స్పోర్ట్స్ సైన్స్ ప్రాధాన్యత పెరిగింది | Gained prominence in sports science | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ సైన్స్ ప్రాధాన్యత పెరిగింది

Published Mon, Mar 10 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

Gained prominence in sports science

ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్:  దేశంలో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్‌కు ప్రాముఖ్యత పెరిగిందని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) రిజిస్ట్రార్ కె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఓయూ అతిథి గృహంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో 25వ పాన్ ఆసియా స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ బ్రోచర్‌ను ఆయన  లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి మరిన్ని పరిశోధనలు జరగాలని అభిలషించారు.
 
 ఓయూలో స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగనుండటం సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 8 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌కు ఆసియా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ కె.రాజేష్ కుమార్ వెల్లడించారు. ఈ సెమినార్ విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ చైర్మన్ ఇమాన్యుయెల్ ఎస్.కుమార్,  ప్రొఫెసర్లు జె.ప్రభాకర్‌రావు, పి.వెంకట్‌రెడ్డి, ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement