార్టర్ని రాష్ట్రపతి ప్రారంభించారు. మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నిర్వాహకులు 5 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా చివరి మొక్కను రాష్ట్ర పతి నాటి కేంద్రాన్ని పరిశీలించారు. అనంత రం అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు, రైతులు, చేతి వృత్తిదారులు, ప్రయోజనాలకు చేపట్టిన కార్యకలాపాలు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు తీసు కుంటున్న చర్యలు ప్రశంసనీయమని, 5 లక్షల మొక్కలతో ఈ క్యాంపస్ ఆకు పచ్చని పరిసరాలతో అలరారుతోందన్నారు. సమున్నతులుగా తీర్చిదిద్దడానికి.. తమను తాము సమున్నతులుగా తీర్చిదిద్దు కోవాలన్న వారి కోరికను ఈ మిషన్ నెరవే ర్చుతుందని రాష్ట్రపతి తెలిపారు. మిషన్కు చెందిన అంతర్జాతీయ సమాజం భూమండ లాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్దగలదని ఆకాంక్షించారు. సంతోషం, సంపూర్ణ సాను కూల శక్తియుక్తులతో అలరారే దిశగా మాన వాళిని పరివర్తన చెందించగలదన్న విశ్వా సాన్ని వెలిబుచ్చారు. ‘దాజీ వివరించిన ‘డిజై నింగ్ డెస్టినీ’లోని 5 సూత్రాలలో ఒకదాన్ని ఇక్కడ తప్పక నేను ప్రస్తావించాలి. మాన వత్వ గమ్యాన్ని రూపొందించాలి. ఇది మొదటగా మనతోనే ప్రారంభంకావాలి. ఆ తర్వాత ఇతరులకు విస్తరించాలి. అందరం కలిసి పనిచేస్తే మానవత్వ దిశను మార్చేం దుకు ఒకరోజు కచ్చితంగా వస్తుంది. ఇందుకు యువత సహకారం తీసుకుని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాల్లో వారిని నిమగ్నం చేయాలి’అని పిలుపు నిచ్చారు. శాంతివనం.. ఓర్పుకు నిదర్శనం కాన్హా శాంతివనం మానవ ఓర్పుకు నిదర్శ నమని గురూజీ కమ్లేష్ డీ పటేల్(దాజీ) అన్నారు. ఐదేళ్లలో శాంతివనంలో ప్రపంచం లోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం నిర్మించడం వేలాది మంది అభ్యాసీకుల నిరంతర కృషి తోనే సాధ్యపడిందన్నారు. 1,400 ఎకరాల్లో శాంతి వనంలో నిర్మించిన ఐకానిక్ ధ్యాన కేంద్రం మానవాళి పరివర్తనకు కేంద్రంగా రూపాంతరం చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ధ్యాన శిబిరాలను గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు 3 విడతలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతికి ఘన వీడ్కోలు.. హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి కోవింద్కు బేగంపేట విమానాశ్రయంలో గవ ర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. -
రంగారెడ్డి జిల్లాలో దుమ్మురేపిన కారు
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పురపోరులో గులాబీ వ్యూహం ఫలించింది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 8 మున్సిపాలిటీలను అధికార పార్టీ దక్కించుకుంది. నాలుగు పురపాలికల్లో మెజార్టీ వార్డులను గెలుచుకొని ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కారు...జిల్లా నేతల వ్యూహ రచనతో మరో నాలుగింట గులాబీ జెండాను రెపరెపలాడించింది. శంషాబాద్ , షాద్ నగర్ , శంకర్పల్లి, ఇబ్రహింపట్నం, ఆదిభట్ల, తుక్కుగూడ, నార్సింగి, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ ఛైర్మన్ పదవులు టీఆర్ఎస్ పార్టీకి దక్కగా... తుర్కయంజాల్ , మణికొండ మున్సిపాలిటీలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఇక ఆమనగల్ మున్సిపాలిటీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. జల్పల్లి మున్సిపాలిటి ఛైర్మన్ పీఠాన్ని ఎంఐఎం దక్కించుకోగా.. వైస్ ఛైర్మన్ పదవి టీఆర్ఎస్ను వరించింది. కాంగ్రెస్కు దక్కుతుందనుకున్న ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ ఛైర్మన్లు... స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఎత్తుగడతో టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. ఆదిభట్ల మున్సిపాలిటికి సంబంధించి 14వ వార్డు సభ్యురాలు కొత్త హార్థిక కాంగ్రెస్ నుంచి గెలిచి అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరి ఛైర్మన్ పదవికి దక్కించుకుంది. అదే విధంగా పెద్ద అంబర్ పేటలో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో ఆ మున్సిపాలిటీ ఛైర్మన్ గులాబీవశం కాగా... వైస్ ఛైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. అదే విధంగా జిల్లాలోని మూడు కార్పొరేషన్లు కూడా టీఆర్ఎస్కే దక్కాయి. బండ్లగూడ జాగీర్ కార్పోరేషన్ మేయర్గా బుర్ర మహేందర్ గౌడ్, బడంగ్పేట కార్పొరేషన్ మేయర్గా పారిజాత, మీర్పేట మేయర్గా ముడావత్ దుర్గా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల వివరాలు... 1. ఆదిభట్ల మున్సిపాలిటీ (టీఆర్ఎస్) కైవసం: ఛైర్మన్గా కొత్త హార్థిక, వైస్ ఛైర్మన్గా కొర్ర కళమ్మ ఎన్నిక 2. ఇబ్రహింపట్నం మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా కప్పరి స్రవంతి, వైస్ ఛైర్మన్గా ఆకుల యాదగిరి 3. పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా చెవుల స్వప్న, వైస్ ఛైర్మన్గా చామ సంపూర్ణరెడ్డి 4. తుక్కుగూడ మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా కాంటేకర్ మధుమోహన్, వైస్ ఛైర్మన్గా భవానీ వెంకట్ రెడ్డి 5. శంకర్ పల్లి మున్సిపాలిటి (టీఆర్ఎస్): ఛైర్మన్గా సత విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ గా వెంకట్రామిరెడ్డి 6. షాద్ నగర్ మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా కొందూటి నరేందర్ , వైఎస్ ఛైర్మన్ గా ఎంఎస్ నటరాజన్ ఎన్నిక 7. శంషాబాద్ మున్సిపాలిటి (టీఆర్ఎస్): ఛైర్మన్గా కొలను సుష్మ, వైస్ ఛైర్మన్ బండి గోపాల్ యాదవ్ 8. నార్సింగి మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా బి.రేఖ, వైస్ ఛైర్మన్ జి.వెంకటేశ్ యాదవ్ ఎన్నిక 9. మణికొండ మున్సిపాలిటీ (కాంగ్రెస్): ఛైర్మన్గా కస్తూరి నరేందర్ (కాంగ్రెస్) , వైస్ ఛైర్మన్ గా నరేందర్ రెడ్డి(బీజేపీ) 10. తుర్కయంజాల్ మున్సిపాలిటీ (కాంగ్రెస్): ఛైర్మన్గా మల్ రెడ్డి అనురాధ, వైస్ ఛైర్మన్ గా గుండ్లపల్లి హరిత 11. జల్ పల్లి మున్సిపాలిటీ (ఎంఐఎం): ఛైర్మన్గా అబ్దుల్లాహబిన్ అహ్మద్ సాది, వైస్ ఛైర్మన్ గా ఫర్హాన నాజ్ (టీఆర్ఎస్) 12. ఆమనగల్ మున్సిపాలిటీ (బీజేపీ): ఛైర్మన్గా నేనావత్ రాంపాల్, వైస్ ఛైర్మన్ గా బేమనపల్లి దుర్గయ్య -
హడలెత్తించిన చిరుత
షాద్నగర్ టౌన్/రూరల్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ చిరుత హడలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక షాద్నగర్లోని పటేల్ రోడ్డుపై ఒక చిరుతవచ్చింది. అక్కడి నుంచి ప్రై వేట్ ఉద్యోగి మన్నె విజయ్కుమార్ ఇంటిపైకి చే రింది. పైపోర్షన్లో ఉండే ఆయన సోమవారం పా లు తీసుకొచ్చి చూడగా వాటర్ ట్యాంక్ పక్కన చి రుత తోక కనిపించింది. వెంటనే ఆయన ఇంట్లోని తన భార్యకు విషయం చెప్పి బయటకు రావొద్దని అప్రమత్తం చేశాడు. అలాగే కాలనీవాసులతో పా టు 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. షాద్నగర్ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీధర్కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకొని మరో ఇంటి పైనుంచి చిరుతను పరిశీలించారు. మత్తు మందు ఇచ్చి..: విషయాన్ని పోలీసులు ఫారెస్టు అధికారులతో పాటు హైదరాబాద్ జూపా ర్కు సిబ్బందికి సమాచారమిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి బీమానాయక్, శంషాబాద్ రేంజ్ ఆఫీసర్ హరిమోహన్రెడ్డి, రెస్క్యూ టీం అధికారి రమేష్కుమార్, జూపార్కు అసిస్టెంట్ డాక్టర్లు అస దుల్లా, అఖిల్, డిప్యూటీ డైరెక్టర్ ఎండీ హకీం ఘట నా స్థలానికి చేరుకున్నారు. రెస్యూ టీం సిబ్బంది చి రుత ఉన్న ఇంటి చుట్టూ వలలు వేశారు. ఉదయం 8కి చిరుత మెట్ల పైనుంచి కిందికి వచ్చి బాత్రూం ఎదుట పడుకుంది. రెస్యూ టీం ఇంటి లోపలికి వెళ్లి బాత్రూం కిటికీ నుంచి ట్రంక్ లైజర్ సాయంతో షూట్ చేసి రెండు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. చిరుత పరుగులు.. మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన వెంటనే పులి ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టింది. దీంతో కాలనీలోని జనం భయాందోళనకు గురయ్యారు. చిరుత పరుగెత్తే సమయంలో దానికి ఎదురుపడిన కానిస్టేబుల్ లక్ష్మణ్పై పంజా విసరడంతో ఆయనకు స్వల్ప గాయాలవగా.. చిరుత పక్క వీధిలోని ఓ పాడుపడిన గోడల్లో పడిపోయింది. వెంటనే అటవీ సిబ్బంది, రెస్క్యూ టీం దానిని బంధిం చి ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్లోని జూపార్కుకు తరలించారు. చిరుత విషయం తెలుసుకొని జనం పటేల్ రోడ్డుకు భారీగా తరలివచ్చారు. పట్టుబడిన చిరుత మగదని, రైల్వేస్టేషన్ సమీపంలోని కమ్మదనం అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని డీఎఫ్ఓ బీమానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. చిరుతను బంధిస్తున్న దృశ్యం -
చాటింగ్ చేస్తూ... భవనంపై నుంచి పడి..
శంషాబాద్: మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి ఓ ఎయిర్పోర్టు ఉద్యోగిని మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని ముదుళీ ప్రాంతానికి చెందిన సిమ్రాన్ (25) శంషాబాద్ ఎయిర్పోర్టులోని కస్టమర్ సర్వీస్లో ఉద్యోగం చేస్తోంది. మంగళవారం సాయంత్రం ఆమె తాను నివసిస్తున్న మూడంతస్తుల భవనం బాల్కనీ పైనుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అయితే, సిమ్రాన్ ల్యాప్టాప్, సెల్ఫోన్ రెండు కూడా ఆన్లోనే ఉండటంతో చాటింగ్ చేస్తూ కిందపడిందా..? తానే దూకి ఆత్మహత్యకు పాల్పడిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలింత ప్రాణం తీసిన ఇడ్లీ
సాక్షి, కందుకూరు: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్సీ)లో చోటుచేసుకుంది. కందుకూరు మండలం ముచ్చర్లకు చెందిన షాబాద్ పరమేశ్కు ధన్నారం గ్రామానికి చెందిన శివాని (28)తో ఆరేళ్ల కిందట వివాహమైంది. శివాని రెండోసారి గర్భం దాల్చిన క్రమంలో ప్రతి నెలా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకుంటుంది. నెలలు నిండటంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు శివానిని పీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు వెంకటమ్మ ఆదివారం తెల్లవారుజామున శివానికి పురుడు పోయగా..బాబు జన్మించాడు. గంట అనంతరం ఇడ్లీ తినిపించా లని నర్సు చెప్పడంతో కుటుంబీకులు ఇడ్లీ తెప్పించారు. అయితే ఆ ఇడ్లీలను శివానికి కూర్చోబెట్టకుండా మంచంపై పడుకున్న బాలింతకు అలాగే తినిపించింది. దీంతో ఇడ్లీ శివాని ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను 108 అంబులెన్స్లో హైదరాబాద్ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పీహెచ్సీ ఎదుట ఆందోళన.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శివాని మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహాన్ని కందుకూరు పీహెచ్సీకి తరలించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైద్యాధికారులకు సమాచారం అం దించగా వారు అక్కడకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇడ్లీ ఇరుక్కోవడంతోనే మృతిచెందినట్లు అంగీకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. -
గో ఆధారిత వ్యవసాయం అత్యద్భుతం
కడ్తాల్ మండలం చల్లంపల్లి గ్రామానికి చెందిన చల్లా పవన్రెడ్డి అనే రైతు గో ఆధారిత వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశవాళీ పాడి ఆవులతో శ్రేష్టమైన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివి, మెడికల్ ఇన్ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ డీలర్గా ఏడేళ్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళానాడు రాష్ట్రాలలో వ్యాపారం నిర్వహించారు. వ్యాపార పనుల నిమిత్తం ఆయా రాష్ట్రాలకు తరుచూ వెళుతుండటం, హోటళ్లలో భోజనం చేస్తుండటం జరిగేది. అనుకోకుండా అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా లివర్ సంబంధిత జబ్బు రావడంతో షాక్కు గురయ్యారు. జబ్బుకు కారణం విషతుల్యమైన ఆçహారం తీసుకోవడమే కారణమని తెలిసింది. దీంతో వ్యాపారానికి స్వస్తి చెప్పారు. తనలా మరొకరు ఇలా విషతుల్య ఆహార పదార్థాల బారిన పడకూడదని నిర్ణయించారు. వెంటనే స్వగ్రామమైన చల్లంపల్లికి చేరుకుని తనకున్న వ్యవసాయ పొలంలో సేంద్రియ పంటలను పండిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాక్షి, కడ్తాల్: మూడు ఆవులతో గో ఆధారిత వ్యవసాయం మొదలు పెట్టాడు రైతు పవన్రెడ్డి. గ్రామంలో తమకు గల 11 ఎకరాల పొలంలో మూడు బోరు బావులను తవ్వించారు. ఎందులోనూ సరిపడా నీరు పడలేదు. అదే సమయంలో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడరిటీ సంస్థకు చెందిన రామ్మోహన్ సాంకేతిక తోడ్పాటుతో పొలంలో వర్షం నీరు చేరుకునే చోటును గుర్తించి, అక్కడ బోరును వేయించి, బోరు చుట్టూ ఇంకుడు గుంతను తవ్వించారు. దీంతో బోరులో కొద్దిపాటి నీరు వచ్చింది. మిగతా మూడు బోరులు ఎండిపోకుండా బోరు చుట్టూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. క్రమంగా గో ఆ«ధారిత సాగును విస్తరించారు. 20 దేశవాళీ రకం గిర్, సాహివాల్, తార్పాకర్, రెడ్సింధి, హర్యనాభీ తదితర అవులను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల నుండి తీసుకువచ్చారు. దేశావాళీ ఆవులను పోషిస్తూ, వాటి పేడ జీవామృతం, ఘనా జీవామృతం, అజోల్లా పెంపకంతో తన భూమిని సారవంతంగా మార్చుకుంటున్నారు. అలాగే ఆరోగ్యదాయకమైన పాలను, ఆహార పదార్థాల ఉత్పత్తికి కృషి చేస్తున్నారు. ఐదు ఎకరాలలో మామిడి తోటతో పాటు అంతర పంటగా కూరగాయాల సాగు, రెండు ఎకరాలల్లో వరి సాగు చేయడం, ఎకరా పొలంలో పచ్చిగడ్డి సాగు చేస్తున్నారు. నిత్యం వంద లీటర్ల పాల ఉత్పత్తి పొలంలో షెడ్డును నిర్మించి 20 దేశ వాళీ రకం ఆవులను పోషిస్తున్నారు. ఒక్కో ఆవు ధర రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. ఆవులకు ఆహారంగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి, నిల్వ చేసి, సైలేజ్ గడ్డిని తయారు చేసి, ఆహారంగా అందిస్తున్నారు. అలాగే అజోల్లా గడ్డిని అందిస్తున్నారు. ప్రత్యేకంగా గానుగ నుంచి తీసిన పల్లి చెక్కను సైతం దాణాలో కలుపుతున్నారు. ఒక్కో ఆవు రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తున్నాయి. మొత్తం ఆవులన్నీ 100 నుంచి 120 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. అలాగే గో మూత్రం వృథా కాకుండా ప్రత్యేకంగా ఒక ట్యాంకును ఏర్పాటు చేశారు. గో మూత్రాన్ని లీటరు రూ.25 చొప్పన విక్రయిస్తున్నారు. అదే విధంగా పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. జీవామృతంతో అధిక దిగుబడులు.. ఆవుల పేడ, గో మూత్రం, బెల్లం, పప్పుల పిండి, పుట్టమట్టిని కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. దీనిని నేరుగా ట్యాంకు నుంచి పంట పోలాలకు పైపులైను ద్వారా అందిస్తున్నారు. పంటకు సమృద్ధిగా పోషకాలు అందడంతో వరి పంట దిగుబడులు అధికంగా రావడం మొదలయ్యాయి. ఎకరా వరి ధాన్యం ఉత్పత్తి 40 బస్తాలకు పైగా వస్తోంది. వరిపంటకు జీవామృతం, అజోల్లా సాగుతో, చీడ పీడల సమస్య కూడా తలెత్తడంలేదు. వరితోపాటు టమాటా, వంకాయ, క్యాప్సికం, గోరుచిక్కుడు, మిర్చి, కొత్తిమీర, పుదీన, మెత్తికూర లాంటి ఆకుకూరలను పండిస్తున్నారు. మామిడి తోటకు, అంతర పంటలైన కూరగాయలకు కూడా జీవామృతాన్ని పైపులైను ద్వారా అందిస్తుండటంతో వాటి ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అలాగే నాటుకోళ్లను సైతం పెంచుతున్నారు. ఆదర్శంగా నిలుస్తూ.. పవన్కుమర్రెడ్డి గో పోషణతో పాటు, సాగులో చేస్తున్న శ్రమను, కృషిని గుర్తించి హైదరాబాద్ వెటర్నరీ యూనివర్శిటీ వారు దేశవాళీ పాడి పశువుల పునరుత్పత్తి, సంకరణ కోసం సాహివాల్ కోడెను అందజేశారు. పవన్రెడ్డి చేస్తున్న గో ఆధారిత వ్యవసాయాన్ని చూసి గ్రామంలో పలువురు ఆయనను ఆదర్శంగా తీసుకుని గో ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. పలువురికి ఉపాధి.. పాడిపోషణ, వ్యవసాయం చేయడానికి ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుండగా, పాల విక్రయాలు, ధాన్యం, కూరగాయలు, ఆకుకూరలను నేరుగా వినియోగదారుల ఇంటికి వెళ్లి విక్రయించడానికి నలుగురు వ్యక్తులను నియమించుకుని ఉపాధి కల్పిస్తున్నారు. సాగు శ్రేష్టమైనది రసాయన ఎరువులతో పండించిన పంటలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజారోగ్యానికి, పర్యావరాణానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి గో ఆధారిత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. 20 దేశవాళీ ఆవులతో శ్రేష్టమైన పాలను ఉత్పత్తి చేయడంతో పాటు, నాణ్యమైన పండ్లు, కూరగాయాలు, ఆకుకూరలను పండిస్తున్నాను. పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను. గ్రామభారతి సభ్యుడిగా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యుడిగా, భారతీయ కిసాన్ సంఘం సభ్యుడిగా వ్యవసాయ రంగా అభివృద్ధికి కృషి చేస్తున్నాను. – పవన్రెడ్డి, గో ఆధారిత వ్యవసాయ దారుడు, చల్లంపల్లి -
అడవిలోని అనుభూతి కలిగించే జంగల్ క్యాంపు
మహేశ్వరం: నగరవాసులకు మానసికోల్లాసంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం జంగల్ క్యాంపులో లభిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం మండలం హర్షగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మజీద్గడ్డ రిజర్వు ఫారెస్టులో 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.34 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను ఇంద్రకరణ్రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగల్ పార్కులో వినోదంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్తో సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నగరవాసులు కుటుంబంతో వచ్చి రోజంతా గడిపేందుకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. జంగల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంగల్ క్యాంపు ప్రత్యేకతలు ఫైర్ (చలికి కాచుకునే ప్రదేశం) క్యాంపును పరిశీలిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, అధికారులు నగర ఉద్యాన యోజన, కంపా, అటవీశాఖ నిధులతో జంగల్ క్యాంపును అభివృద్ధి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా అడ్వెంచర్ జోన్, జంగల్ క్యాంపు సెక్టార్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాకింగ్, రన్నింగ్ సైక్లింగ్ ట్రాక్లతో పాటు క్యాంపింగ్ సౌకర్యాలు, సాహస క్రీడలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఆటస్థలం, గజీబోలు, మల్టీపర్పస్ షెడ్స్, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్ స్పాట్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పార్కులో వంట చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా స్థలాలు ఉన్నాయన్నారు. సందర్శకుల రక్షణ చర్యలో భాగంగా క్యాంపింగ్ ఏరియా చుట్టూ చైన్లింక్డ్ ఫెన్సింగ్, పాములు చొరబడకుండా ప్రూఫ్ ట్రెంచ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పార్కులో ఉన్న రోడ్లకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అటవీవీరుల పేర్లను పెట్టి వారి త్యాగాలకు స్మరించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. నగరవాసులకు వరం హైదరాబాద్ శివారులో మంచి వాతావరణం కల్పించేందుకు జంగల్ క్యాంపు పార్కును ఏర్పాటు చేశామని, ఈ పార్కు నగరవాసులకు వరంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారొద్దనే ఉద్దేశంతో అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో జంగల్ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రులు జంగల్ క్యాంపును ప్రారంభించి, అడ్వెంచర్ జోన్ను పరిశీలించారు. అనంతరం సాహస క్రీడలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ హరీష్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి శోభ, జిల్లా అటవీశాఖ అధికారి భీమ, ఆర్డీఓ రవీందర్రెడ్డి, డివిజనల్ ఫారెస్టు అధికారి శివయ్య, మంఖాల్ ఫారెస్టు రేంజ్ అధికారి విక్రంచంద్ర తదితరులు ఉన్నారు. -
కమల దళపతి ఎవరో..
సాక్షి, రంగారెడ్డి: బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోననే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరులోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో అందరి దృష్టి ఆ పదవిపైకి మళ్లింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. వీరిలో ముగ్గురూ మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. మరొకరు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నేత. వీరిలో ఒకరు తొలిసారిగా బరిలో ఉండగా.. మరో ఇద్దరు రెండోసారి రేసులో నిలిచారు. మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బొక్క నర్సింహారెడ్డి ఈసారి కూడా పోటీపడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడకు చెందిన అర్జున్రెడ్డి గతంలో ఆశించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. అలాగే మహేశ్వరం మండలానికి చెందిన కడారి జంగయ్య యాదవ్, బస్వ పాపయ్యగౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లంతా పార్టీలో సీనియర్ నేతలు. పార్టీ కోసం దాదాపు 35 ఏళ్లకుపైగా శ్రమించిన వ్యక్తులు. జిల్లా అధ్యక్ష పదవి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం బూత్, మండల స్థాయి కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. మరోమూడు నాలుగు రోజుల్లో 50 శాతం కమిటీల నియామకాలు పూర్తికానున్నాయి. ఆ తదుపరి జరిగేది జిల్లా అధ్యక్ష ఎన్నికలే. మొత్తం మీద ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఇందుకు కొన్ని రోజుల సమయమే ఉండటంతో జిల్లా అధ్యక్ష ఎన్నికపై పార్టీలో సర్వత్రా చర్చజరుగుతోంది. పార్టీ అధిష్టానం సూచించిన వ్యక్తికే అధ్యక్ష పదవి కట్టబెడుతున్నప్పటికీ పలువురు నేతలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోసారి పీఠం కోసం.. గ్రామ అధ్యక్షుడి బాధ్యతలతో 1983లో పార్టీలో ప్రస్థానం మొదలుపెట్టిన బొక్క నర్సింహారెడ్డి.. ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. జిల్లాలో సంస్థాగతంగా ఒకింత పార్టీ బలోపేతం చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అంజన్కుమార్గౌడ్ అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో నర్సింహారెడ్డి రెండు పర్యాయాలు జనరల్ సెక్రటరీగా సేవలందించారు. తన సొంత మండలం కందుకూరులో రెండు దఫాలు పార్టీ తరఫున ఎంపీపీ స్థానాన్ని గెలిపించుకోవడంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాక ఆయన జెడ్పీటీసీ అభ్యర్థిగా రెండుసార్లు బరిలో నిలిచి సమీప ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చారు. కిసాన్ మోర్చా జిల్లా సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, సెక్రటరీగా, ట్రెజరర్గా సేవలందించారు. మొదట్లో ఏబీవీపీతోనూ సంబంధాలు కొనసాగించిన ఆయన.. పార్టీ కోసం 36 ఏళ్లు శ్రమించారు. ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో అప్పటి కమల దళపతి అమిత్షా పర్యటన విజయవంతంతో ఆయన మన్ననలు అందుకున్నారు. ఈ గుర్తింపే తనను మరోసారి అధ్యక్ష పదవిలో కూర్చోబెడుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. అధిష్టానంపై నమ్మకంతో బరిలో.. ఆది నుంచి ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలు ఉన్న పోరెడ్డి అర్జున్రెడ్డి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఇంటర్మీడియెట్లోనే విద్యార్థి నేతగా గెలిచిన ఆయన.. పార్టీలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం గడించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అర్జున్.. ప్రస్తుతం కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతసారి కూడా ఈయన అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. 1983 నుంచి 1998 వరకు ఏబీవీపీలో క్రియాశీలకంగా కొనసాగి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మూడు పర్యాయాలు పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్గా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడిగా సేవలందించారు. ఇలా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీతో సుమారు 36 ఏళ్ల అనుబంధమున్న తన పట్ల పార్టీ అధిష్టానం సానుకూలంగా వ్యవహరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తొలిసారిగా రేసులో.. కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో ఉన్నత పదవులను అలంకరించిన కడారి జంగయ్య యాదవ్ తొలిసారిగా పార్టీ జిల్లా బాస్ పదవి రేసులో ఉన్నారు. 1984 నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న జంగయ్య 1987లోనే మహేశ్వరం మండల అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నాలుగు పర్యాయాలు పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కొనసాగిన ఆయన 1996లో జిల్లా ఉపాధ్యక్షునిగా సేవలందించారు. రెండు దఫాలు సెక్రటరీగా పనిచేశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన గతంలో మహేశ్వరం మండలం తుమ్మలూరు సర్పంచ్గా ఎన్నికయ్యారు. మొత్తంగా పార్టీ బలోపేతం కోసం 35 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కింది నుంచి పైవరకు అన్ని స్థాయిల్లో పార్టీ కోసం కష్టపడిన తనను అధ్యక్ష పదవి వరిస్తుందని ధీమాతో ఉన్నారు. సుదీర్ఘ అనుభవం.. కిసాన్ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న పాపయ్యగౌడ్ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో 37 ఏళ్లపాటు పనిచేసిన అనుభవమున్న ఆయన కూడా తొలిసారిగా పదవిని ఆశిస్తున్నారు. కరసేవలో, జాతీయ సమైక్యత, దేశ సమగ్రత కోసం పార్టీ గతంలో చేపట్టిన ఏక్తా యాత్రలో పాల్గొన్న పాపయ్య.. గీతకార్మిక కుటుంబం నుంచి వచ్చి పార్టీకి పలు హోదాల్లో సేవలందించారు. యువమోర్చా జిల్లా సెక్రటరీ, ప్రసిడెంట్, పార్టీ జిల్లా వైస్ ప్రసిడెంట్, సెక్రటరీగా, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మిగిలిన నాయకులకంటే పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు అధ్యక్ష పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. -
దిశ కేసు: ఆ దారి మూసివేత
సాక్షి, షాద్నగర్ టౌన్: దిశ కేసు, నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి అడిషనల్ రిపోర్టును పోలీసులు షాద్నగర్ కోర్టుకు సమర్పించారు. దిశ కేసులో నిందితుల కస్టడీ, రిమాండ్ కాలం పూర్తి కావడంతో కేసుకు సంబంధించిన వివరాలు కోర్టుకు తెలియజేయాల్సిన నేపథ్యంలో పోలీసులు అడిషనల్ రిపోర్టును సమర్పించినట్లు సమాచారం. దిశ హత్యాచారం తర్వాత , నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం విదితమే. నిందితుల ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితులు, మృతుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాల వివరాలన్నింటినీ పేర్కొంటూ అడిషనల్ రిపోర్టును పోలీసులు కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత తుది రిపోర్టును కోర్టుకు అందజేయనున్నట్లు తెలిసింది. దారి మూసివేత.. ఎన్కౌంటర్ చేసిన ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు దారి మూసేశారు. చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరి నుంచి ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలానికి చెట్ల, పొలం గట్ల మధ్యలో నుంచి దారి ఉంది. ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పోలీ సులు ఘటనా స్థలం వద్ద గుడారాన్ని ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్కౌంటర్పై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్పై కె.సజయ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది. పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని, మృతదేహాలు పాడవకుండా ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ అభ్యర్థించగా.. ఎన్కౌంటర్పై ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్ను నియమించామని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ అభ్యర్థన మేరకు హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ధర్మాసనం కల్పించింది. -
దిశకేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్
-
దిశ కేసు: నిందితుల డీఎన్ఏలో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్ : దిశ అత్యాచారం, హత్య కేసు విచారణలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకంగా మారింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్ బోన్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. దీంతో దిశపై అత్యాచారానికి పాల్పడటానికి ముందు నిందితులు ఆమెకు మద్యం తాగించినట్లుగా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ విషయాన్ని నిందితులు ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక ఎన్కౌంటర్లో మరణించిన దిశ నిందితుల డీఎన్ఏ నివేదికలో సైతం కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో జరిగిన నేరాలతో దిశ నిందితుల డీఎన్ఏ మ్యాచ్ అవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. దీని ఆధారంగా నిందితులకు నేర చరిత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న దిశను నలుగురు నిందితులు చటాన్పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ను నియమించింది. -
జ్వాల కొత్త క్రీడా అకాడమీ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆధ్వర్యంలో కొత్త క్రీడా అకాడమీ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని సుజాత హైసూ్కల్ ప్రాంగణంలో ఈ అకాడమీని నెలకొల్పారు. గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్తోపాటు క్రికెట్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. అకాడమీకి సంబంధించిన లోగోను మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత స్టార్ రెజ్లర్, బీజింగ్, లండన్ ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన సుశీల్ కుమార్... భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ ప్రతాప్ రూడీ పాల్గొన్నారు. ‘భారత్ ఎంతో పెద్ద దేశం. కానీ మనకు బ్యాడ్మింటన్లో సైనా, సింధు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య పెరగాలి. జ్వాల అకాడమీ ద్వారా చాంపియన్లను తయారు చేయాలని అనుకుంటున్నాను. నా అకాడమీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును కలిశాను. ఆయన నుంచి సానుకూల స్పందన వచి్చంది. అకాడమీ నిర్మాణం కోసం ఎవరి సహాయం తీసుకోలేదు. సొంతంగా ఏర్పాటు చేశాను. నా అకాడమీలో కనీసం 10 మంది కోచ్లు ఉంటారు. అందులో ఇద్దరు విదేశీ కోచ్లు’ అని జ్వాల వివరించింది. వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభమయ్యే ఈ అకాడమీలో చేరాలనుకునే వారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 8826984583, 9811325251 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. -
ఆత్మరక్షణ కోసమే కాల్పులు
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: ‘దిశ’కేసు నిందితులు చటాన్పల్లి వద్ద పోలీసులపై దాడి చేయడంతోపాటు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దిశను దహనం చేసిన ప్రాంతంలో మరిన్ని ఆధారాల సేకరణ కోసం శుక్రవారం ఉదయం 5.45 గంటల సమయంలో నలుగురు నిందితులను తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్టు చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్రెడ్డితో కలిసి కాల్పులు జరిగిన తీరు, అందుకు దారితీసిన కారణాలను సజ్జనార్ మీడియాకు వివరించారు. ‘‘ఈ ప్రాంతానికి సమీపంలో భూమిలో పాతిపెట్టిన దిశ సెల్ఫోన్, పవర్బ్యాంక్ తదితర వస్తువులను తీయించడానికి నిందితులను తీసుకొచ్చాం. ఈ క్రమంలో వారు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏ2 జొల్లు శివ, ఏ3 జొల్లు నవీన్ పోలీసులపై రాళ్లు రువ్వడంతోపాటు కర్రలతో దాడి చేశారు. ఏ1 మహమ్మద్ ఆరిఫ్, ఏ4 చింతకుంట చెన్నకేశవులు పోలీసుల వద్ద ఆయుధాలు లాక్కొని కాల్పులు మొదలుపెట్టారు. అప్పటికీ ఆయుధాలు, రాళ్లు కింద పడేసి లొంగిపోవాలని హెచ్చరించినా.. వినకపోగా పోలీసుల పైకి కాల్పులు కొనసాగించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చింది. దీంతో నలుగురు నిందితులు బుల్లెట్ గాయాలతో మరణించారు. నిందితుల దాడిలో నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లు తలకు, కానిస్టేబుల్ అరవింద్గౌడ్కు గాయాలయ్యాయి. వారికి స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించాం’’అని సీపీ తెలిపారు. వారికి రాళ్లు, కర్రల దెబ్బలు మాత్రమే తగిలాయని.. బుల్లెట్ గాయాలు కావని ఆయన స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 30 నిమిషాల్లోనే.. ‘‘గతనెల 27న శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ప్లాజా వద్ద కిడ్నాప్నకు గురైన దిశపై లైంగికిదాడి, హత్య చేసి మరుసటి రోజు తెల్లవారుజామున షాద్నగర్ వద్ద చటాన్పల్లి అండర్పాస్ కింద ఆమెను దహనం చేశారు. ఈ కేసుని శంషాబాద్ డీసీపీ లోతైన దర్యాప్తు చేశారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతోపాటు రెండు చోట్ల భౌతిక ఆనవాళ్లు సేకరించాం. వీటి ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి 30న మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈనెల 4న చర్లపల్లి జైలు నుంచి నిందితులను 10రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నాం. ఆరోజు, మరుసటి రోజు విచారణ జరపగా చాలా విషయా లు చెప్పారు. దిశకు చెందిన సెల్ఫోన్, వాచీ తదితర వస్తువులు చటాన్పల్లి వద్ద దాచిపెట్టినట్లు వెల్లడించారు. వీటిని సేకరించడానికి నిందితులను అక్కడికి తీసుకెళ్లగా పోలీసులపైకి కాల్పులు మొదలుపెట్టడంతో ఇంచుమించు 50 మీటర్ల దూరం నుంచి ఎదురుకాల్పులు చేశారు. మొత్తం 30 నిమిషాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది’’అని సజ్జనార్ వివరించారు. గత నేరాలపై ఆరా.. నలుగురు నిందితుల గత నేర చరిత్రపై ఆరా తీస్తున్నట్లు సీపీ వెల్లడించారు. వాళ్లు కరుడుగట్టిన నేరస్తులని, నిందితుల డీఎన్ఏ విశ్లేషణ చేసి, దాని ఆధారంగా.. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలు కిడ్నాప్నకు గురై దహనమైన కేసులను తేల్చుతామని వివరించారు. వదంతులను ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఒక మహిళ కుటుంబ పరువుకు సంబంధించిన కేసు అని, ఇది అత్యంత సున్నితమైందని చెప్పారు. దిశ కుటుంబ సభ్యుల ప్రైవసీ కాపాడాలని కోరారు. వారితో పదేపదే మాట్లాడి ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు అందాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ ఎన్కౌంటర్ అనుకోకుండా జరిగిన ఘటన అని సజ్జనార్ బదులిచ్చారు. -
నేవీరాడార్ ఏర్పాటు చేయొద్దు
సాక్షి, పూడూరు: దామగుండం అటవీ ప్రాంతంలో 2,900 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన నేవీరాడార్ కేంద్రం ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ గురువారం పూడూరు మండల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో విద్యార్థులు మాట్లాడుతూ.. నేవీ రాడార్ ఏర్పాటు చేసి తమకు అన్యాయం చేయరాదని తమకు బతకాలని ఉందని, తమ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని, తమ ఆరోగ్యాలను పాడు చేయరాదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. కేసీఆర్ తాత, మోదీతాత మాకు న్యాయం చేయలని కోరారు. నేవీరాడార్ ద్వారా విషపూరిత సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి తమ జీవితాలను నాశనం చేయరాదని వేడుకున్నారు. త్వరలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్కు, హైకోర్టు న్యాయమూర్తికు పోస్టుకార్డు ద్వారా ఉత్తరాలను రాస్తామని విద్యార్థులు తెలిపారు. -
దిశ ఫోన్ను పాతిపెట్టిన నిందితులు
సాక్షి, హైదరాబాద్ : మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాలు, పోలీసులు అనుసరిస్తున్న తీరుకు సవాలుగా నిలిచిన దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన షాద్నగర్ దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఏడు బృందాలు రంగంలోకి దిగి సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో దిశ కేసులో కీలకంగా మారిన ఆమె సెల్ఫోన్ను నిందితులు పాతిపెట్టినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం. దీంతో మరిన్ని ఆధారాల కోసం ఘటనాస్థలంలో క్లూస్ టీం మరోసారి తనిఖీలు చేపట్టింది. బాధితురాలి ఫోన్ లభ్యమైన నేపథ్యంలో ఆమె కాల్ లిస్టు, కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దిశపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొచి విచారించేందుకు డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ బృందం ఇప్పటికే మహ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులును అదుపులోకి తీసుకొని.. విచారణను కొనసాగిస్తుంది. ఇక మిగిలిన పోలీసు బృందాల్లో ఒక బృందం సాక్ష్యాలను సేకరించనుండగా.. మరో బృందం ఫోరెన్సిక్ , డీఎన్ఏ ఆధారాలను పరిశీలించనుంది. ఇంకొక బృందం లీగల్ ప్రొసీడింగ్స్ సమర్థంగా చేపట్టేందుకు ఏర్పాటైంది. కేసులో ప్రధానంగా ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం మరొక టీమ్ రంగంలోకి దిగింది. -
టీఎస్–ఐపాస్ పురస్కారం అందుకున్న ఇన్చార్జి కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమలకు అనుమతులు జారీ చేయడంలో అత్యుత్తమ పురోగతి కనబర్చిన మన జిల్లాకు అవార్డు వరించింది. ఈమేరకు ‘టీఎస్–ఐపాస్ అవార్డు’ను ఇన్ చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్, జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్రెడ్డికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, కామర్స్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన టీఎస్–ఐపాస్ ఐదు వసంతాల వేడుకల్లో భాగంగా వీరిద్దరూ అవార్డు అందుకున్నారు. ఐదేళ్ల కింద అమల్లోకి వచ్చిన టీఎస్–ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న పరిశ్రమల సంఖ్య ఆధారంగా అన్ని జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. అత్యధికంగా పరిశ్రమలు ఉన్న తొలి జాబితాలో నిలిచిన మన జిల్లా.. సకాలంలో అనుమతుల జారీ, టీఎస్–ఐపాస్ విధానం అమలు, పారిశ్రామిక ప్రగతిలో మెరుగైన పురోగతి కనబర్చింది. ఇందుకు గుర్తింపుగా జిల్లాకు టీఎస్–ఐపాస్ అవార్డు లభించగా.. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించే కలెక్టర్, కన్వీనర్గా కొనసాగుతున్న డీఐసీ జీఎం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు లభించడంపై వారిద్దరు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల అనుమతుల జారీలో భాగస్వాములైన అన్ని శాఖల సహకారంతోనే ఇది సాధ్యపడిందని అన్నారు. -
పరిశ్రమల ఖిల్లా.. రంగారెడ్డి జిల్లా
పరిశ్రమల స్థాపనకు మన జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారింది. సూక్ష్మ నుంచి మెగా వరకు ఏ కేటగిరీని తీసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు విస్తృతంగా వెలుస్తుండటం శుభపరిణామం. హైదరాబాద్ మహానగరం శివారు చుట్టూ మన జిల్లా విస్తరించి ఉండటం, అనువైన రవాణా వ్యవస్థ కలిగి ఉండటంతో పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ‘టీఎస్–ఐపాస్’ పేరిట 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ.. పరిశ్రమలకు స్థాపనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాలసీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడవగా.. విజయవంతంగా అమలు చేసిన జాబితాలో మన జిల్లా అగ్రభాగాన ఉండటం విశేషం. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో జిల్లాకు అవార్డు వచ్చింది. బుధవారం నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించే టీఎస్–ఐపాస్ ఐదేళ్ల సంబరాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీష్, డీఐసీ జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్రెడ్డి అవార్డు అందుకోనున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పరిశ్రమల స్థాపన.. పెట్టుబడులు.. ఉపాధి కల్పనపై ప్రత్యేక కథనం.. సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమల స్థాపనలో మన జిల్లా వేగంగా దూసుకెళ్తోంది. 2014 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ చట్టం (టీఎస్–ఐపాస్) అమల్లోకి తీసుకురావడంతో మహర్దశ పట్టింది. త్వరితగతిన అనుమతులు జారీ చేయడం, నెల రోజుల నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు, ఆన్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఈ పాలసీతో కలిగింది. దీంతో పారిశ్రామికవేత్తలు.. ఎన్నో అనుకూల అంశాలు ఉన్న మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అమితమైన ఆసక్తి చూపారు. టీఎస్–ఐపాస్ పాలసీ అమల్లోకి వచ్చాక ఆయా కేటగిరీల్లో మొత్తం రూ.46 వేల కోట్ల వ్యయంతో 935 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. వీటిద్వారా 7.64 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకు 690 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.13,385 కోట్ల పెట్టుబడులు జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించడం విశేషం. పరోక్షంగా మరో 50 వేల మంది వరకు జీవనోపాధి అవకాశాలు లభించాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు కూడా మన జిల్లాలో ఏర్పాటయ్యాయి. మహానగరం చుట్టూ జిల్లా విస్తరించడం, రవాణామార్గాలు అనువుగా ఉండటం.. తదితర సానుకూలతలు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో మెగా కంపెనీలు రూ.వేల కోట్లు పెట్టుబడులు పెడుతుండగా.. మరికొన్ని విస్తరణకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టైల్స్ తయారీ చేసేందుకు వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల 500 మందికి ఉపాధి లభించనుంది. అలాగే నందిగామలో ఎంఎస్ఎన్ ఫార్మా విస్తరణకు వెళ్తోంది. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సుమారు 1,200 మందికి ఉపాధి దొరకనుంది. ఇక ఆదిబట్లలో ఏరోసిటీలో టాటా ఏరో స్పేస్ ఆరు విభాగాల్లో తమ ఉత్పత్తులను మొదలు పెడుతోంది. ఇందుకోసం రూ.1,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సేవలను మొదలుపెట్టింది. వీటికంటే ముందు జిల్లాలో ఐటీ కారిడార్, హార్డవేర్ పార్క్లు, ఐడీఏ కాటేదాన్ , ఐడీఏ కొత్తూరు తదితర సెజ్లు, పార్క్లు కూడా విస్తరించడం తో పారిశ్రామికరంగంలో జిల్లా దూసుకెళ్తోంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఇవీ.. జిల్లా శివారు ప్రాంతాలన్నీ మహానగరం చుట్టూ ఉండటం నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా లభిస్తుండటం టీఎస్–ఐపాస్ ద్వారా సరళంగా, సులభతరంగా అనుమతులు లభించడం కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం రవాణా వ్యవస్థ బాగా విస్తరించడం ఇన్చార్జి కలెక్టర్ హర్షం టీఎస్–ఐపాస్ అవార్డు లభించడంపై ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే ఉత్తమ ప్రతిభ చూపేందుకు సాధ్యమైందని పేర్కొన్నారు. అవార్డు మరింత బాధ్యతలను పెంచిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అన్ని విధాల అనుకూలమని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. టీఎస్–ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకుపైగా పెట్టుబడులు జిల్లాకు వచ్చాయని తెలిపారు. -
ఈ అడ్డాల వద్ద జర భద్రం బిడ్డా..!
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, గోదాములు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లకు ఇవి కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. రాత్రి పొద్దుపోయేదాక కొందరు ఇక్కడే మకాం వేస్తుండటం గమనార్హం. దీంతో ఈ ప్రాంతాల గుండా వెళ్లేందుకు మహిళలు, యువతులు జంకుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఇలాంటి ‘అడ్డా’లపై సాక్షి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వణుకు పుట్టిస్తున్న చటాన్పల్లి చటాన్పల్లి శివారులోని ఈ బ్రిడ్జి కిందే పాశవిక ఘటన చోటుచేసుకుంది బైపాస్ రోడ్డులోని సర్వీస్రోడ్డు పక్కన పెరిగిన ముళ్లచెట్లు షాద్నగర్టౌన్: మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చటాన్పల్లి శివారులో 44వ జాతీయ రహదారి కిందే పాశవిక దుర్ఘటన జరిగింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రహదారి ఇది. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైపాస్ కూడలి, హోటళ్లు, దాబాలు ఉన్నాయి. ఈ రహదారి పై పోలీసుల పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. కాని కింద జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు, ఇక్కడ ప్రాంతాలు అత్యంత నిర్మానుష్యంగా ఉంటాయి. ఈ సర్వీసు రోడ్డు ఇరువైపులా మొత్తం ముళ్లు, కంప చెట్లు ఉంటాయి. కొత్తూరు దాటిన తర్వాత జాతీయ రహదారి పై షాద్నగర్ వరకు బైపాస్ గుండా సీసీ కెమెరాలు లేక పోవడంతో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి వేళల్లో స్తంభాలకు కనీసం వీధి లైట్లు కూడా లేక పోవడం పలు అనర్థాలకు కారణం అవుతోంది. నిరంతం పెట్రోలింగ్ వ్యవస్ధను కొనసాగించడం, సర్వీసు రోడ్లను అభివృద్ధి చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వార ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంది. ‘జస్టిస్ ఫర్ దిశ’ ఘటన షాద్నగర్ ప్రాంతానికి భాగస్వామ్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దారుణాలు అనేకం మహిళలను దారుణంగా హతమార్చి షాద్నగర్ ప్రాంతంలో పడేసి పోవడం, మహిళలపై అత్యాచారాలు చేసి హత్యలు చేయడం వంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అయితే గతంలో 2007లో షాద్నగర్ ప్రాంతంలో 11 మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వరుస హత్య సంఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పట్లో ఈ సంఘటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. వరుస హత్య కేసుల మిస్టరీని చేజించేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అయితే వివిధ ప్రాంతాల నుండి మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం హత్య చేసిన సంఘటనలు షాద్నగర్ ప్రాంతం ప్రజల మనస్సుల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. పోలీసులు ఇకనైనా మేలుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడికి వెళ్తే ఇక అంతే..? రావిర్యాల ఆర్సీఐ రోడ్డులో భయానక పరిస్థితులు తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శ్రీశైలం హైవే రోడ్డు నుంచి ఆర్సీఐ రోడ్డులో ప్రభుత్వ భూములతో పాటు, అటవీ భూములు విస్తరించాయి. ఈ భూములు జనావాసాలకు దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారాయి. నిత్యం హైదరాబాద్ నుంచి యువత ఈ రోడ్డు నుంచి రావిర్యాలలో ఉన్న వండర్లాకు పర్యటన కోసం వస్తూ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది ఇక్కడ ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అత్యచారం చేసి అంతమొందించారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వెళ్లడమంటే.. సాహసం చేయడమే. ఇటువంటి భయానక పరిస్థితులు ఉన్నా పోలీసులు పెద్దగా నిఘా పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వెంచర్లలో తిష్ట.. రాత్రి వేళ మందుబాబులకు నిలయం.. శంషాబాద్: పట్టణం పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూఅదుపూ లేదు. పట్టణం చుట్టూ విస్తరించిన వెంచర్లన్నీ దాదాపుగా మదుబాబులకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని వెంచర్ల చుట్టూ ప్రహరీలు, అందులో ఓ గది నిర్మించి గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటి వెంచర్లలో జులాయిలు జల్సాలు చేస్తున్నారు.సింప్లెక్స్ ఉన్న నిర్మానుష ప్రాంతంలో నిత్యం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాళ్లగూడ, తొండుపల్లి, ఊట్పల్లి, సిద్ధులగుట్ట మార్గం, కొత్వాల్గూడ, హుడా కాలనీల్లో మద్యం తాగిన సందర్భంలో అనేకసార్లు గొడవలు జరిగాయి. శంషాబాద్ పట్టణం నుంచి నర్కూడ వైపు వెళ్లే దారిలో వెంచర్లలో నిత్యం మందుబాబులు తిష్ట వేస్తుంటారు. గగన్పహాడ్ ట్రాన్స్జెండర్లకు అడ్డాగా మారింది. చీకటి పడితే ఇక్కడ చాలు పదుల సంఖ్యలో ట్రాన్స్జెండర్లు దారి వెంట రాకపోకలు జరిపేవారిని ఆకర్షిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రహదారి పక్కనే ఓ మూతబడిన మద్యం కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో అన్ని కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. చీకటి పడితే భయమే.. తుర్కయంజాల్ మాసాబ్ చెరువు వద్ద గల రాతి నిర్మాణం తుర్కయంజాల్: నగర శివారు ప్రాంతమైన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నాగార్జునసాగర్ రహదారిపై గల మాసాబ్ చెరువు కట్ట మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే చాలు ఇక్కడ బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. రాత్రి 10 గంటల వరకు ఇదే పరిస్థితి. ముఖ్యంగా వాహనాలను రోడ్డు పక్కన నిలిపి మద్యం తాగడం ఇక్కడ నిత్యం జరిగే తంతు. ఈ చెరువు తూము వద్ద గల రాతి కట్టడంపై పొద్దుపోయేవరకు యువతీ యువకులు అక్కడే కాలక్షేపం చేస్తుంటారు. చెరువుకు రెండు పక్కలా నిర్మానుష ప్రాంతాలు ఉంటాయి. కట్టపై అంతంత మాత్రంగానే పోలీసుల గస్తీ ఉంటుంది. కొన్ని సార్లు అక్కడి నుంచి పెట్రోలింగ్ వాహనాలు వెళ్లినా.. మద్యం సేవిస్తున్న వారిని ఏమనక పోవడం గమనార్హం. నిత్యం మద్యం బాటిళ్లు, పేకాటకార్డులు దర్శనం భయంగొల్పుతున్న ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్ గోదాం ఇబ్రహీంపట్నం: పట్టణంలోని పాత బస్టాండ్ గోదాముల్లో, పాత పోలీస్ స్టేషన్, వినోభానగర్లో అసంపూర్తిగా నిర్మాణం నిలిచిన డిగ్రీ కళాశాల భవనాలు ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లు ఇక్కడే తిష్ట వేస్తున్నారు. రాత్రిళ్లు పొద్దు పోయేవారు ఇక్కడే మకాం వేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్ళు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి. పాత బస్టాండ్ గోదాంల వద్ద ఉదయం నుంచి బైక్లు అడ్డంగా పార్క్చేసి గంటల తరబడి అక్కడే టైంపాస్ చేస్తున్నారు. మందుబాబులు, పోకిరీలు రాత్రిళ్ళు బైఠాయిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కళాశాల భవనంలోని ఓ గదిలో ఖాళీ మద్యం సీసాలు -
తొండుపల్లి టోల్గేటు వద్ద సీసీ కెమెరాలు
సాక్షి, శంషాబాద్: ‘సీసీ కెమెరాల ఏర్పాటు.. నేరం జరిగాక ఆధారాలు సేకరించడానికి కాదు.. నిరంతర పర్యవేక్షణతో నేరాల నియంత్రణకు వాటిని వినియోగించాలి.. సీసీ ఫుటేజీ రికార్డు కూడా స్పష్టంగా లేదు’ అని శంషాబాద్ ఘటన తర్వాత పోలీసుల తీరుపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రెండేళ్ల కిందట ఓ వృద్ధుడు నర్కూడ సమీపంలోని ఒయాసిస్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతని మెడ భాగంలో పదునైన ఆయుధంతో దాడిచేశారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నేరస్తులను గుర్తించలేదు. కారణమేమంటే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం. ఆరు నెలల కిందట నర్కూడలోని అమ్మ పల్లి దేవాలయంలో గుర్తుతెలియని దుండ గులు విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఇక్కడ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఉండగా.. ఫుటేజీని నిక్షిప్తం చేసే హార్డ్ డిస్క్ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో దుండగుల ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. నేరాల అదుపు, నియంత్రణలో భాగంగా నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. శంషాబాద్ మండల పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిలో ఔటర్ టోల్గేటు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీ రికార్డు స్పష్టంగా లేదని పేర్కొనడం ఆందోళన కల్గిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి పోలీసులు దాతల సహకారంతో విడతల వారీగా రహదారులు, ప్రధాన రోడ్లు, కూడళ్లతో పాటు గ్రామాల్లో 1400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు ఇంటర్నెట్ ప్రొటోకాల్ తరహా కెమెరాలు ఉన్నాయి. వీటిని ఇంటర్నెట్ ద్వారా సెల్ఫోన్లకు అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవచ్చు. ఈ కెమెరాలు హెచ్డీ కెమెరాల కంటే కూడా నాణ్యమైనవిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే, ఔటర్ మార్గం, పరిసరాల్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెమెరాల నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. తొండుపల్లి వద్ద జరిగిన ఘటనలో ఈ కెమెరాల్లో ఆధారాలు సరిగా రికార్డు కాలేదని మహిళా కమిషన్ సభ్యురాలు చెప్పడం గమనార్హం. తీరు మారేనా.. ఆదివారం తొండుపల్లి టోల్గేటు సమీపంలో రహదారి పక్కన నిలిపిన వాహనం పశు వైద్యురాలి హత్యోదంతం తర్వాత కూడా ఔటర్ టోల్గేటు వద్ద తీరు మారడం లేదు. శంషాబాద్లోని తొండుపల్లి వద్ద గత నెల 28న పశువైద్యురాలి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ టోల్గేట్ వద్ద సర్వీసు దారి లారీలకు అడ్డాగా మారడంతోనే ఈ దురాఘతం చోటు చేసుకుంది. ఇంత దారుణం చోటు చేసుకున్న తర్వాత కూడా లారీల పార్కింగ్ నివారణకు చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. తొండుపల్లి గ్రామం నుంచి సర్వీసు మార్గం వరకు దాదాపు 300 మీటర్ల దూరం పూర్తిగా లారీలకు అడ్డాగా మారింది. లారీ మాటున అమాయకురాలిని నమ్మించి దురాఘతానికి పాల్పడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. పోలీసులు మాత్రం ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల సీసీ కెమెరాలతో నిఘాను ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆదివారం తొండుపల్లి టోల్గేటు సమీపంలో రహదారి పక్కన నిలిపిన వాహనం ఆన్లైన్ విధానం అమలు చేస్తే.. సీసీ కెమెరాలను పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేయాలంటే ఆన్లైన్ విధానం అమలులోకి రావాలి. ప్రస్తుతం ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యాలయాల్లో హార్డ్ డిస్క్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇక్కడే కెమెరాలను పర్యవేక్షించేందుకు స్క్రీన్ ఏర్పాటు చేశారు. అయితే వీటి ద్వారా నేరాలకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికి మాత్రమే అనువుగా ఉంటుంది. ఒక వేళ సీసీ కెమెరాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకొస్తే కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించవచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా వీటిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, వాహనాల పార్కింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశాలుంటాయి. ఇక రాత్రి వేళల్లో వాహనాల లైట్లు కెమెరాలకు నేరుగా తాకడంతో ఆధారాలను రికార్డు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి చోట్ల కెమెరాలను వేరే కోణాల్లో అమర్చుకోవాల్సి ఉంది. కెమెరాలను మార్చాలని నివేదిక పంపిస్తున్నాం.. హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని మార్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు హెచ్ఎండీఏ అధికారులకు సమాచారం ఇస్తున్నాం. శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కెమెరాల నిర్వహణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం కానిస్టేబుల్ను నియమించాం. – వెంకటేష్, సీఐ, శంషాబాద్ -
ప్లీజ్ మా ఇంటికి ఎవరూ రావొద్దు: ప్రియాంక పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్ : అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృగాళ్ల దాష్టీకానికి ప్రాణాలు కోల్పోవటాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దుస్సంఘటనను తలచుకుని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. అయితే పరామర్శల పేరుతో పలువురు నేతల పర్యటనతో వారు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. చనిపోయిన తమ కుమార్తెను ఎవరూ తిరిగి తీసుకురాలేరని, దయచేసి తమను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నేతలు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల నుంచి పలువురు నేతలు ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ముందే దొరికినా వదిలేశారు! మాకు సానుభూతి అవసరం లేదు.. అయితే ప్రియాంకా రెడ్డి కుటుంబసభ్యులు... తమ ఇంట్లోకి ఎవరూ రాకుండా లోపల నుంచి గేటుకు తాళం వేసుకున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరిగితే చాలని, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు. తమ వేదనను అర్థం చేసుకోవాలని కోరారు. సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ ప్రియాంక దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులు ఇప్పుడు తమ ఇంటి చుట్టూ తిరగడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి స్పందించాల్సి ఉందని డిమాండ్ చేశారు. బిడ్డ చనిపోయాక ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి రాజకీయ నాయకులు రావడం ఎందుకంటూ మండిపడ్డారు. సానుభూతి, పరామర్శల పేరుతో తాము విసిగిపోయామని... ఎవరు వచ్చినా తమకు చేసేదేమీ లేదని అన్నారు. అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను శిక్షించాలని ఆందోళన చేసినవారిపై లాఠీఛార్జ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నలు సంధించారు. సంబంధిత వార్తలు 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రియాంక కేసులో ఇదే కీలకం ‘నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు’ ఈ ఘటన నన్ను కలచివేసింది -
చర్లపల్లి జైలుకు ఉన్మాదులు
షాద్నగర్టౌన్, షాద్నగర్ రూరల్: ప్రియాంకారెడ్డి హత్యోదంతంలో పాల్గొన్న దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు శనివారం తెల్లవారు జామున 4గంటల సయమంలో శంషాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించా రు. పోలీసులు స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేయించి తహసీల్దార్ ఎదుట హాజరు పర్చి ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీస్ స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు ప్రియాంకరెడ్డిని హత్య చేసిన దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును మెజిస్ట్రేషన్ ఎదుట హాజరు పరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు చేయించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, నిందితులు పోలీస్స్టేషన్లో ఉండటం.. బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముగ్గురు డాక్టర్లు పోలీస్ స్టేషన్కే వచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ సురేందర్, డాక్టర్ కిరణ్లు నిందితులకు సుమారు రెండు గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో.. పట్టుబడిన నిందితులను షాద్నగర్ కోర్టులో శనివారం ఉదయం హాజరుపరచాల్సి ఉంది. అయితే, మహబూబ్నగర్ జిల్లా కోర్టులో సమావేశం నిమిత్తం షాద్నగర్ కోర్టు జడ్జిలు అక్కడికి వెళ్లారు. దీంతో ఫరూఖ్నగర్ తహసీల్దార్ పాండునాయక్, ఆర్ఐ ప్రవీణ్ పోలీసు వాహనంలో స్టేషన్కు వచ్చారు. స్టేషన్లో తహసీల్దార్ పాండునాయక్ ఎదుట పోలీసులు నిందితులను హాజరుపరిచారు. వారికి తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. చర్లపల్లి జైల్ వద్ద పోలీసులతో వాగ్వివాదం చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత... కుషాయిగూడ: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో అరెస్టైన నిందితులను శనివారం కట్టుదిట్టమైన భద్రత నడుమ షాద్నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు పెద్దెత్తున్న జైలు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తూ జైలు వైపు దూసుకొచ్చారు. జైలు మెయిన్ గేట్కు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. జైలు వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను తరలిస్తున్న వాహనాలు జైలు వద్దకు చేరుకునే సమయంలో చక్రిపురం నుంచి, చర్లపల్లి నుంచి జైలు వైపుగా వచ్చే వాహనాలను నిలిపేశారు. నిందితులను తరలిస్తున్న వాహనం సాయంత్రం 6:05 నిమిషాలకు జైలులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో జైలు వైపు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు రోప్తో అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో వారందరిని పోలీసులు అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్స్టేషన్కు తరలించారు. నిందితులను చర్లపల్లి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్లో వేర్వేరు సెల్లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వార్తలు: ముందే దొరికినా వదిలేశారు! 28 నిమిషాల్లోనే చంపేశారు! -
పెల్లుబికిన ప్రజాగ్రహం
షాద్నగర్ టౌన్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ఆమెను దారుణంగా హత్యచేసిన ఉన్మాదులను వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు షాద్నగర్ పోలీస్ స్టేషన్కు పోటెత్తారు. వారిని తమకు అప్పగిస్తే ప్రజాకోర్టులో తగిన బుద్ధి చెబుతామంటూ ఆందోళన చేశారు. ఓ దశలో పోలీస్స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు షాద్నగర్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు స్టేషన్కు భారీగా చేరుకున్నారు. వేలాది మంది ఒక్కసారిగా తరలి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు. లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో కొంతమంది పోలీస్స్టేషన్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా.. పలువురు నిరసనకారులు పోలీసులపైకి చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అరగంట తర్వాత మళ్లీ వారంతా స్టేషన్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. వారిని అదుపు చేయాలని పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఠాణా ఎదుట ఏర్పాడు చేసిన బారికేడ్లను కూడా ఆందోళనకారులు తోసేసి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేసి చెదరగొట్టాయి. పోలీసు వాహనాల అడ్డగింత.. రాళ్లదాడి ప్రియాంక హత్య కేసులోని నిందితులను పోలీసులు భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఓ వ్యక్తి పోలీసు వ్యాన్కు అడ్డుగా పడుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. దీంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు మరోసారి లాఠీచార్జీ చేసి, వారిని చెదరగొట్టారు. అనంతరం నిందితులను అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు షాద్నగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రజలు ఆందోళన విరమించారు. చదవండి: ముందే దొరికినా వదిలేశారు! 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త -
ముందే దొరికినా వదిలేశారు!
డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. పైగా ఓవర్ లోడ్.. అలాంటి లారీ కనిపిస్తే ఆర్టీఓ ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. కానీ మహబూబ్నగర్ ఆర్టీఓ ఆ పని చేయలేదు. ముందు హైవేపై అక్రమ పార్కింగ్.. తర్వాత సర్వీస్ రోడ్డులో గంటల తరబడి లారీ... అప్పుడు పెట్రోలింగ్ పోలీసులు ఏం చేయాలి? లారీని తీసేలా చర్యలు తీసుకోవాలి. కానీ వారు ఆ పని చేయలేదు. ఈ రెండు ఘటనల్లో ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతోనే ఉండేది. అక్కడ ఆర్టీఓ, ఇక్కడ పోలీసులు తమ విధులు కచ్చితంగా పాటించి ఉంటే ఓ అమాయక అతివ..ఉన్మాదుల పశువాంఛకు బలయ్యేది కాదు. సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డిజిల్లా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేర్వేరు అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన నిందితులను రెండుసార్లు వదిలేయడమే ప్రియాంక పాలిట శాపమైంది. ఆమెపై హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు నిందితులు వస్తున్న లారీని మహబూబ్నగర్ ఆర్టీఓ పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడం, పైగా ఓవర్ లోడ్ ఉండటంతో నిబంధనల ప్రకారం దానిని సీజ్ చేయాల్సి ఉండగా.. ఆర్టీఓ ఆ పని చేయకుండా వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం తొండుపల్లి చేరుకున్న నిందితులు లారీని హైవేపై అక్రమంగా పార్క్ చేశారు. ఘటన జరగడానికి 12 గంటల ముందు అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్ పోలీసులు.. లారీని అక్కడి నుంచి తీసేయాలని హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో నిందితులు తొండుపల్లి టోల్ప్లాజా గేట్ దగ్గరున్న సర్వీస్ రోడ్డులో లారీని నిలిపి అలాగే ఉంచారు. అక్కడే చాలాసేపు లారీ ఉండటం.. ఆపై అక్కడకు వచ్చిన ప్రియాంకను నిందితులు చూడటంతో వారి మదిలో దుర్బుద్ధి పుట్టి పథకం ప్రకారం ఘాతుకానికి తెగబడ్డారు. ఒకవేళ ఆర్టీఓ ఆ లారీని సీజ్ చేసినా.. సర్వీస్ రోడ్డులో కూడా అంతసేపు లారీని నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా.. ఈ దురాగతం జరిగి ఉండేది కాదని రిమాండ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు శనివారం షాద్నగర్ మొదటి శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలివీ.. ఆర్టీఓకి చిక్కి ... నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ నవంబర్ 21న బూర్గుల గ్రామం నుంచి ఇనుప కడ్డీలు తీసుకుని వెళ్లి కర్ణాటకలోని రాయచూర్లో ఆన్లోడ్ చేశారు. అనంతరం లారీ యజమాని సూచనలతో నవంబర్ 24న గంగావతికి వెళ్లి ఇటుకలు లోడ్ చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు. వచ్చేదారిలో నవీన్, చెన్నకేశవులు గుడిగండ్ల గ్రామంలో కలిశారు. అదే గ్రామంలో పొదల్లో ఉన్న ఐరన్ చానల్స్ను లోడ్ చేసుకుని తీసుకొస్తుండగా 26న మహబూబ్నగర్ ఆర్టీఓ లారీని ఆపి తనిఖీలు చేశారు. ఆరిఫ్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, పైగా లారీ ఓవర్ లోడ్తో ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓకు లారీ అప్పగించి రావొద్దంటూ యజమాని స్పష్టంచేయడంతో ఆరిఫ్.. లారీ స్టార్ట్ కాకుండా చూసేందుకు సెల్ఫ్ స్టార్ట్ వైర్ పీకేశాడు. దీంతో ఆర్టీఓ లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యంలో రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద ఇనుప కడ్డీలను విక్రయించిన నిందితులు రూ.4 వేలు సంపాదించారు. అనంతరం తొండుపల్లి వచ్చి అక్కడే లారీ కేబిన్లో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చి అక్కడి నుంచి లారీని తీసేయాలని హెచ్చరించడంతో.. సమీప దూరంలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులోకి లారీని తీసుకెళ్లి అక్కడ నిలిపి ఉంచారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి, కేబిన్లోనే తాగుతూ కూర్చున్నారు. ఆ సమయంలో లారీ పక్కనే స్కూటీ పార్క్ చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రియాంకారెడ్డిని చూశారు. ఆమె అందంగా ఉందని, స్కూటీ కోసం తిరిగి వచ్చినప్పుడు ఆమెపై అత్యాచారం చేయాలని నిందితులు కుట్ర పన్నారు. పథకం ప్రకారం స్కూటీ వెనుక టైర్ను నవీన్ పంక్చర్ చేశాడు. అప్పటికే ఫుల్ బాటిల్ మద్యం తాగిన నిందితులు మరో హాఫ్ బాటిల్ తెచ్చుకుని తాగుతూ కూర్చున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రియాంక రావడాన్ని గమనించారు. ఆరిఫ్, చెన్నకేశవులు ఆమె వద్దకు వెళ్లి.. మేడమ్, మీ స్కూటీ టైర్ పంక్చర్ అయిందని చెప్పి మాట కలిపారు. వారి వాలకం చూసిన ప్రియాంక స్పందించలేదు. కానీ నిందితులు ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటించారు. స్కూటీ టైర్లో గాలి నింపుకొని తీసుకురావాలని ఆరిఫ్.. శివను పంపించాడు. ఆరిఫ్ మాట్లాడుతుండగానే ప్రియాంక తన చెల్లెలికి ఫోన్ చేసి లారీ డ్రైవర్లును చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. కొద్దిసేపటికి షాప్ మూసి ఉందంటూ శివ తిరిగి వచ్చాడు. హెల్ప్.. హెల్ప్ అన్నా వదిలిపెట్టలేదు మరో షాప్లో గాలి నింపుకొని వస్తానంటూ శివ మళ్లీ బండి తీసుకుని వెళ్లాడు. అతడు గాలి నింపుకొని తిరిగి వచ్చిన వెంటనే నిందితులు తమ పథకాన్ని అమలు చేశారు. ఆరిఫ్ ప్రియాంక చేతులు పట్టుకోగా.. చెన్నకేశవులు ఆమె కాళ్లు, నవీన్ నడుము వద్ద పట్టుకుని ప్రహరీ గోడ లోపలున్న చెట్ల పొదల్లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో ఆమె హెల్ప్.. హెల్ప్ అంటూ ఆర్తనాదాలు చేసినా నిందితులు కనికరించలేదు. అరుపులు బయటకు వినిపించకుండా ఆరిఫ్ ఆమె నోటిని తన చేతితో మూసివేశాడు. వెంటనే నవీన్ ఆమె సెల్ఫోన్ను స్విచ్చాఫ్ చేశాడు. శివ ఆమె దుస్తులను లాగేశాడు. దీంతో మళ్లీ హెల్ప్.. హెల్ప్ అని అరవడంతో నవీన్, చెన్నకేశవులు ప్రియాంక నోట్లో మద్యం పోశారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు పాశవికంగా అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రియాంక స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి స్పృహ రావడంతో నిందితులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఆరిఫ్ ఆమె నోరు, ముక్కును చేతులతో గట్టిగా అదిమి పట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. నవీన్ కుమార్ ఆమె సెల్ఫోన్, పవర్ బ్యాంక్, వాచీలను కవర్లో పెట్టి లారీలో ఉంచాడు. అనంతరం ఓ బెడ్షీట్లో మృతదేహాన్ని చుట్టి లారీలో పడేశారు. అక్కడి నుంచి నవీన్, శివ స్కూటీపై, మహమ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో షాద్నగర్ వైపు రాత్రి 11 గంటలకు బయలుదేరారు. నవీన్, శివ బాటిల్ తీసుకుని పెట్రోల్ కోసం కొత్తూరు శివారులోని బంకుకు వెళ్లారు. అయితే, వారిపై అనుమానం వచ్చిన బంక్ ఉద్యోగి లింగరామ్ గౌడ్ బాటిల్లో పెట్రోల్ పోయడానికి నిరాకరించాడు. దీంతో దగ్గర్లో ఉన్న ఐవోసీ పెట్రోల్ బంక్లో నిందితులిద్దరూ పెట్రోల్ కొనుగోలు చేశారు. షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి అండర్పాస్ వద్దకు అందరూ చేరుకున్నారు. మృతదేహాన్ని లారీ నుంచి దింపి అండర్పాస్ కిందికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ప్రియాంక సిమ్కార్డులు, బ్యాగ్ను అదే మంటల్లో వేసి కాల్చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లిపోయారు. సంబంధిత వార్తలు 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రియాంక కేసులో ఇదే కీలకం ‘నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు’ -
షాద్నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్..టెన్షన్..
సాక్షి, రంగారెడ్డి : షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రియాంకారెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, నగర ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్లోకి వచ్చేందుకు యత్నించారు. బారికేడ్లను తోసుకుంటూ స్టేషన్వైపు పరుగులు తీశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిందితులను ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దకే డాక్టర్లను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నిందితులను షాద్నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఆమె ఇంటికి వెళ్లనున్నారు. న్యాయ సహాయం అందించం ప్రియాంకారెడ్డి హత్యను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ బార్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. నిందితులకు ఎటువంటి న్యాయ సహాయం అందించకూడదని మహబూబ్నగర్ జిల్లా బార్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. నిందితుల బెయిల్ కోసం ఎవరూ సహకారం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. -
నా కొడుకును ఎలా చంపినా పర్లేదు
సాక్షి, మహబూబ్నగర్ : ప్రియాంకను ఎలా చంపారో.. తన కొడుకును కూడా అలాగే చంపినా ఫర్వాలేదని ప్రియాంకారెడ్డి హత్యకేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియాకు తెలిపారు. తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్ ఆరిఫ్ (26), ఏ-2 జొల్లు శివ (20), ఏ-3 జొల్లు నవీన్ (20), ఏ-4 చింతకుంట చెన్నకేశవులు (20) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రియాంకను లాక్కెళ్లి, లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడం అంతా 28 నిమిషాల్లోనే జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులను ఉరి తీయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు చెన్నకేశవులు తల్లి జయమ్మ ’సాక్షి’తో మాట్లాడారు. ’నా కొడుకు ఇట్లా చేస్తాడనుకోలేదు. లవ్ మ్యారేజీ చేసుకున్నప్పటికీ ఏం అనలేదు. అయ్యిందేదో అయ్యిందనుకున్నాం. వాడికి కిడ్నీ పాడైంది. జక్లేర్ వ్యక్తి(మహ్మద్ ఆరిఫ్)తో స్నేహం చేసిన తర్వాతే పాడైపోయాడు. లారీ లోడ్ చేయాలని వాడే నా కొడుకును తీసుకుపోయిండు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుతున్నారు. అయితే అందరికీ ఒకటే బాధ. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు తెల్లవారుజామున రెండు గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలా చంపినా ఫర్వాలేదు. ఉరి వేయండి లేదా కాల్చి చంపుర్రి. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరూ వినరు. నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కొడుకును కనలేదు కదా. ఆ అమ్మాయి తల్లిది కూడా కడుపుకోతే. అందరిదీ అదే బాధ’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక హత్యకేసులో కొత్త ట్విస్ట్! నా కొడుకు అలాంటివాడు కాదు: ఆరిఫ్ తల్లి అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు 28 నిమిషాల్లోనే చంపేశారు! -
ప్రియాంక హత్యకేసులో కొత్త ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఐదో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడు నారాయణపేట జిల్లా పొర్లకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డిని బుధవారం రాత్రి షాద్నగర్ హైవేలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులు.. ఏ–1 మహమ్మద్ ఆరిఫ్ (26), ఏ–2 జొల్లు శివ (20), ఏ–3 జొల్లు నవీన్ (20), ఏ–4 చింతకుంట చెన్నకేశవులు (20)లను పోలీసులు అదుపులోకి తీసుకొని షాద్నగర్ పీఎస్కు తరలించారు. శుక్రవారం రాత్రంతా నిందితులను విచారించారు. ఈరోజు(శనివారం) కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరనున్నారు. ప్రియాంక ఇంటికి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కాగా, ప్రియాంకారెడ్డి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కాసేపటి క్రితమే ప్రియాంక ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రియాంకారెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, నగర ప్రజలు డిమాండ్ చేశారు. నినాదాలు చేసుకుంటూ స్టేషన్లోకి వచ్చేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కాగా, నిందితులను మెడికల్ ఎగ్జామిన్ కోసం ఆస్పత్రికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మెడికల్ ఎగ్జామిన్ తర్వాత నిందితులను షాద్నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చదవండి: 28 నిమిషాల్లోనే చంపేశారు! ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
స్కూటీ అక్కడ.. నంబర్ ప్లేటు ఇక్కడ
షాద్నగర్ టౌన్: హత్యకు గురైన పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి స్కూటీ నంబర్ ప్లేటు (టీఎస్ 08 ఈఎఫ్ 2677) షాద్నగర్ పరిధి లోని చటాన్పల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి పక్కన పడి ఉంది. నిందితులు ప్రియాంకా రెడ్డిని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద అత్యాచారం చేసి హతమార్చి లారీలో చటాన్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. దుండగులు శివ, నవీన్ లారీ వెంట చటాన్పల్లి బ్రిడ్జి వద్దకు వచ్చారు. ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని తగులబెట్టి ఆ తర్వాత స్కూటీ నంబర్ ప్లేటును ఘటన స్థలం వద్దనే తొలగించి జాతీయ రహదారి పక్కనే చెట్లలో పడేశారు. అయితే ఈ నంబర్ ప్లేటుపై ఎస్, ఎఫ్ అక్షరాలు లేవు. నంబర్ ప్లేటు తొలగిం చిన స్కూటీపై శివ, నవీన్ కొత్తూరు జేపీ దర్గా జంక్షన్ వద్దకు వెళ్లారు. మృతదేహం మంటల్లో పూర్తిగా కాలిపోయిందో.. లేదో.. చూసేందుకు చటాన్పల్లి బ్రిడ్జి వద్దకు మళ్లీ అదే స్కూటీపై వచ్చారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన విషయాన్ని గుర్తించి స్కూటీ పై కొత్తూరు జేపీ దర్గా జంక్షన్ వద్దకు వెళ్లారు. జేపీ దర్గా రోడ్డులో ఉన్న నాట్కో పరిశ్రమ సమీపంలో స్కూటీని విడిచి పెట్టి మిగతా ఇద్దరు నిందితులతో కలసి లారీలో పరారయ్యారు. కఠిన శిక్ష : డీజీపీ సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డి హత్యపై డీజీపీ మహేందర్రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. ఎవరు ఆపదలో ఉన్నా సరే 100 నంబర్కి డయల్ చేయాలని, లేదా హాక్ ఐ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డీజీపీ సూచించారు. -
పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా/శంషాబాద్: ఆధునిక వాహనాలు.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నా క్షేత్రస్థాయిలో పోలీసుల తీరు లో మాత్రం మార్పు రావట్లేదు. శంషాబాద్ పరిధి లో చోటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి దారు ణ హత్య ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితుల్ని పట్టుకున్నప్పటికీ ఘటనకు ముందు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఉంటే ప్రియాంక ప్రాణాలతో మిగిలి ఉండేది. ఈ కేసులో పోలీసుల అలసత్వం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. ఈ కేసు నమోదు, ప్రాథమిక దర్యాప్తులో సైబరాబాద్ పోలీసుల తీరును ప్రియాంక తండ్రి శ్రీధర్రెడ్డితో పాటు పౌరసమాజం తీవ్రంగా విమర్శిస్తోంది. ఫిర్యాదు తీసుకోవడానికీ విముఖత బుధవారం రాత్రి ప్రియాంక సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన తర్వాత ఆమె కుటుంబీకులు అనేక ప్రాం తాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐఏ) పోలీసుస్టేషన్కు వెళ్లారు. జరిగిన విషయం చెప్పి ప్రియాంక ఆఖరుసారి మాట్లా డినప్పుడు ఉన్న ప్రదేశం వివరాలు చెప్పారు. ఆ రాత్రి డ్యూటీలో ఉన్న పోలీసులు ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని, శంషాబాద్ రూరల్ పీఎస్కు వెళ్లాలని పంపించారు. అక్కడకు వెళ్లిన వారిని మళ్లీ ఆర్జీఐఏ ఠాణాకు తిరిగి పంపించారు. ప్రియాంక తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏ స్టేషన్లోనైనా ఫిర్యా దు తీసుకుని పోలీసులు రంగంలోకి దిగివుంటే ఆమె ప్రాణాలతో ఉండేదనే వాదనలు విన్పిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు రెండోసారి తమ ఠాణాకు వచ్చిన తర్వాతగానీ మిస్సింగ్ కేసు నమోదు చేయలేదు. ఇక్కడే జరగాల్సిన జాప్యం జరిగిపోయింది. బాధితులు వచ్చినప్పుడు పరిధుల విషయం పక్కన పెట్టి స్పందించాలని ఉన్నతాధికారులు, కోర్టులు పదేపదే స్పష్టం చేస్తున్నా పోలీసుల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. తక్షణం స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం, ఆ తర్వాత పరిధి ఆరా తీసి ఆ ఠాణాకు బదిలీ చేయడం వంటి విధానాలే కరువయ్యాయి. కాగా, ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వహించిన ఓ సీఐ, ఓ ఎస్ఐపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కెమెరాల ఫీడ్ చూస్తూ కాలక్షేపం... మిస్సింగ్ కేసుల దర్యాప్తులో పోలీసులు తీవ్ర నిర్ల క్ష్యం వహిస్తున్నారు. తప్పిపోయింది యుక్త వయ స్సు వారైతే ఉద్దేశపూర్వకంగానే ఎవరితోనో కలిసి వెళ్లిపోయి ఉంటారని, పెద్ద వయస్సు వారు అయి తే కుటుంబీకులతో ఉండటం ఇష్టం లేక దూరమై ఉంటారని చెప్తూ కాలయాపన చేస్తుంటారు. ప్రియాంక మిస్సింగ్ కేసు దర్యాప్తులోనూ సైబరాబాద్ పోలీసులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శించారు. కేసు నమోదు చేసిన తర్వాత.. పోలీసులు అవమానకరంగా, హేళనగా మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘మీ బిడ్డ ఎవరితోనైనా వెళ్లిందేమో? లవర్ తీసుకెళ్లాడేమో? ఎక్కడకీ పోదులే.. తిరిగి ఇంటికి వస్తుందిలే’ అంటూ వ్యాఖ్యలు చేసి వారిని మనోవేదనకు గురి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు టోల్ప్లాజా వద్దకు వచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తూ కాలక్షేపం చేశారే తప్ప సరైన దిశలో కేసును దర్యాప్తు చేయలేకపోయారు. ఉదంతం తీవ్రతను, పూర్వాపరాలను కుటుంబీకులు వివరించి లారీడ్రైవర్ల ప్రమేయంపై అనుమా నం కూడా వ్యక్తం చేశారు. అప్పుడైనా రంగంలోకి దిగి శంషాబాద్తో పాటు పక్కన ఉన్న షాద్నగర్ అధికారులను అప్రమత్తం చేసి అనుమానిత ప్రాం తాల్లో పోలీసు వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహించినా నిందితులు మృతదేహంతో సహా దొరికేవా రు. అలా చేయకపోవడంతోనే నిందితులు మృతదేహాన్ని లారీలో పెట్టుకుని దాదాపు 30 కి.మీ. ప్ర యాణించగలిగారన్న వాదనలు విన్పిస్తున్నాయి. పట్టింపులేని పెట్రోలింగ్ సంఘటన జరిగిన ప్రాంతం పక్కనే ఉన్న సర్వీసు రహదారి నుంచి పెట్రోలింగ్ వాహనం నాలుగు సార్లు చక్కర్లు కొట్టినట్లు సీసీ టీవీల్లో నమోదైంది. పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులు అటు ఇటుగా తిరగడమే తప్ప ఆగి ఉన్న లారీలను తీయించే విషయంలో నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టమవుతోంది. రోడ్డుపై అడ్డంగా ఆగి ఉన్న లారీని అక్కడి నుంచి తీయిస్తే జాతీయరహదారి నుంచి రాకపోకలు సాగించే వారికి లోపల జరిగే సంఘటన స్పష్టంగా కనిపించేది. దీంతో ప్రియాంక దుర్ఘటన జరిగి ఉండకపోయేదనే వాదనలున్నాయి. భయం భయంగా ఉంది పెద్దకూతురి మరణం తీవ్రంగా కలచివేసిందని, చిన్న కుమార్తెను ఉద్యోగానికి పంపేందుకు భయపడుతున్నామని శుక్రవారం పరామర్శించడానికి వచ్చిన మంత్రులతో ప్రియాంకరెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో ప్రియాంక చదువుతున్న సమయం లోనే నాలుగేళ్ల క్రితమే శంషాబాద్కు వచ్చామని, భవ్యకు కూడా సమీప ఎయిర్ పోర్టులో ఉద్యోగం రావడంతో ఇక్కడే ఉండిపోయామన్నారు. కొద్దిరోజుల తర్వాత ప్రియాంక కూడా హైదారాబాద్కు బదిలీ చేయించుకుంటానందని, ఇంతలోనే ఘో రం జరిగిపోయిందని వాపోయారు. సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన లేక కూడా తన కుమార్తె హత్యకు ఓ కారణమని ప్రియాంక తండ్రి శ్రీధర్రెడ్డి తెలిపారు. నేరాలపై అవగాహన పెంచాల్సిన అవసరముందని, నిందితుల తరఫున న్యాయవాదులు ఎవరూ వాదించకూడదని కోరారు. నిందితులకు ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా త్వరగానే శిక్షపడుతుందని ఆశిస్తున్నానన్నారు. 10 అడుగులు వేసుంటే.. టోల్ ప్లాజాకు యాభై నుంచి అరవై మీటర్ల దూరం.. జాతీయ రహదారికి కేవ లం ఇరవై నుంచి ముప్పై అడుగుల దూరంలోనే దారుణం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సర్వీసు ర«హదారిని ఆనుకుని ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ప్రియాంకపై అత్యాచారం చేశారు. ప్రియాంక కాస్త ధైర్యం చేసి పదడుగులు ముందుకు వెళ్లి ఉంటే అక్కడే హైమాస్ట్ వెలుగులతో పాటు, వాహనాల రాకపోకలతో జన సమ్మర్దమైన ప్రాంతంలోకి చేరి సురక్షితంగా వచ్చి ఉండేదని, ఆమె దుండగుల బారినుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. శవం దొరికాక హడావుడి: ప్రియాంక బంధువులు ప్రియాంకారెడ్డి అదృశ్యం అయిన తీరు, ఆఖరిసారిగా సోదరితో మాట్లాడటం, సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోవడం వంటి విషయాలు సామాన్య వ్యక్తి విన్నా తక్షణం అప్రమత్తమై వెతికే ప్రయత్నం చేసుండేవాడు. కానీ, సైబరాబాద్ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించారు. ఆమె మృతదేహం లభించిన తర్వాత మాత్రం 10 బృందాలు, 15 బృందాలతో దర్యాప్తు అంటూ హడావుడి చేశారు. నిందితుల్ని మరుసటి రోజే పట్టుకున్నారు సరే... అసలు ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి ఉంటే అసలు ఈ హత్యే జరగకపోయేది. -
అత్యంత అమానుషం
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్లో వరస దురంతాలు వెలుగు చూసి ఆర్నెల్లు కాలేదు. ఆ తర్వాత కూడా అడపా దడపా ఆడపిల్లలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్ నగర శివారులో, రంగారెడ్డి జిల్లా తొండుపల్లి టోల్ ప్లాజాకు సమీపంలో బుధవారం రాత్రి పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డిని అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన తీరు సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనా స్థలి ఎక్కడో మారుమూల లేదు. అది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉంది. దానికి అత్యంత సమీపాన టోల్ ప్లాజా ఉంది. పక్కనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పోయే అతి పెద్ద జాతీయ రహదారి ఉంది. దానిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఉన్నట్టుండి ఆచూకీ తెలియకుండా పోయిన కేసు కూడా కాదిది. తాను ఆపదలో చిక్కుకున్నానని ఆమె సకాలంలో గ్రహించింది. ఆ సంగతినే తన సోదరికి రాత్రి 9.22 నిమిషాలకు ఫోన్ చేసి చెప్పింది. హఠాత్తుగా ఆమె ఫోన్ స్విచాఫ్ కావడంతో కుటుం బసభ్యులు కూడా కీడు శంకించారు. రంగంలోకి దిగారు. కానీ ఇవేవీ ఆ నిస్సహాయురాలిని కాపాడ లేకపోయాయి. ఈ దారుణ ఉదంతం వెల్లడై 24 గంటలు గడవకముందే అదే శంషాబాద్ సమీపంలో శుక్రవారం మరో యువతిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ప్రియాంక హత్య అయినా, మరో మహిళ హత్య అయినా మన వ్యవస్థల పనితీరునూ, సమాజం పాటిస్తున్న విలువలనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మన దేశంలో ఎన్నో కఠిన చట్టాలున్నాయి. దేశ రాజధాని నగరంలో 2012లో నిర్భయ ఉదంతం చోటుచేసుకున్నాక అత్యంత కఠినమైన చట్టం వచ్చింది. పోక్సో చట్టంలో ఉరిశిక్షతోసహా కఠిన శిక్షలు విధించడానికి వీలు కల్పించే సవరణ కూడా చేశారు. వీటితోపాటు తెలంగాణలో ఆడపిల్లల రక్షణ కోసం ‘షీ టీమ్’లు ఏర్పాటు చేశారు. ఆపత్స మయాల్లో ఫోన్ చేయడం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లున్నాయి. తెలంగాణలో అయితే రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ కనబడుతూనే ఉంటుంది. ఇన్ని చట్టాలున్నా, ఇన్ని రకాల జాగ్రత్తలు తీసు కుంటున్నా లైంగిక నేరాలు ఆగుతున్న దాఖలా లేదు. అవి నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. నేర గాళ్లు ఏ మాత్రం భయపడటం లేదు. గడప దాటి బయటికెళ్లే ఏ ఆడపిల్లకైనా ఈ దేశంలో వేధింపులు నిత్యానుభవం. అవి నగరాలా, పట్టణాలా, గ్రామాలా అన్న తేడా లేదు. వీధి చివరా, నడిరోడ్డుపైనా, నిర్మానుష్య ప్రదేశంలోనా అన్న తేడా లేదు. ఎక్కడైనా ఆడపిల్లలు భయపడుతూ బతుకీడ్వవలసిన పరిస్థితులే ఉంటున్నాయి. వెకిలిగా నవ్వడం, ఇష్టానుసారం కామెంట్ చేయడం, అసభ్యంగా తాకడం వంటి ఉదంతాలు కోకొల్లలు. అత్యంత అమానుషమైన ఘటనలు జరిగినప్పుడు మాత్రమే సమాజం మొత్తం కదిలిపోతుంది. వాటిపై వెనువెంటనే ప్రభుత్వాలు స్పందించడం మొదలెడతాయి. ఇప్పుడు ప్రియాంక విషాద ఉదంతమే తీసుకుంటే బుధవారం రాత్రి ఆమె కుటుంబం దాదాపు ఒంటరిగానే ఆరాటపడవలసి వచ్చింది. ఒక పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో పోలీస్స్టేషన్కు వెళ్లమని పంపించేశారని ప్రియాంక తండ్రి చెప్పారు. అక్కడ ఫిర్యాదు చేశాక కూడా పోలీసులు వెనువెంటనే కదలలేదంటున్నారు. తమ ఇంటి దీపం ఏమైందో తెలియక ఆత్రపడుతున్న ఆ కుటుంబానికి ‘లోకంలో మానవత్వం చచ్చిపోయిందా...’అని ఆ క్షణంలో అనిపించిందంటే అది పోలీసుల పనితీరుకు అద్దంపడుతుంది. బాధితుల పట్ల కనీస సహానుభూతి ప్రదర్శించలేని ఆ మనస్తత్వాలను సరిచేసేందుకు చర్యలు తీసుకోనంతకాలం ఈ స్థితి మారదు. పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేయడం కోసం వెళ్లేవాళ్లకూ, ముఖ్యంగా ఆడపిల్లల ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు చేసేవారికీ పోలీస్స్టేషన్లలో ఎదురవుతున్న ప్రశ్నే ప్రియాంక కుటుంబసభ్యులకు కూడా ఎదురైంది. వారు పోలీసులను ఆశ్రయించినప్పుడు ‘ఏం జరిగిందో నిజాలు మాత్రమే చెప్పండి’ అనడం, ‘ఎవరితోనో వెళ్లివుంటుంది. రేపు వస్తది’ అని నిర్లక్ష్యంగా చెప్పడం బండబారుతున్న వ్యవస్థ తీరుకు నిదర్శనం. ‘వారు సకాలంలో స్పందించివుంటే మా అమ్మాయి మాకు దక్కేది’ అని రోదిస్తున్న ప్రియాంక కుటుంబసభ్యుల్ని ఓదార్చగలిగేది ఎవరు? నిజమే... చాలా తక్కువ వ్యవధిలోనే ప్రియాంక హంతకుల ఆచూకీని పోలీసులు రాబట్టగలిగారు. రాత్రికి రాత్రి దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు. పది టీంలు రంగంలోకి దిగి అణువణువూ గాలించాయి. స్వయానా సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసుపై శ్రద్ధ పెట్టి పర్యవేక్షించారు. ఇవన్నీ పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని వెల్లడి స్తాయి. అదే సమయంలో దాని బలహీనతల్ని కూడా పట్టిస్తాయి. ఉన్నత స్థాయిలో జోక్యం చేసు కుంటే తప్ప, ఉన్నతాధికార వర్గం ఉరకలెత్తిస్తే తప్ప సత్ఫలితాలు లభించవా అన్న సందేహం కలుగుతుంది. నేరం చోటుచేసుకున్న వెంటనే నేరగాళ్లను పట్టుకోవడంతోపాటు వారిపై వెంటవెంటనే సాక్ష్యా ధారాలు సేకరించి, సాధ్యమైనంత త్వరగా న్యాయస్థానాల్లో విచారణ మొదలయ్యేలా,అది త్వరగా పూర్తయి, శిక్షలుపడేలా చూసినప్పుడు మాత్రమే ఈ నేరాలు తగ్గుతాయి. అలాగే నేరాలు జరగడానికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లో పకడ్బందీ గస్తీ నిరంతరాయంగా జరగాలి. ప్రియాంక విషాద ఉదంతం వెల్లడై 24 గంటలు గడవకుండానే... ఆ కేసు దర్యాప్తు కోసం ఆ ప్రాంతంలో పోలీసులు సంచరిస్తూనే వున్నా అక్కడికి సమీపంలో మరో యువతి హత్యకు గురైన తీరు చూశాక ఇది ఎంత అవసరమో అర్థమవుతుంది. దానికితోడు సమాజంలో, కుటుంబాల్లో ఉన్న లింగ వివక్ష, దానివల్ల కలుగుతున్న దుష్ఫలితాలపై పిల్లలకు అవగాహన కలిగించే పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. ఆడపిల్ల బలహీనురా లన్న భావన మృగాళ్లను తయారుచేస్తుంటే... ఆడపిల్లలను నిస్సహాయులుగా మారుస్తోంది. సామా జిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తల సాయంతో ప్రభుత్వాలు బహుముఖ చర్యలు తీసుకున్నప్పుడే ఆడపిల్ల భద్రంగా ఉండగలుగుతుంది. -
ప్రియాంక చేసిన పొరపాటు వల్లే: హోం మంత్రి
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఉదంతంపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. తన సోదరికి ఫోన్ చేసే బదులు బాధితురాలు 100 నంబరుకు కాల్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని... ప్రియాంకారెడ్డి చేసిన చిన్న పొరపాటు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రియాంకారెడ్డి కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ప్రియాంకారెడ్డికి జరిగిన అన్యాయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ‘షాద్నగర్లో జరిగిన ఘటన విచారకరం. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హన్మకొండలో కూడా చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రియాంక కేసును కూడా స్వల్పకాలంలో ఛేదించారు. నలుగురిని అరెస్టు చేశారు. లోతుగా విచారణ జరిపించి నిందితులకు శిక్ష వేయిస్తాం. ఇక్కడి పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. అయితే ఉన్నత విద్యనభ్యసించి కూడా ప్రియాంక ఇలాంటి పొరపాటు చేయడం విచారించదగ్గ విషయం. రాత్రి సమయంలో తన సోదరికి ఫోన్ చేసే బదులు 100కి ఫోన్ చేయాల్సింది. పోలీసులు 3 నిమిషాల్లో అక్కడికి చేరుకునే వారు. పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేది’ అని మహమూద్ అలీ పేర్కొన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులు పథకం ప్రకారం ప్రియాంకారెడ్డి స్కూటీ పంక్చర్ అతికిస్తామంటూ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. లారీని అడ్డుపెట్టి అత్యాచారానికి పాల్పడి..అనంతరం హతమార్చారు. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. అత్యంత హేయమైన చర్యలకు పాల్పడిని నలుగురిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితులది మహబూబ్నగర్ జిల్లాగా గుర్తించారు. అయితే తమ ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతో ఉండేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధానిలో నిర్భయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. దర్యాప్తు నివేదిక అందజేయాల్సిందిగా రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపనుంది. నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి ప్రియాంకను రాత్రంతా చిత్రహింసలు పెట్టి.. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు #WATCH Telangana Home Min on alleged rape&murder case of a woman veterinary doctor: We're saddened by the incident,crime happens but police is alert&controlling it. Unfortunate that despite being educated she called her sister¬ '100',had she called 100 she could've been saved. pic.twitter.com/N17THk4T48 — ANI (@ANI) November 29, 2019 -
నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి
సాక్షి, మహబూబ్నగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో లారీ నెంబరు(ts 07 ua 3335) ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న నలుగురిని తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మక్తల్లో అరెస్టు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్కు చెందిన శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తిని లారీ యజమానిగా గుర్తించారు. గత కొంతకాలంగా శ్రీనివాస్రెడ్డి వద్ద లారీ డ్రైవర్గా పనిచేస్తున్న మహ్మద్ పాషాను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. జక్లేర్ గ్రామానికి చెందిన పాషాతో పాటు చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ కుమార్లను నిందితులుగా గుర్తించారు. ప్రియాంకారెడ్డి మర్డర్ కేసును ఛేదించిన క్రమంలో సాయంత్రం ఆరు గంటలకు సైబరాబాద్ పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. మహ్మద్ పాషా తల్లి కాగా నిందితులంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారే. గుడిగండ్ల గ్రామానికి చెందిన జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివ లు అన్నదమ్ముల బిడ్డలు. చెన్నకేశవులుది కూడా అదే గ్రామం. ఇక ఘటన గురించి మహ్మద్ పాషా తల్లి మోలే బీ మాట్లాడుతూ.. తన కొడుకు అలాంటివాడు కాదని పేర్కొంది. ‘ నా కొడుకు హైదరాబాద్లో లారీ నడిపిస్తున్నాడు. నిన్న అర్దరాత్రి తర్వాత ఎవరో వాడిని తీసుకెళ్లారు. అసలేం జరిగిందో నాకు తెలియదు’ అని పేర్కొంది. మరోవైపు... నవీన్, శివ ఇంట్లో కూడా దిగ్భ్రాంతి వాతావరణం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఉదయం నుంచి వాళ్ళ గురించి ఎవరికీ ఏమీ తెలియడం లేదు. తెల్లవారక ముందే వచ్చి ఎవరో తీసుకుని వెళ్ళారు. టీవీలో ఈ వార్తలు వచ్చేంత వరకూ మాకు ఈ విషయం తెలియదు’ అని వాపోయారు. ఇదిలా ఉండగా... ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ హైదరాబాద్లో పరామర్శించారు. సంబంధిత వార్తలు... వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్ మిస్టరీ.. ఆ నలుగురే అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డిని ప్రాణాలతో కాపాడలేకపోయినందుకు బాధపడుతున్నామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఆమె డయల్ 100కి కాల్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ కేసును సుమోటోగా స్వీకరించి నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. మరోవైపు... పోలీసుల అలసత్వం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇది బాధాకర ఘటన అన్నారు. ప్రియాంక మర్డర్ కేసును ఛేదించేందుకు 10 బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ‘ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందలేదు. అయితే సమాచారం అందిన వెనువెంటనే టోల్ ప్లాజా వెరిఫై చేశాం. ప్రియాంక మృతదేహం కాలిపోవడంతో కొన్ని ఆధారాలు మిస్సయ్యాయి. అయినప్పటికీ చాలా కష్టపడి క్లూస్ సంపాదిస్తున్నాం. కీలక ఆధారాలు లభించాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. కేసులో పురోగతి సాధించాం. ఈ క్రమంలో కాస్త ఆలస్యం జరిగింది’ అని తెలిపారు. మహిళలు, వృద్ధులు ఎవరైనా సరే తాము సమస్యలో ఉన్నామని భావిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయాలని విఙ్ఞప్తి చేశారు. చదవండి: ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో దక్కేదని డాక్టర్ ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తర్వాత ఎన్ని బృందాలతో వెళ్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుందని పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు స్వల్పకాలంలోనే ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పథకం ప్రకారం ప్రియాంకారెడ్డి స్కూటీని పంక్చర్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రియాంక ఇంటికి రాలేదని ఫోన్ వచ్చింది. పదకొండు గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశా. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ప్రియాంక వెళ్లేటప్పుడు విజువల్స్ ఉన్నాయి. వచ్చే విజువల్స్ లేవని చెప్పారు. సీసీ కెమెరాలు చూసుకుంటూ కూర్చోవడం వల్లే మా పాప ప్రాణం పోయింది. పోలీసులు సమయం వృథా చేశారు. వెంటనే స్పందించి ఉంటే తను ప్రాణాలతో దొరికేది. పోలీసుల తీరు చూస్తే మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తోంది. ఓ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో స్టేషనుకు వెళ్లమన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల స్పందన సరిగా లేదని.. తమకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఉద్వేగానికి గురయ్యారు. తమ కూతురు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ఇక ప్రియాంకారెడ్డి తల్లి విజయమ్మ మాట్లాడుతూ... ‘ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు వాళ్ల ఫ్రెండ్స్తో పోయి ఉంటుంది అన్నారు. ఏం జరిగిందో.. నిజాలు మాత్రమే చెప్పండి అని అడిగారు. వెళ్లేటప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఉంది. వచ్చేటపుడు ఫుటేజీ లేదు. మీ అమ్మాయి ఎవరితోనూ వెళ్లి ఉంటుంది. రేపు వస్తది చూడండి అని మాట్లాడారు. వాళ్లు తొందరగా స్పందించి ఉంటే మా అమ్మాయి బతికి ఉండేది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
ప్రియాంకను చిత్రహింసలు పెట్టి..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసున్నారు. లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నిర్ధారించారు. మహ్మద్ పాషా అనే వ్యక్తి(నారాయణపేట)ని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో చిత్రహింసలకు గురిచేసి.. ఆమెను హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. ఇక ప్రియాంకరెడ్డి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం... ఆమెను దహనం చేసేందుకు నిందితులు కిరోసిన్ వాడినట్లు వైద్యులు తేల్చారు. శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్ పోసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు తెలిపారు. ఇక ప్రియాంకరెడ్డిని హత్య చేసిన అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాత్రి. 9.30 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి.. ఆమెను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడు మహ్మద్ పాషా మద్యం మత్తులో మృగాళ్ల పైశాచికత్వం నగరంలో రాత్రి సమయంలో లారీ నో ఎంట్రీ ఉండడంతో... తొండూపల్లి గేట్ వద్ద లారీ ఆపి నిందితులు మద్యం సేవించారు. ఈ క్రమంలో టోల్గేట్ వద్ద ఒంటరిగా ఉన్న ప్రియాంకరెడ్డిపై కన్నేశారు. అనంతరం స్కూటీ బాగు చేయిస్తామంటూ ఆమెకు మాయమాటలు చెప్పి తమతో తీసుకువెళ్లారు. లారీని అడ్డుపెట్టి అత్యాచారం చేసి... హతమార్చారు. ఆమె మృతదేహాన్ని దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో పడేసి.. ఇద్దరు బైక్పై, మరికొంత మంది లారీలో తిరుగు ప్రయాణం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నివేదిక ఇవ్వండి: మహిళా కమిషన్ ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్బయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును సుమోటాగా తీసుకుని... విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని స్పష్టం చేసింది. దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఓ లేఖ రాసింది. కేసు విచారణకు ఓ బృందాన్ని పంపుతున్నట్లు పేర్కొంది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు.. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగలుగుతారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ప్రియాంక! ప్రియాంకారెడ్డి చివరి ఫోన్కాల్ నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు Sending a member to Hyderabad to assist the family and take it up with the police @NCWIndia won't leave any stone unturned till these perpetrators get the punishment they deserve. https://t.co/kYBQivLKN0 — Rekha Sharma (@sharmarekha) November 29, 2019