L.B stadium
-
భారత్ అలవోకగా...
ఫైనల్కు చేరిన సానియా బృందం నేడు ఫిలిప్పీన్స్తో తుది పోరు ఫెడ్ కప్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2)లో భారత జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడి ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో తుర్క్మెనిస్తాన్పై ఘన విజయం సాధించింది. భారత క్రీడాకారిణుల జోరు ముందు తుర్క్మెనిస్తాన్ అమ్మాయిలు ఏ మాత్రం ప్రతిఘటన కనబర్చకుండా తలవంచారు. తొలి సింగిల్స్ మ్యాచ్లో ప్రార్థనా తోంబరే 6-0, 6-2తో జహానా బెరమోవాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ 51 నిమిషాల్లో ముగిసింది. రెండో సింగిల్స్లో కూడా అంకితా రైనా చెలరేగింది. ఈ మ్యాచ్లో అంకితా 6-1, 6-2తో అనస్తసియ ప్రెంకోను ఓడించింది. ఈ మ్యాచ్ ముగిసేందుకు 52 నిమిషాలు పట్టింది. సెమీస్ ఫలితం రెండు మ్యాచ్లకే తేలిపోవడంతో డబుల్స్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. మరో ప్లే ఆఫ్ మ్యాచ్లో ఫిలిప్పీన్స్ 2-1 తేడాతో ఇండోనేసియాపై విజయం సాధించి ఫైనల్కు చేరింది. శనివారం జరిగే ఫైనల్లో ఫిలిప్పీన్స్తో భారత్ తలపడుతుంది. శుక్రవారం జరిగిన ఇతర వర్గీకరణ మ్యాచ్లలో మలేసియా 2-0తో ఇరాన్పై... పసిఫిక్ ఓషియానియా 3-0తో సింగపూర్పై గెలుపొందాయి. -
తెలంగాణ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
-
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్
ఎల్బీ స్టేడియం: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీలో షణ్ముఖ తేజ, రోహన్ విజేతలుగా నిలిచారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు తలపడే విభాగంలో షణ్ముఖ తేజ గెలువగా, 5వ తరగతిలోపు విద్యార్థులు పోటీ పడే విభాగంలో ఎం.సాయి రోహన్ నెగ్గాడు. ఫైనల్స్ ఫలితాలు: 6-10 క్లాస్ విభాగం: 1.షణ్ముఖ తేజ (5), 2.పి.సుశీల్రెడ్డి (5), 3. బి.సాయి చాణి క్య (5), 4. డి.గణేష్ (4), 5. ఎన్. వెంకట్(4), 6. డి.సాయి శ్రవణ్ (4), 7. బి.సాయి రేవంత్రెడ్డి (4), 8. భవేష్ (4), 9.సి.హెచ్.మాధురి, 10. హరి చరణ్ సాయి (4). 5 క్లాస్ విభాగం: 1.ఎం.సాయి రోహన్ చౌదరి (5), 2. సి.హెచ్. కార్తీక్ సాయి (5), 3. సి.హెచ్.వర్షిత (4), 5.సర్వజ్ఞి (4), 5.ఎస్.యశస్ నందన్(4), 6. కె.జి.సాత్విక (4), 7. సూరజ్ (4), 8. జస్వంత్ (4), 9. వి.ఆర్.ఎస్. విరించి (4), 10.వెంకట రఘనందన్ (4). -
భవాన్స్ కాలేజీకి క్యారమ్ టైటిల్
ఓయూ ఇంటర్ కాలేజి మహిళల టోర్నీ ఎల్బీ స్టేడియం: ఓయూ ఇంటర్ కాలేజి మహిళల క్యారమ్ టోర్నీలో భవాన్స్ కాలేజి (సైనిక్పురి) జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బర్కత్పురాలోని అవంతి కాలేజిలో జరిగిన ఫైనల్లో భవాన్స్ కాలేజి జట్టు 2-1 స్కోరుతో సెయింట్ ఆన్స్ కాలేజి (మెహిదీపట్నం) జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో వనిత కాలేజి 2-1తో వెస్లీ కాలేజి జట్టుపై గెలిచింది. సెమీఫైనల్లో భవాన్స్ జట్టు 2-1తో ఎస్ఎన్ వనిత డిగ్రీ కాలేజి జట్టుపై, సెయింట్ ఆన్స్ 2-0తో వెస్లీ కాలేజి జట్టుపై నెగ్గాయి. విజేతలకు ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ సెక్రటరీ లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రోఫీలను అందజేశారు. -
బాక్సింగ్ టోర్నీలో సంతోష్కు స్వర్ణం
ఎల్బీ స్టేడియం: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలిండియా పురుషుల ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్లు సత్తా చాట్టారు. విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ బాక్సర్ సంతోష్ పసిడి పతకం గెలిచాడు. పి.మనోజ్రెడ్డి, ఎం.డి.ఇమ్రాన్, అనురాగ్ కాంస్య పతకాలను గెలుపొందారు. ఎండి. జాహెద్ బెస్ట్ లూజర్ అవార్డును అందుకున్నాడు. నేడు బాక్సింగ్ సెలక్షన్ కమ్ టోర్నీ రాష్ట్ర సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ (టీబీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే ఆసక్తి గల బాక్సర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ప్రతాప్రెడ్డి (94401-63038)ని సంప్రదించ వచ్చు. -
మితుల్-ధనుష్ జోడీకి టైటిల్
రుక్మిణీ బాయి స్మారక టీటీ ఎల్బీ స్టేడియం: రుక్మిణీ బాయి స్మారక ప్రైజ్మనీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో అండర్-12 బాలుర డబుల్స్ టైటిల్ను మితుల్ అగర్వాల్, ఎ.ధనుష్ జోడి (బీవీబీ, జూబ్లీహిల్స్) చేజిక్కించుకుంది. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో మితుల్-ధనుష్ జోడి 3-0తో వేణు-సుదర్శన్ ద్వయం (గీతాంజలి దేవాశ్రయ్ స్కూల్)పై విజయం సాధించింది. ఈ పోటీల విజేతలకు ఎస్బీఐ జన రల్ మేనేజర్ హేమంత్ ట్రోఫీలను అందజేశారు. మిగతా ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫైనల్స్ ఫలితాలు అండర్-12 బాలుర సింగిల్స్: 1. సుదర్శన్ (గీతాంజలి దేవాశ్రయ్ స్కూల్), 2. కేశవన్ కన్న(జీఈపీఎస్). అండర్-12 బాలికల సింగిల్స్: 1. రమ్య(సెయింట్ ఆంథోని స్కూల్), 2. రుచిరల్ (సెయింట్ పాల్స్ హైస్కూల్). అండర్-12 బాలికల డబుల్స్: 1. దేవయాని-భవిత జోడి (గీతాంజలి), 2. కీర్తన, ఇషిత జోడి (రోజరి కాన్వెంట్ స్కూల్). -
గౌస్ హ్యాట్రిక్ స్పోర్టింగ్ జయభేరి
సి-డివిజన్ ఫుట్బాల్ లీగ్ ఎల్బీ స్టేడియం: సి-డివిజన్ ఫుట్బాల్ టోర్నమెంట్లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ 5-0 గోల్స్తో సీసీఓబీ జూనియర్ జట్టుపై ఘనవిజయం సాధించింది. స్పోర్టింగ్ ఆటగాడు గౌస్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) గ్రౌండ్స్లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ ఆటగాళ్లు కదం తొక్కారు. రెహ్మాన్, అబ్బాస్ తలా ఒక గోల్ చేశారు. తిరుమలగిరి విలేజ్ గ్రౌండ్స్లో జరిగిన మరో లీగ్ మ్యాచ్లో సచ్దేవ్ ఐడీఎల్ జట్టు 6-0 గోల్స్ తేడాతో సికింద్రాబాద్ బ్లూస్ (బి)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో జయుడు రెండు గోల్స్, క్యానీ, షాన్, రోహిత్, ఉదయ్లు తలా ఒక గోల్ చేశారు. జింఖానా మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్లో సుసాయి సీనియర్ జట్టు 2-1తో ఓకే స్పోర్టింగ్ క్లబ్ జట్టును ఓడించింది. -
హైదరాబాద్ బాక్సర్లదే హవా
తెలంగాణ సబ్ జూనియర్ బాక్సింగ్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ సబ్ జూనియర్ బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ బాక్సర్లు విజృంభించారు. రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శనివారం ఈ పోటీలు జరిగాయి. 28-30 కేజీల విభాగం ఫైనల్లో ఎం.డి. నవీద్ (నిజామాబాద్)... ఎం.డి. షాహిద్ (మహబూబ్నగర్)పై గెలిచి టైటిల్ను గెల్చుకున్నాడు. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి బాక్సింగ్లో అర్జున అవార్డు గ్రహీత జయరామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫలితాలు: 30-32 కేజీలు: 1.తవజ్యోత్ సింగ్ (హైదరాబాద్), 2.ఎం.డి. రయీస్(రంగారెడ్డి). 32-34 కేజీలు: 1.ఎం.డి. రయీస్ (హైదరాబాద్), 2..ఎ. డేవిడ్(రంగారెడ్డి), 34-36 కేజీలు: 1. డొనాల్డ్ విన్స్టన్ (రంగారెడ్డి), 2.అబ్దుల్ రెహ్మాన్(హైదరాబాద్). 36-38 కేజీలు: త్రిజ్యోత్ సింగ్ (హైదరాబాద్), 2. ఎస్. నిఖిల్ రాజ్(మెదక్). 38-40 కేజీలు: 1. నితిన్ (కరీంనగర్), 2.ఉస్మాన్ (హైదరాబాద్). 40-42 కేజీలు: 1.ఎం.డి.సద్దాం (మహబూబ్నగర్), 2.డేవిడ్ (హైదరాబాద్), 42-46 కేజీలు: 1.ఎస్. నితిన్ రాజ్ (హైదరాబాద్), 2.హేమంత్ సింగ్ (ఆదిలాబాద్). 48-50 కేజీలు: 1.ఆర్య (రంగారెడ్డి), 2.రాజ్ (మెదక్). 50-52 కేజీలు: 1.దీప్తాంశ్(నల్లగొండ), 2.సి. సాయికుమార్ (ఆదిలాబాద్). 52-54 కేజీలు: 1.ఎం.డి. ఉస్మాన్(హైదరాబాద్), 2.ఎస్.ఎ. గఫార్ (రంగారెడ్డి). -
ఆర్బీఐపై హెచ్ఏఎల్ గెలుపు
సి-డివిజన్ ఫుట్బాల్ లీగ్ ఎల్బీ స్టేడియం: సి-డివిజన్ ఫుట్బాల్ లీగ్ టోర్నమెంట్లో హెచ్ఏఎల్ జట్టు 6-0 గోల్స్తో ఆర్బీఐ జట్టుపై విజయం సాధించింది. తిరుమలగిరి విలేజ్ గ్రౌండ్స్లో శుక్రవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్లో హెచ్ఏఎల్ జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాహుల్, ఇమాన్యుయెల్, డెంజిల్, గణేష్, కార్తీక్, శరత్లు తలా ఒక గోల్స్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఎయిరిండియా, సోషల్ స్పోర్టింగ్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. శనివారం ఓయూ మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్లో ఏకే స్పోర్టింగ్ క్లబ్తో సీసీఓబీ (జూనియర్) తలపడుతుంది. జింఖానా మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్తో సికింద్రాబాద్ బ్లూస్, అలాగే తిరుమలగిరి విలేజ్ మైదానంలో జరిగే మ్యాచ్లో కంటోన్మెంట్ ఫుట్బాల్ క్లబ్తో హెచ్ఏఎల్ ఢీకొంటుంది. -
‘టి’ బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట: లవ్ అగర్వాల్
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట వేయనున్నట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు, పలు ప్రతిపాదనలపై ఆయన ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న క్రీడ పథకాలు, నూతనంగా నిర్మించనున్న స్పోర్ట్స్ హాస్టళ్లు, ఆధునిక క్రీడా సామాగ్రి కొనుగోలుకు కావాల్సిన బడ్జెట్ సిద్ధం చేయాలని అధికారులను లవ్ అగర్వాల్ ఆదేశించారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్లో వాటర్ స్పోర్ట్స్ కోసం ఆధునిక వాటర్ బోట్స్, షూటింగ్ రే ంజ్లో కొత్త ఆయుధాల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్వప్నమైన ‘బంగారు తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సదుపాయాలతో తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని లవ్ అగర్వాల్ క్రీడాధికారులను ఆదేశించారు. మన ఊరు-మన ప్రణాళికనూ రూపొందించాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, రాణించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, కొత్తగా కోచ్లు, ఉద్యోగుల నియామకాలు, క్రీడాసంఘాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా సమర్థంగా అమలు చేయాలని సూచించారు. -
ఆకాశ్, అనన్యలకు టైటిల్స్
అండర్-14 టెన్నిస్ టోర్నీ ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ అండర్-14 టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎల్. ఆకాశ్ రెడ్డి, అనన్య మోహన్ విజేతలుగా నిలిచారు. ఇమాన్యుయెల్ కోచింగ్ సెంటర్, సూర్యోదయ టెన్నిస్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్ను ఆకాశ్, బాలికల టైటిల్ను అనన్య కైవసం చేసుకున్నారు. సికింద్రాబాద్లోని అకాడమీలో మంగళవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఆకాశ్ రెడ్డి 3-6, 7-6, 6-4తో అమన్ అయూబ్ఖాన్పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో అతను 5-3, 4-1తో చింతా ప్రణవ్పై, అయూబ్ ఖాన్ 4-2, 4-2తో లంక సుహిత్రెడ్డి పై గెలిచారు. బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో అనన్య మోహన్ 6-1, 6-3తో దామెర సంస్కృతిపై గెలిచింది. సెమీఫైనల్లో ఆమె 4-0, 4-0తో లిపిక మురమాలపై, సంస్కృతి 4-2, 3-5, 4-1తో సాహితిరెడ్డిపై గెలుపొందారు. అంతకుముందు జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్లో అకాశ్ 7-3తో రుచిత్ గౌడ్పై, అయూబ్ ఖాన్ 7-2తో పి.కౌశల్పై, సుహిత్రెడ్డి 7-4తో వల్లభనేని ప్రీతమ్పై, ప్రణవ్ 7-4తో లోకాదిత్య వర్ధన్పై నెగ్గారు. బాలికల క్వార్టర్స్లో సంస్కృతి 8-4తో లాస్య పట్నాయక్పై, అనన్య మోహన్ 8-2తో కె.అవంతికరెడ్డిపై, లిపిక 8-4తో పి.అమూల్యపై నెగ్గారు. -
‘స్ట్రాంగ్మాన్’ స్టీఫెన్
హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్లిఫ్టింగ్ ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో స్టీఫెన్ మెరిశాడు. జిల్లా పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన 61 కేజీల విభాగం ఫైనల్లో స్టీఫెన్ అత్యుత్తమ పవర్లిఫ్టర్గా ఎంపికయ్యాడు. దీంతో అతనికి హైదరాబాద్ ‘స్ట్రాంగ్ మాన్’ అవార్డు దక్కింది. ఈ పోటీల విజేతలకు బేగంబజార్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ రాజ్, తెలంగాణ పవర్ లిఫ్టింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: 59 కేజీలు: 1.జి.రమేష్ (460 కేజీలు), 2.బి.పవన్ కుమార్, 3.ఎం.భాను ప్రకాష్. 66 కేజీలు: 1.కె.స్టీఫెన్ (565 కేజీలు), 2.కె.దినేష్, 3.డి.శివకుమార్. 74 కేజీలు: 1.ఎం.జానకిరామ్ (570 కేజీలు), 2.జి.శేషు, 3. కె.మనోజ్ యాదవ్. 83 కేజీలు:1.ఎన్.అంజయ్య (572.5 కేజీలు), 2.ఎస్.కృష్ణ, 3.జె.నరేందర్. 93 కేజీలు: 1.కె.సంతోష్ (425 కేజీలు), 2. కె.శ్రీకాంత్, 3.ఎ.విక్టర్. 105 కేజీలు: 1.వై. రాఘవేంద్ర గౌడ్ (765 కేజీలు), 2.ఆర్.ఉదయ్ కృష్ణ. 120 కేజీలు: 1.ఎల్.ప్రవీణ్ (752 కేజీలు). ప్లస్ 120 కేజీలు: 1.బి.సుమిత్ (747.5 కేజీలు). -
వరుణ్, అంజలిలకు క్యాడెట్ టైటిల్స్
రాష్ట్ర ర్యాంకింగ్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బాలబాలికల క్యాడెట్ సింగిల్స్ టైటిళ్లను బి.వరుణ్ శంకర్, అంజలి గెలుచుకున్నారు. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ సందర్భంగా హైదర్గూడలోని స్కూల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ శంకర్ (గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ-జీటీటీఏ) 11-7, 14-12, 6-11, 13-11తో అద్వైత్ (ఆవా)పై విజయం సాధించాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవామండలి-జీఎస్ఎం) 11-3, 6-11, 11-8, 11-7తో భవిత (జీఎస్ఎం)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలికల సింగిల్స్లో జి. ప్రణీత (జీఎస్ఎం), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీఫైనల్లో ప్రణీత 12-10, 11-8, 8-11, 11-6తో రాగ నివేదిత (జీటీటీఏ)పై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో వరుణి 11-7, 12-10, 12-10, 11-9తో వి.సస్య (ఆవా)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ సెమీస్లో సరోజ్ సిరిల్ (ఎస్పీటీటీఏ) 11-9, 11-6, 5-11, 12-10, 14-12తో సాయి తేజేశ్ (ఎస్పీటీటీఏ)పై, ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్ (జీటీటీఏ) 11-9, 12-10, 9-11, 11-8, 11-7తో అమాన్ ఉల్ రెహ్మాన్ (ఎస్పీటీటీఏ)పై గెలిచారు. ఫైనల్లో పోస్టల్, ఆర్బీఐ ఇంటర్ ఇన్స్టిట్యూషన్ టీమ్ చాంపియన్షిప్లో పోస్టల్, ఆర్బీఐ జట్లు ఫైనల్లోకి చేరాయి. సెమీఫైనల్లో ఆర్బీఐ 3-1తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై గెలిచింది. ఇదివరకే పోస్టల్ జట్లు ఫైనల్ పోరుకు అర్హత సంపాదించాయి. -
బాక్సింగ్ చాంప్ రాజు
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజి బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో 49 కేజీల టైటిల్ను ఎన్. రాజు (హైదరాబాద్) కైవసం చే సుకున్నాడు. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియం బాక్సింగ్ హాల్లో శనివారం ఈ పోటీలు జరిగాయి. ఫైనల్లో రాజు.. మహబూబ్నగర్కు చెందిన అఖిల్ శ్రీగిరిపై గెలిచాడు. ఈపోటీల ముగింపు వేడుకలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ బాక్సర్ ఆర్. ప్రవీణ్ కుమార్ సింగ్, కోచ్ ఓంకార్ యాదవ్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: 52 కేజీలు: 1. పి. మహేందర్ (హైదరాబాద్), 2. సదానంద్ (రంగారెడ్డి జిల్లా). 56 కేజీలు: 1. సి.హెచ్. ధీరజ్ (హైదరాబాద్), 2. వివేక్ సింగ్ (నల్లగొండ). 60 కేజీలు: 1. వెంకటేశ్వర్లు (మహబూబ్నగర్), 2. ఎం.డి. ఇంతియాజ్(కరీంనగర్). 64 కేజీలు:1. ఎస్.డేవిడ్ (హైదరాబాద్), 2. వినయ్ కుమార్ (మెదక్). 69 కేజీలు: 1. ఎస్.సాయి (హైదరాబాద్), 2. ఎం.డి. మతీన్ (కరీంనగర్). 75 కేజీలు: 1. ఆర్. అశోక్ నాయక్ (నల్లగొండ), 2. మనోజ్రెడ్డి (రంగారెడ్డి జిల్లా). -
సెయింట్ పాల్స్ శుభారంభం
తెలంగాణ టేబుల్ టెన్నిస్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సెయింట్ పాల్స్, భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్-జూబ్లీహిల్స్) జట్లు శుభారంభం చేశాయి. హైదర్గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదలైన ఈ ఇంటర్ స్కూల్ చాంపియన్షిప్ టీమ్ విభాగంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్టు 3-0తో డాన్ బాస్కో స్కూల్ జట్టుపై విజయం సాధించింది. సింగిల్స్లో దివేష్ (సెయింట్ పాల్స్) 11-4, 19-17, 11-7తో జీవన్పై, రిత్విక్ (సెయింట్ పాల్స్) 11-7, 11-4, 11-5తో నిఖిల్పై గెలిచారు. డబుల్స్లో దివేష్-రిత్విక్ జోడి 11-9, 11-3, 11-5తో జీవన్-నిఖిల్ జోడిపై గెలిచింది. మరో మ్యాచ్లో బీవీబీపీఎస్ (సి) జట్టు 3-2తో దేవసియా స్కూల్ జట్టుపై గెలిచింది. సింగిల్స్లో ధనుష్ (బీవీబీపీఎస్) 11-5, 11-8, 11-8తో వినయ్పై గెలిచాడు. రెండో సింగిల్స్లో మితుల్ (బీవీబీపీఎస్) 8-11, 9-11, 5-11తో ప్రద్యుమ్న(దేవసియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్లో భువన్-మితుల్ (బీవీబీపీఎస్) జోడి 11-4, 11-4, 12-10తో ప్రద్యుమ్న-యతీష్ (దేవసియా) జోడిపై గెలిచింది. రివర్స్ సింగిల్స్లో ధనుష్ (బీవీబీపీఎస్) 9-11, 11-7, 8-11, 11-6, 4-11తో ప్రద్యుమ్న (దేవసియా) చేతిలో ఓడిపోగా, మితుల్ (బీవీబీపీఎస్) 11-7, 11-6, 12-10తో వినయ్(దేవసియా) పై నెగ్గాడు. ఇతర మ్యాచ్ల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 3-0తో మెరిడియన్పై, ఓక్రిడ్జ్ స్కూల్ 3-0తో బీవీబీపీఎస్పై గెలిచాయి. -
ఆలియా జీహెచ్ఎస్ శుభారంభం
స్కూల్ హ్యాండ్బాల్ లీగ్ ఎల్బీ స్టేడియం: విశాల్ స్మారక హైదరాబాద్ స్కూల్ హ్యాండ్బాల్ లీగ్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో ఆలియా గవర్నమెంట్ మోడల్ హైస్కూల్ (జీహెచ్ఎస్), గతి జీహెచ్ఎస్ జట్లు శుభారంభం చేశాయి. హైదరాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ (హెచ్డీహెచ్ఏ) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన పోటీల్లో ఆలియా జీహెచ్ఎస్ జట్టు 7-6తో శివరాంపల్లి కేంద్రీయ విద్యాలయం (కేవీ)పై విజయం సాధించింది. రెండో లీగ్ మ్యాచ్లో గతి గవర్నమెంట్ హైస్కూల్ (బంజారాహిల్స్) 7-2తో ఎంవీఎం హైస్కూల్ (కొండాపూర్) జట్టుపై గెలిచింది. అంతకుముందు ఈ పోటీలను గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్డీహెచ్ఏ అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, కార్యదర్శి ఫ్రాంక్లిన్, హ్యాండ్బాల్ కోచ్లు రవి కుమార్, జగన్ మోహన్లు పాల్గొన్నారు. లీగ్ ఫలితాలు బాలుర విభాగం: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (టీఎస్డబ్ల్యూఆర్ఎస్) 9-0తో మమత హైస్కూల్ (సికింద్రాబాద్)పై, బ్లూ డైమండ్ ఈఎస్ఐ 7-0తో గవర్నమెంట్ హైస్కూల్ (విజయనగర్కాలనీ)పై, జీహెచ్ఎస్ (చాదర్ఘాట్) 5-4తో టీఎస్డబ్ల్యూఆర్ఎస్ (షేక్పేట్)పై, ఆలియా జీహెచ్ఎస్ 13-4తో చిరెక్ స్కూల్ (ఖాజాగూడ)పై, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ 6-0తో మమత హైస్కూల్పై, ఆర్మీ స్కూల్ 7-3తో నల్లగొండ జెడ్పీ హైస్కూల్పై, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ (కింగ్ కోఠి) 1-0తో చిరెక్ స్కూల్ (ఖాజాగూడ)పై గెలిచాయి. బాలికల విభాగం: హోలీ ఫ్యామిలీ హైస్కూల్ (సికింద్రాబాద్) 2-0తో ఎంవీఎం హైస్కూల్ (కొండాపూర్)పై, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ 5-0తో మమత హైస్కూల్పై, నల్గొండ జెడ్పీ హెస్కూల్ 6-2తో చిరెక్ స్కూల్ (కొండాపూర్)పై, ఎంవీఎం హైస్కూల్ 5-1తో చిరెక్ పబ్లిక్ స్కూల్ (కొండాపూర్)పై విజయం సాధించాయి. -
సానియాకు ఇచ్చినట్లే మిగతా క్రీడాకారులకు ఇవ్వాలి
టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎల్బీ స్టేడియం: రాష్ట్రంలోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు రాకపోవడం విచారకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, అంబర్పేట్ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (టీకేఏ) ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని ప్రెస్క్లబ్లో మంగళవారం టీకేఏ చైర్మన్ అయిన జి.కిషన్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు ఇచ్చిన భారీ నజరానాను ఇతర క్రీడాకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు, కోచ్లకు ఉపాధి కల్పించగలమనే భరోసా ప్రభుత్వం ఇవ్వాలని ఆయన కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు తమ స్పానర్షిప్ కోసం రాజకీయ పార్టీల ఆఫీసులు, ఎమ్మెల్యేల చుట్టు తిరిగే అవసరం లేకుండా చూడాలన్నారు. అలాగే రాష్ట్రంలోని పార్టీలు రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ నేడు ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని అందిస్తున్న కబడ్డీని ఒలింపిక్ క్రీడల్లో చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం ఇక్బాల్ ఇకలేరు
ఎల్బీ స్టేడియం: జాతీయ బాల్ బ్యాడ్మింటన్ మాజీ ఆటగాడు ఎల్.ఎ.ఇక్బాల్ అలీ (78) అనారోగ్యంతో గురువారం కన్ను మూశారు. హైదరాబాదీ క్రీడాకారుడైన ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగిగా పదవీవిరమణ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ గత నెలలో జరిగిన ఒలింపిక్డే రన్కు హాజరై క్రీడాస్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా ఇక్బాల్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సన్మానించారు. పలు జాతీయ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ల్లో సత్తాచాటిన ఆయనను భారత ప్రభుత్వం 1975లో అర్జున అవార్డుతో సత్కరించింది. కెరీర్కు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన రాష్ట్ర జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఇక్బాల్ వద్ద శిక్షణ పొందిన రాంబాబు, రాజ్ కుమార్ తదితరులు జాతీయ చాంపియన్లుగా ఎదిగారు. ఇక్బాల్ మృతి పట్ల రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, హైదరాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు సి.హెచ్.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎ.రవీందర్ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
బాలికల చాంప్ ఫ్యూచర్ కిడ్స్
ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ ట్రోఫీ ఇంటర్ స్కూల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ బాలికల టైటిల్ను చేజిక్కించుకుంది. సెయింట్ పాయిస్ హైస్కూల్ రెండో స్థానం పొందగా, మెరీడియన్ హైస్కూల్ జట్టుకు మూడో స్థానం దక్కింది. బాలుర టీమ్ టైటిల్ను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ గెలుచుకుంది. ఇందులో మహాత్మా గాంధీ స్మారక (ఎంజీఎం) హైస్కూల్ రెండో స్థానం, ఆల్ సెయింట్ హైస్కూల్ మూడో స్థానం పొందాయి. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ టోర్నీని నిర్వహించారు. బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 47-32తో సెయింట్ పాయిస్ హైస్కూల్ (రామ్నగర్)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 35-18తో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ జట్టుపై, సెయింట్ పాయిస్ 26-18తో మెరీడియన్ హైస్కూల్ (బంజారాహిల్స్)పై గెలిచాయి. బాలుర టైటిల్ పోరులో ఓక్రిడ్జ్ స్కూల్ జట్టు 47-28తో ఎంజీఎం హైస్కూల్ జట్టుపై గెలిచింది. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్రదర్ ప్రతాప్రెడ్డి విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.15 వేలు, రన్నరప్కు రూ. 7 వేలు, మూడో స్థానం పొందిన జట్లకు రూ. 5 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ సుధాకర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజయ్ పాల్గొన్నారు. -
క్యాడెట్ చాంప్స్ వరుణ్, అంజలి
సెయింట్ పాల్స్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ అకాడమీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణ్, అంజలి విజేతలుగా నిలిచారు. క్యాడెట్ బాలుర సింగిల్స్ టైటిల్ను గ్లోబల్ టీటీ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన బి.వరుణ్ శంకర్ కైవసం చేసుకున్నాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ట్రోఫీని ఎన్.అంజలి గెలుచుకుంది. హైదర్గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో శనివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ 11-6, 11-7, 11-8తో అద్వైత్ (ఆనంద్నగర్ వెల్పేర్ అసోసియేషన్)పై విజయం సాధించాడు. బాలికల ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవా మండలి) 11-8, 11-6, 11-1తో రుచిరా రెడ్డి (ఎస్పీటీటీఏ)పై గెలిచింది. స్నేహిత్కు సబ్-జూనియర్ టైటిల్ సబ్-జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్ను నిరుటి విజేత ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్(జీటీటీఏ) నిలబెట్టుకున్నాడు. సబ్-జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో జి.ప్రణీత (జీఎస్ఎం) ఫైనల్లోకి చేరింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 11-4, 13-11, 11-4, 11-6తో సాయి తేజస్ (ఎస్పీటీటీఏ)పై నెగ్గాడు. బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణీత 11-4, 7-11, 11-9, 11-7, 7-11, 12-10తో పోరాడి వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)పై నెగ్గింది. టీమ్ చాంపియన్ ఎస్బీఐ ఇంటర్ ఇనిస్టిట్యూషన్ టీమ్ చాంపియన్షిప్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎస్బీఐ జట్టు 3-2తో పోస్టల్ డిపార్ట్మెంట్ జట్టుపై గెలిచింది. -
తరుణ్ యాదవ్కు టైటిల్
తెలంగాణ సబ్-జూనియర్ బాక్సింగ్ సిరీస్ ఎల్బీ స్టేడియం: తెలంగాణ సబ్-జూనియర్ బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో 28-30 కిలోల విభాగంలో తరుణ్ యాదవ్ (హైదరాబాద్) టైటిల్ చేజిక్కించుకున్నాడు. షేక్ షాజీబ్ (మెదక్)కు రెండో స్థానం లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) సౌజన్యంతో తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో శనివారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో విజేతలకు టేబుల్ టెన్నిస్ అర్జున అవార్డీ మీర్ ఖాసీమ్ అలీ ట్రోఫీలను అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. సబ్ జూనియర్ విభాగం: అండర్-16 బాలురు : 34-36 కేజీలు: 1.ఎం.డి.జాహిద్ (వరంగల్), 2. తవ్జ్యోత్ (హైదరాబాద్). 38-40 కేజీలు: 1. త్రిజ్యోత్ (హైదరాబాద్), 2. కె.సాయితేజ (రంగారెడ్డి). 42-44 కేజీలు: 1. క్లింటన్ డేవిడ్ (హైదరాబాద్), 2. పవన్ (రంగారెడ్డి జిల్లా). 46- 48 కేజీలు: 1.ఎం.పవన్ కుమార్ (హైదరాబాద్), 2. రాఖిల్ సాయి(ఆదిలాబాద్). 48-50 కేజీలు: 1.కె.యశ్వంత్ నాయక్ (మహబూబ్నగర్), 2.అబ్దుల్ సయ్యద్ (నిజామాబాద్). అండర్-13 బాలురు : 42-44 కేజీలు: 1.ఎం.వేణు (వరంగల్), 2. ఇమ్రాన్ ఖాన్ (హైదరాబాద్). అండర్-15 బాలురు: 42-44 కేజీలు: 1.బి.సతీష్ (ఆదిలాబాద్), 2. బి.కిషోర్(కరీంనగర్). అండర్-14 బాలురు: 40-42 కేజీలు: 1.ఎస్.నితిన్ రాజ్(హైదరాబాద్), 2.ఎం.ఆశోక్ (నిజామాబాద్). -
22 నుంచి స్కూల్ హ్యాండ్బాల్ లీగ్ టోర్నీ
ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా స్కూల్ హ్యాండ్బాల్ లీగ్ టోర్నమెంట్ ఈనెల 22 నుంచి 24 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్డీహెచ్బీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈటోర్నీని విశాల్ సింగ్ స్మారకార్థంగా నిర్వహిస్తున్నట్లు సి.హెచ్ ఫ్రాంక్లిన్ తెలిపారు. బాల బాలికల విభాగాల్లో ఈపోటీలు నిర్వహిస్తున్నట్లు, ఆసక్తి గల స్కూల్ జట్లు తమ ఎంట్రీలను ఈనెల 21లోగా పంపించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు పి.జగన్మోహన్ గౌడ్(98491-94841), డాక్టర్ రవి కుమార్(98662-29937)లను సంప్రదించవచ్చు. -
ఫైనల్లో భవాన్స్, సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్
సెయింట్ పాల్స్ ఇంటర్ స్కూల్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ స్టాగ్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ బాలికల విభాగంలో భవాన్స్ స్కూల్(ఏ), సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. హైదర్గూడలోని సెయింట్ హైస్కూల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల స్కూల్ టీమ్ చాంపియన్షిప్ విభాగంలో తొలి సెమీఫైనల్లో భవాన్స్ స్కూల్(ఏ) జట్టు 3-0 స్కోరుతో గీతాంజలి స్కూల్ జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టు 3-0తో రోజారీ కాన్వెంట్ స్కూల్ (ఏ)పై గెలిచింది. అంతకు ముందు జరిగిన ఈ పోటీల ప్రారంభ వేడుకలకు బ్రదర్ ప్రతాప్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం అడ్హాక్ కమిటీ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి, టెక్నికల్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ సుధాకర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రోయింగ్లో టీఎస్ఎస్ పతకాల పంట
5 స్వర్ణాలు సహా 9 పతకాలు ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జాతీయ సబ్ జూనియర్ రోయింగ్, జాతీయ స్కూల్స్ రోయింగ్ చాంపియన్షిప్లలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్ఎస్) క్రీడాకారులు సత్తా చాటారు. ఐదు బంగారు పతకాలు సహా తొమ్మిది పతకాలు సాధించారు. జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు ఇటీవల కోల్కతాలో జరిగాయి. ఈ పోటీల్లో బాలుర టీమ్ విభాగంలో రెండు స్వర్ణా లు, కాంస్యం, బాలికల టీమ్ విభాగంలో ఒక్కో పసిడి, కాంస్యం టీఎస్ఎస్ రోయర్లు గెలిచారు. అక్కడే జరిగిన జాతీయ స్కూల్ రోయింగ్ చాంపియన్షిప్లో బాలుర సింగిల్స్ స్కల్ ఈవెంట్లో సి.హెచ్. నవీన్ బంగారు పతకం గెలుచుకోగా... విజయ్, త్రినాథ్, సునీల్, ఆరిఫ్, గణేష్లతో కూడిన జట్టు టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలిచింది. బాలికల సింగిల్స్ స్కల్ ఈవెంట్లో గీతాంజలి కాంస్యం దక్కించుకుంది. బాలికల టీమ్ విభాగంలో సీతా మహాలక్ష్మి, లక్ష్మీప్రసన్న, అర్చన, మనస్విని, ప్రియాంకలతో కూడిన బృందం రజతం గెలిచింది. జాతీయ రోయింగ్ పోటీల్లో పతకాలను గెలిచిన తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) మేనేజింగ్ డైరె క్టర్ రాహుల్ బొజ్జా, రాష్ట్ర రోయింగ్ కోచ్ చక్రవర్తి అభినందించారు. -
ఒలింపిక్ పరుగుపై సద్దుమణిగిన వివాదం
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జంటనగరాల్లో ఈ నెల 23న జరగనున్న ఒలింపిక్ పరుగును ఎవరు నిర్వహించాలనే విషయంపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. శాప్ కమిటీ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం తమ తప్పని కొందరు క్రీడా సంఘాల నేతలు అంగీకరించడంతోపాటు రాష్ట్ర ఒలింపిక్ సంఘం నిబంధనల ప్రకారం నడుచుకొంటామని హెచ్డీఓఏ అధ్యక్షుడు బి.విజయకుమార్ యాదవ్కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ పరుగు నిర్వహించాలని, ఇది తెలంగాణ ప్రభుత్వ పరుగు కాదని వారు అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్రీడా సంఘాలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, పీడీలు, కోచ్ల సమావేశాన్ని ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫతేమైదాన్ క్లబ్లో ఏర్పాటు చేసినట్లు హెచ్డీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.ప్రేమ్రాజ్ తెలిపారు. -
ఏఓసీ సెంటర్పై ఆర్మీ గెలుపు
ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో ఆర్మీ, ఓఎన్జీసీ జట్ల హవా కొనసాగుతోంది. నారాయణగూడలోని వైఎంసీఏ బాస్కెట్బాల్ కోర్టులో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆర్మీ జట్టు 72-46 పాయింట్ల తేడాతో సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ జట్టుపై విజయం సాధించింది. దీంతో ఆడిన నాలుగు మ్యాచ్లకుగాను ఆర్మీ జట్టు మూడింట్లో గెలుపొంది.. ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఓఎన్జీసీ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆర్మీ జట్టులో రమేష్ కుమార్ 20, సౌమ్యా రంజన్18, శశి 12 చొప్పున పాయింట్లు చేశారు. ఏఓసీ సెంటర్ జట్టులో జలీల్ 15, ఇర్ఫాన్ 15, సంజయ్ 10 పాయింట్లు చేశారు. ఇక మరో లీగ్ మ్యాచ్లో ఓఎన్జీసీ జట్టు 87-66తో కేఎస్ఈబీ జట్టుపై గెలిచింది. ఇతర మ్యాచ్ల్లో ఏఓసీ సెంటర్ 84-73తో హైదరాబాద్ వైఎంసీఏపై, ఆర్మీ గ్రీన్ 79-55తో ఆర్సీఎఫ్పై నెగ్గాయి. -
రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఆర్మీ గ్రీన్ జయభేరి
ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో ఆర్మీ గ్రీన్, ఓఎన్జీసీ జట్లు రెండు మ్యాచ్ల్లో గెలిచి ఆరు పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. నారాయణగూడ వైఎంసీఏలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆర్మీ గ్రీన్ జట్టు 79-55 పాయింట్ల తేడాతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్) జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఆర్సీఎఫ్ 36-33తో ఆర్మీ గ్రీన్ జట్టుపై ఆధిక్యాన్ని సాధించింది. ఆర్మీ జట్టులో అభిషేక్ 34, రమేష్ కుమార్ 19, సామ్యా రంజన్ 8 పాయింట్లు నమోదు చేసి విజయాన్ని అందించారు. ఆర్సీఎఫ్ జట్టులో రంజన్ శర్మ, ఖాన్లు చెరో 14 పాయింట్లు, హర్షవర్ధన్ 12 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్లో ఓఎన్జీసీ జట్టు 76-48తో ఏఓసీ జట్టుపై గెలిచింది. ఇతర లీగ్ పోటీల్లో ఆర్సీఎఫ్ 77-73తో కేఎస్ఈబీపై, ఆర్మీ గ్రీన్ 84-61తో హైదరాబాద్ వైఎంసీఏపై గెలిచాయి. -
ఆర్బీఐపై సీసీఓబీ గెలుపు
సి- డివిజన్ ఫుట్బాల్ లీగ్ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హైదరాబాద్ సి- డివిజన్ ఫుట్బాల్ లీగ్లో సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ) జూనియర్ జట్టు 5-0 గోల్స్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జట్టుపై ఘన విజయం సాధించింది. విజయనగర్ ప్లేగ్రౌండ్లో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో సీసీఓబీ ఆటగాళ్లు దూకుడుగా ఆడి ఐదు గోల్స్ నమోదు చేశారు. సీసీఓబీ తరఫున మోషిమ్, జౌషీన్, ఎం.డి.ఇలియాస్, ఇంతియాజ్, ఒమర్లు తలా ఒక గోల్ చేశారు. తిరుమలగిరి విలేజ్ మైదానంలో జరిగిన మరో లీగ్ మ్యాచ్లో సికింద్రాబాద్ బ్లూ(ఎ) జట్టు 2-1తో సికింద్రాబాద్ (బి) జట్టుపై గెలిచింది. శుక్రవారం జరిగే లీగ్ మ్యాచ్లో తిరుమలగిరి ఎయిర్ ఇండియా జట్టుతో సికింద్రాబాద్ (బి) జట్టు తలపడుతుంది. విజయనగర్ కాలనీ మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్లో సీసీఓబీ (సబ్ జూనియర్) జట్టుతో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు ఢీకొంటుంది. -
ఒలింపిక్ రన్పై సమీక్ష
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: నగరంలో ఈనెల 23న జరిగే ఒలింపిక్ రన్ నిర్వహణ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని శాప్ కార్యాలయంలోని కమిటీ హాల్లో గురువారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు బి.వి.పాపారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయేష్ రంజన్ ఐఏఎస్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కె.నర్సయ్య, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కె.రంగారావు, బ్యాడ్మింటన్ ద్రోణాచార్య గ్రహీత ఎస్.ఎం.ఆరిఫ్, వాలీబాల్ అర్జున అవార్డు గ్రహీత రవికాంత్ రెడ్డి, హైదరాబాద్ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్రాజ్, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నర్సింగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ రన్తో ప్రభుత్వానికి సంబంధం లేదు: ఏపీఓఏ ఒలింపిక్ రన్కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఈనెల 9న ఒలింపిక్ భవన్లో తెలంగాణ రాష్ట్ర క్రీడా సంఘాల సమావేశంలో ఈ రన్ నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తమ అనుమతి లేకుండా ఒలింపిక్ రన్పై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు. -
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అడ్రస్ ఎక్కడ?
కాగితాలకే పరిమితమైన ఉద్యోగుల విభజన ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాష్ట్ర విజభన జరిగినప్పటికీ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్)లో మాత్రం కాగితాల మీదే విభజన జరిగింది. శాప్ గత ఆరు నెలలుగా ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగులను విభజించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొందరు అధికారులు తమ పదవుల కోసం తప్పడు సమాచారం అందించారు. దాదాపు 72 మంది తాత్కాలిక కోచ్లను గ్రేడ్-3 కోచ్లుగా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇందులో తెలంగాణకు 34 మందిని కేటాయించగా మరో 38 మందిని ఆంధ్రకు కేటాయించారు. ‘శాప్’ ప్రస్తుత ఆఫీస్ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంగా, అవశేష ఆంధ్రప్రదేశ్కు ఎల్బీస్టేడియంలోని ఇండోర్ టెన్నిస్ స్టేడియాన్ని కార్యాలయంగా మార్చారు. అయితే కనీసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని సూచించే బోర్డును కూడా ఇప్పటిదాకా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో సంబంధిత అధికారులపై క్రీడాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 2వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అధికారికంగా జరిగినప్పటికీ ఇక్కడ మాత్రం అలాంటి వేడుకలేవీ జరగకపోవడం క్రీడావర్గాలను విస్మయపరిచింది. ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల అధికారులు ప్రస్తుతం శాప్ కార్యాలయంలోనే పని చేయడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. తెలంగాణకు చెందిన చంద్రారెడ్డి (సైక్లింగ్ కోచ్), శ్రీకాంత్రెడ్డి (బాక్సింగ్ కోచ్)తో పాటు దాదాపు 57 మంది ఉద్యోగులు, కోచ్లను ఏపీకి బదిలీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఆంధ్రాకు చెందిన అనంతపురం అథ్లెటిక్ కోచ్ శ్రీనివాస్, చిత్తూరు క్రికెట్ కోచ్ ఉమా శంకర్, విజయవాడ హాకీ కోచ్ మహేష్ బాబు, విశాఖపట్నంకు చెందిన ఫుట్బాల్ కోచ్ మరియా జోజిలను తెలంగాణకు కేటాయించడంపై ‘టి’ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాప్ చరిత్రలో లేని రెండు జూయింట్ మేనేజింగ్ డెరైక్టర్ పోస్టులను సృష్టించడాన్ని ఇరు రాష్ట్రాల ఉద్యోగుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. శాప్లో ఉద్యోగుల విభజనలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
29న అంతర్జాతీయ ఫిడే చెస్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్కు నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 29 నుంచి ఈ టోర్నమెంట్ జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చెస్ సంఘాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. ఆలిండియా చెస్ సమాఖ్య సౌజన్యంతో 1500లోపు రేటింగ్ టోర్నమెంట్ను ఎల్బీస్టేడియంలో ఈ నెల 29 నుంచి జూలై 1 వరకు నిర్వహిస్తారు. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ రూ. 2 లక్షలు. మొత్తం 50 మందికి నగదు బహుమతులు అందజేస్తారు. ఇందులో పాల్గొనాలనుకునే చెస్ క్రీడాకారులు ఈ నెల 15వ తేదీలోపు తమ ఎంట్రీలను పంపాలి. మరిన్ని వివరాలకు జాతీయ చెస్ ఆర్బిటర్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకృష్ణను 9247143456, 9246141111 ఫోన్నంబర్లలో సంప్రదించాలి. -
చత్తీస్గఢ్పై కేఎస్ఈబీ గెలుపు
ఆలిండియా ఇన్విటేషన్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో కేరళ స్టేట్ విద్యుత్ బోర్డు (కేఎస్ఈబీ) జట్టు 78-61 పాయింట్ల తేడాతో చత్తీస్గఢ్ జట్టుపై విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో నారాయణగూడ వైఎంసీఏ బాస్కెట్బాల్ కోర్టులో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో చత్తీస్గఢ్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 35-33 పాయింట్లతో ఆధిక్యాన్ని సాధించింది. కేరళ జట్టులో పి.ఎస్.జీనా 37, స్టెఫీ నిక్సన్ 15, రోష్ని థామస్ 8 పాయింట్లు చేశారు. చత్తీస్గఢ్ జట్టులో శరన్జీత్ కౌర్ 28, సంగీత కౌర్ 17, రియా వర్మ 9 పాయింట్లతో రాణించారు. ఇతర పోటీల్లో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు 78-65తో ఈస్టర్న్ రైల్వే జట్టుపై, చత్తీస్గఢ్ జట్టు 47-37తో సెంట్రల్రైల్వే జట్టుపై నెగ్గాయి. -
హ్యాండ్బాల్ విజేత: ఎల్బీ స్టేడియం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ క్రీడలు ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ క్రీడల్లో భాగంగా హ్యాండ్బాల్ పురుషుల టీమ్ టైటిల్ను ఎల్బీ స్టేడియం జట్టు చేజిక్కించుకుంది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఎల్బీ స్టేడియం జట్టు 32-27 స్కోరుతో భవాన్స్ కాలేజిపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఎల్బీ స్టేడియం 15-10తో ఆధిక్యాన్ని సాధించింది. రాజ్ కుమార్, భగత్ సింగ్,వాస్లు చక్కటి నైపుణ్యాన్ని కనబర్చారు. భవాన్స్ కాలేజి జట్టులో వంశీ, అనిల్ రాణించారు. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో ఎల్బీ స్టేడియం జట్టు 17-11తో రంగారెడ్డి జిల్లా జట్టుపై, భవాన్స్ కాలేజి జట్టు 18-10తో సాయ్ హాస్టల్ జట్టుపై గెలిచాయి. విజేతలకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
6 నుంచి జాతీయ ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఈనెల 6 నుంచి 14 వరకు నారాయణగూడలోని వైఎం సీఏలో నిర్వహిస్తున్నట్లు వైఎంసీఏ చైర్మన్ బి.జె.వినయ్ స్వరూప్ తెలిపారు. సెక్రటరీ లియోనార్డ్, కన్వీనర్ నార్మన్ ఐజాక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.ఎస్.ప్రేమ్ కుమార్తో కలిసి వినయ్ వివరాలను వెల్లడించారు. దాదాపు 40 మంది అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో తొలిసారిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటర్ లాకింగ్ సర్ఫేస్ మ్యాట్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళల విభాగంలో పోటీలు రౌండ్ రాబిన్ పద్ధతిలో 6 నుంచి 10 వరకు, పురుషుల విభాగంలో లీగ్ పద్ధతిలో 10 నుంచి 14 వరకు మ్యాచ్లు జరుగుతాయన్నారు. పురుషుల జట్టు విజేతకు రూ. 60 వేలు, రన్నరప్కు రూ. 40 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 30 వేల చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు. మహిళల విభాగంలో వరుసగా రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేల నగదు బహుమతులు ఇస్తారు. మహిళల జట్లు: సౌత్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, చత్తీస్గఢ్, కేరళ విద్యుత్ జట్లు; ఫురుషుల జట్లు: ఆర్మీ, ఓఎన్జీసీ, వైఎంసీఏ, కేరళ విద్యుత్ బోర్డు, ఏఓసీ, ఐఓబీ, ఆర్సీఎఫ్, కొచిన్ కస్టమ్స్. -
రాష్ట్ర జట్టుకు మూడో స్థానం
భారత స్కూల్ బ్యాడ్మింటన్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జాతీయ స్కూల్ అండర్-14 బాలుర బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు మూడో స్థానం లభించింది. బాలుర వ్యక్తిగత సింగిల్స్లో ప్రవీణ్ కృష్ణ సత్తా చాటాడు. ఆగ్రాలో ఇటీవల ఈపోటీలు జరిగాయి. బాలుర వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో టి.ప్రవీణ్ కృష్ణ (ఖమ్మం) రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. అలాగే బాలుర టీమ్ విభాగంలో ఖమ్మంకు చెందిన టి.ప్రవీణ్ కృష్ణ, కె.వరప్రసాద్, ఎం.తరుణ్లతో కూడిన జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ప్రవీణ్ కృష్ణ చైనాలో జరిగే అంతర్జాతీయ స్కూల్ అండర్-14 బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. పతకాలను గెల్చుకున్న క్రీడాకారులను రాష్ట్ర స్కూల్ విద్యా శాఖ కమిషనర్ ఎం.జగదీశ్వర్, జాయింట్ డెరైక్టర్ వి.ఎస్.భార్గవ్, రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి విజయారావులు అభినందించారు. -
అండర్-13 బ్యాడ్మింటన్ చాంప్ అనురాగ్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాష్ట్ర ప్రైజ్మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-13 బాలుర సింగిల్స్ టైటిల్ను కె.అనురాగ్ కైవసం చేసుకున్నాడు. మెదక్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్లోని జీహెచ్ఎంసీ పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్-13 బాలుర సింగిల్స్ ఫైనల్లో కె.అనురాగ్ 3-1తో కె.సాయి చరణ్పై విజయం సాధించాడు. విజేతలకు సంగారెడ్డి కోర్టు మెజిస్ట్రేట్ డి.దుర్గాప్రసాద్, సంగారెడ్డి ఎమ్మెల్యే జి.మహిపాల్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు. అండర్-10 బాలుర సింగిల్స్: 1.జి.ప్రణవ్ రావు, 2.స్వాతిక్ రెడ్డి. డబుల్స్: 1.జి.ప్రణవ్ రావు, ఎ.పి.రవితేజ జోడి, 2.వి.ఎస్.ఎస్.సందేష్, స్వాతిక్రెడ్డి జోడి. అండర్-15 బాలుర సింగిల్స్: 1.నవనీత్(మెదక్), 2.కె.ప్రశాంత్(ఖమ్మం).అండర్-15 బాలికల సింగిల్స్: 1.కె.ప్రీతి, 2.కె.భార్గవి. డబుల్స్: 1.కె.ప్రీతి, బి.సుప్రియ జోడి. 2.కె.భార్గవి, ఎ.అభిలాష జోడి. -
హాకీ చాంప్ ఏజీ ఆఫీస్
హెచ్హెచ్ ఇన్విటేషన్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హెచ్ హెచ్ ఇన్విటేషన్ సిక్స్-ఏ-సైడ్ హాకీ టోర్నమెంట్ టైటిల్ను అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ రిక్రియేషన్ క్లబ్ (ఏజీఓఆర్సీ) జట్టు కైవసం చేసుకుంది. హాకీ హైదరాబాద్ (హెచ్హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఏజీ ఆఫీస్ జట్టు 4-3 గోల్స్తో ఇన్క మ్ట్యాక్స్ ఆఫీస్ జట్టుపై విజయం సాధించింది. ఏజీ ఆఫీస్ జట్టు తరఫున సుమన్ రెండు గోల్స్ చేయగా, సాయికిరణ్, వాసు తలా ఒక గోల్ చేశాడు. ఇన్కమ్ట్యాక్స్ ఆఫీస్ జట్టులో సంజీవ్, సమీర్, అజయ్ వర్మలు చెరో గోల్ చేశారు. ఈ పోటీల ముగింపు వేడుకలకు హెచ్హెచ్ అధ్యక్షుడు, ఐఏఎస్ అధికారి డాక్టర్ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
5 కి.మీ. రేస్ విజేత బుచ్చయ్య
సమ్మర్ రోడ్ రేస్ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హెచ్ఏసీఏ వార్షిక సమ్మర్ రోడ్ రేస్ చాంపియన్షిప్లో పురుషుల 5 కిలో మీటర్ల పరుగులో సి.హెచ్.బుచ్చయ్య (ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి) విజేతగా నిలిచాడు. అతను 14 నిమిషాల 34:50 సెకన్లలో గమ్యం చేరాడు. సయ్యద్ వజీర్ ఘోరి (ఓయూ) రెండో స్థానంతో రజతం గెలుపొందగా, ఎం.ప్రకాష్ (ఓయూ) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నాడు. హైదరాబాద్ అథ్లెటిక్ కోచింగ్ అకాడమీ (హెచ్ఏసీఏ) ఆధ్వర్యంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్(హెచ్డీఏఏ) సౌజన్యంతో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి మైదానంలో ఈ పోటీలు జరిగాయి. అనంతరం ముగింపు కార్యక్రమానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్స్ ఫలితాలు అండర్-16 బాలురు 3 కి.మీ.: 1.సమన్విత్ (మేకగూడ జడ్పీ హైస్కూల్), 2.ఎం.గణేష్ (మేకగూడ జడ్పీ హైస్కూల్), 3.ఎం.గంగాధర్(మేకగూడ జడ్పీ హైస్కూల్). అండర్ -13 బాలురు 2 కి.మీ.: 1.పి.రాయుడు (జడ్పీ హైస్కూల్), 2.ఎం.జీవన్(జడ్పీ హైస్కూల్), 3. లోహిత్ (కేవీఎస్). అండర్-10 బాలురు 2 కి.మీ.: 1.జి.చెన్నయ్య (జడ్పీ హైస్కూల్), 2.బి.అజయ్ (బీటీ హైస్కూల్), 3.అశోక్ (జడ్పీ హైస్కూల్). మాస్టర్ పురుషుల విభాగం: తాహసీన్ కరీమ్ (ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి), 2.డి.సి.ఆనందం (రంగారెడ్డి), 3.జి. నారాయణ (ఆర్ఆర్సీ). మహిళల విభాగం: 3 కి.మీ.: 1.జి.ఉమామహేశ్వరి (నిజామ్ కాలేజి గ్రౌండ్), 2.బి.లక్ష్మి (వరంగల్), 3.ఎం. అలివేలు (జడ్పీ హైస్కూల్). అండర్-16 బాలికలు 3 కి.మీ.: 1.జి.అనూష (జడ్పీ హైస్కూల్), 2.పి. తులసి (ఎల్.బి.నగర్), 3. సుప్రియా (బోయిన్పల్లి). అండర్-13 బాలికలు 2 కి.మీ.: 1.ఎ.కార్తీ (ఓయూ గ్రౌండ్), 2.పి.మమత (జడ్పీ హైస్కూల్), 3.సుస్మిత(కేజీబీవీ). అండర్-10 బాలికలు 2 కి.మీ.: 1.పి.వసంత (జడ్పీ హైస్కూల్), 2 శిరీష (కేజీబీవీ), 3. గౌతమి (కేవీ బేగంపేట్). -
క్రీడాకారులకు నగదు పురస్కారాలు
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ వేసవి క్రీడా శిబిరాలు ఘనంగా ప్రారంభం ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జీహెచ్ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో గత నెల 25 నుంచి అనధికారికంగా జరుగుతున్న వేసవి క్రీడా శిబిరాలను గురువారం అధికారికంగా ఇక్కడి విక్టరీ ప్లేగ్రౌండ్స్లో మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే నగర క్రీడాకారులకు స్పోర్ట్స్ స్కీమ్ ద్వారా నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం నగరంలోని మాజీ అంతర్జాతీయ క్రీడాకారులతో సమావేశమై, వారి సలహాలను తీసుకోనున్నట్లు చెప్పారు. వేసవి శిబిరాలను ప్రత్యేకంగా ఉదయంతోపాటు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ జి.రాజ్కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, కార్పొరేటర్లు వాజిద్ హుస్సేన్, పి.జ్ఞానేశ్వర్ గౌడ్, జె.హేమలత యాదవ్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అన్నపూర్ణ, స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఆలస్యంతో బాలల ఇక్కట్లు ప్రారంభ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మేయర్ మాజిద్ హుస్సేన్ రెండు గంటలు ఆలస్యంగా హాజరు కావడంతో బాల బాలికలు ఎండలో నిరీక్షిస్తూ తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కార్యక్రమం ఉదయం ఏడు గంటలకు జరగనున్నట్లు అధికారులు ప్రకటించడంతో వివిధ క్రీడా మైదానాల నుంచి బాల బాలికలు, వారి తల్లిదండ్రులు, కోచ్లు సమయానికి ముందే హాజరై మేయర్ కోసం నిరీక్షించారు. అయితే మేయర్ 9 గంటల తరువాత రావడంతో అప్పటిదాకా ఎదురు చూసిన వారంతా అసౌకర్యానికి గురయ్యారు. మేయర్ ఆలస్యంగా రావడంపై బాల బాలికల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సెమీస్లో నవభారత్ హాకీ క్లబ్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హెచ్హెచ్ ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్లో చింతల్బస్తీకి చెందిన నవభారత్ హాకీ క్లబ్(ఏ), రసూల్పురా ప్లేగ్రౌండ్(ఏ) జట్లు సెమీఫైనల్లోకి చేరాయి. హైదరాబాద్ హాకీ(హెచ్హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నవభారత్ క్లబ్ జట్టు 7-0తో రసూల్పురా ప్లేగ్రౌండ్(బీ) జట్టుపై ఘన విజయం సాధించింది. నవభారత్ క్లబ్ జట్టు ఆటగాడు రాహుల్ రాజ్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. మహేందర్ రెండు గోల్స్ చేయగా, అరవింద్, హరీష్లు ఒక్కో గోల్ చేశారు. రెండో క్వార్టర్ ఫైనల్లో రసూల్పురా ప్లేగ్రౌండ్ (ఏ) జట్టు 6-0తో నవభారత్ క్లబ్ (బీ) జట్టుపై గెలిచింది. రసూల్పురా పీజీ (ఏ) జట్టులో సంపత్ మూడు గోల్స్ చేయగా, వివేక్ రెండు, దుర్గ ఒక గోల్ చొప్పున చేశారు. మూడో క్వార్టర్ ఫైనల్లో క్రాస్ వింగ్ జట్టు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ జట్టుకు వాకోవర్ లభించింది. -
22న జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్ వేడుకలు
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో ఈ నెల 22న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ప్రారంభ వేడుకలు విక్టరీ ప్లేగ్రౌండ్స్లో నిర్వహించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ‘కోడ్’ అమలులో ఉండటంతో ఈ శిబిరాలను అట్టహాసంగా ప్రారంభించలేదు. ఇప్పటికే ఈ శిబిరాలు ఆరంభమైనప్పటికీ అధికారిక ప్రారంభ వేడుకలను మాత్రం గురువారం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకలకు జీహెచ్ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో డిప్యూటీ మేయర్ జి. రాజ్ కుమార్, స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్రాజ్, సుల్తాన్ బజార్ కార్పొరేటర్ శ్రీరామచంద్ర తదితరులు పాల్గొంటారు. -
టీఎన్ఏ అధ్యక్షుడిగా కృపాకర్రెడ్డి
ఎల్బీ స్టేడియం న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్ర నెట్బాల్ సంఘం (ఏపీఎన్ఏ) కార్యవర్గం సమావేశం ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో ఆదివారం జరిగింది. ఏపీఎన్ఏ అధ్యక్షుడు తీగల కృపాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల కొత్త కార్యవర్గం ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఒలింపిక్ సంఘం కోశాధికారి బి.కె.హరనాథ్, ఎన్నికల అధికారిగా బి.కైలాష్ యాదవ్లు పాల్గొన్నారు. తెలంగాణ నెట్బాల్ సంఘం (టీఎన్ఏ)అధ్యక్షుడుగా తీగల కృపాకర్రెడ్డి(రంగారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా ఎస్.సోమేశ్వర్రావు(రంగారెడ్డి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా టి.సురేశ్ కుమార్(మహబూబ్నగర్), పి.వి.రమణ (ఖమ్మం), ఎం.రఘువీర్ సింగ్ (నల్లగొండ), జి.వేణుగోపాల్ (కరీంనగర్), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సమ్మయ్య (ఆదిలాబాద్), జి.వెంకటేశ్వర్రావు (నిజామాబాద్), కె.శ్రీనివాస్ (ఆదిలాబాద్), సి.హెచ్.సూర్యరావు (వరంగల్), కోశాధికారిగా వై.నందు కుమార్ (హైదరాబాద్)లు ఎన్నికయారు. కార్యవర్గ సభ్యులుగా కె.కృష్ణమూర్తి (ఖమ్మం) టి.సురేశ్ (వరంగల్), ఎం.విఘ్నేశ్వర్ (హైదరాబాద్), ఎ.రమేశ్ (నిజామాబాద్), సుహేల్ రెహ్మన్ (మహబూబ్నగర్), కె.సురేశ్ (నల్లగొండ) నియమితులయ్యారు. -
రాష్ట్ర జూనియర్ హాకీ జట్టు
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జాతీయ మహిళల జూనియర్ హాకీ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 19 నుంచి పుణేలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ హాకీ జట్టు వి.శ్రీదేవి, ఎం.శిరీష, వి.పద్మలత, బి.మాధవి, ఎం.నవనీత కుమారి,ఎస్.మహాలక్ష్మి, టి.భారతి, జె.నళిని, ఎన్. సయేషా, మహాలక్ష్మి, పి. జ్యోతి, కె.కీర్తన, బి. తరంగిణి, పి. ప్రమీళ, కె. రమ్య నాగలక్ష్మి, కె. వరలక్ష్మి, పి. మానస, కె. అనిత, టి. బాబయ్య (మేనేజర్). -
‘టి’ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడిగా సైమన్
సుధాకర్రెడ్డికి ఏపీఆర్ఎస్ఏ బాధ్యతలు ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం రెండుగా విడిపోయింది. వేర్వేరు సంఘాల కార్యవర్గం కోసం గురువారం ఇక్కడి ఒలింపిక్ భవన్లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడిగా ఎఫ్.జె.సైమన్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాంప్రసాద్ శ్రీవాస్తవ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా జె. సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భగీరథ్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కోశాధికారులుగా తెలంగాణకు కేఆర్ మహేంద్ర, శశిధర్, ఏపీకి అచ్యుతరామ్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి పని చేస్తారు. తెలంగాణ కార్యవర్గం సీనియర్ ఉపాధ్యక్షుడు: వీరేశ్ కుమార్ యామా, ఉపాధ్యక్షులు: ఎస్ఆర్ ప్రేమ్రాజ్, ఇక్బాల్ లసానియా, కె. సాంబయ్య. అదనపు కార్యదర్శి: నిర్మలా సింగ్, సంయుక్త కార్యదర్శులు: డాక్టర్ నవీన్ కుమార్, నూర్ మొహమ్మద్, నర్సింహ. ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం సీనియర్ ఉపాధ్యక్షుడు: రఘుపతి రాజు, ఉపాధ్యక్షులు: ప్రసన్న కుమార్, శ్యామ్బాబు, రామకృష్ణ, అదనపు కార్యదర్శి: దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులు: వెంకటేశ్వర్లు, ఆర్.వి.వి. నాయుడు, షేక్ మస్తాన్, కార్యవర్గ సభ్యులు: మోహన్రావు, సునీల్ కుమార్, పురుషోత్తం, ఈశ్వర్, పీటర్సన్ -
28 నుంచి రాష్ట్ర ఓపెన్ బ్యాడ్మింటన్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈనెల 28 నుంచి 30 దాకా లింగంపల్లిలోని పీజేఆర్- జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. మెదక్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్(ఎండీబీఏ) ఆధ్వర్యంలో అండర్-10,13,15 బాలబాలికల సింగిల్స్, డబుల్స్ అంశాల్లో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈనెల 25లోగా పంపించాలి. ఇతర వివరాలకు ఎండీబీఏ సెక్రటరీ పి.సి.ఎస్.రావు(98498-02616)ను సంప్రదించాలి. వచ్చేనెల 2న టీ స్టేట్ రన్... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 2వ తేది సోమవారం ఉదయం 29వ విక్టరీ ప్లేగ్రౌండ్ నుంచి ‘టి’ రన్ నిర్వహించనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్(టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ఈ రన్ కోఠి నుంచి అమర వీరుల స్థూపం వరకు జరుగనుంది. ఈ రన్లో క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ వాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని టీఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి డి. రూపేశ్ కోరారు. వివరాలకు 90320-05518లో సంప్రదించవచ్చు. -
క్వార్టర్ ఫైనల్లో సీసీఓబీ, హైదరాబాద్ గ్లోబ్
హఫీజ్ స్మారక ఫుట్బాల్ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హఫీజ్ స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్లో సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ)(ఏ), హైదరాబాద్ గ్లోబ్ క్లబ్, ఎస్ఎస్ ముర్షాద్ జట్లు క్వార్టర్ ఫైనల్కి చేరాయి. విజయనగర్ కాలనీ ఫుట్బాల్ మైదానంలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సీసీఓబీ(ఏ) జట్టు 2-1స్కోరుతో హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. సీసీఓబీ జట్టు మాజీ అంతర్జాతీయ ఆటగాడు మౌజమ్ 26, 45వ నిమిషాల్లో రెండు గోల్స్ నమోదు చేశాడు. స్పోర్టింగ్ జట్టు తరపున అబన్నన్ 50వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. రెండో క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ గ్లోబ్ క్లబ్ జట్టు 2-0 స్కోరుతో అబ్బాస్ యూనియన్ జట్టుపై గెలిచింది. అబ్దుల్ అమన్ 14వ నిమిషంలో, ఫహాద్ 35వ నిమిషంలో గోల్స్ చేశారు. మరో క్వార్టర్ ఫైనల్లో ఎస్ఎస్ ముర్షాద్ జట్టు 4-1 స్కోరుతో మల్లేపల్లి ఫుట్బాల్ క్లబ్ జట్టుపై గెలిచింది. -
జోరుగా సాగుతున్న జీహెచ్ఎంసీ శిబిరాలు
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో జీహెచ్ఎంసీ క్రీడాధికారులు, కోచ్లు, సిబ్బంది బిజీగా ఉండడంతో శిబిరాలు కాస్త ఆలస్యంగా ఆరంభమయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తి కావడంతో శిబిరాలవైపు అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఈ సారి ఎన్నికల కోడ్ కారణంగా శిబిరాల ప్రారంభ వేడుకల్ని నిర్వహించలేదని క్రీడాధికారులు తెలిపారు. జంటనగరాల్లో ఐదు సర్కిల్స్లో దాదాపు 1200పైగా క్రీడా మైదానాల్లో 54 క్రీడాంశాల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇక్కడికి వచ్చే బాలబాలికల సంఖ్య కూడా గత కొద్ది రోజుల నుంచి భారీగా పెరిగిందని పలువురు కోచ్లు తెలిపారు. ఇదిలా ఉండగా అంబర్పేట్లోని జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో మలక్పేట్ నియోజక వర్గం ఈవీఎంలను భ ద్రపరచడంతో పాటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో ఆ మైదానంలోకి క్రీడాకారులను అనుమతించడంలేదు. అలాగే ఎల్బీ స్టేడియం, యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవీఎంలు భద్రపరచడంతో శిబిరాలు జరగడంలేదు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఆధ్వర్యంలో ఆధికారికంగా ఈనెల 1 నుంచి వేసవి క్రీడా శిబిరాలు జరుగుతున్నాయి. -
రవితేజ, బాలచంద్ర ప్రసాద్ ముందంజ
ఆర్బీవీఆర్ఆర్ స్మారక చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాజా బహుదూర్ వెంకట్రామ్రెడ్డి(ఆర్బీవీఆర్ఆర్) స్మారక రాష్ట్ర సీనియర్ చెస్ టోర్నమెంట్లో తొలి రోజు ఎస్.రవితేజ,బాలచంద్ర ప్రసాద్రెడ్డి తొలి రౌండ్లో విజయాలను నమోదు చేసుకున్నారు. రాష్ట్ర చెస్ అసోసియేషన్(ఏపీసీఏ) ఆధ్వర్యంలో దోమలగూడలోని ఏవీ కాలేజిలో శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో ఎస్.రవితేజా(1) రాజా రిత్విక్(0)పై విజయం సాధించింది. కృష్ణతేజ(1) శ్రీరోహిత్(0)పై, బాలచంద్ర ప్రసాద్(1) మనీష్ చౌదరి(0)పై, జె.మల్లేశ్వర్రావు(1) వి.సాహితి(0)పై, చక్రవర్తిరెడ్డి(1) సి.హెచ్,లాస్య(0)పై గెలిచారు. అంతకు ముందు ఈ పోటీల ప్రారంభ వేడుకలకు రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్. గోపాల్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ టి.అమర్కాంత్రెడ్డి, ఏపీసీఏ ఉపాధ్యక్షుడు మేజర్ కె.ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.కన్నారెడ్డి, ఏవీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ పి.యాదగిరిరెడ్డి, డాక్టర్ జి.జలంధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండర్-9 బాలుర విభాగం: తొలి రౌండ్ ఫలితాలు: చైతన్య సాయి(1) అభినవ్ చంద్ర(0)పై, సాయి ప్రణవ్(1) అభిరామ్రెడ్డి(0)పై, వెంకట రఘునందన్(1) పంకజ్ దత్(0)పై గెలుపొందారు. అండర్-9 బాలికల విభాగం: సి.హెచ్.వైష్ణవి(1) కాత్యాయని దాట్ల(0)పై, నాగ విజయకీర్తి(1) హంసిక(0)పై, నాతుర బేతి(1) రోచిష్నరెడ్డి(0)పై, కె.జాహ్నవి(1) డి.మణుశ్రీ(0) ఎన్.సాత్విక(1) దాట్ల అనన్య(0)పై నెగ్గారు. -
రాష్ట్ర అథ్లెటిక్ మీట్కు హైదరాబాద్ జట్టు ఎంపిక
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 3 నుంచి రెండు రోజులపాటు వరంగల్లో జరుగుతాయి. పురుషుల జట్టు: ఎం.అఖిలేష్, విధాతరెడ్డి,ఎస్.సంతోష్, రాకేష్, పి.ఎన్.సాయి కుమార్, జి.శ్రీనివాస్, ఎస్.వెంకటేష్, విజ్ఞాష్, సి.హెచ్.బుచ్చయ్య, సయ్యద్ వజార్ ఘోరి,జె,రజనీకాంత్, చంద్రబాగు, బాలస్వామి, అకింత్ కుమార్ పఠక్, ప్రవీణ్ మూర్తి, ఎస్.కె.ముజిహిద్, భరత్ రాజ్, బి.సంతోష్, నిసార్ అహ్మద్. మహిళల జట్టు: జి.ఉమామహేశ్వరి, జరీనా బేగం, సయ్యద్ ఆఫ్రీనా, బి.సాహితి, శ్రీలత, డి.హెమలత. తెలంగాణ టి20 జట్టు ఎంపిక తెలంగాణ ట్వంటి-20 క్రికెట్ జట్టు కెప్టెన్గా కిషోర్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టు ఆలిండియా నేషనల్ టి20 చాంపియన్షిప్లో పాల్గొంటుంది. ఈ టోర్నీ ఆగ్రాలో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. జట్టు: కిషోర్ (కెప్టెన్), విజయ్ కుమార్ (వైస్ కెప్టెన్), ప్రశాంత్ కుమార్, ఓబులేశ్, రాజ్కుమార్, నాగరాజు, రాంబాబు, వీరబాబు, సాయిరాం, చంద్రమౌళి, గణేష్, చైతన్య, సాయి సంకేశ్, ప్రశాంత్రెడ్డి, ప్రసాద్. -
హెచ్డీఏఏ అధ్యక్షుడిగా రాజేష్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ (హెచ్డీఏఏ) నూతన అధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బి.చంద్రభాస్కర్రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్గా బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి నియమితులయ్యారు. హెచ్డీఏఏ కార్యవర్గం సమావేశం మంగళవారం ఒలింపిక్ భవన్లో జరిగింది. ఈ కొత్త కార్యవర్గం 2018 వరకు కొనసాగుతుంది. కార్యవర్గం: ఎం.లక్ష్మణ్రెడ్డి(చీఫ్ ప్యాట్రన్), ఎ.నరసింహారెడ్డి (చైర్మన్), రాజేష్ కుమార్ (అధ్యక్షుడు), వై. శ్రీనివాస్రావు, ఎ.జేవియర్, టి.రమేష్ సింగ్, కె.లక్ష్మీపతి, ఎస్.జయరామ్, డి.వేణు గోపాల్ (వీరంతా ఉపాధ్యక్షులు), బి.చంద్ర భాస్కర్ (కార్యదర్శి), కె.ఎం. కిస్టీ (నిర్వాహక కార్యదర్శి), ఎస్,కె.మిశ్రా, బికాష్ కరార్, అమ్రాయిల్ సింగ్, కె.ప్రవీణ్ కుమార్, ఎం.ఎలీషా(సంయుక్త కార్యదర్శులు), ఎ.సోమేశ్వర్ రావు (కోశాధికారి). కార్యవర్గ సభ్యులుగా ఎం.బాబురావు, పి.అశోక్, వి.విజేందర్రెడ్డి, ఆదర్శ గోస్వామి, జి.బాలరాజ్, పి.నారాయణ, టి.ప్రేమావతి సింగ్, డాక్టర్ జె.సందీప్, పి. సాల్మాన్, జె.సంజీవ, సి.ఆర్.భీమ్ సింగ్, వెంకటేశ్వర్రావు, జి.ఎస్.ప్రభు కిరణ్, జె.మేషక్ బాబు, వి.రవీందర్ నియమితులయ్యారు. -
‘స్కూల్ గేమ్స్లో టెన్నికాయిట్ను చేర్చాలి’
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జాతీయ స్కూల్ గేమ్స్ క్రీడాంశాల జాబితాలో టెన్నికాయిట్ క్రీడను చేర్చాలని భారత టెన్నికాయిట్ సమాఖ్య (ఐటీఎఫ్) కోరింది. దేశ, విదేశాల్లో గ్రామీణ క్రీడగా పేరు పొందిన టెన్నికాయిట్ క్రీడ ప్రస్తుతం అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి గేమ్గా ఎదిగిందని ఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మీకాంత్ తెలిపారు. భారత్, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాల్లో మూడు టెన్నికాయిట్ వరల్డ్కప్ పోటీలను సమర్థంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. శ్రీనగర్లో జరగనున్న జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) కార్యవర్గ సమావేశంలో టెన్నికాయిట్ క్రీడను అండర్-14, 17, 19 బాలబాలికల విభాగాల్లో చేర్చాలని కోరుతూ సమాఖ్య కార్యదర్శి డాక్టర్ రాజేష్ మిశ్రాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. జాతీయ స్కూల్ గేమ్స్లో టెన్నికాయిట్ అండర్-19 బాలబాలికల పోటీలను 2012, 2013 సంవత్సరాల్లో మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నిర్వహించారని ఆయన చెప్పారు. దేశంలో 27 రాష్ట్రాల్లో టెన్నికాయిట్ సంఘాలున్నాయని ఆయన తెలిపారు. టెన్నికాయిట్ క్రీడకు భారత ఒలింపిక్ అసోసియేషన్, కేంద్ర క్రీడాశాఖ గుర్తింపు ఉందని ఆయన చెప్పారు. దీంతో ఎస్జీఎఫ్ఐలో టెన్నికాయిట్ను చేర్చాలని లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు. -
ఫుట్బాల్ రెఫరీల శిక్షణా శిబిరం ప్రారంభం
జింఖానా, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ రెఫరీల సంఘం ఆధ్వర్యంలో ఫుట్బాల్ రెఫరీలకు శిక్షణా శిబిరం ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలోని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ సంఘం (ఏపీఎఫ్ఏ) కార్యాలయంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీఎఫ్ఏ అధ్యక్షుడు, ఐఏఎస్ అధికారి డాక్టర్ మహ్మద్ అలీ రఫత్ ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎఫ్ఏ కార్యదర్శి ఫల్గుణ తదితరులు హాజరయ్యారు. ఏపీ రెఫరీల సంఘం అధ్యక్షుడు సలీమ్, కార్యదర్శి మహ్మద్ హషమ్ల పర్యవేక్షణలో ఈ శిబిరం జరుగుతోంది. జంట నగరాల నుంచి దాదాపు 50 మంది ఈ శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నారు. -
ఎస్సీ రైల్వేకు గోల్ఫ్ టైటిల్
ఇంటర్ క్లబ్ గోల్ఫ్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఇంటర్ క్లబ్ గోల్ఫ్ టోర్నీలో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బొల్లారంలోని బెప్టా క్లబ్లో మంగళవారం జరిగిన పోటీల్లో ఎస్సీఆర్ జట్టు గెలిచింది. ఆతిథ్య బెప్టా క్లబ్ జట్టుకు రెండో స్థానం దక్కింది. ఎస్సీఆర్ జట్టు తరఫున రాజ్ కుమార్, ఎ.రవి, నరేన్ సింగ్, నరేందర్, వాసుదేవన్, సురేష్ గిరిరాజ్లు చక్కటి నైపుణ్యాన్ని కనబర్చారు. ఈ టోర్నీలో నరేన్ కుమార్ సింగ్ బెస్ట్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. -
800 మీ. పరుగులో అనీశ్కు స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హైదరాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్ మీట్లో అండర్-18 బాలుర విభాగం 800 మీ. పరుగు పందెంలో అనీశ్ కుమార్ పాఠక్ స్వర్ణపతకం గెలుపొందాడు. పోటీని అతను 2ని. 10.3 సెకన్లలో పూర్తి చేశాడు. ప్రమోద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, కుందన్ మూడోస్థానంతో కాంస్యం నెగ్గాడు. ఈ పోటీలు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగాయి. ఫైనల్స్ ఫలితాలు: అండర్-18 బాలురు: 100 మీ.: 1.శివం జయంత్, 2.పాణిరామ్, 3. కమలేష్ కుమార్; 200 మీ.: 1.శివం జయంత్, 2. భరత్ కుమార్, 3.వంశీకృష్ణ; 1500 మీ.: 1. సమన్విత్, 2.కుందన్, 3. శివ శంకర్; లాంగ్జంప్: 1.విక్రాంత్ జయంత్, 2. చంద్ర ప్రకాష్, 3.ఎం.కుమార స్వామి; డిస్కస్త్రో: 1. సమరసింహారెడ్డి, 2.ఎం.అవినాష్, 3.పి.సాయికృష్ణ; అండర్-20 బాలురు: 100 మీ.: 1.ప్రవీణ్ మూర్తి, 2.అమీర్, 3.కె.సాయి ప్రదీప్; 200 మీ.: 1.అమర్, 2.టి.గోపాల్శర్మ, 3.పి.సాయి కిషోర్; 5000 మీ.: 1.అజయ్, 2.రాంగోపాల్ శర్మ, 3.డి.పవన్ ; లాంగ్జంప్: 1.ప్రవీణ్ మూర్తి, 2.ధనమేంధ్రీ, 3.లక్ష్మణ్; డిస్కస్త్రో: 1.అంకిత్ పాఠక్, 2. ఫరూక్ 3. ఉదిత్. -
టి బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శిగా సంపత్
తెలంగాణ సంఘాల ఆవిర్భావం షురూ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో తెలంగాణలో క్రీడా సంఘాల ఆవిర్భావం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం(ఏపీఓఏ) ఇటీవలి సమావేశంలో మే 15లోగా తెలంగాణ క్రీడా సంఘాల ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జి.ఎం.సంపత్ కుమార్ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ (టీబీఏ)ను ఏర్పాటు చేసి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. సికింద్రాబాద్లోని వైఎంసీఏలో జరిగిన తెలంగాణ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ల కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం 2014 నుంచి 2018 వరకు కొనసాగుతుంది. టీబీఏ కార్యవర్గం: చైర్మన్గా జి.సత్యనారాయణ (రంగారెడ్డి), అధ్యక్షుడుగా రాజేందర్రెడ్డి (నిజామాబాద్), ఉపాధ్యక్షులుగా ఆర్.శ్రీధర్రెడ్డి (ఆదిలాబాద్), అనంతరెడ్డి (కరీంనగర్), ఖాదర్ అబ్దుల్లా (రంగారెడ్డి), ప్రతాప్రెడ్డి (వరంగల్) డి.వై.చౌదరి (ఖమ్మం), ప్రధాన కార్యదర్శి జి.ఎం.సంపత్ కుమార్(హైదరాబాద్), సంయుక్త కార్యదర్శులుగా నార్మన్ ఇసాక్ (మహబూబ్నగర్), రఘునందన్రెడ్డి (నిజామాబాద్), కోశాధికారిగా నార్మన్ ఇసాక్ (మహబూబ్నగర్)లు ఎన్నికయ్యారు. అంతర్జాతీయ బాస్కెట్బాల్ అఫిషియల్ పీటర్ సంతోష్ దివాకర్ (హైదరాబాద్) టెక్నికల్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. -
క్రీడా సంఘాల్లో విభజన షురూ
ముగిసిన ఏపీఓఏ కార్యవర్గ సమావేశం ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) కార్యవర్గం చివరి సమావేశం శనివారం ఇక్కడి ఒలింపిక్ భవన్లో జరిగింది. ఏపీఓఏ అధ్యక్షుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో గత జూలై 7వ తేదీన చేసిన పలు తీర్మానాలు అమోదించారు. ఏపీఓఏ అనుబంధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 51 క్రీడా సంఘాలు ఉండగా తెలంగాణ, ఆంధ్రపదేశ్లో కొత్తగా 46 క్రీడా సంఘాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించారు. ఈ క్రీడా సంఘాల జాబితాల్లో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రలో ఐదు క్రీడా సంఘాలు ప్రత్యేకంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇందులో ఖోఖో, కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్, క్యారమ్, బాడీబిల్డింగ్ సంఘాలున్నాయి. రెండు రాష్ట్రాల క్రీడా సంఘాల ఏర్పాటుకు, విధి విధానాల కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ క్రీడా సంఘాల పునర్విభజన కమిటీ చైర్మన్గా లగడపాటి రాజగోపాల్, వైస్ చైర్మన్గా ఎపీ జితేందర్రెడ్డి, కన్వీనర్గా కె.జగదీశ్వర్ యాదవ్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి ప్రొఫెసర్ కె.రంగారావు (ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్), బి.కె.హరనాథ్ (హైదరాబాద్ క్యారమ్), ఆర్. నారాయణరెడ్డి (ఆదిలాబాద్), ఆంధ్ర ప్రాంతం నుంచి పద్మనాభం (తూర్పు గోదావరి), ఎం.నిరంజన్రెడ్డి (గుంటూరు), మచ్చ రామలింగారెడ్డి (అనంతపురం)లను నియమించారు. ఈ కమిటీ మే నెల 15వ తేదీలోగా రెండు రాష్ట్రాల్లో 46 క్రీడా సంఘాల కొత్త కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనుంది. జూన్ 2నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త క్రీడా సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీలు తమ కార్యకలాపాలు సాగించే విధంగా చర్యలను ఈ కమిటీ తీసుకోనుంది. జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపు ఉన్న క్రీడా సంఘాలకే ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.రంగారావు, ఎపీ.జితేందర్రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఎస్.ఆర్.ప్రేమ్రాజ్, కోశాధికారి బి.కె.హరనాథ్, సభ్యులు ఎస్.సోమేశ్వర్రావు, ఆర్.నిరంజన్రెడ్డి, బి.కైలాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి స్కూల్ చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ ఈనెల 23నుంచి రాంనగర్లోని మదర్స్ హైస్కూల్లో జరుగనుంది. రాయల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో జరగనున్న ఈ టోర్నీలో స్కూల్ విద్యార్థులు మాత్రమే పోటీపడేందుకు అర్హులని చీఫ్ ఆర్బిటర్ ఎస్.సబ్బారాజు తెలిపారు. అండర్-7, 9, 11, 13, 14, 15 బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. అలాగే వన్డే ఓపెన్ ప్రైజ్మనీ చెస్ టోర్నీ కూడా అదే రోజు మదర్స్ హైస్కూల్లో నిర్వహించనున్నారు. 22లోగా తమ ఎంట్రీలను పంపించాలి. వివరాల కోసం ఎస్.సుబ్బారాజు (98667-02431), బి.వి.కుమార్ (92471-88018)లను సంప్రదించవచ్చు. -
ఫైనల్లో తమిళనాడు జట్లు
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జాతీయ ఇంటర్ స్టేట్ క్యారమ్ టోర్నమెంట్లో తమిళనాడు పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. అలాగే పురుషుల విభాగంలో మహారాష్ట్ర, మహిళల విభాగంలో బీహార్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. విశాఖపట్నంలోని కేపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ పోటీల్లో మూడో రోజు మంగళవారం జరిగిన పురుషుల టీమ్ విభాగం సెమీఫైనల్లో తమిళనాడు జట్టు 2-1స్కోరుతో కర్ణాటక జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర జట్టు 3-0తో విదర్భ జట్టుపై గెలిచింది. మహిళల టీమ్ విభాగం సెమీఫైనల్లో తమిళనాడు 2-1తో చండీగఢ్పై, బీహార్ 2-1తో మహారాష్ట్రపై గెలిచాయి. ఇన్స్టిట్యూషన్స్ సెమీఫైనల్స్ ఫలితాలు పురుషుల టీమ్ విభాగం: పీఎస్పీబీ 3-0తో ఏఐఈఎస్సీబీపై, జైన్ ఇరిగేషన్ 2-1తో ఆర్బీఐపై గెలిచాయి. మహిళల టీమ్ విభాగం: ఎల్ఐసీ 3-0తో సీఏజీపై, పీఎస్పీబీ 3-0తో ఆర్బీఐపై నెగ్గాయి. -
చెస్ విజేతలు లాస్య ప్రియ, దీప్తాంశ్
బ్రిలియంట్ ఓపెన్ చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్లో జూనియర్ కేటగిరి టైటిల్ను పి.లాస్య ప్రియ (గౌతమ్ మోడల్ స్కూల్ మారేడ్పల్లి) కైవసం చేసుకుంది. ఓపెన్ కేటగిరి టైటిల్ను దీప్తాంశ్ రెడ్డి చేజిక్కించుకున్నాడు. దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జరిగిన జూనియర్ విభాగం (ఆరో రౌండ్) ఫైనల్లో లాస్య ప్రియ, కె.తరుణ్ సంయుక్తంగా 5.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అయితే ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా లాస్య ప్రియ విన్నర్గా, తరుణ్ రన్నరప్గా నిర్వాహకులు ప్రకటించారు. అలాగే ఓపెన్ విభాగంలో దీప్తాంశ్ రెడ్డి, ఎస్.కె.ఫయాజ్ ఖాన్ (6) పాయింట్లను పొందగా ప్రోగ్రెసివ్ స్కోరుతో దీప్తాంశ్ రెడ్డిని విజేతగా ఎంపిక చేశారు. చివరిదైన ఆరో రౌండ్లో ఎం.దీప్తాంశ్ రెడ్డి (6) ఎం.చక్రవర్తి రెడ్డి (5)పై విజయం సాధించాడు. ఫయాజ్ ఖాన్ (6) సుబ్బరాజు(4)పై గెలిచారు. జూనియర్ విభాగం (6)ఫైనల్ రౌండ్స్లో పి.లాస్య ప్రియ (5.5) బి.వి.మేఘాంశ్రామ్ (5)పై విజయం సాధించింది. కె.తరుణ్ (5.5)జస్వంత్ (4)పై, కె.యశ్వంత్ (5) సి.హెచ్.సాయి గోపాల్ (4)పై, కె.శరత్ చంద్ర (5) ఎన్.కృష్ణ కళ్యాణ్ (4)పై, కె.విశ్వనాథ్ అరవింద్ (5) కృష్ణ బాలాజీ (4)పై గెలిచారు. -
స్పోర్ట్స్ సైన్స్ ప్రాధాన్యత పెరిగింది
ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: దేశంలో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్కు ప్రాముఖ్యత పెరిగిందని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) రిజిస్ట్రార్ కె.ప్రతాప్రెడ్డి చెప్పారు. ఓయూ అతిథి గృహంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో 25వ పాన్ ఆసియా స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ బ్రోచర్ను ఆయన లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి మరిన్ని పరిశోధనలు జరగాలని అభిలషించారు. ఓయూలో స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగనుండటం సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 8 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ కాన్ఫరెన్స్కు ఆసియా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ కె.రాజేష్ కుమార్ వెల్లడించారు. ఈ సెమినార్ విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ చైర్మన్ ఇమాన్యుయెల్ ఎస్.కుమార్, ప్రొఫెసర్లు జె.ప్రభాకర్రావు, పి.వెంకట్రెడ్డి, ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
మేఘాంశ్రామ్, తరుణ్ ముందంజ
బ్రిలియంట్ చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్లో తొలి రోజు జూనియర్ విభాగంలో మేఘాంశ్రామ్, కె.తరుణ్ సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వీరితో పాటు కె.విశ్వజిత్ అరవింద్, జి.నితీష్ కుమార్, లాస్యప్రియ 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఓపెన్ కేటగిరీలో దీప్తాంశ్రెడ్డి, ఎం.చక్రవర్తిరెడ్డి, ఎం.వై.రాజు, భరత్ కుమార్రెడ్డి, జె.కె.రాజు, సుబ్బరాజు మూడు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో శనివారం జరిగిన జూనియర్ విభాగం మూడో రౌండ్లో మేఘాంశ్రామ్ (3)... కె.సుమంత్ (2)పై గెలుపొందగా, కె.తరుణ్ (3)... సి.హెచ్.సాయి గోపాల్ (2)పై, కె.విశ్వజిత్ అరవింద్ (3)... జి.అభినవ్ (2)పై విజయం సాధించారు. జి.నితీష్ కుమార్ (3)... కె.యశ్వంత్(2)ను, లాస్య ప్రియ(3)... జి.సాహిత్య(2)ను ఓడించారు. అలాగే ఓపెన్ కేటగిరీలో దీప్తాంశ్రెడ్డి (3)... షణ్ముఖ తేజ (2)పై, ఎం.చక్రవర్తిరెడ్డి (3)... ఎం.కౌశిక్(2)పై, ఎం.వై.రాజు (3), కవి సామ్రాట్ (2)పై, భరత్ కుమార్రెడ్డి (3)... ప్రసాద్రావు(2)పై, జె.కె.రాజు (3)... నాగభూషణం (2)పై నెగ్గారు. -
నైనా, సయీదాలకు సన్మానం
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీయూఎస్) మహిళా విభాగం ఆధ్వర్యంలో టేబుల్టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్, కరాటే క్రీడాకారిణి సయీదా ఫాలక్లను సన్మానించారు. మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా నిర్వహించిన సదస్సులో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారిణులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీయూఎస్ మహిళా అధ్యక్షురాలు టి.నిర్మల, కన్వీనర్ కనకతారలతో పాటు పలువురు ఉద్యోగినులు పాల్గొన్నారు. ఆ ఇద్దరు క్రీడాకారిణులతో పాటు కూచిపూడి కళాకారిణి సుహితనూ సన్మానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మహిళల భాగస్వామ్యానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని, ఉద్యోగినుల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీయూఎస్ అధ్యక్షుడు సి.విఠల్, కోశాధికారి పి.పవన్ కుమార్ గౌడ్, వి.నిర్మల, సునీత, గీతారాణి, కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అండర్-13 చాంప్ ప్రదీప్ కుమార్
ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్లో అండర్-13 బాలుర టైటిల్ను వి.ప్రదీప్ కుమార్ చేజిక్కించుకున్నాడు. అండర్-13 బాలికల టైటిల్ను అమిత కరణ్ జైశ్వాల్ గెలిచింది. సుజాత స్కూల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో మొయినాబాద్లోని సుజాత స్కూల్లో మంగళవారం ఈ పోటీలు జరిగాయి. వీటిని స్కూల్ ప్రిన్సిపల్ సునిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టోర్నీ డెరైక్టర్ కృష్ణ సింగ్, చీఫ్ ఆర్బిటర్ జ్యోతి గణేష్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 బాలురు: 1.జస్వంత్, 2. కార్తీక్ రెడ్డి, 3. విశాల్, 4.కుష్, 5.వైష్ణవ్, 6. రోహన్ 7.ప్రవేక్. 8.ఆకాష్, 9.ప్రియాంచ్. అండర్ 10 బాలికలు: 1.వర్షిత, 2.నందిత, 3. త్రిష. అండర్-13 బాలురు: 1.వి.ప్రదీప్ కుమార్, 2.కె.సుమంత్, 3.భరత్ యాదవ్, 4.సి.హెచ్.రితిక్, 5.తరుణ్. అండర్-13 బాలికలు: 1.అమిత కరణ్ జైశ్వాల్, 2.దేవి సృజన, 3.రిషిత. అండర్-16 బాలురు:1. షణ్ముఖ్ తేజ. అండర్-16 బాలికలు: 1.షీతల్. -
నెట్బాల్ కెప్టెన్లు బాలరాజ్, శిరీష
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జాతీయ సీనియర్ నెట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు బాలరాజ్ (హైదరాబాద్) సారథ్యం వహిస్తాడు. పురుషుల జట్టుకు శిరీషా రాణి (రంగారెడ్డి) కెప్టెన్గా వ్యవహరించనుంది. ఈ పోటీలు మార్చి 1 (శనివారం) నుంచి 4 వరకు పాట్నాలో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్ల జాబితాను రాష్ట్ర నెట్బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సమ్మయ్య ప్రకటించారు. రాష్ట్ర పురుషుల జట్టు: బాలరాజ్ (కెప్టెన్), అక్తర్ పాషా (హైదరాబాద్), సాయికృష్ణ, శ్రవ ణ్ కుమార్ (కృష్ణా జిల్లా), ఓంప్రకాష్ (మెదక్), విహారి, అఖిల్ (ఖమ్మం), అనిల్ (వరంగల్), సందీప్(కరీంనగర్), మహేశ్వర్ (నిజామాబాద్), సాయి కుమార్ (రంగారెడ్డి). రాష్ట్ర మహిళల జట్టు: శిరీషా రాణి(కెప్టెన్), వేదవతి (రంగారెడ్డి), వరలక్ష్మి (పశ్చిమ గోదావరి), డి.పావని (హైదరాబాద్), ఆర్తి (ప్రకాశం), శివాని, హర్షిణి, అదితి, వాణి, దేవి వర్జిత (ఖమ్మం), రేష్మ (మెదక్), సంయుక్త (కృష్ణా), కోచ్ కమ్ మేనేజర్ విఘ్నేశ్. -
నవశక్తి క్లబ్కు కబడ్డీ టైటిల్
నరేంద్ర మోడి చాలెంజ్ కప్ కబడ్డీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: నరేంద్రమోడి చాలెంజ్ కప్ కబడ్డీ టోర్నమెంట్ టైటిల్ను ఖైరతాబాద్కు చెందిన నవశక్తి క్రీడా మండలి క్లబ్ జట్టు చేజిక్కించుకుంది. కార్వాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో తాళ్లగడ్డలోని రాజలింగం కబడ్డీ మినీ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో నవ శక్తి క్లబ్ జట్టు 24-19 పాయింట్ల తేడాతో సరూర్నగర్కు చెందిన జ్యోతి యూత్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి నవశక్తి క్లబ్ జట్టు 12-7తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ టోర్నీలో బెస్ట్ ప్లేయర్ అవార్డును రాఘవేంద్ర (నవశక్తి క్లబ్) గెలుచుకోగా, బెస్ట్ కోచింగ్ అవార్డు నిఖిల్(జ్యోతి క్లబ్)కు లభించింది. ఈ పోటీల ముగింపు వేడుకలకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శానససభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాథోడ్, హైదరాబాద్ కబడ్డీ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
షేక్పేట్ ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్దే హవా
హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య(హెచ్డీఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడల్లో షేక్పేట్లోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (ఏపీఎస్డబ్ల్యూఆర్) జట్లు సత్తా చాటాయి. ఈ స్కూలుకు చెందిన జట్లు అండర్-14 బాలబాలికల విభాగాల్లో వాలీబాల్ టీమ్ టైటిల్స్ గెలుచుకున్నాయి. అండర్-14 బాలుర విభాగంలో కబడ్డీ, హ్యాండ్బాల్... అండర్-17 బాలుర విభాగంలో బీచ్ వాలీబాల్లో టీమ్ టైటిల్స్ను చేజిక్కించుకున్నాయి. అండర్-14 బేస్బాల్, అండర్-17 హ్యాండ్బాల్ క్రీడల్లో రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. అండర్-17 బాలుర విభాగంలో వాలీబాల్, బేస్బాల్, ఖోఖో క్రీడల్లో మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ పోటీల విజేతలకు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ఎ.సుబ్బారెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖాధికారి సుశీంద్రరావు, హెచ్డీఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి.యాదయ్య, ఎస్.సోమేశ్వర్రావు, డాక్టర్ ఎ.బాలరాజ్, డాక్టర్ రవీందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వివిధ క్రీడల విజేతల వివరాలిలా ఉన్నాయి. ఫైనల్స్ ఫలితాలు: ఫుట్బాల్: అండర్-14 బాలురు: 1.బేగంపేట్ హెచ్పీఎస్, 2.ఆల్ సెయింట్స్ హైస్కూల్, 3. రామంతపూర్ హెచ్పీఎస్; అండర్-17 బాలురు:1.సెయింట్ మార్క్స్ బాయ్స్ టౌన్ హైస్కూల్, 2.బేగంపేట్ హెచ్పీఎస్, 3.జూబ్లీహిల్స్ బీవీబీపీఎస్; అండర్-14 బాలికలు: 1. అంబర్పేట్ శ్రీసత్య సాయి విద్యా విహార్, 2. మొజంషాహి గవర్నమెంట్ హైస్కూల్. 3.డాన్ బాస్కో హైస్కూల్. అండర్-17 బాలురు: 1.జూబ్లీహిల్స్ హైస్కూల్, 2.శ్రీసత్య సాయి విద్యా విహార్, 3. డాన్ బాస్కో హైస్కూల్. కబడ్డీ: అండర్-14 బాలురు: 1.ఏపీఎస్డబ్ల్యూఆర్ ఎస్, 2.మలక్పేట్ గవర్నమెంట్ హైస్కూల్ (జీహెచ్ఎస్), 3.ఆలియా గవర్నమెంట్ హైస్కూల్; అండర్-14 బాలికలు: 1.వెస్ట్ మారేడ్పల్లి జీహెచ్ఎస్, 2.సీతాఫల్మండి జీహెచ్ఎస్, 3.వెస్ట్ మారేడ్పల్లి జీహెచ్ఎస్; అండర్-17 బాలురు: మలక్పేట్ జీహెచ్ఎస్, 2.రాంనగర్ జె.వి.హైస్కూల్, 3.లాల్ దర్వాజ వెంకట్రావు మెమోరియల్ హైస్కూల్. అండర్-17 బాలికలు: 1. ముసారంబాగ్ జీహెచ్ఎస్, 2. బాలంరాయి నల్లకుంట జీహెచ్ఎస్, 3.వెస్ట్ మారేడ్పల్లి జీహెచ్ఎస్; ఖోఖో: అండర్-14 బాలురు:1.యూసుఫ్గూడ జీహెచ్ఎస్, 2.నారాయణగూడ కేశవ మెమోరియల్ హైస్కూల్, 3.న్యూ ముసారంబాగ్ జీహెచ్ఎస్. అండర్-14 బాలికలు: 1.న్యూ ముసారంబాగ్ జీహెచ్ఎస్, 2. కాచిగూడ జీహెచ్ఎస్,3. కేశవ మెమోరియల్ హైస్కూల్; అండర్-17 బాలురు: 1.కేశవ మెమోరియల్ హైస్కూల్, 2.యూసుఫ్గూడ జీహెచ్ఎస్; అండర్-17 బాలికలు: 1.కేశవ మెమోరియల్ హైస్కూల్, 2. వెస్ట్ మారేడ్పల్లి గవర్నమెంట్ బాలికల హైస్కూల్, 3. న్యూ ముసారంబాగ్ జీహెచ్ఎస్; బాస్కెట్బాల్: అండర్-14 బాలురు: జూబీహిల్స్ పబ్లిక్ స్కూల్, 2.లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, 3.డాన్బాస్కో ైెహ స్కూల్; అండర్-14 బాలికలు: 1.హోలీ ఫ్యామిలీ హైస్కూల్, 2. జూబ్లీహిల్స్ బీవీబీపీఎస్, 3. రాంనగర్ సెయింట్ పాయిస్ హైస్కూల్; అండర్-17 బాలురు: 1.ఆల్ సెయింట్స్ హైస్కూల్, 2.సెయింట్ పాల్స్ హైస్కూల్, 3. డాన్బాస్కో హైస్కూల్; అండర్-17 బాలికలు: 1.హోలీ ఫ్యామిలీ హైస్కూల్, 2.మెరిడియన్ హైస్కూల్, 3.సెయింట్ పాయిస్ హైస్కూల్; వాలీబాల్: అండర్-14 బాలురు: 1.షేక్పేట్ ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్, 2.బేగంపేట్ హెచ్పీఎస్, 3.రామంతపురం హెచ్పీఎస్; అండర్-14 బాలికలు: 1.షేక్పేట్ ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్, 2.హోలీ ఫ్యామిలీ హైస్కూల్, 3.సెయింట్ పాయిస్ హైస్కూల్. -
సీసీఎల్-4 చాంప్ కర్ణాటక
ఫైనల్లో కేరళ స్ట్రయికర్స్పై గెలుపు సాక్షి, హైదరాబాద్ : డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక బుల్డోజర్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) టైటిల్ను నిలబెట్టుకుంది. ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 36 పరుగుల తేడాతో కేరళ స్ట్రయికర్స్ను చిత్తు చేసి నాలుగో సీజన్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన కర్ణాటక.. రాజీవ్ అద్భుత సెంచరీ (42 బంతుల్లో 112 నాటౌట్, 12 ఫోర్లు, 7 సిక్సర్లు), ధృవ్ శర్మ అర్ధ సెంచరీ (41 బంతుల్లో 56, 6 ఫోర్లు)లతో రాణించడంతో 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కేరళ స్ట్రయికర్స్ 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. నందకుమార్ అర్ధ సెంచరీ (47 బంతుల్లో 78, 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించాడు. రాజీవ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
క్రీడాకారులకు ఉపాధి కల్పించాలి: నీల్ గోటే
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేఎంఐటీ డెరైక్టర్ నీల్ గోటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి వార్షిక స్పోర్ట్స్ డే శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అంకితభావంతో తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించాలన్నారు. స్పోర్ట్స్ చాంపియన్ అర్జున కుమార్ పటేల్కు ట్రోఫీని అందజేశారు. కేశవ మెమోరియల్ విద్యా సంస్థ కార్యదర్శి టి.హరిహరశర్మ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తితోపాటు క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో కాలేజి ప్రిన్సిపల్ టి.ఎం.శేఖర్రావు, ఫిజికల్ డెరైక్టర్ బి.లక్ష్మయ్య, మధుర హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులను సన్మానించారు. -
ఫుట్బాల్ టోర్నీ విజేత తార్నాక క్లబ్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: సెవెన్-ఎ-సైడ్ ఫుట్బాల్ టోర్నమెంట్ టైటిల్ను తార్నాక ఫుట్బాల్ క్లబ్ జట్టు కైవసం చేసుకుంది. ఓల్డ్ అల్వాల్లో శుక్రవారం జరిగిన ఫైనల్లో తార్నాక క్లబ్ జట్టు 7-1 స్కోరుతో కుకి ఫుట్బాల్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. తార్నాక క్లబ్ జట్టు తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 1-0తో ఆధిక్యాన్ని సాధించింది. తార్నాక క్లబ్ జట్టు ఆటగాడు రియాజ్ హ్యాట్రిక్ నమోదు చేయడం ఈ మ్యాచ్లోని విశేషం. ఈ పోటీల విజేతలకు అంతర్జాతీయ ఫుట్బాల్ మాజీ ఆటగాడు జాన్ విక్టర్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రేమ్ కుమార్, భీమ్రావులు పాల్గొన్నారు. -
అండర్-16 చెస్ విజేత షణ్ముక తేజ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్లో అండర్-16 టైటిల్ను షణ్ముక తేజ కైవసం చేసుకున్నాడు. అండర్-14 టైటిల్ను వి.ప్రదీప్ కుమార్ గెలుచుకోగా, అండర్-10 టైటిల్ను వి.ప్రణీత్ గెలిచాడు. జి.అదితి, శ్రీపాద అరుణ్లిద్దరూ బెస్ట్ ప్లేయర్లుగా నిలిచారు. చెస్ డాట్ హలో హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు తార్నాకలోని ఎం.కృష్ణారెడ్డి హాల్లో జరిగాయి. ఈ పోటీల ముగింపు వేడుకలకు రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మేజర్ శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హలో హైదరాబాద్ డాట్ కామ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నంద గోపాల్, నవీన్ కుమార్లు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 విభాగం:1. వి.ప్రణీత్, 2.సి. అకిరారెడ్డి,3. మొహమ్మది బేగం, 4. జి.విశాల్రెడ్డి, 5. ఎం.శివ భార్గవి, 6.ఎన్.విద్యాధర్, 7.పి.రఘు, 8.ఎన్.కళాధర్, కె.వి.ధృవ్, 9.జ్ఞాన ప్రియా. అండర్-14 విభాగం:1.వి.ప్రదీప్ కుమార్, 2. టి.సాయి వరుణ్, 3.ముదాసిర్, 4.పి.మధుకేతన్, 5. పి.ప్రణవీ సాయి, 6. డి.ఎన్.వి.వరుణేంద్ర, 7.పి.ప్రణీత్, 8.డి.ఎన్.వి.హర్షేంద్ర, 9. హజీరా బేగం, 10.జి.నవీన్. అండర్-16 విభాగం:1.పి.షణ్ముక తేజ, 2.ఎం.తరుణ్, 3.వి.వి.ఎస్.శివ, 4.సి.పార్థసారథి, 5.డి.సాయి శ్రవణ్, 7.ఎం.ఎ.ఎస్.ప్రణవ నినాదం, 8.ఎన్.సాయి వికాస్రెడ్డి, 9. బి.మధు కుమార్, 10. ఎ.అరవింద్ నాయక్, 11.పి.వి.ప్రణీత్. -
భారత టీటీ జట్టులో స్నేహిత్, శ్రీజ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: టేబుల్ టెన్నిస్లో విశేషంగా రాణిస్తున్న హైదరాబాదీలు స్నేహిత్, ఆకుల శ్రీజ, నైనా జైస్వాల్, హరికృష్ణలు భారత జట్టుకు ఎంపికయ్యారు. ఐటీటీఎఫ్ గ్లోబల్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనే భారత క్యాడెట్, జూనియర్ జట్లకు ఎంపికయ్యారు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి.ఆర్.చౌదరి ఈ మేరకు వెల్లడించారు. భారత బాలుర జట్టులో చాన్నాళ్ల తర్వాత ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకోవడం పట్ల రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుల్తానా హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు త్వరలో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తారని చెప్పారు. క్యాడెట్ అండర్-15 బాలుర విభాగంలో ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్, వి.ఎస్.హరికృష్ణలకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. అలాగే భారత జూనియర్ జట్టుకు ఆకుల శ్రీజా, నైనాలు ఎంపికయ్యారు. ఈ పోటీలు మార్చి 25 నుంచి 28 వరకు గోవాలో జరుగుతాయి. రాష్ట్ర సబ్ జూనియర్ చాంపియన్ అయిన స్నేహిత్... జూనియర్ , యూత్ విభాగం రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్నాడు. జాతీయ సబ్ జూనియర్ విభాగంలో అతను మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. స్నేహిత్, శ్రీజాలు గ్లోబల్ టీటీ అకాడమీలో శిక్షణ పొందారు. హరికృష్ణ సెయింట్ పాల్స్ టీటీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. హరికృష్ణ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల హైదర్గూడలోని సెయింట్ పాల్స్ టీటీ అకాడమీలో తోటి క్రీడాకారులు, కోచ్లు సంతోషం వ్యక్తం చేశారు. కోచ్లు ఇబ్రహీమ్ ఖాన్, నాగేందర్రెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ హరికృష్ణకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. అంకితభావం గల హరికి కష్ణపడేతత్వం ఉందని వారు పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో శిక్షణ పొందిన నైనా ఇప్పటికే పలు అంతర్జాతీయ టీటీ టోర్నీల్లో సత్తాచాటిన సంగతి తెలిసిందే. -
ఎస్పీ కాలేజి డబుల్ ధమాకా
హైదరాబాద్ ఎగ్జిబిషన్ క్రీడలు ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విద్యా సంస్థల క్రీడల్లో పురుషుల విభాగంలో సర్దార్ పటేల్ (ఎస్పీ) కాలేజి జట్టు వాలీబాల్, బాస్కెట్బాల్ టీమ్ టైటిల్స్ను సాధించింది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో విక్టరీ ప్లే గ్రౌండ్లో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.రమణరావు ట్రోఫీలను అందజేశారు. ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫైనల్స్ ఫలితాలు: పురుషుల విభాగం: వాలీబాల్: 1.ఎస్పీ కాలేజి, 2.శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి (సూర్యాపేట). బాస్కెట్బాల్: 1.ఎస్పీ కాలేజి, 2.ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజి (భువనగిరి). చెస్: 1.ఎస్పీ కాలేజి, 2.శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి (సూర్యాపేట). క్యారమ్ డబుల్స్: 1.జి.అంజన్ కుమార్-జె.స్వామి జోడి (ఎస్పీ కాలేజి). 2.పి.సాయి కుమార్- టి.సంతోష్ జోడి (ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజి). మహిళల విభాగం: టెన్నికాయిట్ (డబుల్స్): 1. రమ్య-షాలిని (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. ఎస్.కె.హిజారత్-ఎస్.భాగ్యలక్షి్ష్మ జోడి (ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజి). చెస్:1. కస్తూర్బా గాంధీ కాలేజి 2. వనిత మహా విద్యాలయం. క్యారమ్ డబుల్స్: 1.ఎం.శిరీష-ఎస్. సరిత జోడి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.దీపిక-బి.ఆలేఖ్య జోడి (వనిత మహా విద్యాలయం). -
విజేతలు స్పర్శ్, కృష్ణా జట్లు
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాష్ట్ర బాస్కెట్బాల్ టోర్నమెంట్లో పురుషుల టీమ్ టైటిల్ను హైదరాబాద్ స్పర్శ్ జట్టు కైవసం చేసుకుంది. మహిళల టీమ్ టైటిల్ను కృష్ణా జిల్లా జట్టు గెలుచుకుంది. రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వైఎంసీఏ బాస్కెట్బాల్ కోర్టులో జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్ స్పర్శ్ జట్టు 17-13 పాయింట్ల తేడాతో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై విజయం సాధించింది. స్పర్శ్ ఆటగాడు శ్రీనాథ్ దూకుడుగా ఆడి 6 పాయింట్లను నమోదు చేశాడు. వైఎంసీఏ జట్టులో రోహిత్ చక్కటి ఆటతీరును ప్రదర్శించి 8 పాయింట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. మహిళల విభాగం ఫైనల్లో కృష్ణా జిల్లా జట్టు 12-11 పాయింట్ల తేడాతో లయోలా-ఎ జట్టుపై పోరాడి గెలిచింది. ఈ టోర్నీలో విజేత జట్టుకు మూడు వేల రూపాయలు, రన్నర్స్ జట్టుకు రెండు వేల రూపాయల నగదు పురస్కారం లభించాయి. ఈ పోటీల విజేతలకు అంతర్జాతీయ బాస్కెట్బాల్ ఆటగాడు ఎల్.సి. ఉమాకాంత్ బహుమతులను అందజేశారు. -
ఫైనల్లో లయోలా అకాడమీ
ఎల్బీ స్టేడియం,న్యూస్లైన్: ఫాదర్ బాలయ్య స్మారక ఆలిండియా ఇంటర్ కాలేజి క్రీడల్లో లయోలా అకాడమీ జట్లు బాస్కెట్బాల్లో తుదిపోరుకు అర్హత సంపాదించాయి. ఫైనల్లో హైదరాబాద్ లయోలా అకాడమీతో చెన్నై లయోలా అకాడమీ అమీతుమీ తేల్చుకోనుంది. లయోలా అకాడమీ మైదానంలో మంగళవారం జరిగిన బాస్కెట్బాల్ సెమీఫైనల్లో లయోలా జట్టు 75-70తో ఎ.వి.కాలేజి జట్టుపై విజయం సాధించింది. లయోలా జట్టులో గణేష్ 28, ఉదయ్ 15, చంద్రహాసన్ 12 పాయింట్లు చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఎ.వి.కాలేజి జట్టులో బాలాజి 22, సాయి 18 పాయింట్లు చేశారు. రెండో సెమీఫైనల్లో చెన్నై లయోలా అకాడమీ జట్టు 78-41తో సెయింట్ మార్టిన్స్ కాలేజి జట్టుపై గెలిచింది. చెన్నై లయోలా జట్టులో హరీశ్ 38, వినోద్ 13 పాయింట్లు చేయగా, సెయింట్ మార్టిన్స్ జట్టు తరఫున సంతోష్ 12, విశాల్ 10 పాయింట్లు చేశారు. వాలీబాల్లో ఓడిన లయోలా వాలీబాల్ టోర్నీ సెమీఫైనల్లో హైదరాబాద్ లయోలా అకాడమీ జట్టు ఓడిపోయింది. జమాల్ మహ్మద్, సెక్రెడ్ హార్ట్ జట్లు ఫైనల్లోకి చేరాయి. తొలి సెమీఫైనల్లో జమాల్ మహ్మద్ కాలేజి 25-20, 25-17, 25-20తో లయోలా జట్టుపై గెలిచింది. రెండో సెమీఫైనల్లో సెక్రెడ్ హార్ట్ జట్టు 3-1 గేమ్ల తేడాతో విజయవాడ లయోలా అకాడమీ జట్టుపై నెగ్గింది. -
చెస్ విజేతలు సాకేత్, బిపిన్రాజు
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ ఓపెన్ కేటగిరీలో సాకేత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రత్యూష్ శ్రీవాస్తవకు రెండో స్థానం లభించగా, ప్రతీక్ శ్రీవాస్తవకు మూడో స్థానం దక్కింది. జూనియర్ కేటగిరీ టైటిల్ను ఎస్.బిపిన్రాజ్ (సాక్రెడ్ హార్ట్ స్కూల్) చేజిక్కించుకున్నాడు. బ్రిలియంట్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ ఆఖరి ఆరో రౌండ్లో సాకేత్, ప్రత్యూష్ శ్రీవాస్తవల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. ఇద్దరు ఐదున్నర పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ ప్రొగ్రెసివ్ స్కోర్ ఆధారంగా సాకేత్ను విజేతగా ప్రకటించారు. జూనియర్ కేటగిరీలో ఎస్.బిపిన్రాజ్ (5.5), మిధుష్ (5.5)ల మధ్య కూడా చివరి రౌండ్ గేమ్ డ్రా అయింది. బిపిన్రాజ్ ప్రోగ్రెసివ్ స్కోర్తో మొదటి స్థానం పొందాడు. మిధుష్, ఎం.తరుణ్ వరుసగా రెండు, మూడో స్థానాలు పొందారు. వెటరన్ పురుషుల టైటిల్ను యు.వి.దివాకర్ గెలుచుకోగా, మహిళల టైటిల్ను మనీషా చౌదరి గెలిచింది. వివిధ విభాగాల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫైనల్స్ ఫలితాలు ఓపెన్ కేటగిరీ: 1.సాకేత్, 2.ప్రత్యూష్, 3.ప్రతీక్, 4.డి.సురేష్, 5.శోభరాజ్, 6.ఎస్.ఖాన్, 7.ఫయాజ్, 8.వి.ఎస్.ఎన్. మూర్తి, 9.ఎన్.రామ్మోహన్రావు, 10. సందీప్ నాయుడు. అండర్-14 బాలురు: 1.తరుణ్, 2.గులాబ్ అహ్మద్; అండర్-14 బాలికలు: 1,హరిలాస్య, 2.ఎస్.దేవిక; అండర్-12 బాలురు: 1.జయతీర్థ్, 2.మేఘాంశ్ రామ్; అండర్-12 బాలికలు:1.లాస్య ప్రియ, 2. డి.మోహిని; అండర్-10 బాలురు: 1.మిధుష్, 2.కె.తరుణ్; అండర్-10 బాలికలు: 1.సాహిత్య, 2. హంసిక; అండర్-8 బాలురు: 1. పి.రుత్విక్, 2. ఒ.రుత్విక్; అండర్-8 బాలికలు: 1.రచిత, 2. కె.త్రిష. అండర్-6 బాలురు: 1.ప్రణయ్ వెంకటేష్, 2.హరినారాయణ; అండర్-6 బాలికలు:1. అనన్య, 2. సుసేన్రెడ్డి. -
సైకిల్ పోలో జట్టు కెప్టెన్గా రాకేష్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ సైకిల్ పోలో చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఏపీ సైకిల్ పోలో అసోసియేషన్ కార్యదర్శి ఆర్.సత్యనారాయణ ప్రకటించారు. ఈ పోటీలు ఆదివారం నుంచి మహారాష్ట్రలోని జెల్గావ్లో జరుగుతాయి. రాష్ట్ర సబ్ జూనియర్ బాలుర జట్టు: కె.రాకేష్ (కెప్టెన్), శరణ్ (ప్రకాశం), వంశీ (మహబూబ్నగర్), ఎన్.భరత సింహారెడ్డి, కె.చక్రధర్ (కృష్ణా జిల్లా), కల్యాణ్ (గుం టూరు), ఎస్.కె.జావిద్ బాషా (ప్రకాశం), వి.రేవంత్ కుమార్ (కృష్ణా). జూనియర్ బాలుర జట్టు: ఎం.మస్తాన్ (కెప్టెన్, కృష్ణా జిల్లా), బి.రవితేజ, కె.భాను ప్రకాష్ (రంగారెడ్డి), బి.శ్రీను (పశ్చిమ గోదావరి), ఎస్.కె.ఖాదర్ (ప్రకాశం), జె.తేజ (కృష్ణా), జె.రాజేష్ నాయక్ (మహబూబ్నగర్), ఎస్.కె.జంషెద్ (కర్నూలు), కోచ్: ఎం.అవినాశ్ (కరీంనగర్), జట్టు మేనేజర్: ఎం.అచ్చయ్య (గుంటూరు). -
లయోలా జట్ల శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఫాదర్ బాలయ్య స్మారక జాతీయ అంతర్ కళాశాలల బాస్కెట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్, చెన్నైలకు చెందిన లయోలా అకాడమీ జట్లు శుభారంభం చేశాయి. సికింద్రాబాద్లోని లయోలా అకాడమీ బాస్కెట్బాల్ కోర్టులో శనివారం జరిగిన పోటీల్లో హైదరాబాద్ లయోలా అకాడమీ జట్టు 79-48తో సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి జట్టుపై విజయం సాధించింది. లయోలా అకాడమీ జట్టులో గణేష్ 20 పాయింట్లు చేయగా, ఉదయ్, క్రిస్లు చెరో 14 పాయింట్లు సాధించారు. సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి జట్టులో మహేశ్ 20 పాయింట్లు, మురళీ 14 పాయింట్లను నమోదు చేశారు. రెండో లీగ్ మ్యాచ్లో చెన్నై లయోలా అకాడమీ జట్టు 102-59తో ఏవీ కాలేజి జట్టుపై గెలిచింది. చెన్నై లయోలా అకాడమీ జట్టులో హరిశంకర్ 14, విరాత్ 10 పాయింట్లు చేయగా, ఏవీ కాలేజి జట్టు తరఫున విజయ్ 15, శ్యామ్ 11 పాయింట్లు సాధించారు. ఈ పోటీలను అంతర్జాతీయ బాస్కెట్బాల్ ఆటగాడు కె.విశాల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. -
క్వార్టర్స్లో కార్తికేయ్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-15 బాలుర సింగిల్స్లో ఏపీ కుర్రాడు డి.జస్వం త్, టాప్ సీడ్ కార్తికేయ్ (ఢిల్లీ) క్వార్టర్ ఫైనల్స్కు చేరారు. సాత్విక్ సాయిరాజ్(ఏపీ) ఓడిపోయాడు. శనివారం కడపలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సి.జస్వంత్ (ఏపీ) 10-21, 22-20, 21-10తో మైస్నమ్ మేరాబా (మణిపూర్)పై విజయం సాధించాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ కార్తికేయ్ (ఢిల్లీ) 21-16, 21-8తో ప్రాకార్ (మధ్యప్రదేశ్)పై గెలిచాడు. ఇతర మ్యాచ్ల్లో కిరణ్ (కేరళ) 12-21, 21-18, 21-17తో నాలుగో సీడ్ సాత్విక్ సాయిరాజ్(ఏపీ)పై, రాహుల్ 21-19, 21-11తో ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ)పై, ఒరిజీత్ (అస్సాం) 21-16, 21-15తో శ్రీదత్తాత్రేయ రెడ్డి(ఏపీ)పై, ధృవ్ కపిలా (పంజాబ్) 17-21, 21-10, 21-14తో కె.ఆర్.కె.చరిత్ (ఏపీ)పై, లక్ష సేన్ (ఉత్తరాంచల్) 21-13, 21-12తో కె.జగదీష్ (ఏపీ)పై నెగ్గారు. -
మనీష్ కుమార్, అంకిత్ శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: జాతీయ సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలి రోజు అండర్-13 బాలుర సింగిల్స్లో రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్, పి.అంకిత్, సాయిచరణ్ శుభారంభం చేశారు. కడపలో మంగళవారం జరిగిన అండర్-13 బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో మనీష్ కుమార్ (ఏపీ) 15-6, 15-6 స్కోరుతో యోగేందర్(మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. పి.అంకిత్ (ఏపీ) 15-6, 7-15,15-10తో అనిరుధ్పై గెలిచింది. తొలి రౌండ్ ఫలితాలు: అండర్-13 బాలుర సింగిల్స్: సుధాంశు (మహారాష్ట్ర) 15-13, 15-7తో విజయ్ (ఏపీ)పై, రిత్విక్ సంజీవి (తమిళనాడు) 15-2,15-7తో రాంగోపాల్(ఏపీ)పై, శివం అగర్వాల్ (ఉత్తర ప్రదేశ్) 15-8,15-14తో అఖిలేష్ కౌశిక్(ఏపీ)పై, రాహుల్ (మహారాష్ట్ర) 15-5, 15-4తో జయకృష్ణ (ఏపీ)పై, వికాస్ ప్రభు (తమిళనాడు) 15-5, 15-5తో సుజాల్(కర్ణాటక)పై, ఎస్.గుప్త (తమిళనాడు) 15-11,15-10తో వంశీ కృష్ణ(ఏపీ)పై, సాయి చరణ్ (ఏపీ) 15-7,15-11తో అజయ్ అభిషేక్ (తమిళనాడు)పై, ఎం.అలీ ఖాన్ మీర్ (ఏపీ) 15-11, 15-8తో శివరామ్ (యూటీఆర్)పై, శశాంక్ రెడ్డి (ఏపీ) 15-5,15-4తో ఎం.కార్తికేయన్ (తమిళనాడు)పై, మయాంక్ రాణా (హర్యానా) 16-4, 15-8తో లీలా అభిరామ్(ఏపీ)పై గెలిచారు. అండర్-15 బాలుర సింగిల్స్: నవనీత్(ఏపీ) 15-6,15-11తో రోషన్ విక్టర్ (కేరళ)పై, తరుణ్ కుమార్ (ఏపీ) 15-7, 15-12తో శౌర్య (పశ్చిమ బెంగాల్)పై, వికాస్ యాదవ్ (ఢిల్లీ) 15-9,15-5తో టి.తేజ (ఏపీ)పై, అక్షయ్ శెట్టి (మహారాష్ట్ర) 15-9,16-14తో సాయినాథ్ రెడ్డి(ఏపీ)పై, జి.అరవింద్ (పీవై) 13-21,15-5, కె.అనికేత్ రెడ్డి(ఏపీ)పై, అనీష్ చంద్ర (ఏపీ) 15-8, 15-13తో అనిరుధ్(కేరళ)పై, ధీరజ్ రెడ్డి(ఏపీ) 21-16, 21-11తో శంకర్ ముత్తు స్వామి(తమిళనాడు)పై, ముఖేష్ రవి (ఏపీ) 15-5,15-8తో గోవింద్(కేరళ)పై నెగ్గారు. -
టెన్నిస్ చాంప్ జ్ఞానభాస్కర్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: మీరా స్మారక ప్రైజ్మనీ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను జ్ఞానభాస్కర్ కైవసం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్ను గోవర్ధన్,ప్రదీప్ రెడ్డి జోడి గెల్చుకుంది. రమ్యాస్ టెన్నిస్ అకాడమీలో మంగళవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో జ్ఞానభాస్కర్ 10-7 స్కోరుతో ఎం.సాయి జితేష్పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో జ్ఞాన భాస్కర్ 9-3తో పి.అజయ్పై, జితేష్ స్వామి 9-8 (7-4)తో సూర్య పవన్పై నెగ్గారు. డబుల్స్ ఫైనల్లో గోవర్ధన్, ప్రదీప్ రెడ్డి జోడి 9-5తో పి.అజయ్, సాయికుమార్ జోడిపై గెలిచింది. పురుషుల 35+ సింగిల్స్ ఫైనల్లో డి.రామకృష్ణ 8-3తో కె.వి.ఎన్.మూర్తిపై గెలిచాడు. సెమీఫైనల్లో కె.వి.ఎన్.మూర్తి 9-7తో వహీద్పై, రామకృష్ణ 9-6తో డి.మనీష్పై గెలిచారు. డబుల్స్ ఫైనల్లో వహీద్, మూర్తి జోడి 9-4తో రామకృష్ణ, మనీష్ జోడిపై గెలిచింది.